Thursday 28 January 2016

ATTU - AYURVEDAM


| రోజువారీ టిఫిన్లకు పెసరట్టు మంచిదా? మినపట్టు
మంచిదా? ఆరోగ్యానికి ఈ రెండింటిలో దేనికి ప్రాధా
అర్థచందు
న్యతనివ్వాలో చెప్పండి!

* అట్టు అనే వంటకం (దోసెలు, రొట్టెలు, అప్పచ్చులు) ఏ పిండితో చేసిందైనా
సరే, మిగిలిన పిండివంటల మాదిరే పండగకో పబ్బానికో తినవలసిందేగానీ, రోజూ
తప్పనిసరిగా తినేవి కావు. ఉదయం పూట సాంప్రదాయ పద్ధతిలో చద్దన్నం (చల్లన్నం
లేదా పెరుగన్నం) తినటం మానేసి, రోజూ అట్లు, పూరీలు, బజ్జీలు, పునుగులూ
తినటం ఉర్ణాశయానికి మేలు చేసే
అలవాటు కాదు. అది పెసరట్టినా,
మినపట్టినా, ఇదే సూత్రం. ఆ
రెండింటికీ గుణాల రీత్యా పెద్ద
వ్యత్యాసం లేదు. ఆరోగ్యవంతులు
కూడా పిండిపదార్థాల వాడకం తగ్గి
స్తేనే మంచిది.
ఏ కారణం చేతనో మనవాళ్ళు
ప్రొద్దున పూట మెతుకు తగలకూడ
దనే అపోహని బలంగా పెంచుకున్నారు. నిజానికి, ఇడ్లీలో గానీ, అట్టులోగానీ అధిక
శాతం బియ్యమే కదా! అయినా అన్నం మెతుకు సెంటిమెంట్ దేనికో అర్ధం కాదు.
నాగరికత పేరుతో మనకు మనమే సృష్టించుకునే ఇలాంటి కొన్ని అవరోధాల్లోంచి
బయటపడితే ఆరోగ్యానికి మేలు.
అట్టు మాత్రమే తినాలనుకుంటే తక్కువ కేలరీలు కలిగిన రాగులు, జొన్నలు,
సజ్జలు, గోధుమలు, ఉలవలు ఇలాంటి వాటిని రుబ్బి అట్లు వేసుకోవచ్చు. పెనరట్టు
గానీ, మినపట్టుగానీ సరదాగా అప్పుడప్పుడూ తినండి. మధ్య మధ్య కమ్మగా తాలింపు
పెట్టిన దధ్యోదనం (దధోజనం) కరైన్ లాంటివి కూడా తింటూ ఉండండి. రాగిపిం
డితోనూ, జొన్నపిండితోనూ, గోధుమపిండితో కూడా బజ్జీలు, పునుగులూ, పకోడీలు
వేసుకోవచ్చు. అన్ని రుచులను ఆస్వాదించడమే మంచిది.

KOBBARI PALU - KOBBARI NEELLU

కొబ్బరిపాలు కొబ్బరినీళ్ళు

కొబ్బరి తినటం మంచిదేనా? ఉపకారాలు, అవకా
రాలు వివరించగలరు

* కూరగాయల్ని ఎలా లేతగా ఉన్నప్పుడే తినాలో అలానే లేత
కొబ్బరినీ తినాలి. లేతగా ఉండే కొబ్బరికాయలు మార్కెట్లో దొరకటం
అపురూపం అవుతోంది. ముదిరిన కొబ్బరి, కొబ్బరినీళ్ళు కూడా వాత
వ్యాధులకు దారితీస్తాయి. దగ్గు, ఉబ్బసం, పైత్యరోగాలు వస్తాయి. లేత
కొబ్బరిని అతిగా తిన్నా ముదురు కొబ్బరిని కొద్దిగా తిన్నా రెండూ అప
ఇతర నూనెలతో పోల్చినప్పుడు కొబ్బరి నూనెలో 87 శాతం కొవ్వు
ఉంది. మంచి కొలెస్ట్రాల్, చెడ్డ కొలెస్ట్రాల్ మిశ్రమంగా ఉండే ఈ నూనె
గుండెకు అవకారం చేసేదని కొందరు, మేలుచేసేదని కొందరు
భావిస్తున్నారు. స్థూలకాయం తగ్గాలంటే కొబ్బరి తినటం మంచి
దంటారు ఇంకొందరు.
కొబ్బరిని ఇష్టంగా తినబోయే
ముందు, దానిలోని కొవ్వుని
దృష్టిలో పెట్టుకోవాలి. లేత కొబ్బరి
కోరును కొద్దిగా కొబ్బరి నీళ్ళుపోసి
పిండితే వచ్చే తెల్లని నీటిని కొబ్బరి
పాలు అంటారు. ముదిరిన కొబ్బరి
కన్నా లేత కొబ్బరిలో కొవ్వు శాతం
తక్కువగా ఉంటుంది. కొబ్బరిపా
లుగా తీసుకున్నప్పుడు మరింత
తక్కువగా ఉంటుంది. దీన్ని ఆహార పదార్థాల్లో వాడుకోవటం మంచిది. కొబ్బరి
నీళ్ళనీ, కొబ్బరిపాలనూ ఆహార పదార్థాలుగా తయారుచేసుకోవటం మంచిది. తగి
నంత పొదాషియం కోసం వీటి వాడకం అవసరం కూడా!
సాధారణంగా తెలుగువారి ఆహారంలో పులుపు, ఉప్పు, కారం ఎక్కువగా
ఉంటాయి. అధిక ఉప్పు తినేవారికి తగినంత పొటాషియం ఉన్న కొబ్బరి పదార్థాలు
తీసుకోవటం అవసరం. అలాగే కూర అరటికాయ, అరటిపళ్లను కూడా తీసుకోవటం
మంచిది. ముఖ్యంగా వేసవి కాలంలో వడకొట్టి శోష కలగకుండా లవణ సమతుల్యత
(ఎలెక్ట్రోలైట్ బ్యాలెన్స్) కోసం ఈ రెండింటినీ వాడుకుంటూ ఉండాలి.

