29, డిసెంబర్ 2011, గురువారం

DR. ELCHURI RECIPES WITH GORINTA CHETTU ( HENNA PLANT )


గురిచూసి రోగాలను తరిమికొట్టు - గోరింటచెట్టు

ప్రియాతి ప్రియమైన అభిమానపాఠకులారా! పూర్వకాలంలో గోరింట చెట్టును ఊరూరా విరివిగా
పెంచుకునేవారు. ప్రతి పండుగ సందర్భంలో గోరింటాకును చేతులకు అలంకరించుకునే వారు. స్త్రీలు పాదాలకు
కూడా గోరింటాకును పెట్టుకోవడం పాద సౌందర్యాన్ని పెంచుకోవడం మన ఆచారంగా వుండేది. అయితే,
చాలామందికి గోరింట అంటే కేవలం చేతులకు అలంకారంగా పెట్టుకునే సాధనం మాత్రమే అని తెలుసు. కానీ,
గోరింట ఒక గొప్ప ఔషధం కూడా అని తెలియదు. ఈనాడు గోరింట పేరుతో అనేకరకాల విష రసాయనాలు కలిపిన
మిశ్రమాలు అలంకరణ కోసం అమ్మ బడుతున్నయ్. ఈ విషపు గోరింటను వాడటమే చాలా సులభం అనే
ఆలోచనలతో నేటి ఆధునికులు ఆ విషాన్ని తమ చేతులకు పాదాలకు పులుము కుంటూ లేనిపోని కొత్త రోగాలను
కొనుక్కుంటున్నారు. ప్రజలలో ఈ విష గోరింట దుష్పరిణామాలను వివరించి అసలైన మనదేశవాళ గోరింటాకు
మాత్రమే వాడుకోవాలని చెబుతూ ఈ క్రింద వివరించబోయే ఇతర ఉపయోగాలను కూడా అందరికీ పంచిపెట్టండి.



గోరింట చెట్టు రూప గుణ ప్రభావాలు 

దీని మానుబెరడు రసం గానీ, కషాయం గానీ, లేక చూర్ణం గానీ చెడిపోయిన శరీర తత్వాన్ని మంచిగా మారుస్తయ్‌. పాండు రోగం,ప్లీహ రోగం, మూత్ర కృచ్చం కలిగిన చర్మరోగాలు, కాలిన పుండ్లు, (వ్రణాలు, నోటిపూత, తలనొప్పి, స్ఫోటకము, కంతులు, గ్రంథులు, తల వెంట్రుకల రోగాలు మొదలైన అనేక అనారోగ్య సమస్యలను గోరింట చెట్టు సునాయాసంగా పరిష్కరించగలదు. 

వాపులు, నొప్పలు తగ్గుటకు

గోరింటాకు కొంచెం సబ్బు ముక్క కలిపి నీటితో మెత్తగా నూరి పైన పట్టు వేస్తుంటే, దెబ్బల వల్ల కలిగిన వాపులు, దెబ్బల నొప్పి, కీళ్ళనొప్పులు, కీళ్ళ పట్లు, మేహవాత నొప్పులు కూడా తగ్గిపోతయ్‌. 



కాళ్ళు, చేతులు పగిలి వుంటే 

గోరింటాకును మెత్తగా నూరి చేతుల పైన, కాళ్ళ పైన, పిప్పిగోళ్ళ పైన, వ్రేళ్ళ సందులలో, పాచి వున చోట లేపనం చేయాలి. ఇలా రోజూ రాత్రిపూట చేస్తూవుంటే పై సమస్యలు తొలగి పోవడమే కాక, లేనివారికి ఎప్పటికీ రాకుండా వుంటయ్‌. 

శరీరంపై కంతులకు, మొండి గ్రంథులకు

 పచ్చి గోరింటాకును తెచ్చి నీరు కలపకుండా మెత్తగా నూరి ఆ ముద్దను రాత్రి నిద్రించే ముందు కంతుల పైన, గ్రంధుల పైన వేసి దూది పెట్టి ఊడిపోకుండా కట్టు కడుతూవుంటే అవి తగ్గిపోతాయి. 

