సాధారణ ఆరోగ్య అవగాహన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సాధారణ ఆరోగ్య అవగాహన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జనవరి 2019, సోమవారం

ఆపిల్ పండ్లతో వైద్యపరమైన ఉపయోగాలు. / APPLE / SEPU - AYURVEDIC USES

ఆపిల్ పండ్లు సాధారణంగా అన్ని కాలాలలో విరివిగా దొరుకుతాయి.దీనిలో మంచి విటమినులు ఉన్నాయి.ఒక ఆపిల్ లో 1 మి.గ్రా ఇనుము ,14 మి.గ్రా ఫాస్ఫరస్ ,10 మి.గ్రా కాల్షియం ,ఏ విటమినులున్నాయి.రోజుకొక ఆపిల్నైనా తింటే ఆరోగ్యంగా ఉంటారు.

1. ఆపిల్ మలబద్ధకాన్ని నివారిస్తుంది.సాఫీగా విరేచనం అవుతుంది,కడుపులో మలాన్ని కరిగిస్తుంది.శరీరానికి బలాన్నిస్తుంది.మలబద్ధకంలోనూ , విరేచనాలలోనూ రెంటిలో ఉపయోగపడతాయి.దోరగా ఉన్న ఆపిల్స్ మలబద్ధకంలోనూ,ఉడికించిన ఆపిల్స్ , బేక్ చేసిన ఆపిల్స్ విరేచనాలలోనూ ఉపయోగపడతాయి.రోజుకు కనీసం 2 ఆపిల్స్ తీసుకుంటే గాని మలబద్ధకంలో ఫలితం కనిపించదు.ఉడికించడం వల్ల ఆపిల్స్ లో ఉండే చెల్యులోజ్ మెత్తబడి మలం హెచ్చు మొత్తాల్లో తయారవుతుంది.

2 . ఇది రక్త క్షీణతను నివారిస్తుంది.రక్తక్షీణత గలవారు కనీసం రోజుకు 3 ఆపిల్స్ అన్నా తింటే మంచిది.దీని జ్యూస్ను తీసిన వెంటనే తాగాలి.ఆపిల్స్ లో ఇనుము ,ఫాస్ఫరస్ ,ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటాయి.కావున రక్త హీనతలో బాగా పని చేస్తుంది.తాజా జ్యూస్ వాడితే ఫలితాలు బాగా ఉంటాయి.రోజుకు కిలో చొప్పున తీసుకోగలిగితే మంచిది.ఆహారానికి అరగంట ముందు గాని ,నిద్రకు ఉపక్రమించబోయేముందు గాని తీసుకుంటే పూర్తిస్థాయిలో ఉపయోగం కలుగుతుంది.


3.చంటి పిల్లలకు విరేచనాలవుతున్నప్పుడు ఒక చెంచా ఆపిల్ జ్యూస్ తాగిస్తే విరేచనాలు అరికడతాయి.

4 . ఆపిల్ జ్యూస్ లో యాలకులు ,తేనె కూదా కలుపుకుని తీసుకుంటుంటే కడుపులో మంట ,పేగుల్లో పూత ,అజీర్తి,గ్యాస్ ట్రబుల్ ,పుల్లని తేనుపులు ,గుండెల్లో మంట నివారిస్తాయి.

5. రక్త ,బంక విరేచనాలు అవుతున్నవారు ఆపిల్ జ్యూస్ తీసుకుంటుంటే అందులో ఉండే పిండి పదార్థాలు విరేచనాలలోని నీటి శాతాన్ని తగ్గించడం వల్ల విరేచనాలు తగ్గుతాయి.ఆపిల్ ముక్కలను ఉడికించి తీసుకుంటే ఇంకా మంచిది.

6 . తరచూ ఆపిల్స్ తింటూ ఉంటే తరచూ వచ్చే జ్వరాలు అరికడతాయి.

7 . రోజూ ఆపిల్ జ్యూస్ తాగడం వలన కడుపులో మంట,మూత్రంలో మంట ఉండదు.

8 . ఆపిల్ లో క్యాల్షియం ,పొటాషియం ఎక్కువగా ఉండటం వలన బీపీ తో పాటు అన్ని హృదయ వ్యాధులను ,మూత్రపిండాల వ్యాధులను అరికడుతుంది.

9 . పక్షవాతం,నాడీ సంబంధ వ్యాధులు ,మెదడు వ్యాధులు కలవారికి ఆపిల్ చాలా మేలు చేస్తుంది.నరాలలో గల కణజాలాలమధ్య సంబంధాలను కలుగచేసే యాక్టిల్ చోలిన్ ఉత్పత్తి పెంపుదలకు ఈ పండు దోహదం చేస్తుందని తద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని,అల్జీమర్స్/మతిమరుపు అవకాశాలు తగ్గుతాయని అధ్యయనవేత్తలు తెలియజేస్తున్నారు.

10 . కామెర్ల వ్యాధిలో వీలైనంత ఆపిల్ రసాన్ని తాగుతుంటే కాలేయాన్ని సం రక్షిస్తుంది.

11 . ఆపిల్ కు కఫాన్ని తగ్గించే గుణం కూడా ఉంది.జలుబు,దగ్గు,ఆయాసం వీటిని నివారిస్తుంది.

12 . ఎలాంటి అనారోగ్యాలలోనైనా ఆపిల్ జ్యూస్ తాగవచ్చు.షుగర్ పేషంట్స్ మాత్రం ఈ పండ్లను తినకూడదు.

13 . ఆపిల్ జ్యూస్ లైంగిక శక్తిని పెంచుతుంది.అలసటను , నీరసాన్ని తగ్గిస్తుంది.

14 . ఆపిల్ ను ముక్కలుగా కోసి ,ఉడికించి రోజూ తింటుంటే శరీరం మీద బొల్లి మచ్చలు నివారణవుతాయి.శరీరం కాంతివంతంగా ఉంటుంది.

15 . ఆపిల్ చెట్టు వేళ్ళ రసాన్ని తాగుతుంటే కడుపులో ఏలిక పాములు నశిస్తాయి.

కొలెస్టరాల్ ఆధిక్యత తగ్గుదల -

ఆపిల్స్ ను తింటుంటే దానిలో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ పదార్థం కొవ్వు పదార్థల గ్రహింపును అడ్డుకుంటుంది.పెక్టిన్ ఒక జెల్ మాదిరి పదార్థంగా తయారై ఆంలాశయం గోడల మీద ,చిన్న పేగు గోడల మీద పేరుకుపోయి కొవ్వు విలీనాన్ని అడ్డుకుంటుంది.

క్యాన్సర్లు తగ్గుటకు -

 రోజూ ఆపిల్స్ వాడే వారిలో పెద్ద ప్రేగు క్యాన్సర్ల ఉనికి తక్కువగా ఉంటుంది.దీనిలోని పెక్టిన్ జీవక్రియకు లోనైనప్పుడు బ్యుటైరేట్ అనె పదార్థం విడుదలవుతుంది.ఇది మలాశయం గోడల మీద రక్షణగా పనిచేసి క్యాన్సర్లబారినుండి శరీరాన్ని కాపాడుతుంది.


తలనొప్పులలో  -

 అన్ని రకాల తలనొప్పులలో ఆపిల్స్ చక్కగా ఉపయోగపడతాయి.బాగా పండిన ఆపిల్ను పైనా కిందా చెక్కు తొలగించి ,మధ్యలోని గట్టి పదార్థాన్ని కూడా తొలగించి కొద్దిగా ఉప్పు కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తహీనత వంటి కారణాలతో ఏర్పడిన తలనొప్పులు తగ్గుతాయి.ఆశించిన ఫలితం కనిపించాలంటే దీనిని కనీసం 2,3 వారాలు తీసుకోవాలి.

ఉదర సంబంధ సంస్యలు తగ్గటానికి -

అల్పమైన జీర్ణక్రియా సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆపిల్ ఆహార ఔషధంగా ఉపయోగపడుతుంది.ఆపిల్ ను మెత్తగా తరిగి ముక్కలను మెత్తని గుజ్జుగా చేసి ,దాల్చిన చెక్క పొడిని ,తేనెను చేర్చి తీసుకోవాలి.గింజలు , తొడిమ తప్ప ఆపిల్ ను మొత్తంగా ఉపయోగించవచ్చు.తినబోయేముందు బాగా నమలాలి.ఆహార సమయాలకు మధ్యలో దీనిని తీసుకోవాలి.ఆపిల్ లోని పెక్టిన్ ఆంలాశయపు గోడల మీద సం రక్షణ పొరగా ఏర్పడి మృదుత్వాన్ని కలిగిస్తుంది.ముక్కలుగా తరిగిన ఆపిల్ కు పెద్ద చెంచాడు తేనెను చేర్చి ,కొద్దిగా నువ్వుల పొడిని చిలకరించి తీసుకుంటే జీర్ణావయవాలకు శక్తినిచ్చే టానిక్ గా పని చేస్తుంది.ఆకలిని పెంచుతుంది.ఆహారానికి ముందు దీనిని తీసుకోవాలి.దీని వల్ల జీర్ణ రసాలు ఎక్కువగా తయారవుతాయి.

గుండె జబ్బులలో -

గుండె సమస్యలున్నవారు ఆపిల్ తీసుకోవడం మంచిది.పొటాషియం , ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి.సోడియం తక్కువగా ఉంటుంది కాబట్టి రక్తపోటు పెరగదు.ఆపిల్ ను తేనెతో తీసుకుంటే ఫలితాలు చాలా బాగుంటాయి.ఆపిల్ లోని పొటాషియం వల్ల గుండెకండరాలు సమర్థవంతంగా పని చేస్తాయి.గుండె పోటు అవకాశాలు తగ్గుతాయి.

అధిక రక్తపోటు తగ్గడానికి -

రక్తపోటు ఎక్కువగా ఉన్నవారికి ఇది చక్కని ఆహార ఔషధంగా పని చేస్తుంది.పొటాషియం అధిక మొత్తాల్లో ఉండటం వల్ల మూత్రం హెచ్చు మొత్తాల్లో తయారై వెలుపలకు విసర్జితమౌతుంది.అలాగే సోడియం నిల్వలను తగ్గించి రక్తపోటు తగ్గడానికి కారణమౌతుంది.

వాపులతో కూడిన కీళ్ళనొప్పులు తగ్గడానికి -

గౌట్,రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ వంటి వాపులతో కూడిన కీళ్ళనొప్పుల్లో ఆపిల్ మంచి ఆహార ఔషధంగా పని చేస్తుంది.దీనిలోని మేలిక్ యాసిడ్ గౌట్ వ్యాధిలో పెరిగే యూరిక్ యాసిడ్ ను తటస్థపరచి నొప్పులను దూరం చేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.ఆపిల్స్ ను ఉడికించి ,జెల్లీలాగా చేసి పైన పూసి కొద్దిగా రుద్దితే నొప్పులను లాగేసి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

పొడి దగ్గు తగ్గటానికి -

ఇది తగ్గటానికి తియ్యటి ఆపిల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.రోజుకు పావుకిలో చొప్పున తీసుకుంటే బలహీనత మూలంగా వచ్చే పొడి దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది.

మూత్రపిండాల్లో రాళ్ళ సమస్యకు -

కిడ్నీలో రాళ్లు ఏర్పడినపుడు ఆపిల్స్ తీసుకుంటే ఉపయోగం కనిపిస్తుంది.కొన్ని దేశాల్లో మనం చింతపండు వాడినంత విరివిగా అసలైన ఆపిల్ సిడార్ వెనిగార్ వాడుతుంటారు.వీరిని శాస్త్రకారులు గమనించినపుడు కిడ్నీళ్ళో రాళ్లు దాదాపు కనిపించలేదు.బాగా పండిన తాజా ఆపిల్ పండ్లలో ఈ గుణం ఎక్కువగా ఉంటుంది.

కంటి సమస్యలలో -

కళ్ల కలకలూ , కంటి ఎరుపులూ ఉన్నప్పుడు ఆపిల్ ను లోపలకూ , బయటకూ వాడవచ్చు.పానీయంగా వాడటానికి కొంత తయారీ అవసరం.ముందుగా ఆపిల్ చెక్కులను ఒక పాత్రలో ఉంచి నీల్లు పోసి నీళ్లు మరిగేటంతవరకూ ఉంచి , దానంతట అదే చల్లబడేలా చేయాలి.తర్వాత వడపోసి ,తేనె కలిపి తీసుకోవాలి.బాగా మిగలపండిన ఆపిల్స్ నుకళ్ళ మీద పట్టు వేయటానికి వాడవచ్చు.కంటి మంటలలో ఇది అద్భుతంగా పని చేస్తుంది.కళ్లను మూసుకుని ఆపిల్ గుజ్జును పైకి పట్టు వేసి కదలకుండా బ్యాండేజీ గుడ్డను చుట్టుకొని ఒకటి రెండు గంటలుంచుకోవాలి.

