6, జూన్ 2017, మంగళవారం

రంజాన్ లో షుగర్ రోగులకు సూచనలు..

ముస్లింలకు పవిత్రమైన నెల రంజాన్. ఈ నెల రోజుల కాలంలో ప్రార్థనలు, ఉపవాసాలు వంటివి ఆరోగ్యవంతమైన ప్రతి ముస్లింకు తప్పనిసరి. వైద్యపరమైన సమస్యలు ఉన్న వ్యక్తులు అంటే మధుమేహం తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది మినహాయింపు అయినా అధిక శాతం మంది వైద్య సలహాలు అధిగమించి మరీ ఈ ఉపవాసాలు చేస్తుంటారు .ఈ కారణం చేతనే అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్, డయాబెటిస్ అండ్ రమదాన్ తో కలిసి మధుమేహరోగులు ఉపవాస సమయంలో పాటించ వలసిన నియమాలపై మార్గ నిర్దేశకత్వం చేసింది. ఈ మార్గ నిర్దేశకాలను ప్రధానంగా రోగులకు అవగాహన కల్పించడంతోపాటు ఉపవాస సమయంలో మధుమేహం నియంత్రణ గురించి తెలిపేందుకు రూపొందించారు. హెల్త్ కేర్ ప్రొఫెషనల్ మరింత అత్యాధునిక సమాచారంతో సలహాలు ఇవ్వడం సాధ్యం కావడంతో పాటుగా తమ రోగులకు రంజాన్ సమయంలో సహకరించడం సాధ్యమవుతుంది.
 2001లో ఎపీడీయాఆర్ అధ్యయనంలో వెళ్లడైన సమాచారం ప్రకారం 42 శాతం మంది రోగులు  టైప్ వన్ మధుమేహంతో బాధపడుతుంటే 78.7% మంది టైప్ టు మధుమేహంతో బాధపడుతూ కనీసం రంజాన్ సమయంలో 15 రోజులు ఉపవాసం ఉంటున్నారు. ఇటీవల కాలంలో అంటే 2010 క్రీడ్ అధ్యయనంలో తేలింది ఏమిటంటే తమ అధ్యయనం కోసం నమోదు చేసుకున్న వారిలో 94.2% మంది టైప్ టు డయాబెటిస్తో బాధపడుతున్న రోగులు అయితే వారంతా కూడా కనీసం 15 రోజులు రంజాన్ సమయంలో ఉపవాసం ఉన్నారు. వీరిలో 63.6% మంది ప్రతి రోజు ఉపవాసం చేశారు. ఈ అధ్యయనాలు ప్రతి వ్యక్తికి రంజాన్ మాసంలో ఉపవాసం ఎంత ముఖ్యమో తెలుపుతుంది. అధ్యయనాలు తెలిపే దాని ప్రకారం రమదాన్ కౌన్సిలింగ్ తో హైపోగ్లసీమియా కేసులను తగ్గించడం సాధ్యమవుతుంది .ఇటీవల యూకే, పాకిస్తాన్లలో చేసిన అధ్యయనాలు వెల్లడించిన దాని ప్రకారం హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ప్రభావంతమైన విద్య అందించడం ద్వారానే ఇది సాధ్యమైంది .అందువల్ల రంజాన్ సమయంలో మధుమేహాన్ని నియంత్రించడంలో అత్యంత కీలకంశం.. రోగికి గ్లూకోజ్ నియంత్రణ, పర్యవేక్షణ, పౌష్టికాహారం ,వ్యాయామం, మందుల డోస్ ని సరి చేసుకోవడం, రిస్క్ తగ్గించుకోవడం ,ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులలో ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం ,హాని జరగకుండా ఏ సమయంలో ఉపవాసాన్ని విరమించాలి లాంటి అంశాలపై అవగాహన కల్పించడం అవసరం .ఉపవాస సమయంలో అతి ప్రమాదకరమైన అంశాలు అంటే హైపోగ్లసిమియా, హైపర్  గ్లైసిమియా, డిహైడ్రేషన్ వంటివి ఉంటాయి. ఉపవాసం చేయాలనుకునే మధుమేహ రోగులు రంజాన్ కు ముందుగానే పరిశీలన, కౌన్సిలింగ్ ను హెల్త్ కేర్ ప్రొఫెషనల్ వద్ద తీసుకోవడంతో పాటుగా డైటీషియన్ సలహాలు తీసుకోవడం అతి కీలకం.

