17, సెప్టెంబర్ 2026, గురువారం

కుంకుమ పువ్వు.. విశిష్ట ప్రయోజనాలు..

 ఈ భూభాగంలో అత్యంత ఆకర్షణీయమైనది, ఖరీదైనది , అద్భుత ఔషధ గుణాలు కలిగినది కుంకుమ పువ్వు. ఆసేతు హిమాచలమే కాదు, సీమాంతర భూములలోనూ ప్రతిష్టాత్మకంగా వాడే ఖరీదైన మూలిక కుంకుమ పువ్వు. నాటి గ్రీకు సంస్కృతిలోనూ, అరబిక్ ఆచరణలోనూ , వేద కాలపు సంస్కృతిలోనూ ప్రాముఖ్యమైన సౌందర్య పోషణ ద్రవ్యమిది. నాటి రాచరిక కాలపు దర్పణానికి చిహ్నం కుంకుమ పువ్వు. 

రుచికరమైన వంటలలోనూ ,రమ్యమైన సౌందర్య సాధనము గానూ రసాయన ఔషధ ద్రవ్యంగానూ విశిష్టమైన ఈ కుంకుమ పువ్వు తనలో పెరగడం వల్ల మన శిఖరోజ్వల ప్రాంతం కాశ్మీరం అయింది. వేరు దుంప కలిగిన ఈ ఊదా రంగు పుష్పాలు గుత్తులు గుత్తులుగా ఈ కాశ్మీరంలోనే ఎక్కువగా పండుతాయి. 

ఈ పుష్పాలలోని కీల భాగమే కుంకుమ పువ్వు.పారశీక, బాహ్లిక దేశాలలో పండించినా కాశ్మీర కుంకుమ పువ్వే శ్రేష్ఠమైనది అని భావమిశ్రుడు అంటాడు. 

స్త్రీలలో ఇది శ్రోనితా స్థాపకం కనుక కవులు దీన్ని కమ్మ పుప్పొడి లోని మధుర లాలన అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో , అన్ని వర్గాల ప్రజావళి తమ పిండి వంటలలో , సౌందర్య సాధనాలలో, మందు లలో దీన్ని వాడుతున్నారు. దీని దుంప, పువ్వు, కాండం, పై పొర , వేరు, ఆకులు, అన్ని వివిధ రకాలుగా వాడుతున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో కుంకుమ పువ్వు ఒక భాగమైంది. 

వంటకాలకు రుచి..ముఖ్యంగా దీని పువ్వులలో కీల భాగం నుండి వచ్చే పరిమళ భరితమైన పుప్పొడిని తరతరాల నుండి ఈ దేశపు ప్రత్యేక వంటలలో వాడుతున్నారు. 

మన పూర్వులే కాదు, మొఘలాయిల అద్భుత మొఘల్ వంటకాలలో ఈ కుంకుమ పువ్వు ను ప్రత్యేకంగా వాడేవారు. చేదుగా, స్నిగ్ధంగా ఉండే ఈ పదార్థం తేనెలా కరిగి మధురమైన పదార్థాలకు, ప్రత్యేకమైన కూరలకు అద్భుతమైన ఆకర్షణ ఇస్తుంది. 

ఇది కలిస్తే పిండి వంటలకు లేత ఆరెంజ్ రంగు లాంటి ఛాయ వస్తుంది.అందుకే మధుర పదార్థాలకు,పానీయాలకు , మాంస వంటకాలకు దీన్ని కొంచెం కలుపుతారు. ఆదికాలం నుంచి ముఖ్యమైన వంటకాలలో ..ముఖ్యంగా భారత దేశపు బిర్యానీలో దీన్ని ప్రత్యేకంగా చేరుస్తారు.

హైదరాబాదీ ప్రత్యేక వంటకమైన పక్కీ బిర్యానీలో ఇది ముఖ్యంగా ఉంటుంది. జోధ్ పూరి లస్సీలో ఇది ముఖ్యంగా కలుపబడే ప్రత్యేక పదార్థం.అందుకే దాన్ని లేసన్స్ లస్సీ అంటారు.

భారతీయ ఆయుర్వేదంలో, అరబిక్ యునాని వైద్యంలో దీన్ని వాడతారు.

దివ్యమైన ఔషధం..

ఆయుర్వేదంలో మోకాళ్ళ నొప్పుల నుండి వంధ్యత్వం అంటే సంతానం లేకపోవడం దాకా ఎన్నో వ్యాధులలో మందుల రూపంగా దీన్ని వాడతారు.