దంత సమస్యల నివారణకు -

ఆపిల్స్ లో దంతాలు పుచ్చిపోకుండా నిరోధించే జీవరసాయనాలున్నాయి.ఆపిల్స్ ను అనునిత్యం తీసుకునేవారిలో దంతాలు ఆరోగ్యంగా తయారవుతాయి.ఆహారం తీసుకున్న తర్వాత ఆపిల్స్ ను కొరికి తింటే బ్రష్ చేసుకున్నంత ఫలితం ఉంటుంది.పైగా ఆపిల్స్ లో ఉందే ఆసిడ్స్ వల్ల లాలాజలం స్రవించి సహజమైన రీతిలో కీటాణువులను నిర్వీర్యపరుస్తుంది.ఏ ఇతర పండులోనూ లేని అద్భుత గుణమిది.

యవ్వన శక్తి పొందుటకు -

అకారణంగా నీరసంగా అనిపించేటప్పుడు ,బడలికగా ఉన్నప్పుడూ ,నిస్త్రాణగా తోచినప్పుడూ ఆపిల్ మంచి ఆరోగ్యకరమైన ఆహారంగా ఉపయోగపడుతుంది.ఇది అనేకరకాల ఆహారలోపాలను సవరించి శరీరాన్ని పరిపుష్టం చేస్తుంది.ఆపిల్ లో అధిక మొత్తాల్లో ఇనుము , ఫాస్ఫరస్ లు ఉంటాయి.ఇతర పండ్లలో ఇంత మొత్తాల్లో ఈ పదార్థాలు ఉండవు.ఆపిల్ ను అనునిత్యం పాలతో కలిపి తీసుకుంటే చర్మం యవ్వన కాంతిని సంతరించుకుంటుంది.చర్మానికి బిగువు,నిగారింపు వంటివి ఏర్పడతాయి.దీనివల్ల అమితమైన రిలాక్సేషన్ లభిస్తుంది.

జిగట విరేచనాలు తగ్గుటకు -

పిల్లలలో తరచుగా జిగట విరేచనాలు అవుతుంటాయి.ఇలాంటి సందర్భాల్లో ఆపిల్స్ బాగా ఉపయోగపడతాయి.బాగా మిగలపండి,తియ్యటి రుచి కలిగిన ఆపిల్స్ ను మెత్తగా చిదిమి వయసును బట్టి ఒకటి నుంచి నాలుగు పెద్ద చెంచాలు తినిపిస్తే జిగట విరేచనాలు తగ్గుతాయి.

ఆపిల్స్ లో ఫైబర్ ఎక్కువగా,కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ,సోడియం తక్కువగా,పొటాషియం ఎక్కువగా ఉంటాయి.విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది.

శ్వాస సమస్యల నివారణకు -

రోజుకు ఒక ఆపిల్ చొప్పున వారంలో ఐదారు తిన్నట్లైతే ఊపిరితిత్తుల పనివిధానం మెరుగ్గా ఉంటుంది.ఆపిల్ తొక్కలోని క్యురెక్టిన్ అనే యాంటీ ఆక్సిడెంట్  ఊపిరితిత్తుల పనివిధానాన్ని మెరుగుపరుస్తుంది.టొమేటోలూ,ఉల్లిపాయలలోనూ ఇలాంటి ఆంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి.క్రమం తప్పకుండా ఆపిల్స్ తింటూ ఉంటే శ్వాసకోశ పనివిధానం బాగుంటుంది.పుష్కలంగా ఆపిల్స్ తినే మహిళల్లో ఆస్థ్మా ఉండే అవకాశాలు లేని పిల్లలు జన్మిస్తారని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.





ఫిట్స్ / మూర్చ వ్యాధి గురించిన అపోహలు - వాస్తవాలు.


మూర్చ రోగంగా ప్రచారంలో ఉన్న ఈ వ్యాధిని వైద్య పరిభాషలో ఎపిలెప్సి ,కన్వల్షన్స్,సీజర్స్,ఫిట్స్ అని అంటారు.పూర్వ కాలంలో ఈ వ్యాధిపై ప్రజల్లో చాలా అపోహలు ఉండేవి.శక్తి పూనింది,ఆత్మ ఆవహించింది,దెయ్యం పట్టిందని ప్రజలు నమ్మేవాళ్లు.క్రీ.పూ. 470 లో హిపోక్రెట్స్ అనే వ్యక్తి దీనిని జబ్బుగా గుర్తించడంతో కొద్దిగా భయం తగ్గింది.యూరప్ దేశాల్లో 17,18 వ శతాబ్దంలో ఈ వ్యాధి ఎక్కువ మందికి రావడంతో ఆ దేశ ప్రజలు చాలా ఆందోఅళనకు లోనయ్యారు.ఇండియా ఈ వ్యాధిని ఆత్మ ఆవాహన / ఈవిలి స్పిరిట్ గా భావించి అశాస్త్రీయ పద్ధతుల్లో నివారణకు ప్రయత్నించేవారు.

  మొదటి సారి జాన్ హల్గిన్స్ జాన్సన్ 1835-1911 ఈ వ్యాధిపై ఎన్నో పరిశోధనలు చేసి ,ఎందరో రోగులను పరిశీలించి జబ్బు లక్షణాలు కనుగొన్నారు.ఆయన చేసిన విశేష కృషికి గాను ఆయనను ఫాదర్ ఆఫ్ న్యూరాలజీ అంటారు.1857 లో మొదటి మందు పొటాషియం బ్రోమైడ్ ను సర్ చార్లెస్ కనుగొన్నారు.

ఫిట్స్ వచ్చేవారిలో 95 శాతం మందికి ఒకటి,రెండు నిమిషాలలో ఫిట్స్ వచ్చి తగ్గిపోతాయి.5 శాతం మందిలో మాత్రమే ఎక్కువసేపు ఉంటాయి.

ఫిట్స్ వచ్చిన వెంటనే తలపై నీళ్లు పోయడం ,చేతిలో ఇనుప వస్తువులు ఉంచడం ,నోట్లో స్పూన్ లేదా కర్చీఫ్ పెట్టడం ,ముక్కు దగ్గర ఉల్లిపాయ ఉంచడం వంటి పద్ధతులు మంచివి కావు.ఈ చిట్కాలలో రోగికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ఫిట్స్ వచ్చినప్పుడు ఒకవైపునకు తిప్పి పడుకోబెట్టాలి.శ్వాస సరిగ్గా తీసుకునేలా మెడను కొద్దిగా వెనక్కి వంచాలి.రోగికి గాలి తగిలేలా కిటికీలు ,తలుపులు తెరిచి ,ఫాన్ వేయాలి.

ఫిట్స్ తగ్గిన అరగంట వరకు ఎలాంటి ఆహారం ఇవ్వవద్దు.అరగంట తర్వాత రోగి పూర్తిగా స్పృహలోకి వచ్చిన తర్వాత మొదట మంచినీళ్లు ఇవ్వాలి.ఫిట్స్ వచ్చిన సమయంలో నాలుక కట్ అయి ఉంటే వెంటనే దాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాలి.

మూర్చ రోగ నిర్ధారణకు చేయాల్సిన పరీక్షలు ఇ ఇ జి ,సిటి స్కాన్ బ్రెయిన్,ఎం ఆర్ ఐ బ్రెయిన్ పరీక్షలు చేసి జబ్బును నిర్ధారించుకున్న తర్వాత చికిత్స ప్రారంభించాలి.

90 శాతం మందికి 3 సంవత్సరాలు క్రమంగా మందుల వాడకంతో ఫిట్స్ పూర్తిగా తగ్గిపోతాయి.10 శాతం రోగులకు మాత్రమే పదే పదే వస్తుంది.తగిన పరీక్షలు చేసి సరైన మందులతో తగ్గించవచ్చు.1000 మందిలో ఒకరిద్దరికి మాత్రం ఎన్ని మందులు వాడినా ఫిత్స్ వస్తూనే ఉంటాయి.ఇలాంటి రోగులకు ఎపిలెప్సీ సర్జరీ చేయడంతో వ్యాధిని తగ్గించవచ్చు.100 మంది రోగులలో 90 శాతం మందికి ఒక్క టాబ్లెట్ తోనే పూర్తిగా కంట్రోల్ అవుతుంది.మరో 9 శాతం రోగుల్లో మరో టాబ్లెట్ ( రెండు రకాల మందులతో ) ఇవ్వడంతో తగ్గుతుంది.1 శాతం రోగుల్లో మాత్రమే రెండు కన్నా ఎక్కువ రకాల మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది.

కారణాలు.-  ఎన్నో కారణాలు ఉన్నా ముఖ్యంగా 60 శాతం మందికి ఏ కారణం లేకుండానే వస్తుంది.దీనిని ఇడియోపథిక్ ఎపిలెప్సీ అంటారు.40 శాతం మందిలో రకరకాల కారణాలతో టిభి,వాంస్ కారక ట్యూమర్ వల్ల,మెదడులో ఏర్పడే మచ్చల వల్ల ,రక్తనాళాలలో దోషాలతో ,తలకు దెబ్బ తగలడంతో ,శరీరంలో కొన్ని అవాంచిత మార్పుల కారణంగా ( సోడియం తగ్గినా ,కిడ్నీ,లివర్ ఫెయిల్ అయినా ,కాల్షియం మోతాదు పెరిగినాతగ్గినా,గ్లూకోజ్ తగ్గినా,పెరిగినా ) ఫిట్స్ వస్తాయి.

ఐతే నూటికి 99 శాతం ఫిట్స్ పూర్తిగా నయం అవుతున్నాయి కాబట్టి వీటి గురించి ఆందోళన అవసరం లేదు.ఫిట్స్ కారణంగా ప్రాణహాని,శరీర ఇతర భాగాలపై చెడు ప్రభావం లేదు కాబట్టి దీనిని ప్రమాదకరమైన జబ్బుగా పరిగణించాల్సిన అవసరం లేదు.

ఒక్కసారి వస్తే జీవితాంతం ఉండి ,శరీర భాగాలపై దుష్ప్రభావం చూపే మధుమేహం తో పోలిస్తే ఈ జబ్బు చాలా చిన్నది.

జాగ్రత్తలు -
              ఈ వ్యాధి నివారణకు మందులతో పాటు జీవనశైలిలో మార్పు చాలా అవసరం.

సమయానుకూలంగా భోజనం,నిద్ర చాలా ముఖ్యం .ఉపవాసాలు చేయవద్దు.

ఈ వ్యాధి వచ్చిన వారు ఆల్కహాల్ తీసుకోవద్దు.కాఫీ,టీ,స్మోకింగ్ చాలా వరకు తగ్గించాలి.

ఎక్కువగా టెన్షన్ ,మానసిక ఒత్తిడికి గురికావద్దు.డ్రైవింగ్,స్విమ్మింగ్ చేయవద్దు.

మరీ దగ్గరగా టివి ని చూడవద్దు.టివి బ్రైట్నెస్స్ ,కలర్,షార్ప్నెస్స్ ,కాంట్రాస్ట్ చాలా వరకు తగ్గించి చూడాలి.

" నిరక్షరాస్యత కన్నా మూర్చ రోగం పెద్ద జబ్బు కాదు " .

ఆయుర్వేద చికిత్స

1.సర్ప గంధి వేర్ల కషాయము ప్రతిరోజూ తీసుకోవాలి.మూర్చ రాగానే ఉల్లిపాయ రసం కానీ ,కుంకుడు కాయను అరగదీసిన గంధమును కానీ రెండు చుక్కలు ముక్కులో వేస్తే వెంటనే స్పృహలోకొస్తారు.

2.ఒక చెంచా తేనెను ఒక కప్పు నీటిలో కలుపుకొని పూటకొకసారి తాగుతుంటే కొంత కాలమునకు పూర్తిగా వ్యాధి నయమౌతుంది.

3.వసను పొడిగా చేసి సీసాలో భద్రం చేసుకుని ,రోజూ అరచెంచా పొడిని తేనెతో కలిపి తీసుకుంటుంటే మూర్చ,ఫిట్స్,నరాలకు సంబంధించిన వ్యాధులు నయమౌతాయి.దీన్ని తీసుకుంటున్నవారు మసాలాలు,పులుపు,కారం లేకుండా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.