NOONE VIKARAM

ఆ నూనె పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు సైడ్ ఎఫెక్టులు రాకుండా
ఏమైనా ఉపాయాలున్నాయా?
* అతిగా నూనె పదార్థాలు తిన్నప్పుడు దాహంగానూ, కడుపులో తిక్కతిక్కగానూ
ఉంటుంది. ఇది తగ్గడానికి మజ్జిగలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలుపుకొని తాగితే
కొంత సుఖంగా ఉంటుంది.
ధనియాలు, జీలకర్ర, శొంది
మూడింటినీ దంచిన పొడిని మజ్జి
గలో కలుపుకుని తగినంత ఉప్పు,
పంచదార కలుపుకుని తాగితే
నూనె వలన కలిగిన వికారం తగ్గు
తుంది.
తేలికగా అరిగే ఆహార పదా


Saturday 16 January 2016

BACKING SODA

'* తినేసోడా ఉప్పుని బేకీంగ్‌ సోడా అనీ, బ్రైడ్‌ సోడా అనీ కుకింగ్‌ సోదా అనీ, లై కార్పొనేట్‌ ఆఫ్‌ సోడా అనీ పిలుస్తారు. రొట్టెలు బాగా పొంగడం కోనం, పాలు విర క్కుండా ఉండటం కోనం దీన్ని వంటింట్లోకి తెచ్చారు మనవాళ్లు. నీళ్లలో వేస్తే దీనిలోని కర్భన వరమాణువులు గ్యాన్‌ రూపాన బుడగలుగా వియటకు వస్తాయి. కాబట్టి, దీన్ని సోడా ఉప్పు అనీ, “సాల్ట్‌ ఎయిరేటన్‌' అనీ పిలుస్తారు. 12 [1003 దీని శాస్త్రీయ నామం. 

ఉప్పు ఏవిధంగా మంచీ చెడూ మిశ్రమ ఫలితాలనిన్తుందో అలాగ తినేసోడా ఉప్పు కూడా ఇన్తుంది. ఉప్పు ఎవరెవరికి నిషేధమో వారందరికీ తినే సోడా ఉప్పు కూడా నిషే ధమే! అలాగే కాల్షియం లాంటి క్షారాలను వాడుతున్న వారు కూడా తినే సోడా ఉప్పు వాడకూడదు. రెండూ క్షూరాలే కాబట్టి శరీరంలో క్షారగుణాలు పెరిగిపోయి కొత్త నమ న్యలొస్తాయి. ఎంత సోడా లైకార్చ్‌ తీనుకున్నారో అంత మేర మామూలు ఉప్పుని తగ్గించి వాడుకుంటే ఉప్పు నమన్య తీరుతుంది. గ్యాన్‌ వగైరా బాధలకు సోడా బైకార్స్‌ వాడవచ్చా అని అడిగారు. కానీ గ్యాన్‌ బాధని తెచ్చి పెట్టే ఆహార విహారాలను మూర్పు చేనుకోవడం ఒక రసాయనం వాడటం కన్నా మంచిది కదా! 

RAGI AMBALI - AYURVEDAM



అన్నం తినబుద్ధి కాకపోవడం / అజీర్ణం ,నోటికి రుచి తెలియకపోవడం జరిగినప్పుడు ఏం చేయాలి? / అల్లం - అజీర్ణం - ఆయుర్వేదం / ALLAM - AJEERNAM - AYURVEDAM


దీనిని అరుచి అంటారు.అజీర్త్ కారణంగానైన, లేదా ఇతర కారణాలవల్లనైన ఇది కలగవచ్చు. కారణం ఏదైనా ముందు జీర్ణ వ్యవస్థ బలకరం కావాలి.

ప్రతి రోజూ అల్లనికి తగినంత ఉప్పు వేసుకుని దంచి అన్నంలో మొదటి ముద్దగా కలుపుకుని నెయ్యి వేసుకుని తినాలి.నాలుక మీద జిగురు తగ్గి ,అన్న హితవు కలుగుతుంది.అన్నంలో మొదటి ముద్దగా అల్లం, ఉప్పు ( వీలైతే సైంధవ లవణం ) మిశ్రమాన్ని తినాలి.అరోగ్యవంతులు కూడా దీనిని పాటిస్తే భుక్తాయాసం కలుగదు.అహారం తేలికగా జీర్ణం అవుతుంది.అన్నం తినాలనే కోరిక కలుగుతుంది.ఉసిరికాయ తొక్కుడు పచ్చది లేద నల్ల పచ్చడిని ఈ అల్లం మిశ్రమానికి కలిపి తింటే మరీ మంచిది.భోజనంలో మొదటి పదార్థంగా దీనిని తీసుకోవాలి.
పచారీ కొట్లలో దొరికే పిప్పళ్ళను దోరగా వేయించి మెత్తగా దంచాలి.ఈ చూర్ణానికి ఆరు రెట్లు పంచదార కలిపి పాకం పట్టి కుంకుడు కాయంత ఉండలు చేసుకొని సీసాలో భద్రపరుచు కోవాలి.జీర్ణవ్యవస్థ బలంగా లేని వాళ్ళు వీటిని ఉదయం , రాత్రి ఒక్కొక్క మాత్ర చొప్పున తీసుకుంటూ వుంటే కడుపులో వాతం తగ్గి జీర్ణాశయం బలపడుతుంది.శరీరానికి నూతనోత్తేజం కలుగుతుంది.