రోగి స్థితిని పరీక్షించి ,ప్రమాదకారకాలయ్యే అంశాలను గుర్తించి ,స్వీయ నియంత్రణ పట్ల రోగి ని ఎడ్యుకేట్ చేయాల్సిన  ఆవశ్యకత ఉంది .అలాగే రోగికి సంబంధించిన ప్రత్యేక ట్రీట్మెంట్ ప్రణాళిక సైతం సమర్పించాలి. హైపోగ్లీసిమియా ప్రమాదం అధికంగా కలిగిన రోగులు, మధుమేహాన్ని సరిగ్గా నియంత్రించలేని రోగులు, అధిక లేదా స్వల్ప మధుమేహాల కారణంగా ఇటీవల కాలంలో హాస్పిటల్లో చేరిన వారు, కొద్దిగా లేదంటే తీవ్ర స్థాయి మధుమేహం కలిగిన గర్భవతులైన మహిళలు, దీర్ఘకాల కిడ్నీ బాధితులు లేదా గుండె సంబంధిత వ్యాధులు కలిగిన వారు, మధుమేహ సంబంధిత సమస్యలు కలిగి ఉన్నవారు తప్పనిసరిగా ఉపవాసాన్ని వదిలివేయడమే మంచిది. ఫిజీషియన్ సలహాల మేరకు తప్పకుండా మందులు తీసుకోవాలి.

 ముఖ్యమైన ఆహార పద్ధతులు..

సేహర్ ,ఇఫ్తార్ నడుమ మీరు తీసుకునే రోజువారీ కేలరీలను విభజించుకోవాలి .అవసరమైతే ఒకటి నుండి రెండు స్నాక్స్ తప్పనిసరి .భోజన సమతుల్యత సరిగ్గా ఉందని నిర్ధారించుకోండి. మీరు తీసుకునే భోజనంలో 40 నుంచి 50 శాతం కార్బోహైడ్రేట్స్, 20 నుండి 30% ప్రోటీన్స్, 35 శాతం కన్నా తక్కువ ఫ్యాట్స్ ప్రధానంగా మోనో పాలీ శాచూరేటెడ్ 
 ఫ్యాట్స్ ఉండాలి. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ తో పాటుగా ఫైబర్ ఫుడ్స్ అందునా ఉపవాసానికి ముందు, తర్వాత నెమ్మదిగా శక్తిని విడుదల చేసే ఆహారాన్ని జోడించాలి ఉదాహరణకు బీన్స్, రైస్, బ్రెడ్. అధికంగా పళ్ళు కూరగాయలు సలాడ్స్ జోడించాలి. అధికంగా ఉండే ఆహారం తగ్గించుకోవాలి. ఉదాహరణకు నెయ్యి, సమోసాలు ,పంచదార అధికంగా ఉండే స్వీట్లు తగ్గించుకోవాలి. అతి తక్కువ వంట నూనె వాడాలి. ఆలివ్, రాప్ సీడ్ లాంటివి మంచిది. సంధ్యా సమయం, సూర్యోదయానికి నడుమ హైడ్రేట్ చేసుకునేందుకు ప్రయత్నించాలి .అధికంగా నీళ్లు తాగడంతో పాటుగా ఇతర స్వీట్ లేని బేవరేజెస్ తీసుకోవాలి. కెఫినెటెడ్ డ్రింక్ తాగొద్దు.. మధుమేహ రోగులకు రంజాన్ సమయంలో రెగ్యులర్ గా తప్పనిసరిగా ఎస్ఎంబిఐ తప్పనిసరి.
సూర్యోదయానికి మునుపే తినేందుకు ప్రయత్నించండి. అప్పుడు మాత్రమే తర్వాత రోజు ఉపవాసం ప్రారంభం చేయగలరు.