5, జనవరి 2019, శనివారం

పచ్చి మిర్చి మంచిదా లేక పండు మిర్చి మంచిదా ?

పచ్చి మిర్చి మంచిదా ,పండు మిర్చి మంచిదా అంటే రెండూ మంచివే.ఏ కాలంలో దొరికేవి ఆ కాలంలో తినడం మంచిదన్నది తెలిసిందే.ఆకుపచ్చని మిర్చి,పసుపు రంగు మిర్చిలతో పోలిస్తే పండు మిర్చిలో విటమిన్ సి,బీటా కెరోటిన్ ల శాతం ఎక్కువ,ఎ,బి,సి విటమినులతో పాటు ఖనిజాలు కూడా ఇందులో పుష్కలంగా ఉండడంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.క్యాన్సర్ తోనూ పోరాడగలడు.ముఖ్యంగా ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు ఇది సాయపడుతుందట.పొట్టలో హానికర బ్యాక్టీరియాని నివారిస్తుంది.

  పండు మిర్చి రంగు చూస్తేనే నోరూరుతుంది.అంటే ఆకలిని పెంచినట్లే కదా..అలాగే ఇది రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేయడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది.ముఖ్యంగా రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వుని సైతం కరిగించే గుణాలు ఇందులో ఉంటాయి.

    జలుబూ,జ్వరాలు గట్రా రాకుండా నిరోధించే గుణాలూ ఇందులో ఎక్కువే.నొప్పులకి కారణమయ్యే ఇంఫ్లమ్మేషన్ ని తగ్గిస్తుంది.దాని ఫలితంగానే ఆర్థ్రైటిస్,సొరియాసిస్,డయాబెటిక్ న్యూరోపతి...వంటి వాటి కారణంగా తలెత్తే నొప్పుల్ని తగ్గించే గుణం పండు మిర్చిలో ఎక్కువ.దీన్ని తరచూ ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణశక్తినీ,జీవక్రియనీ పెంచడంతో పాటు బరువు పెరగకుండానూ చేస్తుంది.ఇది తిన్నాక పుట్టే వేడి కారణంగా వ్యాయామంలో మాదిరిగా కెలొరీలు కరుగుతాయి.

   ఆస్తమా,సైనస్,జలుబులతో బాధ పడేవాళ్లు వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఊపిరితిత్తులు,గొంతు,ముక్కుల్లో శ్లేష్మం,మ్యూకస్ పేరుకోకుండా ఉంటుంది.పండు మిర్చి వాసన తలనొప్పుల్నీ తగ్గిస్తుంది.

* బచ్చలి ఆకుకూరను తరచుగా తింటుంటే పంటి చిగుళ్ళ నొప్పులు తగ్గిపోయి ,చిగుళ్ళను గట్టి పరుస్తుంది. *

26, డిసెంబర్ 2018, బుధవారం

పండంటి ఆరోగ్యానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 5 సూత్రాలు.

పంచ ప్రాణాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన 5 సూత్రాలు.

పండంటి ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యం ఖచ్చితంగా సూత్రాలు పాటించాలని తాజాగా పిలుపిచ్చింది.ఏ వయసు వారైనా ,ఆహారపరంగా ఈ సూత్రాలను పాటిస్తే జబ్బుల బారిన పడకుండా జీవించటానికి అవకాశం ఉంటుందని తెలిపింది.

1. రక రకాల ఆహార పదార్థాలను తినడం.

2. ఉప్పు తగ్గించడం.

3. కొవ్వులు,నూనెలు తగ్గించడం.

4. తీపి కూడా తగ్గించడం.

5. మద్యం మానుకోవడం / మద్యానికి సురక్షిత స్థాయి లేదు .

22, డిసెంబర్ 2018, శనివారం

పెంపుడు జంతువులతో వచ్చే జబ్బులు - ఆయుర్వేద చికిత్స


ఈ రోజులలో ప్రతి ఇంట్లోనూ పెంపుడు జంతువులు ఉండడం సర్వసాధారణం అయిపోయింది.ఐతే వీటితో ఎక్కువగా గడపడం వల్ల కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.వీటి వల్ల నోరు,కడుపు,పేగులు మండుట వంటివి వచ్చే అవకాశన్మ్ కలదు.అలాంటప్పుడు ఈ కింది చికిత్సలు ఎంతో ఉపయోగపడతాయి.

1. ఒక కప్పు నీటిలో రెండు చెంచాల తేనెను కలిపి తాగుతుండాలి.

2. 10 చుక్కల వెల్లుల్లి రసమును నీటిలో కలిపి తాగుతూఉండాలి.రోజుకు 2 సార్లు వ్యాధి తగ్గేవరకు తాగాలి.

3. శీతాంశురసము,పైత్యాంతక రసములను కలిపి వాడాలి.

23, ఏప్రిల్ 2017, ఆదివారం

ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్య వేధిస్తుంటే ఏం చెయ్యాలి? / EPPUDOO EDO OKA ANAROGYA SAMASYA VEDHISTHUNTE EM CHEYYALI?



వ్యాధుల లక్షణాల ఆధారంగా చికిత్స తీసుకుంటే మందులు వాడున్నంత కాలమే కొంత ఉపశమనంగా అనిపిస్తుంది.ఆ మందులు కాస్త మానేయగానే సమస్య మళ్ళీ మొదలవుతుంది.ఈ సారి ఇన్ని రోజులుగా వాడిన మందుల దుష్ప్రభావాలు అదనంగా కనిపిస్తాయి.ఈ సమస్యలన్నింటికీ శరీరం వ్యాధుల మూలాల నుండి పూర్తిగా విముక్తం కాకపోవడమే కారణం.శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే దీనికి సరైన పరిష్కారం.అందుకొరకు రెండే రెండు మౌలిక సూత్రాలు అనుసరించాలి.1. శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోకుండా చూసుకోవడం. 2.శక్తి నిలువలను తగ్గకుండా చూసుకోవడం.ఇందులో భాగంగా శరీరంలో ఆక్సీజన్ , నీటి నిలువలు , హిమోగ్లోబిన్ , విటమిన్ నిలువలు సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి.ఈ మౌలిక సూత్రాలు విస్మరించి , డాక్టర్ సూచించిన ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండదు.ఒక్క మాటలో చెప్పాలంటే , వ్యాధి నుండి విముక్తం కావాలంటే ,వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం.

ఆవు పేడ / AVU PEDA THO AROGYA MANTHRAM/COW DUNG - HEALTH BENEFITS

Cow dung is very useful in many diceasesహోత్ర,
అగ్రహోత్ర అనే వస్తువును ఆవు పిడకలు, పంచ
నెయ్యి కలిపి తయారు చేస్తారు. దీని వలన ప్రాజ
బిన్ అనే పదార్థంలో పాటు ఆక్సిజన్ విడుదల అవు
ఉంది. దీంతో మృత్యువుని జయించే శక్తితో పాటు
వాతావరణం శుద్ధి అవుతుంది. ఇంటిలో గొడవలు,
అల్లర్లు జరుగకుండా ఉండే ప్రశాంత వాతావరణం
ఇందులో నుంచి వెలువడుతుంది. ఈ వీడు
పాటు వెయ్యివేసి హోమం చేస్తే వర్షాలు కురిసే
ఎక్కువ. ఆ బూడిలను వేసే నీరు శుచ్చంగా
దీపం వత్తి..
చేసిన దీపం వత్తినిదీపం వత్తి..
వేరు, పంచకము, నెయ్యితో
తయారు చేసిన దీపం పట్టం
తయారు చేయాలి. అనం
ఏకాగ్రత కోసం వాడుతారు.
అనారోగ్య సమస్యలు ఎదురు
రాయి. కానీ, అన్న పేరుతో చేసిన
నిత్యం హోమం చేసినట్లుగా భాం
పారు. అలాగే, లక్ష్మీదేవి అని
నమ్మకం

దూప్ స్టిక్..
దూస్టికు ఆవు పేడ, పంచకము,
వనమూలికలతో తయారు చేస్తారు.
ఇళ్లలో దూప్ స్టిక్ ను వెలిగించడం వలన
ఏకాగ్రత, బుద్ధికుశలత కలిగి పరంగా
ఉపయోగపడుతుంది. ఆవుపేడ,
పంచకం, వనమూలికలతో చేయటం
వలన ఆరోగ్యానికి మంచిది.

పళ్ల పొడి..
అన్న పేరుతో తయారు చేసిన వీర
ఆడ, మిరియాలు, పటిక,
లవంగ, ప్రపం చూర్ణంతో కలిపి
ఉపొడిని తయారు చేస్తారు. అలా
నాలు ఉండవు. ఈ పొడితో పళ్లు
తోముకుంటే పిప్పళ్లు, దంత సమ
వ్యలు, నోటి దుర్వాసన వంటిని
ఆ చేరవు. విడిపోయే పళ్లు సైతం
గట్టి పడే అవకాశాలు ఉన్నాయి.
ఫినాయిల్..
ఫినాయిలను ఆవు పంచకము,
వేపాకు రసం, ఫైన్ ఆయిల్ తో తయారు
చేస్తారు. పంచకం చల్లిన ప్రదేశం శుద్ధి
అవుతుంది. ఈ ఫినాయిలు వాడడం
వలన దుర్వాసన, క్రిమికీటకాల నుంచి
యనాలు లేకుండా ఫినాయిల్ ఆరోగ్య

దోమల బిళ్లలు..
దోమల బిళ్లలను ఆవు పేడ, పంచ
కము, వేప ఆకులతో తయారు చేస్తారు.
రసాయనాలు వాడకుండా వీటిని
చేయడం వలన దోమల నివారణతో
పాటు, ఆవు పేడ, పంచకంతో తయారు
అవుతున్నందున ధనధాన్యాలు సమృద్ధిగా
ఉండే అవకాశాలుంటాయని నమ్మకం.
పేడ బాల్స్..
పేడ, పంచకము, త్రిఫల
చూర్ణం, తులసితో బాలు
తయారు చేస్తారు. చిన్న పిల్లలు
సామాన్యంగా ఆడుకోవడానికి
ప్లాస్టిక్, రబ్బర్ బాలు ఉపయోగి
స్తారు. వాటిని నోట్లో పెట్టుకోవు
టంతో అనారోగ్య సమస్యలు తల
త్తుతాయి. ఆవు పేడ, పంచకం
త్రిఫల చూర్ణం, తులసితో
తయారు చేసిన బాల్స్ తో పిల్లలు
ఆడుకోవచ్చు. నోట్లో పెట్టుకున్నా
ఎలాంటి సమస్యలు తలెత్తకుండా
ఉంటాయి.
హోమపిడకలు..
లికలతో హోమ పిడకలను
తయారు చేస్తారు. వాటిని
మంలో వాడటం వలన అనా
రోగ్య సమస్యలను తొలగించు
డంతో పాటు ఆరోగ్యం కుదురుగా
ఉంటుంది. ఇళ్లలో వాడటం వలన
శుచి, శుభ్రతకు మంచిగా చెప్పిన
చ్చును.
ఇటుకలు..
ఆవుపేడ, పంచకంతో మట్టి ఇటుక
లను కాలుస్తే గట్టి పడతాయి. ఆవు
పేడతో తయారు చేసిన ఇటుకలు 150
కిలోల బరువు వరకు మోయగలవు,
ఇటుకలను కాల్చనవసరం లేకుండా గట్టి
పడుతుంది. వీటిని ఇల్లు కట్టుకోవటానికి
సైతం ఉపయోగించవచ్చును. ఈ ఇటుక
లతో దేవుని గదిలో ఉహోమపిడకలు..
లికలతో హోమ పిడకలను
తయారు చేస్తారు. వాటిని
మంలో వాడటం వలన అనా
రోగ్య సమస్యలను తొలగించు
డంతో పాటు ఆరోగ్యం కుదురుగా
ఉంటుంది. ఇళ్లలో వాడటం వలన
శుచి, శుభ్రతకు మంచిగా చెప్పిన
చ్చును.
ఇటుకలు..
ఆవుపేడ, పంచకంతో మట్టి ఇటుక
లను కాలుస్తే గట్టి పడతాయి. ఆవు
పేడతో తయారు చేసిన ఇటుకలు 150
కిలోల బరువు వరకు మోయగలవు,
ఇటుకలను కాల్చనవసరం లేకుండా గట్టి
పడుతుంది. వీటిని ఇల్లు కట్టుకోవటానికి
సైతం ఉపయోగించవచ్చును. ఈ ఇటుక
లతో దేవుని గదిలో ఉ


వని, 11రకాల వస్తువులను వాడటం ఇంటి పానికి
ఆవు పేడను సేకరించటమే ఒక వింతగా భావించే
నేటి సమాజంలో నిత్యం ఆవు పేడ, మూత్రంతోనే గడు
ప్రభావం చూపని 11 రకాల వస్తువులను తయారు చేసి,
మార్కెట్‌లోకి తీసుకు రావటం అరుదైన విషయమని
చెప్పొచ్చు. మనం ఇళ్లలో నిత్యం ఉపయోగించే వస్తున్న
విషయం తెలిసిందే. అయితే ఆవు పేడతో తయారైన ఈ
వస్తువులతో ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు ఉంది
11రకాల వస్తువుల తయారీ..
పడం ప్రత్యేకతే వాటితో మనిషి ఆరోగ్యంపై ఎలాంటి
లతో పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్న
ఆరోగ్యకరమని పలువురు పేర్కొంటున్నారు.