DAMPUDU BIYYAM - SUGER DISEASE - AYURVEDAM

సుగరు రోగులకు దంపుడు బియ్యం పెడితే కలిగే ప్రయోజనం వివ
రించగలరు.

* షుగరు వ్యాధిలో బియ్యం వాడ
కాన్ని సగానికి తగ్గించాలని వైద్యులు సూచి
స్తున్నారు. ఆ మిగిలిన సగానికి సరిపడే
రాగి,
జొన్న, సజ్జ, గోధుమలను వాడుకోవ
లసిందని చెప్తున్నారు. కాబట్టి, దంపుడు
బియ్యం మాత్రమే తినాలని అనుకోనవ
సరం లేదు. షుగరు వ్యాధిలో దంపుడు
బియ్యాన్నో లేక 'పట్టు తక్కువ బియ్యాన్నో
తినటం వలన జీర్ణాశయ వ్యవస్థ మరింత
దెబ్బ తింటుంది. గోధుమలూ, రాగులు, సజ్జల్లాంటివి పూర్తి ధాన్యంగా వండు
కుంటాం. వీటిని మిల్లాడించి పై పొరల్లోంచి చిట్టూ, తవుడూ వగైరా తీసేయటం
ఉండదు. కాబట్టి, షుగర్ రోగులు దంపుడు బియ్యం తినటం కన్నా జొన్నలూ,
రాగులు, సజ్జలూ వగైరా తృణధాన్యానికి ప్రాధాన్యత నివ్వటం మంచిది. దంపుడు
బియ్యం తింటే ఏ పోషకాలు దొరుకుతాయని ఆశిస్తున్నారో అవన్నీ అంతకన్నా ఎక్కు
వగానే ఈ ప్రత్యామ్నాయ ధాన్యంలో దొరుకుతాయి.
అన్నీ సవ్యంగానే ఉన్నప్పుడు దంపుడు బియ్యం మేలు చేసేదే! షుగర్ రోగులకు,
స్థూలకాయులకు, కొవ్వు కారణంగా ఏర్పడే వ్యాధులతో బాధపడేవారికీ రాగి, జొన్న,
సజ్జ, గోధుమలు మంచివి.

VUPMA AND AYURVEDAM


ఉప్మా రోజూ తినదగినదేనా?

తెలుగు, తమిళ, కన్నడ మలయాళ తదితర ద్రావిడ ప్రజలు కొన్ని ఉత్తరాది
రాష్ట్రాల వాళ్లు కూడా వందలాది ఏళ్లుగా వండుకుని తింటున్న ప్రాచీన వంటకం ఇది!
ఉప్మా మనందరిది!
నీళ్లు పోసి గానీ, లేదా నీళ్ల ఆవిరి మీద గానీ ఉడికించిన పిండిని 'ఉప్పిండి'
అంటారు. దీన్నే ఉప్పుడు పిండి, ఉప్పిండి,
ఉప్పిడి, ఉప్పుమావు అని కూడా పిలుస్తారు.
ఇడి అంటే పిండి. ఉప్పడి అంటే ఉడికించిన
పిండి లేదా రవ్వ. మావు అనేది పిండికి
పర్యాయపదం. శరీరాన్ని శుష్కింప చేసుకో
వటం కోసం కేవలం ఉడికించిన ఉప్పిండిని
తిని పడుకోవడాన్ని ఉప్పడి ఉపవాసం
అంటారు. కమ్మని తాలింపుతో చేసిన
'ఉప్పుమావు' ఆంగ్లేయుల ఉచ్ఛారణలో ఉప్మాగా మారిపోయింది.
డురమ్ అనే రవ్వ గోధుమ గింజ లోపలి నడిభాగాన్ని 'సెమోలినా' అంటారు. ఏ
ధాన్యపు గింజలోంచైనా సెమోలీనా తీయవచ్చు. కానీ, ఈ గోధుమ 'సెమోలీనా' రవ్వ
ఉప్మా తయారీకి బాగా అనుకూలంగా ఉంది. బొంబాయి రవ్వని దక్షిణాది ప్రజలు
గొప్పగా సద్వినియోగపరచుకున్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉప్మా, ఉప్పుమావు,
ఉప్పట్టు, ఉపీత్ పేర్లు వినిపిస్తాయి. బొంబాయి రవ్వతోనే కాకుండా గోధుమరవ్వ
ఉప్మా, మొక్కజొన్న రవ్వ ఉప్మా, పెనర రవ్వ ఉప్మా, నవధాన్యాల ఉప్మా, ఉలవల రవ్వ
ఉప్మాలు ప్రసిద్ధి. దేని గుణాలు దానివి. జీర్ణశక్తి ననుసరించి ఏ ధాన్యపు
రవ్వతో ఉప్మా చేసుకోవాలో నిర్ణయించుకోగలగాలి. ఉప్మా ప్రభావం దాని
వంటలో కాకుండా దాని కోసం వాడే రవ్వ మీద ఆధారపడి ఉంది. తక్కువ
కేలరీలు కలిగిన ఉప్మా కావాలంటే రవ్వ గోధుమల రవ్వ, జొన్న రవ్వ,
సజ్జ రవ్వ ఉత్తమం. రాగి పిండితో కూడా ఉప్మా చేసుకోవచ్చు. అన్ని
వ్యాధుల్లోనూ తినదగినదిగా ఉంటుంది. ఇతర ఉప్మాల కన్నా ఇది తేలిగ్గా
ఆరుగుతుంది. స్థూలకాయం తగ్గడానికి ఉలవ రవ్వ, జొన్న రవ్వ ఉప్మాలు
ఉపయోగపడతాయి. అతి ఆకలిని తగ్గించడానికి పెసర రవ్వ తోడ్పడు
తుంది. ఘనమైన జీర్ణశక్తి ఉన్నప్పుడే బొంబాయి రవ్వ ఉప్మా
తినటం మంచిది.