వేసవిలో నీరసం తగ్గుటకు

 పచ్చి గోరింటాకులు 10 గ్రా. తీసుకొని పావు లీటరు మంచినీటిలో వేసి రాత్రి నుండి ఉదయం వరకు నానబెట్టి, ఉదయంపూట ఆకులను పిసికి బట్టలో వడ పోసుకోవాలి. ఆ నీటిలో కండ  చక్కెర పొడి 50(గ్రా .కలిపి పరగడుపున నెల రోజుల పాటు విడవకుండా తాగుతుంటే ఎంత ఎండలో తిరిగినా గ నీరసం రాకపోవడమే కాక రక్తశుద్ధి జరి శరీరానికి బలం కూడా కలుగుతుంది. 

తెలుగు - గోరింట , గోరింత,మైదాకు
english - henna plant
హిందీ - మెహందీ
సంస్కృతం - నఖ రంజన ,మేధిక

1 . అరికాళ్ళ మంటలు తగ్గుటకు ( FOR FOOT BURNS )

గోరింటాకు - 1 భాగం
మాచికాయ - 1 భాగం
నారింజ ఆకు - 1 భాగం

 పై వాటిని కలిపి మెత్తగా నూరి అరికాళ్ళకు పూసుకోవాలి.

uses -  మంటలు త్వరగా తగ్గిపోతాయి.

2 . నోటి పూత తగ్గడానికి ( FOR MOUTH ULCERS )

మంచి నీరు- 1 గ్లాస్
గోరింటాకు లు - 15

 పై వాటిని కలిపి చిన్న మంటపైన ఒక కప్ కషాయం మిగిలే వరకు మరిగించాలి .తర్వాత వడ పోసి గోరువెచ్చగా అయిన తర్వాత నోటిలో పోసుకొని ఐదు నుండి పది నిమిషాల పాటు పుక్కిలించి ఊసివేయాలి . రోజూ రెండు పూటలా ఇలా చేయాలి.

uses - తీవ్రమైన నోటి పూత ,నోటి  పుండ్లు అతి త్వరగా తగ్గిపోతాయి.

3 . తల నొప్పి తగ్గడానికి ( FOR HEADACHE )

గోరింటాకు

ఆకును మెత్తగా నూరి ఆ గుజ్జును కనతలపైన మందంగా పట్టువేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి.

uses - గోరింట గుజ్జు ఎండిపోయేటప్పటికి తలనొప్పి తగ్గిపోతుంది.

4 . గజ్జి,తామర, చిడుము,దురదలు,దద్దుర్లు ( FOR SCABIES ,RING WORM ,ITCHINGS ETC SKIN DISEASES )

గోరింటాకు

 ప్రతిరోజు పచ్చి గోరింటాకును తెచ్చి మెత్తగా రుబ్బాలి. గుజ్జును చర్మ సమస్య ఉన్నచోట దట్టంగా లేపనం చేయాలి లేపనం పూర్తిగా ఎండిపోయిన తర్వాత సున్నిపిండితో స్నానం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ఒకసారి చేస్తూ వంకాయ గోంగూర మాంసాహారం చేపలు వంటి పదార్థాలను తినకుండా ఆహార నియమాలు పాటించాలి.

uses -  గజ్జి తామర మొదలగు చర్మ సమస్యలు సులువుగా తగ్గిపోతాయి.

5 . గోర్ల సమస్యలు తగ్గడానికి. ( FOR VARIOUS NAIL PROBLEMS )

గోరింటాకు

 ఆకును మెత్తగా నూరి నిద్రపోయే ముందు గోర్ల పైన లేపనం చేసుకోవాలి. ఇలా వరుసగా కొన్ని రోజులు చేయాలి.

uses -  పుచ్చిన గోర్లు , గొగ్గిరి గోర్లు , మొదలగు గోర్ల సమస్యలు తగ్గుతాయి.
.
కండ్ల నొప్పికి - కమనీయ మార్గం

పచ్చిగోరింటాకు 40గ్రా. తీసుకొని మెత్తగా
దంచి ముద్ద చేయాలి. ఆ ముద్దను గారె లాగా
వెడల్పుగా చేతితో చరిచి దానిని ఒక నూలు బట్టపై
పెట్టి ఆ ముద్ద ఆను కొనేటట్లు ఆసనానికి పెట్టి గోచీ
కట్టుకోవాలి. రాత్రి నుంచి ఉదయం వరకు ఉంచి
ఉదయంపూట గోచీ గుడ్డను తీసివేయాలి. ఇలా
చేస్తుంటే కండ్ల నొప్పి ఆశ్చర్యకరంగా తగ్గిపోతుంది.