 హైపో లేదా హైపర్ గ్లైసిమియా పరిస్థితి తలెత్తినప్పుడు ఉపవాసాన్ని బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉండాలి .గ్లూకోజ్ స్థాయి 80ఎంజి /డిఎల్ కన్నా తగ్గినప్పుడు 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ను ఏదైనా ఈ దిగువ మార్గాలలో తీసుకోండి. మూడు టీ స్పూన్ల గ్లూకోజ్ పౌడర్ లేదా అరకప్పు యాపిల్ లేదా ఆరెంజ్ జ్యూస్ లేదా ఒక సర్వింగ్ గ్లూకోజ్ జెల్ లేదా మూడు ,నాలుగు గ్లూకోజ్ టాబ్లెట్స్ లేదా ఐదు, ఆరు పీసులు హార్ట్ క్యాండీ లేదా ఒక టేబుల్ స్పూన్ పంచదార లేదా తేనె తీసుకోవాలి .15 నిమిషాలు ఆగి గ్లూకోజ్ స్థాయిని పరీక్షించుకోవాలి. ఆ తర్వాత ఈవినింగ్  మీల్ తీసుకోవడానికి ఒక గంట కన్నా ఎక్కువ లేదనుకున్న సమయంలో స్నాక్స్ తీసుకోవాలి.

5, జూన్ 2017, సోమవారం

సైంధవలవణం / SAINDHAVA LAVANA/ROCK SALT - VUPAYOGALU.