Saturday 9 January 2016

VUNDRALLU , AVIRI KUDUMULU - AYURVEDAM

కోటల్ కెళితే ఇడ్లీలు దొరకుతాయి
గానీ ఉండ్రాళ్ళు దొరకవు. గారెలు, వడలు
దొరుకుతాయిగానీ ఆవిరి కుడుములు
దొరకవు.
ఉండ్రాళ్ళు వినాయక చవితినాడు
మాత్రమే తినాలని మన ప్రజలు ఎందుకను
కొంటారో తెలీదు. ఆవిరి కుడుములు
వేస్తారనీ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివనీ
మన వాళ్ళు చాలా మందికి తెలీదు. తెలిసినా
వండరు. అమ్మమ్మల వంటలని ఎగతాళి
చేస్తారని భయం!!
బహుశా, పూటకూళ్ళ సాంప్రదాయాన్ని
మార్చి తమిళులు, కన్నడవారూ తెలుగు నాట
హోటల్ సాంప్రదాయాల్ని ప్రవేశ పెట్టి “ఇడ్లీ
+ వడ దోసె"ల్ని మనమీద రుద్దేశారు.
దాంతో మనం మన సాంప్రదాయకమైన
ఆహారాన్ని మర్చిపోయి ఇడ్లీ సాంబార్లలో
వడి కుడితి తొట్లో ఎలుకలా కొట్టు
కొంటున్నాం... అవునంటారా.... కాదంటారా....
'విదేశీ సంస్కృతి' అంటూ అయిన
దానికి కానిదానికి ఒంటికాలుమీద లేచే మన
పెద్దలు ఇలా మనం స్వంత సంస్కృతిని
మరిచిపోతున్న నంగతిని ఎప్పుడైనా
గుర్తించారా...???
ఇడ్లీలు వాతం చేస్తాయి
ఉండ్రాళ్ళు, ఆవిరి కుడుములు ఎంత
మేలుచేస్తాయో మీకు వివరంగా చెప్పబోయే
ముందు ఇడ్లీ గురించి ఒక మాట...
ఇడ్లీలు ఉప్పుడు రవ్వతో తయారౌతాయి
కాబట్టి తెల్లగా మర పట్టించకుండా
బియ్యంలో సారం అంతా పోకుండా
ఉప్పుకు రవ్వలో నిలవ వుంటుంది కాబట్టి
ఉప్పుడు రవ్వ వలన బలం ఎక్కువగా
వస్తుందనీ, నాడీ ఉత్తేజం (Nerve Stimula-
tion) కల్గుతుందని అర్ధం చేసుకోవాలి.
ఇది బాగానే ఉంది కానీ, ఉప్పుడు
రవ్వవలన, అవి పులిసిన బియ్యం కాబట్టి-
వాతం పెరుగుతుంది. మలబద్ధకం కలుగు
తుంది. అందుకని కడుపులో మంట, గ్యాస్
ట్రబుల్ పేగుమాత, అమీబియాసిన్,
ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి వ్యాధులు
న్నవారు, అన్నిరకాల వాతవ్యాధులున్నవారు
ఇడ్లీలు తినడం మంచిది కాదు.
చలవని కల్గించే చక్కని టిఫిను ఇదిగో...
మీ కోసం...
ఉండ్రాళ్ళు, ఆవిరి కుడుములు కొంచెం
ఆలస్యంగా అరుగుతాయి. అందుకని ఇవి
తేలికగా అరగడం కోసం నెయ్యివేసుకొని
తినాలి. ఇడ్లీలైనా నేతితో తిన్నప్పుడు అంతగా
చెడును కల్గించవు.
ఆరోగ్యవంతుడే కాదు, ఏ వ్యాధితో
బాధపడున్నవారైనా సరే ఉండ్రాళ్ళనూ ఆవిరి
కుడుమునూ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
చలవని కల్గిస్తాయి. తృప్తిని కల్గిస్తాయి. తిన్న
తర్వాత కడుపునిండినట్లు అనిపిస్తుంది. మళ్ళీ
భోజనం వేళకే ఆకలి అవుతుంది. అందుకని
టిఫిన్ గా ఉండ్రాళ్ళను గానీ, ఆవిరి కుడుము
నుగానీ తినడం మంచిది.
ఇడ్లీల వలన తృప్తి కలగదు. అందులోకి
శనగ చెట్నీ, కారప్పొడి, సాంబారు లేనిదే
అవి సహించవు. అవన్నీ కలిపి తినడం వలన
ఇడ్లీలు వేడిచేసే వాటిలో ముందు వరసగా
వచ్చేస్తున్నాయి. ఉండ్రాళ్ళుగానీ, ఆవిరి
కుడుములుగానీ ఇలా వేడిచేయనీయ
కుండానే చక్కగా, నేరుగా తినవచ్చు. ఈ
సున్నితమైన తేడాని గుర్తించండి.
మూత్ర వ్యాధులున్నవారు, మూత్ర
