కూరగాయలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కూరగాయలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, జనవరి 2019, శనివారం

పచ్చి మిర్చి మంచిదా లేక పండు మిర్చి మంచిదా ?

పచ్చి మిర్చి మంచిదా ,పండు మిర్చి మంచిదా అంటే రెండూ మంచివే.ఏ కాలంలో దొరికేవి ఆ కాలంలో తినడం మంచిదన్నది తెలిసిందే.ఆకుపచ్చని మిర్చి,పసుపు రంగు మిర్చిలతో పోలిస్తే పండు మిర్చిలో విటమిన్ సి,బీటా కెరోటిన్ ల శాతం ఎక్కువ,ఎ,బి,సి విటమినులతో పాటు ఖనిజాలు కూడా ఇందులో పుష్కలంగా ఉండడంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.క్యాన్సర్ తోనూ పోరాడగలడు.ముఖ్యంగా ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు ఇది సాయపడుతుందట.పొట్టలో హానికర బ్యాక్టీరియాని నివారిస్తుంది.

  పండు మిర్చి రంగు చూస్తేనే నోరూరుతుంది.అంటే ఆకలిని పెంచినట్లే కదా..అలాగే ఇది రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేయడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది.ముఖ్యంగా రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వుని సైతం కరిగించే గుణాలు ఇందులో ఉంటాయి.

    జలుబూ,జ్వరాలు గట్రా రాకుండా నిరోధించే గుణాలూ ఇందులో ఎక్కువే.నొప్పులకి కారణమయ్యే ఇంఫ్లమ్మేషన్ ని తగ్గిస్తుంది.దాని ఫలితంగానే ఆర్థ్రైటిస్,సొరియాసిస్,డయాబెటిక్ న్యూరోపతి...వంటి వాటి కారణంగా తలెత్తే నొప్పుల్ని తగ్గించే గుణం పండు మిర్చిలో ఎక్కువ.దీన్ని తరచూ ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణశక్తినీ,జీవక్రియనీ పెంచడంతో పాటు బరువు పెరగకుండానూ చేస్తుంది.ఇది తిన్నాక పుట్టే వేడి కారణంగా వ్యాయామంలో మాదిరిగా కెలొరీలు కరుగుతాయి.

   ఆస్తమా,సైనస్,జలుబులతో బాధ పడేవాళ్లు వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఊపిరితిత్తులు,గొంతు,ముక్కుల్లో శ్లేష్మం,మ్యూకస్ పేరుకోకుండా ఉంటుంది.పండు మిర్చి వాసన తలనొప్పుల్నీ తగ్గిస్తుంది.

* బచ్చలి ఆకుకూరను తరచుగా తింటుంటే పంటి చిగుళ్ళ నొప్పులు తగ్గిపోయి ,చిగుళ్ళను గట్టి పరుస్తుంది. *

19, డిసెంబర్ 2018, బుధవారం

పచ్చి మిరపకాయలు రోజూ తింటే కలిగే లాభాలు.

పచ్చి మిరప కాయలను మనం అనేక రకాలుగా ఆహరంలో వాడుకుంటుంటము.ఎండు కారం కు బదులుగా చాలా మంది కూరల్లో వేస్తారు.చక్కని రుచి వస్తుంది.కొందరు వీటిని అలాగే తినేస్తారు.కొందరు మజ్జొగలో కలుపుకుని తింటారు.రోజువారీ ఆహారంలో వీటిని తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి.

1. విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.విటమిన్ బి6,ఏ,ఐరన్,కాపర్,పొటాషియం,నియాసిన్,ఫైబర్,ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

2. వీటిని విత్తనాలతో సహా తింటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది.ఆహారం సరిగా జీర్ణం అవుతుంది.ఉమ్మి ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగవుతుంది.

3. విత్తనాల్లో ఫైటోస్టెరాల్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది.ఇది రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది.పేగుల నుండి కొలెస్టరాల్ రక్తంలోకి కలవకుండా చూస్తుంది.రక్తంలోని చెడు కొలెస్టరాల్ ను కరిగిస్తుంది.దీనితో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

4. వీటిలో ఉండే క్యాప్సిసిన్ శరీర జీవ క్రియలను వేగవంతం చేస్తుంది.దీనితో క్యాలొరీలు అధికంగా ఖర్చవుతాయి.ఫలితంగా అధిక కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.అలాగే గుండె కొట్టుకునే వేగం సక్రమంగా ఉంటుంది.

5. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ సమస్యలను పోగొడతాయి.

6. దగ్గు , జలుబు , ఫ్లూ జ్వరం ఉన్నవారు పచ్చి మిరపను బాగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.ముక్కు దిబ్బడ ఉంటే ముక్కు ద్వారాలు క్లియర్ అవుతాయి గాలి బాగా పీల్చుకోవచ్చు.

16, డిసెంబర్ 2018, ఆదివారం

ఉల్లి కాడలతో ఆయుర్వేద ,ఆరోగ్య ప్రయోజనాలు./ ULLIKADALATO AYURVEDA,AROGYA PRAYOJANALU.

1 . ఉల్లి కాడల్లోని అల్లిసిన్ చర్మం ముదతలు పడకుండా కాపాడుతుంది.

2. వీటిలోని కెరోటినాయిడ్ లుకంటి చూపును మెరుగు పరుస్తాయి.అలాగే ఎముకలు ధృఢత్వాన్ని సంతరించుకుంటాయి.

3. వీటిలో యాంటి ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ ,బి,సి,కె ,యాంటి బాక్టీరియల్,యాంటి ఫంగల్ సుగుణాలు,సల్ఫర్,రాగి,మెగ్నీషియం,పొటాషియం,క్రోమియం,మాంగనీస్ లాంటివి చాలా ఉన్నాయి.

4.చక్కెర వ్యాధిగ్రస్తులు రోజువారీ ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది.

5. వీటితో దగ్గు,జలుబు,అజీర్తి నయమౌతాయి.

6.కెలొరీలు,కొవ్వు,తక్కువగా ,పీచు పదార్థం ఎకువగా ఉండడంతో అధిక బరువు తగ్గిస్తాయి.

7.గర్భిణీలు తొలి మూడు నెలల్లో తరచుగా తింటే కడుపులోని బిడ్డకు ఫోలిక్ యాసిడ్ అందుతుంది.శిశువుకు వెన్నెముక సమస్యలు రాకుండా ఉంటాయి.

8. ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్త నాళాలకు చాలా మంచిది.కొలెస్టరాల్ ఆక్సీకరణను తగ్గించి ,గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

9.వీటిలోని సల్ఫర్ కాంపౌండ్ బిపి స్థాయులను నియంత్రించడానికి సహాయపడుతుంది.కొలెస్టరాల్ స్థాయిలు తగ్గిస్తాయి.

10.వీటిలోని క్రోమియం కంటెంట్ మధుమేహాన్ని తగ్గిస్తుంది.ఘ్లూకోజ్ శక్తిని అందిస్తాయి.

11. జలుబు , జ్వరానికి వ్యతిరేకంగా పోరాడుతుంది.

12. అజీర్ణం నుండి ఉపశమనం కలిగిస్తాయి.

13.వీటిలోని పెక్టిన్ పెద్దపేగును క్యాన్సర్కు గురికాకుండా చేస్తుంది.

14.కీళ్ళ నొప్పులు ,ఉబ్బసం తగ్గిస్తాయి.కాళ్ల సమస్యలు కూడా తగ్గుతాయి.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...