For
Daily Use
सेंध नमक
THE NATURE'S BEST GIFT FOR OUR HEALTH
సైంధవలవణం (ఉప్పు) 100% vegetarian
త్రిదోషనాశకము
ROCK SALT
त्रिदोषनाशक
Purest Cooking Salt on the Earth
పవిత్ర హిమాలయాల నుండి ఉత్పన్నమైనది
ఉప్పుస్లో పాయిజన్ (ఉప్పుకు బదులుగా సైంధవలవణం (అమృతం) వాడండి) రుచి సేమ్
ముఖ్య సూచన : ఉప్పు 3 చెంచాలు వాడితే ఈ సైంధవలవణం 2 చెంచాలు మాత్రమే వాడాలి
సైంధవలవణం (ఉప్పు) ప్రకృతి ప్రసాదించినది. ప్రకృతిచే శుద్ధి చేయబడినది. దీనిలో ఎటువంటి రసాయనాలు కలపబడవు. అధిక ఉష్ణోగ్రత పైన
వేడి చేయబడదు. భూమిపై అన్నింటికంటే స్వచ్ఛమైన ఉప్పు మన శరీరానికి కావలసిన
84 రకాల పోషక విలువలు కలిగినది. ఉదా॥ కాల్షియం, కాపర్,
ఐరన్, మెగ్నిషియం, పాష్ఫరస్, పోటాషియం, సిలికాన్, సల్ఫర్, జింక్, అయోడిన్, ఆక్సిజన్ మొదలగు పోషక విలవలు కలిగినది. ఈ ఉప్పు నిత్యం
వంటల్లో వాడిన వారికి పలు వ్యాధుల నుండి ఉపశమనం లభించును. రోగనిరోధక శక్తి పెంచును. 100% శాఖాహారం తక్కువ సోడియం మోతాదు
కలది. లక్షలాది సంవత్సరాల పురాతనమైనది. దీర్ఘకాలం నిలువ చేయగలిగినది. వైద్యులచే ఆమోదించబడినది.
పిహెచ్ విలువలను తటస్థంగా ఉంచునది
మౌళిక స్థాయిలో అనగా కణము స్థాయిలో దేహము యొక్క శక్తిని పెంపొందించినది. సుఖ నిద్రకు సహాయకారి అస్తమా, సైనసైటిస్ ను అదుపు చేస్తుంది.
శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకల దృఢత్వాన్ని క్షిస్తుంది, అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
యవ్వన శక్తిని పెంపొందిస్తుంది. పళ్లను, చిగుళ్ళను పటిష్టపరుస్తుంది. మధుమేహాన్ని (షుగర్)ని నియంత్రించుటలో సహాయకారి, రక్తనాళాలు
ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఆకలిని ప్రేరేపిస్తుంది. ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. స్నానము చేసే నీళ్ళల్లో కొంచెం
| సైంధవలవణం (ఉప్పు) వేసి స్నానము చేసిన అలసట పోగొట్టి శరీర దుర్గందాన్ని పోగొట్టును. శారీరక నొప్పులను, వత్తిడిని అరికట్టును. ఈ ఉప్పుతో
పళ్ళు తోమితే పళ్ళు తెల్లబడి దంతాలు దృడంగా అయి నోటి దుర్వాసన అరికడుతుంది. అసిడిటీని తగ్గించును. థైరాయిడ్ అరికట్టును.
నేడు సముద్రం నీరు కలుషితం అయినది. అనేక పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, విష రసాయనాలు ఇందులో కలుపుచున్నారు. పెట్రోల్ చమురు వల్ల
కూడా సముద్రం కలుషితమవుతుంది. సముద్రంలో వుండే లక్షలాది జంతువుల చెడిపోయిన మాంసం మరియు చెడిపోయిన జంతువుల అవశేషాలు
ఇందులోనే వుండి సముద్ర నీరును కలుషితం చేస్తున్నాయి. అదే సైంధవలవణం సముద్రం నీటితో సంబంధం లేకుండా హిమాలయాల్లోని పర్వత
ప్రాంతాల్లో సైంధవలవణం గనుల నుండి తీయబడినది.
ఆర్థరైటీస్ సమస్య, పక్షవాతం సమస్య, నపుంసకత్వ సమస్య మొదలగు సమస్యలను అరికట్టును. భారతదేశంలో 1930 కంటే ముందు సైంధవ
లవణం మాత్రమే వాడేవారు. అసలైన సైంధవ లవణం మిమ్మల్ని ప్రకృతికి దగ్గరగా చేర్చును. పూర్వం ఆయుర్వేద ఋషులు సైంధవ లవణాన్ని బంగారం
కంటే విలువైనదిగా గుర్తించి వివిధ వ్యాధులక, మూలికలతోపాటు సైంధవ లవణాన్ని కలిపి ఇచ్చేవారు.
నిత్యం వంటల్లో వాడే ఆహ్లాదకరమైన రుచిని ఆస్వాదిస్తారు. మామూలు వంటలు కూడా చక్కని రుచిని అందిస్తుంది. అధికంగా (కామన్ సాల్ట్)