పిండాలలో రాళ్ళతో బాధపడున్నవారు,
మూత్రంలో మంట చీము వున్న వారు
ఉండ్రాళ్ళు తింటే మంచిది. చలవని కల్గి
స్తాయి.
అమీబియాసిస్ వ్యాధిలో ఇడ్లీ
సాంబార్లు తినడం కన్నా వీటిని తినడం
మంచిది.
రాత్రిపూట అన్నం మానేసి చపాతీలు
తినదలచిన వారుకూడా, ఆవిరి కుడుముగానీ,
దిబ్బరొట్టెగానీ తినడం మంచిది. చపాతీలు
సరిపడని వారికీ ఇవి మంచివే. చలవ
నిస్తాయి. పెద్దగా కేలరీలు పెరగవు. గోధుమ
పిండితో వండిన వాటి కన్న మన వాతా
వరణానికి ఇవే మంచివి!
ఆవిరి కుడుముల కన్నా మంచి ఆహారం
ఇంకొకటి లేదు
ఆవిరి కుడుములు తింటే- భోజనం
3
చేయగానే వచ్చే కడుపులో నొప్పి వ్యాధిలో
చాలా మంచిది. కడుపులో పుండువలన ఈ
నొప్పి వస్తూండవచ్చు. ఉండ్రాళ్ళుకూడా ఈ
వ్యాధిలో మేలుచేస్తాయి.
ఆవిరి కుడుముల్ని రాత్రిపూట వేసుకొని
ఉదయం పూట సూర్యోదయానికి ముందే
తింటే వేసవికాలం అమితమైన చలవ
కి నిస్తుంది. తేలికగా వడదెబ్బ తగలకుండా
-దే కాపాడుతుంది.
వాత వ్యాధులు, పక్షవాతం కీలు
గా నొప్పులతో బాదపడున్న వారికి ఈ విధంగా
పెడితే వాతం త్వరగా తగ్గుతోంది. మందులు
చక్కగా పనిచేస్తాయి.
ఇడ్లీలు చల్లారితే బాగోవు. ఆవిరి
కుడుము చల్లారిన తర్వాతే బాగుంటుంది
ఆరోగ్యం కూడా!! ఆవిరి కుడుములో బియ్యం
చాలా స్వల్పంగా వుంటాయి. కేవలం
మినపప్పును, జిగురుకోసం కొద్దిగా బియ్యపు
గింజలు కలిపి నానబెట్టి రుబ్బి ఇడ్లీ ప్లేట్లలో
గానీ, వాసిన కట్టిన గుడ్డమీదగానీ ఇడ్లీ వేసినట్లే
వేసుకొని చల్లారిన తర్వాత తింటారు. ఆవిరి
కుడుముల్లో బియ్యం దాదాపుగా వేడి కాబట్టి
ఇంతకుమించిన ఉత్తమమైన ఆహారం
మధుమేహరోగులకుగానీ,
స్థలకాయులకిగానీ
ఉండదు కదా! ఆ విధంగా, కేవలం మినప
పిండితో వండినవి కాబట్టి ఆవిరి కుడుములు
వాత వ్యాధుల్లో అద్భుతమైన ప్రభావాన్ని
చూపిస్తాయి. గారెలకన్న ఆవిరి కుడుములే
శ్రేష్టం. గారెల్లో నూనె వుంటుంది. ఆవిరి
కుడుముల్లో నూనె అసలే వుండదు కదా!
అన్నం కన్నా ఉండ్రాయి మిన్న
ఇంక ఉండ్రాళ్ళు - బియ్యపు రవ్వతో
తయారుచేస్తారు. వండే విధానంలో ఇడ్లీలను
వండినట్లే వీటిని ఆవిరిమీద ఉడికించడమే
పద్ధతి. ఇందులో మినపప్పు వుండదు. రుచి
కోసం శనగపప్పు కలుపుతారు. కానీ,
మామూలు బియ్యంతో వండిన అన్నంకన్నా
ఉండ్రాళ్ళు తేలికగా అరుగుతాయి. ఎక్కువ
చలవ.
ఇవి తరతరాలుగా మన తెలుగు వారు
తిన్న టిఫిన్లు. ఆరోగ్యానికి మేలు చేసేవి.
తమిళులు, కన్నడీయులు పుణ్యమా అని,
మనం చలవచేసే టిఫిన్లను వదిలేని
వేడిచేసేవి. ఆరోగ్యాన్ని దెబ్బతీసేవి అయిన
ఇడ్లీ, దోసె, ఉప్మా, పూరీలను తిని
బాధపడ్తున్నాం- కాదంటారా...!!
జీలకర్ర ధనియాలను విడివిడిగా నేతిలో
వేయించి, సమానంగా తీసుకొని, మెత్తగా
దంచి, తగినంత ఉప్పు కలిపి ఆ పొడిని
నంజుకుతింటే ఇవి
తేలికగా అరుగు
తాయి. పొదీనా ఆకు
పచ్చడి కూడా వీటికి
విరుగుడుగా పని
చేస్తుంది.

Tuesday 5 January 2016

పాలకూర తినకూడని వ్యాధులు / PALAKOORA - THINAKOODANI VYADHULU .

