పేలు, చుండ్రు సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు
గానుగలో తీసిన స్వచ్ఛమైన కొబ్బరి నూనె అర లీటర్ తీసుకుని ఒక పాత్రలో పోసి చిన్న మంట పెట్టండి. తర్వాత బాగా పండిన 5 నిమ్మ కాయలను గింజలు తీసి రసం తీసి నూనెలో పోయండి . క్రమంగా నిమ్మరసం పోయి నూనె మాత్రమే మిగిలే వరకు వేచి ఉండాలి. పాత్రను దించి నూనె వడ పోసి గాజు సీసాలో నిలువ చేసుకోవాలి.
ఈ తైలాన్ని రోజూ గోరు వెచ్చగా తలకు పట్టిస్తుంటే చుండ్రు, పేలు పోయి వెంట్రుకలు దృఢంగా మరి తలకట్టు అందంగా మారుతుంది.
దంతాలు కదిలే సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..
నల్ల తుమ్మ చెట్టు బెరడు 20 గ్రాములు, దోరగా వేయించిన శొంఠి పొడి 3 గ్రాములు తీసుకోవాలి. తుమ్మ చెట్టు బెరడు కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టి పొడి చేసుకోవాలి. శొంఠిని కూడా దోరగా వేయించి దంచి పొడి చేసి.. రెంటినీ కలపాలి.ఆ పొడికి తగినంత ఎవరికి ఎంత అవసరమో అంత సైంధవ లవణం పొడిని కలిపి నిలువ చేసుకోవాలి.
ఈ మిశ్రమ చూర్ణాన్ని ప్రతి రోజూ రెండు పూటలా పళ్ళు తోముకోవడానికి వాడుతుంటే కదులుతున్న దంతాలు గట్టి పడి దృఢంగా మారుతాయి. ఎంతో సులువుగా తయారు చేసుకునే ఈ చూర్ణాన్ని అందరూ వాడుకోవచ్చు.