16, ఏప్రిల్ 2017, ఆదివారం

అలవాట్లు మార్చుకుంటే ఆయుష్మాన్ భవ / CHANGE IN HABITS - MORE LIFE SPAN

Change in habits improves our lifespan .Hence we have to observe ourselves and make necessary changes in habits.
• 12 గిరిజన గ్రామాల్లో 3,600 మందిపై
ఎన్‌ఐఎన్ పరిశోధన
వీరిలో 1800 మంది ఆహార
అలవాట్లు మార్పించిన శాస్త్రవేత్తలు
తగ్గిన రక్తపోటు, ఇతర వ్యాధులు
మిగిలిన వారిలో వ్యాధులు యథాతథం

అదుపులేని ఆహారపు అలవాట్లు, వేళకు తినకపోవడం,
కనీస వ్యాయామం లేకపోవడం.. నూటికి తొంభై శాతం
జబ్బులకు ఇదే కారణం. వాటిలో మార్పు తేగలిగితే
అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘవ్యాధుల
బారిన పడకుండా కాపాడుకోవచ్చు. తద్వారా ఆయుష్షును
పెంచుకోవచ్చని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్)
చెబుతోంది. ఈ అంశాన్ని నిరూపించేందుకు కొంతమంది
గిరిజన కుటుంబాల పాత అలవాట్లను మార్చి ఆరోగ్యప
రమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారిలో రక్తపోటు
(బీపీ), ఇతర వ్యాధులను తగ్గించడంలో సఫలీకృతమ
యింది. రెండేళ్ల కృషి ఫలితంగా దాదాపు 1800 మంది
జీవితాల్లో కొత్త వెలుగులు చూపించబోతోంది. ఈ పరి
శోధన ఫలితాలపై ప్రత్యేక కథనం.
ప్రయోగం ఎలా చేశారంటే..
రెండేళ్ల కిందట ఎన్‌ఐఎన్ ప్రతినిధులు ఆదిలాబాద్
జిల్లాలోని గిరిజన గ్రామాల్లో సర్వే చేసి క్షేత్రస్థాయిలో
పరిస్థితిని అంచనా వేశారు. ఇప్పటికీ
చాలా గిరిజన గ్రామాల్లోని పురుషుల్లో 50 శాతం
మందికి, మహిళల్లో 20 శాతం మందికి మద్యం
తాగే అలవాటుంది. చాలా మంది ఆహారం, ఇత
రత్రా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం
లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్‌ఎన్
శాస్త్రవేత్తలు ఉట్నూరు మండలంలోని పన్నెండు
గ్రామాల్లోని గిరిజనులపై ప్రయోగాన్ని చేపట్టారు.
ఈ గ్రామాల్లో 18 ఏళ్లు పైబడిన మొత్తం 3,600
మందిని ఎంపిక చేసి రెండు గ్రూపులు చేశారు.
ఇందులో ఆరు గ్రామాల్లోని 1800 మందిని
మొదటి విభాగంగా చేసి తమ అధ్యయనంలోకి
తీసుకున్నారు. ఆహారపు అలవాట్ల విషయంలో
జిల్లాలోని ఆశ, అంగన్‌వాడీ సిబ్బందికి రెండు
నెలల శిక్షణ ఇచ్చి వారిద్వారా 1800 మంది గిరిజ
నుల ఆహార అలవాట్లలో మార్పునకు శ్రీకారం
చుట్టారు. వందల సంఖ్యలో చైతన్య కార్యక్రమాల
ద్వారా మొదటి గ్రూపులోని గిరిజనులంతా ఆహా
రపు అలవాట్లను మార్చుకుంటున్నారు.
ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివి...
ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాములు ఉప్పు
మాత్రమే వాడాలి. కానీ అక్కడి గిరిజనులు 10
-12 గ్రాముల ఉప్పును వాడుతున్నట్లు తేలింది.
ఒక వ్యక్తి రోజుకు 20 గ్రాములకు మించి వంట
నూనె వాడకూడదు. అది నెలంతా ఒకే రకం
నూనెను వాడకుండా రెండు మూడు రకాల
నూనెలను వాడాలి. గిరిజనులు తక్కువ
నూనెనే వాడుతున్నా పెద్దగా నాణ్యత లేని ఒకే
నూనెను నెలల తరబడి వాడుతున్నారు. ఇది
అనార్యోగానికి కారణమవుతోంది.
రోజుకు 100 గ్రాముల కూరగాయలు తీసుకో
వాలి. అందులో 250 గ్రాముల కూరగాయలు,
150 గ్రాముల పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు.
గిరిజనులు పళ్లు, కూరగాయల తక్కువగానూ,
మాంసాహారం ఎక్కువగానూ తింటున్నారు.
రోజూ కనీసం అరగంట నుంచి గంటపాటు ఏదో
ఒక వ్యాయామం చేయాలి. గిరిజన గ్రామాల్లో
గతంలో కొండలు ఎక్కి దిగి అటవీ ఉత్పత్తులను
సేకరించేవారు. ఇప్పుడా పరిస్థితి దాదాపుగా
లేదు. ఒకరోజు పనికి వెళ్లి రూ.300-రూ.400
తెచ్చుకుంటే తర్వాత మూడు నాలుగు రోజుల
పాటు ఇంట్లోనే కూర్చోవడం, కొంతమంది మద్యం
తాగుతుండడం వంటివి చేస్తున్నారు. ఇది వారి
ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోందని తేల్చారు.
ఇది లక్ష్యం
12 గిరిజన గ్రామాల్లో ఎంపిక చేసిన 3,600
మందికి ఆరోగ్య పరీక్షలు చేయించి వీరి వ్యక్తిగత
ఆరోగ్య నివేదికలు తయారు చేయించారు. ఇక్కడి
గిరిజనుల్లో 20 శాతం మంది అధిక రక్తపోటుబాధితులు, రక్తంలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ 128
మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్కురీ (ఎంఎంహెచ్ఓ)
ఉంది. దీన్ని 120 గ్రాములకు తగ్గిస్తే నాలుగో
వంతు మందిని గుండె సంబంధిత వ్యాధులను
నుంచి దూరం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతు
న్నారు. ఈ దిశగా వీరు ప్రయత్నాలు చేశారు.
ఏం చేశారు?
•ఆరు గ్రామాల్లోని ఎంపిక చేసిన 1800 మంది
గిరిజనుల ఆహారపు అలవాట్లను రెండేళ్లలో
మార్చగలిగారు. ప్రతి రోజూ ఒక్కో మనిషి
ఆరు గ్రాముల ఉప్పే వాడకంతోపాటు, 20
గ్రాముల చొప్పున రెండు మూడు రకాల నూనె
లను వినియోగించేలా చూశారు.
• అందుబాటులో ఉన్న కూరగాయలు, పండ్లు
తినేలా చేస్తున్నారు.
ప్రతి రోజూ వ్యాయామాన్ని అలవాటు చేశారు.
• ధూమపానం, మద్యపానం, అతిగా మాంసాహారం
తినే అలవాట్లను చాలా వరకు మాన్పిస్తున్నారు.
ప్రస్తుతం వీరికి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు.
మూడొంతుల మందిలో రక్తపోటుతోపాటు
రక్తంలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ 128ఎంఎంహెజ్
నుంచి 120-123 మిల్లీ గ్రాములకు తగ్గింది.
• మరో ఆరు గ్రామాల్లో ఎంపిక చేసిన 1800
మంది విషయంలో ఇటువంటి జాగ్రత్తలేమీ
తీసుకోలేదు. దీంతో వీరి ఆరోగ్యంలో ఎలాంటి
మార్పు రాలేదని తేలింది. అధిక రక్తపోటుతో
పాటు వివిధ రకాల వ్యాధులతో వీరు బాధప
డుతున్నారని గుర్తించారు.
ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనుల పై అధ్యయనం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గిరిజనుల ఆరోగ్యంపై
ఎస్ఎన్ నాలుగేళ్ల కిందట సమగ్ర అధ్యయనం
చేసింది. దీనిలో గుర్తించిన అంశాలివి.
• ప్రీస్కూల్ బాలురలో తక్కువ బరువున్న వారు
59.04 శాతం, బాలికలు 50.3 శాతం ఉన్నారు.పెరుగుదల తక్కువ ఉన్న వారు బాలురలో
57.0 శాతం, బాలికల్లో 52.4 శాతం.
• పెరుగుదల బాగున్నా బరువు తక్కువున్నవారు
బాలురలో 2.7శాతం, బాలికల్లో 20.2 శాతం.
• ఉమ్మడి రాష్ట్రంలో 17 శాతం మంది పురుషులు,
20.8 శాతం మంది మహిళలు అధిక రక్తపో
టుతో బాధపడుతున్నారు.

మరణాల నివారణే లక్ష్యం

దేశంలోని వ్యాధుల వల్ల చనిపో
తున్న రోగుల్లో 50 శాతం మంది
గుండె సంబంధిత వ్యాధులతోనే చనిపో
తున్నారు. ఈ మరణాలను నివారించా
లంటే సరైన ఆహార అలవాట్లు పాటిం
చాలి. దీన్ని తెలియజేసేందుకే రెండేళ్ల
నుంచి పరిశోధన మొదలు పెట్టాం. పూర్తి ఆరోగ్య
విధానాలను పాటించడం ద్వారా ఆరో
గ్యపరంగా అనేక మార్పులు తీసుకురా
వచ్చని నిరూపించగలిగాం. ఈ ప్రయో
గాన్ని మరో ఏడాది కొనసాగించి
మరిన్ని ఫలితాలను సాధిస్తాం.