పాలకూరను జీవంతి అంటారు.పేరుకుతగ్గ ఆహారద్రవ్యం ఇది.గొప్ప బలకరమైన ఔషధాల్లో పాలకూర ఒకటి.ఎదిగే పిల్లలకు తప్పనిసరిగా తినిపించాలి.క్యాన్సర్ లాంటి ఉద్రేక స్వభావం ఉన్న వ్యాధుల్లో ఉపశమనం కలిగిస్తుంది.క్యాన్సర్,స్థూలకాయం,బిపి,షుగరు వ్యాధి,గుండె జబ్బులు,అల్సర్లు,జీర్ణకోశ వ్యాధులు ఇలా అనేక వ్యాధులకు పాలకూరలో ఔషధ గుణాలున్నాయి.కె విటమిన్ తో పాటు శరీరానికి కావలసిన పోషక విలువలన్నీ ఉన్నాయి.రక్షనయంత్రాంగం పాలకూరలో పుష్కలంగా ఉంది.ఇది బాగా చలవ చేస్తుంది.సాధారణంగా అన్ని వ్యాధుల్లోనూ తినతగినదిగా ఉంటుంది.కొన్ని ఔషధాలతో ఇది రసాయన చర్యలు జరుపుతుంది.దానివల్ల ఆయా ఔషధాలను బట్టి ,వ్యాధులను బట్టి కొన్ని ప్రభావాలుంటాయి.చక్కెర వ్యాధిలో వాడే మందులతో పాటు పాలకూరను తీసుకుంటే చక్కెర స్థాయి బాగా తగ్గుతుందని పరిశోధనల్లో తెలిసింది.కాబట్టి షుగర్ బార్డర్ లైన్ లో ఉన్న వాళ్ళు పాలకూర తిన్నప్పుడు ఔషధాల మోతాదుని డాక్టర్ సలహా మేరకు మార్పుచేసుకోవాల్సి రావచ్చు.షుగరు సరిగా కంట్రోల్ లో లేని వాళ్ళు పాలకూరను తినటం అలవాటు చేసుకోవాలి.గుండె జబ్బులు,బిపి వ్యాధుల్లో రక్తం గడ్డకట్టే ప్రక్రియను నెమ్మది చేసేందుకు కొన్ని ఔషధాలు వాడతారు.దీని చలువచేసె స్వభావరీత్యా రక్తస్రావాన్ని ఆపే స్వభావం కలిగి ఉంటుంది.దీనిలోని కె వితమిన్ ఇందుకు తోడ్పడుతుంది.ఇది రక్తం గడ్డ కట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుందన్నమాట.రక్తం గడ్డ కట్టే ప్రక్రియను ఆలస్యం చేసే మందులు ,వేగవంతం చేసే ఆహరమూ రెండూ విరుద్ధ స్వభావాలను కలిగినవవుతాయి.అలాంటప్పుడు ఆ రోగులకు మాత్రమే పాలకూరను తగ్గించాలని వైద్యులు చెబుతారు.అలాగే మూత్రపిండాల్లో కాల్షియం ఆగ్జలేట్ రాల్లు ఉన్నవాళ్ళకి పాలకూరను తినవద్దని చెబుతారు.

అధిక రక్తపోటుతో బాధపడే వారికి పొటాషియం ఉన్న పాలకూర బిపి ని తగ్గించడానికి బాగా తోడ్పడుతుంది.బిపి రోగులు పాలకూరను తప్పని సరిగా తినాలి.కానీ మూత్రపిండాలు బాగా చెడిపోయి సోడియం,పొటాషియం సమతుల్యతలో తేడాలేర్పడతాయి.డయాలసిస్ మీద ఉన్న రోగులకు సోడియం నిలవలు తగ్గిపోయే పరిస్థితి వస్తే పాలకూరను వద్దంటారు.ఇలా పాలకూరను  తప్పనిసరిగా మానాల్సిన వ్యాధుల్లో మాత్రమే వైద్య్లు ఆ విధంగా సూచిస్తారు.దాని అర్థం పాలకూరతో కిడ్నీలో రాళ్ళొస్తాయి,కిడ్నీలు చెడిపోతాయని కాదని గుర్తించాలి.