కుంకుమ పువ్వు ఆస్తమా,జలుబు, ముఖం పై మొటిమలు,కడుపులో నొప్పి, మద్య పానం వంటి వాటికి బాగా పనిచేస్తుంది. దీంతో తయారైన క్రీములు ముఖం పై మచ్చలను పోగొట్టడమే కాకుండా ముఖాన్ని కాంతి వంతంగా చేస్తాయి. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం తాగితే ఒంట్లో ఉండిపోయిన నీరు పోతుంది.గర్భాశయ,మూత్రాశయ వ్యాధులలో దీన్ని బాగా వాడతారు.గర్భాశయం వాపులలో, పైనున్న చిన్న గడ్డలలో / ఫైబ్రాయిడ్స్ , దీన్ని తేనెతో కలిపి వాడడం మంచిది.దీన్నుంచి తీసిన నూనె గర్భాశయంపై వచ్చే గడ్డలలో చాలా బాగా ఉపకరిస్తుంది.

రాత్రి వేడి పాలలో పటిక బెల్లం,కుంకుమ పువ్వు వేసి తాగితే పురుషులలో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అది తాగితే స్త్రీలలో అనుభూతి కలుగుతుంది.పిల్లల్లో శరీరం కాంతి వంతంగా మారుతుంది.

ఒక సీసాలో మూడు ఔన్సుల 100 ప్రూఫ్ ఆల్కహాలు తీసుకుని అందులో మూడు చిటికెల కుంకుమ పువ్వు వేసి గట్టిగా మూత పెట్టండి. దాన్ని అలాగే మూడు వారాలు ఉంచండి. తర్వాత చల్లటి పొడి ప్రదేశంలో కొంత సేపు ఉంచి దాన్ని పావు కప్పు ఒక్కసారి తీసుకోండి.మనసులో వేదన,ఆందోళన పోయి చక్కటి ఉత్సాహం వస్తుంది. కానీ ఇది అలవాటుగా మార కూడదు.

ఆయువు వృద్ధికి..

క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకు ముందే చరక సుశ్రుతాది సంహితలలో దీని గురించి ప్రస్తావన ఉంది.కండర గుండెకు బలాన్నిచ్చే ఈ కుంకుమ పువ్వు లేపం ' సంకోచ ' అని పిలవబడుతుంది. పాయసంలో, చక్కెర పొంగలిలో దీన్ని కలిపి తీసుకుంటే ఆయువు పెరుగుతుంది.

USDA ప్రకారం దీనిలో ఎనర్జీ 15.5% ,కార్బోహైడ్రేట్స్ 50%, ప్రోటీన్స్ 21% ఉన్నాయి.విటమిన్లు 77% , మినరల్స్ 37% ,ముఖ్యంగా విటమిన్ ఎ,ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి ఎక్కువగా ఉన్నాయి.

కుంకుమ పువ్వు తీసుకునేటప్పుడు దాని నియమ బద్ధతను చూడండి.ఇంట్లో ఉన్నప్పుడు గాలి వెళ్ళని గట్టి పాత్రలో భద్ర పరుచుకోండి. రోజూ రాత్రి గోరు వెచ్చని పాలలో రెండు చిటికెల కుంకుమ పువ్వు, పటిక బెల్లం పొడి కలిపి సేవిస్తుంటే గుండె జబ్బుల వారికి మంచిది. గర్భిణీ కాలంలో రోజూ చిటికెడు కుంకుమ పువ్వు,రెండు గులాబీ రేకులు పాలలో వేసి తాగుతుంటే అందమైన బిడ్డలు పుడతారు. ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.

ఈ  భారత భూమిని కీర్తించిన వారు ఈ అద్భుత కుంకుమ పువ్వును అందించిన కాశ్మీరాన్ని శీతాచల శిఖరోజ్వలం అని కీర్తించారు.


తల తిరుగుడుకు.. ఆయుర్వేదంలో విరుగుడు.

 తల తిరగడం చాలా మంది కి సర్వ సాధారణం. ఎక్కువ పని చేసినా, దిగులు, ఆందోళన , మానసిక అశాంతి ఉన్నా తిన్నది జీర్ణం కాకపోయినా , మందులు పడక పోయినా, నూనె సరుకులు తిన్నా తల తిరుగుతుంది. ఇది కొద్ది సేపు మాత్రమే ఉంటుంది. కొందరికి గది అంతా తిరుగుతున్నట్లు, గోడలు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. దీన్ని ఒళ్ళు తిరగడం అని కూడా అంటారు. ఇది పోవడానికి రోజూ భస్త్రిక ప్రాణాయామం చేయడం మంచిది. దాని వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. గుండెకు, మెదడుకు ఆక్సిజన్ లభిస్తుంది. వివిధ ప్రాణాయామాలు ఉన్నప్పటికీ వాటిని శిక్షకుని సహాయంతో చేయాలి. ఇక తల తిరుగుడు తగ్గడానికి ఆయుర్వేదంలో మంచి చికిత్సలు ఉన్నాయి. 

1. గ్లాసు నీటిలో రెండు లవంగాలు వేసి మరిగించి అది చల్లారిన తర్వాత తాగాలి. 

2. గ్లాసు నీటిలో రెండు ఎండు ఖర్జూరాలు, 5 లవంగాలు , 10 గ్రాముల మంచి నెయ్యి, 40 గ్రాముల పటిక బెల్లం కలిపి మరిగించి చల్లారిన తర్వాత తాగాలి. 