9, మార్చి 2017, గురువారం

ఆయుష్షు పెంచే ఆహారం / THE FOOD FOR IMPROVING LIFESPAN

Some good things are very useful in improvement of lifespan.
30 ఏళ్లకే ఆయాసం, నలభై ఏళ్లు
నీరసం, నవల చాలా మందిలో చూస్తున్న
పరిస్థితి ఇది. ఇక యాభయ్యో పడిలో పడితే
గుప్పెడు మాత్రలు మింగుతూ ఇంటిపట్టున
కృష్ణారామా అనుకుంటూ కూర్చోవలసిందే!
మన దగ్గర ఇలా ఉంటే జపాన్ దగ్గరున్న
'ఒకినావా దీని వాసులు మాత్రం శతాధిక
వృద్ధులుగా ప్రపంచ ప్రఖ్యాతి పొందుతు
న్నారు. అక్కడి రోమాన్ మురా అనేక
శతాధిక వృద్ధుడు ఏకంగా 118 ఏళ్ల దాకా
బతికి ఇటీవల కొత్త రికార్డు సృష్టించాడు.
ఇతనికి ముందు మిసావో కావా అనే
మహిళ 15 ఏళ్లు జీవించిన శతాధికురాలిగా
పేరు తెచ్చుకుంది. జపనీయులు వందేళ్లు
జీవిస్తూ పేరు తెచ్చుకుంటే, ఒకినావా
వాసులు ఏకంగా సెంచరీ కూడా దాటేసి
ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే
వీళింత సుదీర్ఘకాలం జీవించటం వెనకో
ఆరోగ్య రహస్యం ఉంది. అదే. ఒకినావా డైట్
ఒకినావా అనేది జపాన్‌లోని ఓ దీవి. ఈ
దీనిలోని వాళ్లంతా నిండు నూరేళ్లపాటు
జీవించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మరి
దీర్ఘాయుషు కోసం వీళ్లంతా ఏం తిన్నారు. ఆ
వివరాలు తెలియాలంటే ఒకినావా ఆహారశైలి
గురించి తెలుసుకోవాలి.
ఒకినావా వాసుల్లా వందేళ్లు నిక్షేపంగా
జీవించాలంటే ఈ ఒకినావా ఫుడ్ లిస్టు
దైనందిన ఆహారంలో చోటు కల్పించాలి.
అట్టర్మెన్స్ వచ్చి పుచ్చకాయను
ఇతర కూరగాయలతో కలిపి స్టర్ చేసి
తినాలి. బిట్టర్ మెలన్లో మధుమేహానికి
వ్యతిరేకంగా పోరాడే గుణాలుంటాయి.
లోపు ఫ్రెంచ్ వాళ్లకు బ్రెడ్,
ఐరోపా వాళ్లకు బంగాళా
దుంపల్లా ఒకినావా
అంత ప్రియమైన
ఆహారం. వీళ్ల
డైనందిన ఆహా
రంలో టోపు
ఉండాల్సిందే!
అమెరికన్ల కంటే
రెట్లు ఎక్కువగా
టోప తింటారు. ఇతర
సోయా ఉత్పత్తుల్లాగే టోపు
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మాంసం బదులుగా సోయా ఉత్పత్తులు
తిన్నవాళ్లలో గుండె జబ్బులకు కారణ
మయ్యే టైగిసరైడ్స్, కొలస్టరాల్స్ తక్కువగా
ఒకినావా ద్వీపంలో ఇప్పుడు కనిపించే
శతాధిక వృద్ధులందరూ 1908 - 1914 మధ్య
కాలంలో పుట్టినవాళ్లే. వీళ్ల జీవితంలో మొదటి
పావు భాగం వరకు. అంటే 1940 వరకూ
ఎక్కువ శాతం, దాదాపు 60% క్యాలరీలను
ఒకే ఒక పదార్థం నుంచే తీసుకున్నారు. అదే
'ఐమో'. ఐమో అనేది ఒకినావా ద్వీపంలోని
చిలకడ దుంప, వంకాయ లేదా పసుపుపచ్చ
రంగులో ఉండే ఈ స్వీట్ పొటాటో 400
ఏళ్లకు పూర్వం అమెరికా నుంచి ఈ దీనికి
తరలి వచ్చింది. దీన్లో అత్యధిక ప్లావనాయిడ్స్త
విటమిన్ సి, కెరోటినాయిడ్స్ ఆలస్యంగా
ఖర్చయ్యే పిండి పదార్థాలున్నాయి.
Thaక్కువ క్యాలరీలు: ఒకినావా వాసులు
జపనీయుల కంటే 20% తక్కువ క్యాలరీ
లున్న ఆహారం తింటారు. ఒక గ్రాము అని
రానికి ఒక గ్రాము క్యాలరీ ఉండేలా చూసు
కుంటారు. వాళ్లు (బాడీ మాస్
ఇండి) సుమారుగా దీన్ని బట్టి క్యాలరీ
లను కంట్రోల్ చేస్తే బరును అదుపులో ఉండ
టంతోపాటు ఈ అంది ప్రయోజనాలు కూడా
ఉన్నాయి.
-ఆరోగ్యం మెరుగవుతుంది.వృద్ధాప్యం ఆలస్యమవుతుంది.
ఒకినావాలు పళ్లు, కూరగాయలను గ్రీన్,
ఆరెంజ్, ఎల్లో (212). ఈ మూడు
రంగుల్లో వర్గీకరించుకుటారు. ఈ
రంగుల్లో ఉండే పళ్లు, కూరగాయలు,
దుంపలను మాత్రమే తింటారు. జీపై
పులో విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా
కెరోటిన్, లుటీన్, గాంధీన్ వంటి
పోషకాలుంటాయి.
తక్కువ చక్కెర, కొవ్వులు, ఆరోగ్యాన్ని
శుష్కింపజేసేవి చక్కెర, కొవ్వులే. కాబట్టి ఒక
నావా డైట్
లో వీటికి స్వల్ప స్థానం ఉంటుంది.
వీళ్ల దైనందిన
ఆహారంలో 25%
చక్కెర, కొవ్వులు ఉంటాయి. మిగతా 75% పప్పుధాన్యాలతో
నిండి ఉంటుంది. కాబట్టే వీళ్లకు హృద్రోగాలు,
గుండెపోట్లు రావు.
kooragayalu,samuద్రాహారం కూడా తింటారు. అయితే తక్కువ
మొత్తంలో చేపలు, ఎక్కువగా కూరగాయలు --
గుడ్లకు సాధ్యమైనంత దూరంగా ఉంటారు..
ఒకినావా డైట్ ఎంతో క్రమశిక్షణతో కూడుకు
న్నది. ఆరోగ్యానికి మేలు చేస్తూ ఆయుముని
కాపాడే పదార్థాలను ఆచితూచి ఎంచుకోబట్టి
కూరగాయలు, సముద్రాహారం: ఎక్కువ
మంది ఒకినావాలు శాకాహారులే వాళ్లుండే
ప్రదేశం దీవి కాబట్టి వీళ్లలో కొందరు నము
తింటారు. ఇక మాంసం, డైరీ ఉత్పత్తులు,
అక్కడి వాళ్లకు అంత దీరాయపు
ఉంటున్నాయని పరిశోధనల్లో తేలింది.
స్వీట్ పొటాటో, మిగతా దుంపల్లా చిల
కడ దుంపలు రక్తంలో చక్కెర స్థాయిని
పెంచదు. వీటి ఆకులతో సూప్ తాగినా
ఫలితం ఉంటుంది. చిలకడ దుంపల్లో
వృద్ధాప్యాన్ని కుంటుపరిచే స్పారామిన్ అనే
యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.
పసుపు, ఒకినావాలు పసువు సుగంధ
ద్రవ్యంగా, గా కూడా వాడతారు.
యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,
యాంటీ ఆక్సిడెంట్ అయిన వసుపులోని యాంటీ ఏజింగ్యాం
గుణాల గురించి అధ్యయ
నాలు జరుగుతున్నాయి.
దీన్ని విరివిగా వాడబట్టే
ఒకినావా వాసుల్లో ఆర్టీ
మర్స్ వ్యాధిగ్రస్థులు
కూడా చాలా తక్కువగాటీ ఏజింగ్
గుణాల గురించి అధ్యయ
నాలు జరుగుతున్నాయి.
దీన్ని విరివిగా వాడబట్టే
ఒకినావా వాసుల్లో ఆర్టీ
మర్స్ వ్యాధిగ్రస్థులు
కూడా చాలా తక్కువగా unnaru.
కాపాడే పదార్థాలను ఆచితూచి ఎంచుకోబట్టి
మొత్తంలో చేపలు, ఎక్కువగా కూరగాయలు
తింటారు. ఇక మాంసం, డైరీ ఉత్పత్తులు,
గుడ్లకు సాధ్యమైనంత దూరంగా ఉంటారు...
ఒకినావా డైట్ ఎంతో క్రమశిక్షణతో కూడుకు
న్నది. ఆరోగ్యానికి మేలు చేస్తూ ఆయుముని
ఉంటాయి. మిగతా 75% పప్పుధాన్యాలతో
నిండి ఉంటుంది. కాబట్టే వీళ్లకు హృద్రోగాలు,
గుండెపోటు రావు
కూరగాయలు, సముద్రాహారం ఎక్కువ
మంది ఒకినావాలు శాకాహారులే, వాళ్లుండే
ప్రదేశం దీని కాబట్టి వీళ్లలో కొందరు సము
ద్రాహారం కూడా ఉంటారు. అయితే తక్కువ
అక్కడి వాళ్లకు అంత దీర్గాయుపు




ఆయుషుని పెంచే ఫుడ్
ఒకినావా వాసుల్లా వందేళ్లు నిక్షేపంగా
జీవించాలంటే ఈ ఒకినావా ఫుడ్ లిస్టు
దైనందిన ఆహారంలో చోటు కల్పించాలి.
బిట్టర్‌మెలన్స్ వచ్చి పుచ్చకాయను
ఇతర కూరగాయలతో కలిసి స్టీల్ ప్లే చేసి
తినాలి. బిట్టర్ మెలన్లో మధుమేహానికి
వ్యతిరేకంగా పోరాడే గుణాలుంటాయి.
లోపు ఫ్రెంచ్ వాళ్లకు బ్రెడ్,
ఐరోపా వాళ్లకు బంగాళా
దుంపల్లా ఒకినావా
వాసులకు టోపు
అంత ప్రియమైన
ఆహారం. వీళ్ల
డైనందిన ఆహా
రంలో టోపు
ఉండాల్సిందే
అమెరికన్ల కంటే
రెట్లు ఎక్కువగా
టోప తింటారు. ఇతర
సోయా ఉత్పత్తుల్లాగే టోపు
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మాంసం బదులుగా సోయా ఉత్పత్తులు
తిన్నవాళ్లలో గుండె జబ్బులకు కారణ
మయ్యే ట్రైగ్లిసరైడ్స్, కొలస్ట్రాల్స్ తక్కువగా
ఉంటున్నాయని పరిశోధనల్లో తేలింది.
స్వీట్ పొటాటో మిగతా దుంపల్లా చిల
కడ దుంపలు రక్తంలో చక్కెర స్థాయిని
పెంచడు. వీటి ఆకులతో సూప్ తాగినా
ఫలితం ఉంటుంది. చిలకడ దుంపల్లో
వృద్ధాప్యాన్ని కుంటుపరిచే స్పారామిన్ అనే
యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.
పసుపు, ఒకినావాలు పసుపునుగంధ
ద్రవ్యంగా, టీ గా కూడా వాడతారు.
యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,
యాంటీ ఆక్సిడెంట్ అయిన వసు
సలోని యాంటీ ఏజింగ్
గుణాల గురించి అధ్యయ
నాలు జరుగుతున్నాయి.
దీన్ని విరివిగా వాడబట్టి
ఒకినావా వాసుల్లో ఆర్టీ
మర్స్ వ్యాధిగ్రస్థులు
కూడా చాలా తక్కువగా
సముద్రపు నాడు:
తక్కువ క్యాలరీలు, ఎక్కువ
పోషకాలున్న పదార్థం నీ వీడ్. ఈ
సముద్రపు నాచును ఒకినావా వాసులు
సూప్స్ స్కూలలో వాడతారు. సీవీలో
కెరోటినాయిడ్స్, ఫోలేట్, మెగ్నీషియం,
క్యాల్షియం, ఐరన్, అయోడిన్లు ఉంటాయి.

21, నవంబర్ 2016, సోమవారం

శాఖాహారం మేలు చేస్తుంది.