SHANAGA PINDI MANCHI CHEDU - AYURVEDAM

శనగపిండి మంచి - చెడూ

శనగపిండి మంచి ప్రొటీన్లతో కూడిన ఆహారం కదా! వైద్యులు దాన్ని
తినవద్దని ఎందుకు చెప్తారు?
* శనగపిండి తినకూడని చెడ్డ ఆహార పదార్ధం కాదు. ఆ మాటకొస్తే ఏ ఆహారద్రవ్యాన్ని తినకూడనిదిగా ముద్ర వేయటము మంచిది కాదు. మీరన్నట్టు
శనగపిండి మంచి పోషక విలువలు కలిగిన ఆహార ద్రవ్యమే!
సహజంగా శనగపిండితో చేసిన వంటకాలు కష్టంగా అరిగే స్వభావం
ఆకలి కలిగిన వారికి దీన్ని నిరభ్యంతరంగా పెట్టవచ్చు. తిన్న తరువాత
కలిగి ఉంటాయి. అయినప్పటికీ, ఉర్ణశక్తి బలంగా ఉన్నవారికీ, అతి
ఎలాంటి ఇబ్బంది కలిగించనప్పుడు దాన్ని మానాలని చెప్పాల్సిన అవ
సరం లేదు. జఠరాగ్ని బలహీనంగా ఉన్న వారికి మాత్రమే దీని జాగ్రత్తలు
వర్తిస్తాయి.
పోషక విలువలు ఉన్నవన్నీ అరిగించుకోగల స్థితిలో వ్యక్తి
ఉన్నప్పుడే
..వంటబడతాయి. కాబట్టి, అరిగించుకోగల
వారికి వర్తించే విషయాలు అగ్నిబలం తక్కువగా ఉన్నవారికి
వర్తించవని అర్ధం చేసుకోవాలి. అలాంటి వాళ్లకు శనగలు, శనగపప్పు, శనగపిండి
అపకారం చేసేవిగానే ఉంటాయి. జీర్ణశక్తి ననుసరించి, శనగపిండి తినడమో మాన
డమో ఎవరికివారు నిర్ణయించుకో
అని చెప్పవచ్చు. 
శనగపిండి వేడి శరీర తత్వం ఉన్న
వారికి కడుపులో ఆమ్లాన్ని పెంచు
తుంది. వాత శరీరతత్వం ఉన్నవారికి
కీళ్ళవాతం ఇతర వాత బాధలను
పెంచుతుంది. కఫతత్వం ఉన్నవారిలో
మందగుణం, ఉత్సాహం, చలాకీ
తనం లేకుండా చేస్తుంది. షుగరు,
బీపీ, అర్ధరయిటీస్, ఎలర్జీలు, పేగుపూత, స్థూలకాయం వగైరా వ్యాధులున్నవారికి
అపకారం చేస్తుంది. చిక్కిపోతున్నవారికి, శుష్కించిపోతున్న వారికి జీర్ణశక్తిని పెంపొం
దేలా చికిత్స చేస్తూ శనగపిండితో వంటకాలు చేసి పెట్టవచ్చు.
శరీర శ్రమ ఎక్కువగా ఉండేవాళ్ళు, ఏది తిన్నా అరిగించుకోగలవాళ్ళకు శనగ
పిండి మేలే చేస్తుంది. ఆయుర్వేదశాస్త్రంలో చెప్పిన చికిత్సా సూత్రం ప్రకారం,
ప్రయత్న పూర్వకంగా రోగి జఠరాగ్ని బలాన్ని కాపాడవలసి ఉంది. అగ్ని బలం పెరి
గితే, రోగి బలం పెరిగి, రోగ బలం తగ్గుతుంది. అప్పుడు వ్యాధిని తగ్గించటం తేలికవు
శనగపిండి ప్రస్తావన దీర్ఘ వ్యాధుల విషయంలో వచ్చినప్పుడు జీర్ణశక్తిని బట్టి తినా
తుంది.అప్పటికప్పుడు ముంచుకొచ్చిన వ్యాధుల్లో అగ్నిబలం ముఖ్యం
కాబట్టి శనగపిండిని ఆపాలని చెప్పవచ్చు.. ఏ వ్యాధులూ లేనివాళ్లకు, మంచి జీర్ణశక్తిఉన్నవాళ్లకు శనగపిండిని నిరభ్యంతరంగా వాడుకోవాలని చెప్పవచ్చు.

Saturday 2 January 2016

THYROID JABBU - AHARA NIYAMALU - AYURVEDAM



* అయోడిన్‌ తగినంత సరీమాణంలో అహారం ద్వారా అందనష్పుడు 
గ్రంథి వాచిపోయి అనేక రుగ్యతలకు దారి తీస్తుంది. శరీరంలోని జీవనక్రియే లన్నింటికీ ఈ థైరాయిడ్‌ గ్రంథి అధార భూతంగా ఉంటుంది. దాని పని తీరు తగ్గిపోతే మెదడు, నరాలు, చర్మం, వెంట్రుకలు కడుపులోని అనేక అవయ వాల మీద దాని ప్రభావం చెడుగా ఉంటుంది. మీకు డాక్టరుగారు రాసి చ్చిన మాత్రలు అయోడిన్‌ మాత్రలు కావు, అవి థైరాక్సిన్‌ అనే హార్మోను మాత్రలు థైరాయిడ్‌ గ్రంథి నరిగా పనిచేయకపోవటం వలన ఈ హార్మోను ఉత్పత్తి తగ్గిపోతోంది. అది ఎంత మేర అవనరమో అంతకు తగ్గ మోతాదులో ఆ బిళ్లలు వాడుకోవాలి. ఎక్కువైనా ప్రమాదమే... తక్కు వైనా ప్రమాదమే! 
" ఆమోడిన్‌ కలిసిన ఉప్పు వాడటం వలన ,  తైరా 

క్సిన్‌ హార్మోన్ల ఉత్పత్తి లోపం కలగదని ఆ విధంగా అయోడిన్‌ ష్పుని వాడేస్తున్నారు. కానీ థైరాయిడ్‌ దెబ్బతినటొనికి అయోడిన్‌ లోపం ఒక్కటీ కారణం కాదు. మన జీవన విధానం, మన ఆహార విహారపు అలవాట్లు, బజార్లో 
మనం కొనుక్కుంటున్న ఆహార ద్రవ్యాలు అన్నీ అంతో ఇంతో కారణం అవుతు న్నాయి. విషరసాయనాల కల్తీలు, రంగులు కలిసిన ఆహార పదార్థాలు, వాతావరణ 
కాలుష్యం లాంటివి కూడా కారణాలవుతున్నాయి. గత 80 యేళ్లుగా అయోడిన్‌ కలి సిన ఉప్పే వాడుతున్నప్పటికీ, 
రోజురోజుకీ థైరాయిడ్‌ గ్రంథి % చెడిపోతున్నరోగుల సంఖ్య పెరు 
గుతోందే గానీ తగ్గటం లేదు, గొ అందుకే, అయోడిన్‌ ఉప్పుకీ ష్‌ థైరాయిడ్‌ కోసం వాడే మందు ౯ లకూ సంబంధం లేదు. దేని దారి 
దానిదే. 