వాడడం వల్ల వచ్చిన దుష్ఫలితాలను అరికడుతుంది. ఉప్పులన్నింటిలోకి అత్యుత్తమైనది, మలబద్ధకాన్ని, గ్యాస్టికన్ను తగ్గిస్తుంది.
1. రోచన : రుచి మెరుగుపరుస్తుంది 2. దీపన : జీర్ణక్రియ బలం మెరుగుపరుస్తుంది. 3. వృష్య : నిరోధకంగా పనిచేస్తుంది. 4. చక శుష్య : కళ్ళకు
మంచిది. ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం 5. వైదేహి : మంటను అరికడుతుంది. 6. హృదయ : గుండెకు మంచిది 7. హిక్కనాశన : ఎక్కిళ్లకు మంచిది.
నెలసరి సమయంలో కడుపు నొప్పికి వాముపొడి, సైంధవలవణం కలిపి తింటుండాలి. ఎండు ద్రాక్ష కొద్దిగా నేతిలో వేయించి సైంధవ లవణం కలిపి
తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత మజ్జిగలో సైంధవలవణం వేసి తాగాలి. జీలకర్రలో సైంధవలవణం కలిపి తింటే
వాంతులు తగ్గుతాయి. సైంధవలవణం, పసుపు, శొంఠి పొడి అన్నంలో కలుపుకొని తింటే ఆకలి పెరుగుతుంది. తులసి ఆకులు గుప్పెడు తీసుకొని నీళ్ళలో
వేసి మరిగించి కషాయం తయారుచేసి చిటికెడు సైంధవలవణం కలిపి తీసుకుంటే అరుగుదల మెరుగవుతుంది. జిగట విరేచనాలు, గ్యాస్ వంటి
సమస్యలు తగ్గుతాయి. అజీర్ణంతో బాధపడేవారు, భోజనానికి ముందు అల్లం రసం, సైంధవలవణం చిటికెడు కలిపి తీసుకుంటే సత్వర ఉపశమనం
దొరుకుతుంది. నిమ్మరసంలో సైంధవలవసం కలిపి రోజు త్రాగుతూ వుంటే మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోతాయి. ఆరబెట్టిన తులసి పొడి
ఒక టీ స్పూన్ చిటికెడు సైంధవలవణం చేర్చి పళ్ళు తోముకుంటే పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పి, నోటి దుర్వాసన మొదలైన సమస్యలు నివారించవచ్చు. బి.పి.
ఉన్నవారు స్నానము చేసే నీళ్ళలో సైంధవలవణం వేసి స్నానం చెయ్యాలి, లో బి.ఏ. వారు ఒక గ్లాసు మంచి సిటీలో సైంధవ లవణం తగు మాత్రం వేసి త్రాగాలి,
కూరగాయలు సైంధవలవణం కలిపిన నీటితో కడిగితే, పెస్టిసైడ్స్ యొక్క దుష్ఫలితాలను కొంతవరకు నివారించవచ్చు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని
విసర్జిస్తుంది. చెడునీరును బయటకు పంపేందుకు తోడ్పడుతుంది.
సైంధవలవణం రాయిని మీ ఆఫీసులో / ఇంట్లో కంప్యూటర్ టేబుల్ పై పెట్టుకుంటే నెగిటివ్ శక్తిని గ్రహించి పాజిటివ్ శక్తిని ఇస్తుంది. వాస్తుదోష
నివారిణి, ఇంట్లోని గాలిని శుద్ధి చేయును. పచ్చళ్లలో సైంధవలవణం వాడితే పచ్చళ్లు రుచికరంగా ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. శరీరంలోని అధిక
వేడిని నియంత్రిస్తుంది. శరీంలోని అధిక కొలెస్ట్రాల్ ని, అధిక రక్తపోటును నియంత్రించి తద్వారా గుండెకుపోటును రాకుండా నియంత్రిస్తుంది.
అధిక బరువు, అస్తమాకు లాభసాటి, గుండెకు లాభసాటి, షుగర్ నియంత్రిస్తుంది. ఆస్ట్రియా పారోసిస్ రాకుండా కాపాడును, వత్తిడిని తగ్గిస్తుంది.
హిమాలయాల్లోని పర్వత ప్రాంతాలలో సైంధవలవనం (ఉప్పు) గనుల నిక్షేపాలు అపారంగా వున్నవి. ఈ ప్రాంతంలో ఎటువంటి జనసంచారంగాని,
పరిశ్రమలు గాని లేవు. కాలుష్య రహిత ప్రదేశం కనుక ఈ ఉప్పు అన్ని ఉప్పులలో శ్రేష్టమైనది, ఉత్తమమైనది, అత్యధిక పోషక విలువలు కలిగినది. కనుకనే
మన మహర్షులు ఈ ఉప్పును ఆయుర్వేదంలో నిత్యం వంటలో వాడమని సూచించినారు.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...