పళ్ళు, కూరగాయలే ఎందుకు తినాలి?
మాంసంలో లేని ప్రత్యేకతలు కూరగాయల్లో
ఉన్నాయా?
* మనం పళ్ళు కూరగాయలు ఎందుకు తినా
లంటే వాటిలో సూక్ష్మ పోషకాలు నిలవుంటాయి
కాబట్టి, లవణాలు, ఖనిజాలు అతి కొద్ది మోతా
దులో మనిషికి ఆజన్మాంతం అవసరమౌతాయి.
కోబాల్ట్, క్రోంఇయం, రాగి, అయొడిన్, మ్యాంగ
నీసు, జింక్ లాంటి ఖనిజాలు, ఇంకా ఇతర విట
మిన్లు ఎక్కువగా రోజుకు 100 మి.గ్రా, మోతాదు
వరకూ అవసరం అవుతాయి.
పోషకాలు:
తక్కువ మోతాదులో ఎక్కువ శక్తిదాయకమైన
వీటిని సూక్ష్మ పోషకాలంటారు. ఇవి పళ్ళలోను,
కూరగాయల్లోను అత్యధికంగా ఉంటాయి. పీచు
పదార్థాలు, పిండిపదార్ధాల్లాంటి స్థూల(మక్రోపోష
కాలంటారు. ఇవి ఎక్కువ మోతాదులో శరీరానికి
అవసరం అవుతాయి కాబట్టి వీటికా పేరు వచ్చింది.
ఇవి కాక శరీరం తన పనిని తాను సమర్థవంతంగా
చేసుకునేందుకు కావలసిన పోషకాలను మొక్కలు
మాత్రమే మన శరీరానికి అందిస్తాయి. వీటిని
'పైటోన్యూట్రియంట్స్' అంటారు. ఇవి మొక్కల్లో
ఫంగస్ లాంటి చీడ పట్టకుండా కాపాడే రక్షణ
యంత్రాంగానికి సంబంధించినవి. మొక్కలకు
సంబంధించిన వాటిని ఆహారంగా తీసుకున్నప్పుడు
ఈ రక్షక రసాయనాలు పూర్తిస్థాయిలో మనకు
అందుతాయి.
కేవలం మాంసాహారం మీద ఆధారపడితే ఇవి
చాలినన్ని అందకుండా పోతాయి.
కాషాయం రంగు కూరగాయలు:
పిల్లల్లో కంటి చూపు పెరగడానికి, చర్మం
మృదుత్వం, లావణ్యం పొందడానికి, వ్యాధి నిరో
ధక శక్తి పెరగడానికి ఏ విటమిని అవసరంఅవు
తుంది. కేరట్లు, టమోటాలు, చిలకడదుంపలు,
బొప్పాయి, మామిడి పండు లాంటి ఎరుపు రంగు
కలిగిన పండ్లు, కాయగూరల్లో కెరటోనాయిడ్స్ అనే
పోషకాలు శరీరానికి రక్షణ కలిగించే ద్రవ్యాలను
బాగా అందిస్తాయి.
సివిటమిన్:
టమోటాలాంటి
కూరగాయల్లోనూ,
జామ అరటి లాంటి
పండ్లల్లోనూ ఉండే 'సి
విటమిన్ పూర్తిస్థాయిలో
మనం ఉపయోగించుకో
లేకపోతున్నాం. వాటిని అధిక ఉష్ణోగ్రత దగ్గర
వండటం కారణంగా సి విటమిన్ ఎగిరిపోతోంది.
చారు, సాంబారు, పప్పుచారు, కలగూర పప్పు
లాంటివి వండినప్పుడు పొయ్యి మీంచి దించబోయే
ముందుటమోటా రసం కలపటం మంచిది. సివిట
మిన్ని అతిగా వండితే త్వరగా ఆవిరైపోతుంది.
అందువలన కూర రుచి కూడా దెబ్బతింటుంది. ని
విటమిన్ ఎక్కువగా కలిగిన పండ్లను, కాయగూర
లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వాటిలోని
ఇనుముకు సంబంధించిన ఫోలిక్ యాసిడ్ అనేది
శరీరానికి బాగా వంటబడ్తుంది.
పీచుపదార్ధాలు:
కాయగూరల్లోనూ, ఆకు కూరల్లోనూ అధి
కంగా ఉండే పీచుపదార్థాలు జీర్ణశక్తిని పెంచు
తాయి. పేగులను బలసంపన్నం చేస్తాయి. రోజూ
కాలవిరేచనం అయ్యేలా చేస్తాయి. పేగుల్లో కేన్సర్
లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా కాపాడ
తాయి. పీచుపదార్థాలతో నిండిన ఆహారం తీసుకు
న్నప్పుడు కొవ్వు పదార్థాలు, పంచదార పదార్థాలు
- రక్తంలోకి ఎక్కువగా చేరకుండా అని అడ్డుకుం
దాయి. ఆ విధంగా స్థూలకాయం, షుగరు వ్యాధుల్ని
5 అదుపులో పెట్టడానికి పీచుపదార్థాల అవసరం
ఎంతైనా ఉంది.
కూరల్ని ఇలా వండాలి:
కూరల్ని అతిగా చింతపండు, అల్లం, వెల్లుల్లి
మసాలాలు వేయకుండా వండుకుంటే కూర ఎక్కు
వగానూ, అన్నం తక్కువగానూ తినటం సాధ్యం
అవుతుంది. ఏ కూరగాయనైనా నూనెలో బాగా
వేయిస్తే ఆ కూరగాయ ప్రబావం సగం చచ్చిపో
తుంది. పోషాకాలు మాడి పోతాయి. అతిగా
వేగడం వలన అందులో కేన్సర్ కారకమైన ఆకీల
మైడ్ అనే విషరసాయనం పుడుతుంది. ఈ సంగతు
లను గమనించి కూరగాయలను మందాగ్ని మీద
తేలికగా ఉడికించుకుని కూరలు తయారు చేసుకో
వాలి.
మాంసానికి ప్రత్యామ్నాయం?
మాంసాహారానికి ప్రత్యామ్నయంగా కూరగా
యలను, పప్పుధాన్యాలను, తీసుకోవచ్చు. కానీ
- కూరగాయలకు మాంసాహారం ప్రత్యామ్నాయం
కానే కాదు. కూరగాయల్లోని పోషకాలు తేలికగా
అరిగే స్వభావాన్ని కలిగి ఉంటాయి.
ఇటీవల కాలంలో పనస ముక్కల పలావ్,
దొండకాయ టిక్కాలాంటి వంటకాలు మాంసాహా
రాన్ని వండే పద్ధతిలో కూరగాయల్ని ఎక్కువగా
వండుతున్నారు. ముఖ్యంగా విందు భోజనాల్లో కేట
రర్లు ఇలాంటి వంటకాలను సృష్టిస్తున్నారు. అక్కడ
తిని, ఇంట్లో కూడా అలాంటివే వండుతూ ఆహా
రాన్ని విషతుల్యం చేసుకుంటున్నాం. కొద్దిపాటి వేడి
మీద కొంచెంసేపు ఉమ్మగిలనిస్తే కూర తినడానికి
రుచిగానూ, ఆరోగ్యదాయకం గానూ ఉంటుంది.

2, నవంబర్ 2016, బుధవారం

ఆపరేషన్ చేయించుకునే ముందు




Pillalaku ఇంజక్షన్ అంటే భయం ఉన్నట్టే
పెద్దవాళ్ళకు ఆపరేషన్ అనేసరికి అదే మోస్తరు
భయం కలుగుతుంది.
“మీకు ఆపరేషన్ చేయాలి' అని వైద్యుడు చెప్పగానే
ఇంజక్షన్‌కి భయపడిన పిల్లాడిలా వెంటనే బిగ్గరగా ఏడుపు
అందుకోకపోయినా మనసులో అంతకురెట్టింపు భయం,
ఆందోళనలకు గురవుతారు. ఆక్షణంలో కలిగే మాన
సిక ఒత్తిడి అనుభవిస్తేగాని తెలియదు.
మిగిలినవాళ్ళకు ఎంతో ధైర్యం చెప్పినవారు కూడా
తమదాకా వచ్చేసరికి ఆపరేషన్ టేబుల్ మీద ఏమవు
తుందో, తిరిగి ఆరోగ్యంతో బయటకు రాగలుగుతానా,
ఆపరేషన్ ఫెయిల్క్అయితే ఎలా అనేటువంటి అనేక
సందేహాలతో సతమతమవుతారు.
ఎంతో సింపుల్ ఆపరేషన్లని చెప్పేకుటుంబనియం
త్రణ ఆపరేషన్క తాముభయపడి భార్యల్నిముందుకు
-నెట్టిన మగవాళ్ళు ఎందరో ఉన్నారు. ఇలాంటి ఇబ్బంది
కర మానసిక పరిస్థితి నుండి బయటపడాలంటే తమ
కున్న ఆరోగ్య పరిస్థితిగురించి, ఆ అనారోగ్యానికి అందు
బాటులో ఉన్న ప్రత్యామ్నాయ చికిత్సల గురించి రోగి
తప్పనిసరిగా వైద్యుని అడిగి తెలుసుకోవాలి.
»వైద్యులు మారారు
నేటి వైద్యులకు అంతగా తీరిక ఉండడం లేదు.వర
సగా వస్తున్న పేషెంట్లను గబగబా చూసి పంపటంలో
ఒక్కొక్కరోగితో ఎక్కువసేపు మాట్లాడటం లేదు.
కుటుంబ ఆరోగ్య చరిత్ర గురించి తెలుసుకుందా
మనుకునే వైద్యులు బహుతక్కువ. ఎక్కువశాతం 'క్లిని
కల్' పరీక్షల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా
అనారోగ్యం అంచనావేసి హడావుడిగా ఆపరేషన్ బల్ల
ఎక్కిస్తున్నారు. తమ ఆసుపత్రిలో ఉన్న సామాగ్రికి
పని కల్పించేందుకు ఆపరేషన్లు చేస్తున్నారో లేక ఆపరే
షన్ల ప్రాక్టీసుకోసం పేషెంట్లను వాడుకుంటున్నారో
అర్థంకాని పరిస్థితి నేడున్నది.
పైగా నిలువుదోపిడీ చేస్తున్న వైద్యులు చాలామంది
ఉన్నారు. ఆ మధ్య జాతీయస్థాయిలో జరిగిన
ఒక సర్వేలో మనదేశంలో హిస్ట్రక్టమీ (గర్భసంచీ
తొలగింపు) ఆపరేషన్ అనవసరంగా చేస్తున్న
వైనం బయటపడింది. గర్భసంచీ తొలగించటం
అవసరమా, ఒకవేళ అది తొలగిస్తే ఏమవు
తుంది అనే విషయం పట్టించుకోకుండా ఆపరే
షన్ చేసి తీసి పారేస్తున్నారు.
ఇటువంటిదే నేడు జరుగుతున్న సిజేరియన్
ఆపరేషన్. అలాగే అవసరం లేకున్నా హడావుడిగా
సిజేరియన్ చేస్తున్నారు. దీనిమీద జాతీయస్థాయిలో
పెద్ద ఆందోళనే జరిగింది. అంతమాత్రంచేత
కాలం పడుతుందో తెలుసుకోవాలి.
కున్న ఇతర చికిత్సా విధానాలగురించి అడగండి.
ఆ తర్వాత ఆపరేషన్ చేయాలని చెప్పిన భాగం
ఏది, ఆపరేషన్ ద్వారా ఏదైనా ఒక శరీర భాగం
అలా తొలగిస్తే ఎదురయ్యే ఇబ్బందులు
ఏమిటి, ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన
జాగ్రత్తలు ఏమిటి? కోలుకునేందుకు ఎంత
మ: మనదేశంలో వైద్యులు, కార్పోరేట్ ఆసుపత్రులు తమ
ము పద్ధతి మార్చుకుంటాయనలేం,
గి
ఇటీవల ముంబయిలోని ఒక సంస్థ చేసిన పరిశోధ
నలో మనదేశం మొత్తం మీద జరుగుతున్న ఆపరేషన్లలో
సగానికి సగం రోగికి అవసరం లేకుండా జరుగుతున్న
ఆపరేషనేనని తేలింది.
తాజాగా అనవసరపు ఆపరేషన్ల జాబితాలో మోకాలి
చిప్ప రీప్లేస్ మెంట్ చేరింది. అమెరికాలో గత సంవత్సరం
లో
చేసిన మోకాలుచిప్ప రీప్లేస్ మెంట్ ఆపరేషన్లలో
మూడవవంతు మందికి అసలు అటువంటి రీప్లేస్మెంట్
అవసరంలేనే లేదు అని తేలింది. మనదేశంలో పరిస్థితి
అంతకన్నా భిన్నంగా ఉండివుంటుందని అనలేం.
" ఒత్తిడిలో పేషెంట్స్
ఆపరేషన్ నగానే పేషెంట్తోపాటు వారి కుటుం
బం మొత్తం ఒత్తిడికి గురవుతుంది.
ఆపరేషన్ సమయంలో మద్దతుగా నిలబడేవారు
మానసికంగా ధైర్యం చెప్పేవారు లేకపోవటం వల్ల రోగులు
కోలుకోటానికి చాలా ఇబ్బందిపడుతున్నారు.
ఇరుకు ఇళ్ళలో ఆపరేషన్ తర్వాత పేషెంట్ ని ఉంచ
గలిగిన పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఇటువంటి
పరిస్థితుల్లో కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి,
కుటుంబసభ్యులు మానసికంగా ఎన్నో ఇబ్బందులకు
గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆపరేషన్
చేయాలి అనగానే కంగారుపడటం మానేసి తగినచర్యలు
మొదలు పెట్టాలి. వైద్యుడి దగ్గర దాపరికం అనవసరం.
అనారోగ్యస్థితి గురించి, ఆపరేషన్ ఎందుకు అవసర
మైందో వివరంగా చర్చించాలి.
తీవ్రంగా ప్రశ్నిస్తే తప్పించి వైద్యుల నుండి సరైన
సమాధానాలు రావు. మరో వైద్యుడి నుండి అభిప్రాయం
తీసుకునే హక్కు రోగికి ఉందనే విషయం మరవకండి.
ఆపరేషన్ చెయ్యాలని సర్జన్ చెప్పాడు కాబట్టి ఆ
విషయం మీద మరో సర్జన్ వెళ్ళి కలవటంకన్నా సర్జరీ
విభాగానికి చెందని వైద్యుడిని కలిసి ప్రస్తుత రోగాని
తొలగిస్తారా!
సమాచారం సేకరించాలి
అలాగే గతంలో ఇటువంటి ఆపరేషన్లు ఎన్ని ఆ
డాక్టర్ చేతి మీదుగా జరిగాయి, వారి పరిస్థితి ఎలా ఉంది
అనే అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి.
అందుకు సంబంధించిన ప్రశ్నలు ఆ సర్జన్ కి సంధించేం
దుకు వెనుకాడాల్సిన అవసరం లేదు. వైద్యులు ఆపరేష
” అంతా సవ్యంగా ఉంటుందని చెప్పకపోవచ్చు.
చాలా ఆసుపత్రుల్లో ఆపరేషన్ చేసే వైద్యులు
అక్కడ పనిచేసేవారు కాదు. నైపుణ్యం కలవారిని ఆప
రేషన్ కోసం పిలిపిస్తారు. తాను ఏ పేషెంట్ ఆపరేషన్
చేస్తున్నది కూడా తెలియకుండా ఆపరేషన్ ముగించి
ఫీజు తీసుకుని వెళ్ళిపోయే సర్జన్స్ ఉన్నారు. అదేవిధంగా
ఆపరేషన్సమయంలో కీలకపాత్ర పోషించేది ఎనస్తీషియా
ఇచ్చేవారు. అతని నైపుణ్యం గురించి కూడా ఆపరేషన్
ముందే తెలుసుకునే హక్కు రోగికి ఉంటుంది.
కాబట్టి ఆపరేషన్ ఎంటేనే ఒక పెద్ద రిస్క్ అయిన
పుడు ఆ రిస్క్ తో కూడిన నిర్ణయం తీసుకునే ముందు
మరెంతో జాగ్రత్తగా ఉండటం అవసరం కదా.