థైరాయిడ్‌ వ్యాధిలో ప్రthyekamaina ఆహారం అంటూ ఏమీ లేదు. సా ధ్యమైనంత వరకూ కాయగూరలకు, అకుకూరలకూ ప్రాధాన్యత ఇచ్చేలా bhoja నం తీరుని మార్పు చేసుకోవాలి. ఫైబర్‌ ఎక్కుvaga ఉండే ఆకుకూరలు, కాషగూ రలూ, వళ తినండి. రాగి, జొన్న నజ్జ ధాన్యాలు ఈ వ్యాధిలో కొంత మేలు చేస్తాయి 

6 రుచులూ కలిసిన ఆహారాన్ని ఆయుర్వేదంలో సమతుల్య ఆహారం (బ్యాలెన్స్‌ ల అంటారు. వగరూ, చేదు రుచులు కలిగిన పదార్థాలు కూడా తగినంతగా భోజ ర తో ఉందేలా చూసుకోండి. బాగా చిలికిన, పలచని మజ్జిగ వగరు రులి కలిగి వ్రయోజనకరంగా ఉంటుంది. అయోడిన్‌ ఉప్పుని ఆపకండి. జీర్ణశన్ని baలంగా ఉండేలా చూసుకుంటే థైరాయిడ్‌ బాగా అదుపులో ఉంట్రుంdi. 

AVAKAYA / VOORAGAYA PACHADI - AYURVEDAM



* మనకే కాదు, క్లియోపాత్రకి దోసావకాయ అంటే మహాప్రీతి
అని చరిత్రకారులు చెప్తారు. ఊరుగాయలు ప్రపంచ ప్రాచీన ఆహార
పదార్ధం. పళ్ళూ, కాయలూ, మాంసం దొరకని అన్ సీజన్లో కూడా
వాటిని కమ్మగా తినేందుకు ఊరుగాయ ప్రక్రియని మన పూర్వులు ఉప
యోగించుకున్నారు.
కూరగాయ మొక్కలు తరిగి ఉప్పు పట్టించి నిలవబెట్టడాన్ని ఊరపె ర్ధదం అంటారు. ఉప్పు తగలగానే కూరగాయ ముక్కల్లోంచి నీరు ఆస్మాసిన్‌ వద్ధతిలో బయటకు వచ్చేన్తుంది. నీటిని పిండేసి ఆవసెండి, మంతిపిండిలొంటి సుగంధ ద్రవ్యాలను కలిపితే అది ఊరు 
గాయ (వికిల్‌. పికిల్‌ అంటే ఉప్పులో ఊరపెట్టటం అని అర్ధం. మూగాయని ఊరుగాయగా మొదలుపెట్టి మామిడి ముక్కలోని నీరంతా తీసేనీ 
టి చివరికి ఆ ఒరుగుల్ని మళ్ళీ ఆ పుల్లటి నీళ్ళలోనే వేసి తాలింపు పెడుతు 
న్నారు. అంటే ఊరుగాయని
పుల్లగాయగా మారుస్తున్నారు.
ఊరబెట్టినదాంట్లో మెంతిపిండి
వగైరా కలిపి తాలింపు పెట్టు
కుంటే ఆ మాగాయిలో పులుపు
సమానంగా ఉంటుంది. రుచిగా
ఉంటుంది. ఉప్పు, కారాలు
తక్కువ పడతాయి. ఆరోగ్యానికి
హాని చెయ్యదు.

 ఊరుగాయల్లో ఉత్తమమైంది. ఉసిరికాయతో పెట్టిన ఊరుగాయ. ఉసిరికాయ
లోపలి గింజలు తీనేని ఉప్పు కలిపి ఊరబెట్టి, తొక్కి నిలవబెడతారు. అందుకని
తొక్కుడు పచ్చడి, నల్లపచ్చడి అని కూడా పిలుస్తారు. ఊరుగాయని జాడీలో వాసెనా
కట్టి ఆరునెలలు మాగేలా చేస్తారు. ఎప్పటికప్పుడు కొద్దిగా ఇవతలకు తీసి, కొత్తిమీర వగైరా కలివి తాలింపుపెట్టి తాజాదనాన్ని కాపాడుకుంటూ ఉంటారు. పాతబడి. ఉనీరి తొక్కు, చింతకాయ తొక్కు, చూమిడి తొక్కు, ఇంకా కంద, వెలగ, టమోటా వంకాయ, దోనే, నిమ్మ, కాకర ఇలా రకరకాల కాయగూరలతో లేదా పళ్ళతో ఊర గొయలు పెడుతుంటారు. 
ఆవకాయకన్నా, తొక్కు పచ్చడి లేదా నల్లపచ్చడి ఆరోగ్యదాయకం. గోంగూరని
ఉప్పుతో ఊరబెట్టి చింతపండు రసం పోసి నిలవ పచ్చడి పెడితే అది తప్పకుండా అప
కారం చేస్తుంది. పులుపుని తగ్గించడానికి ప్రయత్నిస్తే ఊరుగాయలు మేలు చేస్తాయి.
పులుపు పెరిగే కొద్దీ ఉప్పూకారం నూనెల మోతాదు పెరుగుతుంది. వాటివలన
మరింత చేటు కలుగుతుంది. కానీ, కూరగాయల్లో చేసిన ఊరుగాయలు పేగులకు
బలం ఇచ్చి విరేచనం అయ్యేలా చేస్తాయి. జీర్ణశక్తిని కాపాడతాయి. సౌర, బీర, ద్రాక్ష
బొప్పాయి, అరటి, బూడిద గుమ్మడి లాంటి కూరగాయలన్నింటితోనూ మేలు చేసే
విధంగా ఊరుగాయలు పెట్టుకోవచ్చు.