పుండ్లు పడి - చర్మం మందమైతే

కొంతమందికి వివిధ కారణాలవల్ల చర్మంపైన
పుండ్లు వచ్చి అవి తగ్గిన తరువాత పై చర్మం లావుగా
మందంగా తయారౌతుంది. అలాంటివారు ప్రతి
రోజూ నిదురించే ముందు తగినంత గోరింటాకు
తీసుకొని మెత్తగా నూరి ఆ ముద్దను పైన వేసి కట్టు
కడుతూ వుంటే క్రమంగా మందంగా వున్న చర్మం
తిరిగి మామూలు పరిస్థితికి వస్తుంది.

జగ మొండి - చర్మ రోగములకు

గోరింటాకు చిగుర్లు, పూలు వీటిని 20 గ్రా.
మోతాదుగా తీసుకొని ఒక పెద్ద గ్లాసు నీటిలో వేసి ఒక
కప్పు కషాయం అనగా నాలుగవ వంతు కషాయం
మిగిలే టట్లు మరగబెట్టి వడపోసి గోరువెచ్చగా
తాగుతుంటే చర్మరోగాలు హరించి పోతయ్. *


సంభోగ సౌఖ్యానికి - ముళ్ళ గోరింట

ముళ్ళ గోరింట గింజలను మేలి రకమైన తేనెతో
మెత్తగా నూరి దానిని పురుషులు తమ మర్మాంగము పై లేపనం చేసుకొని ఆరిన తరువాత సంభోగం
చేస్తుంటే ఎక్కువ సమయం వీర్యం నిలుస్తుంది.

దంతాలు ఊడకుండా - గట్టి పడుటకు

ఒక గ్లాసు నీటిలో పది గ్రాముల నల్ల పూల ముళ్ళ
గోరింటాకును వేసి ఒక కప్పు కషాయం మిగిలే
వరకు మరిగించి వడపోసి అది గోరువెచ్చగా
అయిన తరువాత నోటిలో పోసుకొని అయిదు నిమిషాలసేపు పుక్కిలించి వూసి వేయాలి. ఇలా చేస్తుంటే
పండ్లు గట్టిపడి నోటిపూత కూడ తగ్గిపోతుంది.

నోటినుండి రక్తం పడుతూ వుంటే 

పసుపుపచ్చని పూలు పూసే ముళ్ళ గోరింట
వేరును తెచ్చి కడిగి ఆర బెట్టుకోవాలి. ఈ వేరును
కొంచెం తేనెతో అరగదీసి ఆ గంధాన్ని 5 గ్రా. మోతాదుగా కొద్దికొద్దిగా నాలుకతో నాకుతూ వుంటే నోటి
నుండి పడే రక్తం ఆగిపోతుంది.

నిద్ర రాని వారికి - నిద్ర వచ్చుటకు

చాలామందికి వివిధరకాల మానసిక ఆందోళనల వల్ల లేక నరాల బలహీనతల వల్ల రాత్రిపూట
చాల సేపటి వరకు నిద్ర రాదు. అలాంటివారు
గోరింట చెట్టునుండి పూలు తెచ్చుకొని ఆ పూలను
దిండు కింద పరచి ఆ దిండు పైన తల బెట్టి కళ్ళు
మూసుకొని పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది.

అన్నిరకాల - సర్పి రోగాలకు

గోరింటాకు,ధనియాలు, ఎర్రచందనం, వీటిని
సమాన భాగాలుగా తీసుకొని విడివిడిగా దంచి,
జల్లెడ పట్టి ఆ తరువాత ఒకదానిలో ఒకటి వరుసగా
కలిపి ఒక గాజు పాత్రలో నిలువ వుంచుకోవాలి.

రోజూ పూటకు 3 గ్రా. మోతాదుగా నీటితో
రెండుపూటలా ఆహారానికి అరగంట ముందు
సేవిస్తూ, ఉప్పు వేయని గోధుమ రొట్టెను నేతితో తింటూ 
వుంటే క్రమంగా అన్నిరకాల సర్పి వ్యాధులు
తప్పకుండా హరించి పోతయ్.  


Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...