విశ్వాసం తగ్గుతోంది
'ఆపరేషన్
చేయించుకున్నా' కాని నా ఆరోగ్యస్థితిలో
ఏమంత మార్పులేదు' అని కొందరు చెప్పటం మనం
వింటుంటాం. వారు చెపుతున్నదానిలో ఏమాత్రం
అబద్ధం లేదు. కొన్ని రకాల అనారోగ్యాలు ఒక దశ దాటిన
తర్వాత చక్కదిద్దటం కుదరదు.
ఎంతో నైపుణ్యం ఉన్న సీనియర్ సర్జన్ ఆపరేషన్
చేసినా ఆ అనారోగ్యపు ఇబ్బందిలోనుండి బయటపడ
లేరు. అలాంటి స్థాయికి చేరిన దాని గురించి వైద్యులు
ముందుగానే చెప్పరు. ఆపరేషన్ ద్వారా నూటికి నూరు
శాతం తగ్గుతుందా లేక ఆపరేషన్లో పరిష్కారం ఫిఫ్టీ
ఫిథీనా అనేది వైద్యుని అడిగి తెలుసుకోవాలి.
ఆపరేషన్తో సక్సెస్ శాతం బాగుంటుందనుకుంటేనే
బల్ల ఎక్కటం మంచిది. వైద్యుడిని దేవుడితో సమానంగా
భావిస్తారు రోగులు. మరే ఇతర వృత్తిలో ఉన్నవారికి
రెండుచేతులు పెట్టి నమస్కారం చెయ్యరు.
కాని తమకు
చికిత్స అందునా ఆపరేషన్ వంటివాటిని చేసే డాక్టర్కి
రెండు చేతులెత్తి నమస్కారం చేస్తారు.
అంతటి పవిత్రమైన, గురుతర బాధ్యత కల్గిన 
Yeకైకవృత్తి వైద్య వృత్తి. అయితే సమాజంలోని అన్ని
వృత్తులలోకి వచ్చిచేరిన చెడు నేడు వైద్య వృత్తిలోకి
వచ్చి చేరింది. డబ్బుకు తప్ప మరేదానికి స్పందిం
చని కఠినాత్ములుగా మారారు వైద్యులు.
ఎవరికివారు తమవంతుగా రోగిని ఒక 'రౌండ్
వేసి చూసి వెళ్ళేవారే తప్పించి, నిలుచుని మాట్లాడి,
వివరించి వాస్తవాన్ని రోగి ముందుంచే వైద్యులు
బాగా తగ్గిపోయారు. వైద్యులమీద నమ్మకం తగ్గి ఇంట
ర్నెట్ సమాచారంమీద విశ్వాసము పెరుగుతున్న కాలం
ఇది. రోగం పేరు చెప్పగానే ముందుగా వెళ్ళి ఇంట
ర్నెట్లో గూగుల్ సెర్చ్ చేసుకుంటున్నారు రోగులు.
ప్రాథమిక సమాచారమే కాదు, పలు తాజా అంశా
లను గూగుల్ ద్వారా తెలుసుకుని వైద్యుడి దగ్గరకు
వస్తున్నారు.గతంలోలా వైద్యుడు చెప్పిందే ఫైనల్ అను
కోవటం లేదు రోగులు. రెండవ ఒపీనియన్ ముందుగా
ఇంటర్నెట్లో ఆ పైనే మరో వైద్యుడి దగ్గర.
అందుకే ఇప్పుడు రోగులు వేసే ప్రశ్నలు పెరిగాయి.
ఆ ప్రశ్నలు వైద్యులకు చిరాకు తెప్పిస్తున్నాయి. ఇంట
ర్నెట్, గూగుల్ ని తిట్టని వైద్యులు లేరు.
» ప్రశ్నలు సంధించాలి
అయినా సరే వైద్యుడి ముందు ప్రశ్నలు ఉంచక
తప్పదు. ఆపరేషన్ అనగానే కత్తితో ఏదో ఒక భాగం
కోసి తిరిగి కుట్లు వేస్తారనేది చాలామంది రోగులు
అనుకునేది.
కోసి తెరచి, తిరిగి మూసే మధ్యలో జరి
గేదే ప్రాముఖ్యమైన అంశం.
ఇందులో దెబ్బతిన్న అంగాలు తొలగించవచ్చు,
శరీరంలోపల ఏర్పడినలోపాలను చక్కదిద్దవచ్చు, పేరు
కున్న కొవ్వులను తొలగించవచ్చు లేదా అంగమార్పిడి
జరగవచ్చు. ఇలా ఆపరేషన్లు పలురకాలు.
అయితే ఆపరేషన్ చిట్టచివరిగా ఎంపిక చేసుకునేది
కావాలి. ఆ దశకు చేరి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళే
ముందు రోగి లేదా రోగి ఆప్తులెవరైనా వైద్యునికి తప్పని
సరిగా సంధించవలసిన ప్రశ్నలు పది ఉన్నాయి.
• అసలు ఆపరేషన్ ఎందుకనేది తొలి ప్రశ్న అవ్వాలి.
ఈ ఆపరేషన్ కాక ఇతరత్రా మందుల వాడకం లేదా
మరో ప్రత్యామ్నాయంతో రోగం తగ్గించగలరా లేదా
అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి.
• ఒకసారి ఆపరేషన్ తప్పదన్న నిర్ణయానికి వచ్చినతర్వాత మరో వైద్యునిదగ్గర రెండవ అభిప్రాయం
సేకరించుకునే
యత్నం
చేయాలి.
• ఒకరికన్నా ఎక్కువమంది ఆపరేషన్‌ పరిష్కారమని
స్పష్టం చేసిన ఆ ఆపరేషన్ ఎలా చేస్తారు. ఆప
రేషన్లో వచ్చే లాభం ఏమిటి? ఆపరేషన్ వల్ల ఏర్పడే
ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా?
• ఆపరేషన్ సమయంలో ఇచ్చే మత్తుమందు స్థాయి,
ఆపరేషన్ ఎన్ని గంటలు చేస్తారు? ఎన్ని గంటల
తర్వాత స్పృహలోకి వస్తారు అనే ప్రశ్నలు వేసి సరైన
సమాధానం రాబట్టాలి.
• ఆపరేషన్ కి ముందు నిర్వహించే ప్రశ్నలు, వేసు
కోవాల్సిన మందులు, ఆపరేషన్ కి రెడీ అవటం
ఎలా అనేవి వైద్యుని అడిగి తెలుసుకోవాలి.
ఈ ఆపరేషన్ఏ ఆసుపత్రిలో చేస్తారు? అక్కడ అందు
బాటులో ఉన్న సౌకర్యాలు, అక్కడి నియమనిబంధ
నలు వంటివి కూడా అడగాల్సిన ప్రశ్నలే.
• ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన ఆహార, ఇతరత్రా
శారీరక జాగ్రత్తల గురించి ముందుగానే అవగాహన
ఏర్పరచుకోవాలి. వైద్యుని అనుభవం, గతంలో ఇటు
వంటి ఆపరేషన్లు ఎన్ని చేసింది. వాటిలో ఎన్ని విజయ
వంతమైనది తెలుసుకోవాల్సిన అంశం.
మీకున్న ఆరోగ్య బీమా పాలసీ ఆ పాలసీలో మీ ఆప
రేషన్ కవర్ అయిందో లేదో కూడా తెలుసుకుని
ఉండటం అవసరం. చిన్న పామునైనా పెద్దకర్రతో
కొట్టాలన్నది నానుడి. అలాగే ఆపరేషన్ చిన్నదే అయినా
దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్దవే.

తప్పనిసరి అయితేనే
ఆపరేషన్ థియేటర్ వాతావరణం, అక్కడ
ఆపరేషన్ కి ముందు వైద్యుడి మీద నమ్మకం ఉంచి
అనుసరించే పరిశుభ్రత విధానాలు ఆపరేషన్
టంతోపాటు సంపూర్ణ సమాచారం ఇవ్వటం అవసరం. సక్సెస్ లో కీలకం. వైద్యుడి నేర్పుతోపాటుగా
గతంలో తీసుకున్న చికిత్స, వాడిన మందులు, ఇత
ఆయనకు సహాయం అందించే సిబ్బంది పాటించే
రత్రా ఏవైనా ఆపరేషన్లు చేయించుకునివుంటే ఆసమా జాగ్రత్తలు, ఆపరేషన్ కి ముందు, తర్వాత రోగిని
చారం వైద్యునికి ఇవ్వటం ద్వారా శస్త్రచికిత్స సమ
ఉంచే గది వాతావరణం వగైరాలన్నీ పరిగణనలోకి
యంలో వైద్యుడికి ఎంతో సహకరించినవారవుతారు.
తీసుకుని ఆపరేషన్స్ ఎంపిక చేసుకోవాలి.
ఆపరేషన్ తగిన సర్జన్‌తోపాటు మంచి ఆసుపత్రిని ఆపరేషన్ చేస్తుండగా అనుకోని సంఘటనలు
కూడా ఎంచుకోవాలి.
జరగవచ్చు. అటువంటి ఎమర్జన్సీ పరిస్థితులు
చాలా ఆపరేషన్లలో ఇబ్బందులు తలెత్తవు. నిజానికి తలెత్తినపుడు వాటిని ఎదుర్కొనేందుకు ఎంచు
ఆ ఇబ్బందులు ఆపరేషన్ చేసినందువల్ల కాక ఆపరేషన్ కున్న ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాల గురించి వైద్యు
జరిగిన వాతావరణంబట్టి వస్తాయి.
డిని ముందుగానే అడిగి తెలుసుకోవాలి.

27, అక్టోబర్ 2016, గురువారం

వంటింటి లోనే పోషకాలు



ప్రతి ఆహార ద్రవ్యంలోనూ దేని పోషకాలు దానికి
ఉంటాయి కదా? కొన్నింటి గురించే ఎక్కువ
మంది వైద్యులు చెప్తున్నారు. ఆహారం ఎందుకు, ఎలా
తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఆహార లక్ష్యాలు వివరి
స్తారా?


ఆహారాన్ని దేశ, కాలమాన పరిస్థితులకు అను
గుణంగా ఒక పథకం ప్రకారం తీసుకోవటం విజ్ఞత.
శరీర ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచటం, శరీర బరువు
సమస్థితిలో ఉండేలా చూడటం, పోషకాలన్నీ తగుపా
ళ్లలో ఉండేలా జాగ్రత్త తీసుకోవటం పోషక లోపాల
వలన కలిగే వ్యాధులకు ఆస్కారం లేకుండా జాగ్రత్త
పడటం, ఆహారంవల్ల కలిగే వ్యాధులు దీర్ఘ వ్యాధు
లుగా మారకుండా జాగ్రత్త పడటం, ముంచుకొచ్చే
వృద్ధాప్యాన్ని నివారించి జీవనప్రమాణాన్ని పెంపొం
దించుకోవటం గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు,
స్త్రీబాల వృద్ధులకు తగినంత పోషకాలు అందేలా
చూడటం, పుట్టే బిడ్డ తగినంత బరువు, ఎదుగుదల
ఉండేలా చూడటం ఇవీ ఆహార లక్ష్యాలు. శరీర
తత్వాన్ని తెలుసుకుని తగినట్టుగా ఆహార పదార్థాలను
ఎంపిక చేసుకోవాలి. ఏవి తింటే శరీరానికి సౌక
ర్యంగా ఉంటుందో అవి తినాలి. వేటివలన అసౌ
కర్యం, అనారోగ్యం అనిపిస్తుందో వాటిని తగ్గిం
చటం, మానేయటం కూడా అవసరం.


మన ఆహారంలో తగినంత పోషకాలున్నాయా?
సామాన్యుడు వాటిని కొనగలడా? వైద్యశాస్త్రం ఆహా
రాన్ని పోషకాల పేరుతో మరింత ఖరీదు చేస్తోందం
వారా?
* పోషకాలు రోజువారీ మనం తినే ఆహారంలోనే
ఉన్నాయి. బజార్లో అమ్మే పదార్థాల మీద విటమిన్లు
వగైరా ఎంతెంత ఉంటాయో రాసి ఉంటుంది కాబట్టి
అనే పోషకాలని, ఇంట్లో వండుకునేవి బలకరమైనవి
కావనే అపోహ చాలా మందిలో ఉంది. పోషకాలనే
రుతో వ్యాపార పరంగా అమ్మే పాలపిండి డబ్బాల
ప్రకటనల్ని, వాటి ఖరీదుల్ని చూసి, పోషకాలు సామా
న్యుడుకి అందుబాటులో లేవంటున్నారు. ఆ డబ్బాల్లో
నిజంగా పోషకాలు ఎంత ఉన్నాయో దేవుడికెరుక.
పోషకాల కోసం మార్కెట్లో వెదకద్దు. వంటిం
బ్లోనే వెదకండి! రాగి,
జొన్న, సజ్జ, గోధుమ
ల్లాంటి ధాన్యాలు, కంది
పప్పు, వేరుశనగ,
నువ్వులు, ఆవాల్లాంటి
నూనె గింజలు, పంచ
దార, బెల్లం ఇవన్నీ పోష
కాలే! మన ఆహారంలో
పోషక విలువలు లేని పదార్ధామే లేదు.
నిజానికి ఆకుపచ్చని ఆకుకూరలు బాగానే దొరు
కుతున్నాయి. కానీ, వాటిని ఫథ్యం కూరలని తన
దించే వాళ్ళు ఎక్కువ. విందుభోజనాల్లో సాధార
-జంగా ఆకుకూరలు వడ్డించకపోవడానికి ఎక్కువ
- మంది తినరనే అభిప్రాయమే కారణం.
బాగా మసా
లాలు దట్టించి, నూనె పోసి వండితేనే అది వంటకం
అనే వాళ్ళు ఎక్కువ. వీళ్ళవలన తక్కిన వాళ్ళక్కూడా
పోషకాలు అందకుండా పోతున్నాయి. ఆకుకూరలు
- పెడితే నీళ్ళ విరేచనాలు అవుతాయని కొందరు ఆకు
-కూరల్ని వండరు. ఆకు కూరల్లో ఉండే పీచు పదా
-ర్థాలు (డైటరీ ఫైబర్స్) విరేచనం ఫ్రీగా కావడానికి
-కారణం అవుతాయి. ఈ ఫైబరు తగినంత మోతా
దులో పేగులకు అందితేనే జీర్ణకోశ వ్యవస్థ బలసంప
-న్నంగా ఉంటుంది. దీనివలన కొందరు పిల్లలకు
5 కొంచెం ఎక్కువ విరేచనాలు కావచ్చు. కొద్దికొద్దిగా
తినిపిస్తూ అలవాటు చేయటమే మంచిదికాని,
మాన్పించటం సరికాదు.
పిల్లలకు పసినాటి నుండే
రకరకాల కూరగా
యలు, ఆకు కూరలు,
షకాలు
పప్పు ధాన్యాలను కొద్ది
కొద్దిగా తినిపిస్తూ శరీ
రానికి అలవాటు
చేయాలి. అందువ
లన జీర్ణాశయ వ్యవ
స్థకూ, కూరలకూ,
పండ్లకూ మధ్య
స్నేహం కలుస్తుంది.
జీర్ణశక్తి బలపడు
తుంది.
వైద్యశాస్త్రం
వంటింట్లో దొరికే
పోషకాలను చక్కగా
ఉపయోగించుకోవా
లనే చెప్తోంది. మనమే
వాటిని బజార్లో వెదు
క్కునే ప్రయత్నం
చేస్తున్నాం. డబ్బు తగ
లేని ఆరోగ్యానికి బదు
లుగా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం.
-

గర్భవతులు ఎక్కువ తినాలా?


 గర్భవతులకు ఎక్కువ అన్నం పెట్టాలా?
మామూలుగా తింటే కడుపులో బిడ్డకు
సరిపోదా?

గర్భం దాల్చిన సమయంలో గర్భవతులకు
అదనపు ఆహారం అవసరమే! ఇద్దరు మనుషుల
తిండి తినాలని దీని భావం కాదు. బిడ్డ ఎదుగుద
లకు కావలసిన పోషకాలు అందేందుకు, పోషక
విలువలు కలిగిన అదనపు ఆహారం అవసరమే!
అట్టడుగు ప్రజలే కాదు, మన సమాజంలో
మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి స్త్రీలక్కూడా
పోషకాహార లోపం ఎక్కువగానే ఉంటోంది. చదువు
కున్నవారు, స్థితిమంతులు కూడా అనాలోచిత
వ్యామోహాలతో పోషక విలువలు లేని జంక్ ఫుడ్స్
మీద యావ వదులుకోలేకపోతున్నారు. పిజ్జాలు,
రోటీ కర్రీలే కాదు, ఇంట్లో తినే బజ్జీలు, పునుగులు
కూడా జంక్ ఫుడ్స్! గర్భం దాల్చిన సమయంలోనూ,
బిడ్డకు పాలిచ్చే సమయంలోనూ ఇలాంటి ఆహా
రాన్ని ఎక్కువగా తింటే స్థితిమంతులక్కూడా పోష
కాహార లోపం కలిగే ఆవకాశం ఉంది.
బిడ్డ తక్కవ బరువుతో అరకొర ఎదుగుదలతో
పుట్టాడంటే తల్లి ఆహార లోపం కూడా ఒక కారణం
కావచ్చునని అర్ధం చేసుకోవాలి. నిండు చూలాలు
గనక 10 కిలోల బరువు పెరిగితే కడుపులో బిడ్డ 3
కిలోల వరకూ బరువు పెరగటం అనేది ఆరోగ్యదా
యకంగా జరగాలి. మొదటి 3నెలల్లో ఒక అర
గ్రాము ప్రోటీను, నాలుగోనెల నుండీ 6వనెల వరకూ
7గ్రాముల ప్రోటీను 6వనెల నుండి ప్రసవించే
వరకూ 23 గ్రాముల ప్రోటీను అవసరం అవుతా
యని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండి
యన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి సూచన.
ఐరన్, కాల్షియం, ఎ విటమిన్, అయోడిన్ ఇతర ఖని
జాలు కూడా తగుపాళ్ళలో గర్భవతులకు అందాలి.
ఇందువలన బిడ్డలకు పుట్టుకతోనే వచ్చే వ్యాధులు,
తక్కువ బరువుతో పుట్టటం, అవయవ లోపాల్లాంటి
సమస్యలన్నీ నివారించవచ్చు.
ఆర్థిక స్తోమత లేకపోవటం, వాంతులు, గ్యాస్,
తినబుద్ధి కాకపోవటం, వండుకునే ఓపిక లేకపోవ
దాల వలన కూడా గర్భ
వతులు పోషకాహారం
తీసుకోలేకపోతున్నారు.
అతిగా మసాలాలు,
కారాలు, అమిత పులుపు
తిన్నప్పుడూ కడుపులో
పెరిగే బిడ్డ ఎక్కువ కదిలి
పడతాడు.
ఇబ్బంది
.
ఇబ్బంది పెడతాడు కూడా!
గర్భవతుల ఆహారం అంటూ ప్రత్యేకంగా ఏది
వ ఉండదు.
రోజు వారి తీసుకునే ఆహారంలోనే కూర
గాయలు, ఆకుకూరలు, పళ్ళు, పాలు తగినంతగా
ఉండేలా చూసుకోవాలి. తేలికగా అరిగే పద్ధతిలో
వండుకుంటే కడుపులో గ్యాసు ఏర్పడదు. అన్నం
-తక్కువ, కూర పప్పు ఎక్కువగా తినేట్లు వండుకో
వాలి. మంచి నెయ్యి వాడకం కూడా మంచిదే! తేలి
త కపాటి మాంసం, గ్రుడ్లు తీసుకోవచ్చు. ఆహార పదా
ర్ధాల ద్వారా సహజంగా వచ్చే పోషకాలు వంటబట్టి
-, నట్టు ఔషధ రూపంలో తీసుకునే విటమిన్లు వగైరా
- వంటబట్టవని గుర్తించాలి. పొట్టు తీయాల్సిన అవ
సరం లేని గోధమ, జొన్న, రాగి, సజ్జ వీటితో
తరుచూ చేతనైన వంటకాలు చేసుకు తినటం వలన
ఎక్కువ విటమిన్లు, పీచు పదార్థాలు, ఖనిజాలు శరీరా
నికి అందుతాయి.
పాలు, పెరుగు, చల్ల ఎక్కువగా తీసుకోవటం
వలన క్యాల్షియం తగినంత అందుతుంది. పొట్టలో

మృదుత్వం ఏర్పడుతుంది. ఉపయోగపడే బా!
రియా పేగులకు తగినంత అందుతుంది. గ్యాసు,
ఎసిడిటీ తగ్గుతాయి. మజ్జిగ లేదా పెరుగు తగినంత
తీసుకున్నప్పుడు మొత్తం ఆహారంలోని పోషకాలు
సమత్వాన్ని పొందుతాయి. మజ్జిగ మీద తేరిన నీటిని
తాగటం మంచిది. గర్భవతులు ఉప్పు తగినంత
తీసుకోవాలి. అకారణ ఉప్పు ద్వేషాన్ని కొందరు పని
గట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఉప్పు నిషేధాన్ని
లోకం మొత్తానికి వర్తింప చేయటం సరికాదు.
తరచూ బీవీ చూపించుకోవటం, బిడ్డ ఎదుగు
దల బాగా ఉందని నిర్ధారించుకోవటం, బరువుచూ
సుకోవటం, ధనుర్వాతం ఇంజెక్షను వగైరా తీసుకో
వటం ఇలా వైద్యుల పర్యవేక్షణలో ఉండటం
మంచిది. శరీరానికి కొంతలో కొంత వ్యాయామం
ఇవ్వటం అవసరం. ఏ ఆసుపత్రిలో ప్రసవం చేయిం
చుకోదలుచుకున్నారో ఆ వైద్యురాలిని మొదట్లో
లిసి ఆమె పర్యవేక్షణలో ఉండటం మంచిది. వైద్యు
లకు తెలియకుండా స్వంతంగానో, వారు వీరు
- చెప్పారనో ఏ మందులు వాడవద్దు. పోషక ఔష
ధాలు కొద్ది తప్ప సాధ్యమైనంతవరకూ ఆహారబలం
మీదే ఆధార పడటం అవసరం.
గర్భవతులకు, బాలింతలకు వాతపు నొప్పులు

సహజంగా వస్తుంటాయి. అజీర్తి చేసి ఆహార పదా
రైలు తిన్నప్పుడు వాతపు నొప్పులు పెరుగుతాయి.
ఒక క్యారట్, ఒక ముల్లంగి, ఒక యాపిల్ ఈ
మూడింటిని సమపాళ్ళలో తీసుకుని ఒక గ్లాసు
- జ్యూసు రోజు తాగితే గర్భవతులకు కావలసిన పోష
కాలు సమున్నతంగా అందుతాయి. ప్రసవించిన,
బిడ్డకు పాలిస్తున్నంత వరకూ రోజూ ఈ జ్యూసు
క తాగటం మంచిది. కాఫీ, టీలు, అడ్డపొగ ఇలాంటికి
- గర్భవతులుకు హాని చేస్తాయి. గుట్కాలు, పాన్ మసా
లాలు కడుపులో బిడ్డ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
-వాటికి గర్భవతులు దూరంగా ఉండాలి.


Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...