3. 25 గ్రాముల చక్కెర , 10 గ్రాముల శొంఠి పొడి, 20 గ్రాములు మంచి నెయ్యి కలిపి దాన్ని రెండు మోతాదులుగా చేసుకుని రెండు పూటలా తినాలి. ఇలా 15 రోజులు చేస్తే తల తిరగడం ఆగిపోతుంది.

4. మంచి నెయ్యి, గోధుమ పిండి, చక్కెర కలిపి ఉండలుగా చేసుకుని రోజూ తినాలి. తల తిరిగినపుడు నుదుటిపై గంధం లేదా పసుపును నీటిలో అద్ది రాసుకోవాలి. 

5. తల తిరిగినపుడు నిమ్మ రసం తాగాలి. మొలకెత్తిన ధనియాలు, రెండు చెంచాల సోంపు కలిపి నూరి దాన్ని గోరువెచ్చని నీటిలో వేసి తాగాలి. లేదా అర చెంచా తులసి రసానికి కొద్దిగా తేనె కలిపి తినాలి. 

6. నాలుకపై కొద్దిగా ఇంగువ , కొద్దిగా కర్పూరం ఉంచుకుని దాన్ని కొద్దికొద్దిగా పీల్చాలి. 

7. ఎండా కాలంలో కరక్కాయ చూర్ణం లేదా రసాన్ని తాగడం వల్ల తల తిరగదు. లేదా కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది. 

8. కర్బుజ గింజలను నేతిలో వేయించి చప్పరించాలి. లేదా మిరియాల పొడి , రెండు చెంచాల పసుపు, గోధుమ పిండి కలిపి నేతిలో వేయించి , దాన్ని నాలుగు చెంచాలు పాలల్లో కలిపి తాగాలి. అలసట వల్ల తల తిరిగినట్లుగా ఉంటే గ్లాసు పాలల్లో చెంచా నెయ్యి , కొద్దిగా పసుపు వేసుకుని తాగాలి 

9. 400 గ్రాముల పాలు, 5 లవంగాలు , 25 గ్రాముల నెయ్యి, 4 పొట్టు తీసిన బాదం కలిపి నూరి తాగాలి. 

10. నేతిలో అరకిలో గోధుమ పిండి ని వేయించి , దానికి ఏలకుల పొడి కలిపి ఉండలుగా చేసి బెల్లం పాకంలో వేసి రోజూ తినాలి. దీని వల్ల తల తిరుగుడు తగ్గిపోతుంది. 

16, సెప్టెంబర్ 2026, బుధవారం

ఆలివ్ ఆయిల్ తో ఆరోగ్యం..

 ఈనాడు ప్రపంచమంతటా ఆరోగ్య పరిరక్షణకు , దీర్ఘ కాలం ఆనందంగా జీవించడానికి ఏది మంచో , ఏది చెడో అన్న ఆలోచనలతో మానవ మేధస్సు ఎక్కువ ఆలోచిస్తోంది. పూర్వం దూరదృష్టితో చూసే పెద్ద వాళ్ళు మంచి, చెడు చెప్పేవారు. 

ఇప్పుడు శాస్త్రం మనిషి వ్యక్తిగతంగానూ మారి తన శ్రేయస్సుకు ఏది మంచో చూస్తున్నాడు. అలాగే ఆరోగ్యానికి ప్రసిద్ధి చెందింది ఆలివ్ ఆయిల్. 

ప్రపంచమంతటా ఇంత ప్రాచుర్యం పొందడానికి ఆలివ్ తో ఉన్న అనేక ప్రయోజనాంశాలు సమాజపరంగా, వైద్య పరంగా ముఖ్యంగా సహజ ఆహార పదార్థంలో ఉండే జీవ శక్తి వల్ల దీని ప్రాచుర్యం ఎక్కువైంది. 

మెడిటరేనియన్ లో ప్రజలు అనాది నుంచి ఒక ఆహార పదార్థంగానే కాకుండా మంచి మందులా, మంచి అద్భుతంలా సౌభాగ్యానికి, అధికారానికి , కీర్తికి సూచికగా భావిస్తారు, అభిమానిస్తారు. ఈ చెట్టుని అపరిమితమైన శక్తికి , కీర్తికి , శాంతికి చిహ్నంగా భావిస్తారు. 

ఈ చెట్టు విచ్చుకున్న ఆకులతో కూడిన ఆకృతిని స్నేహ పూర్వకంగా జరిగే ఆటలలో విజయ చిహ్నంగా ఉపయోగిస్తారు. రక్తం పారే యుద్ధాలలో శాంతికి ఆలవాలంగా పూర్వులు దీన్ని కీర్తించారు. దీని పండు నుంచి స్రవించే నూనె చరిత్రలో అసామాన్యులుగా కీర్తించబడ్డ చక్రవర్తుల తలలను అభ్యంగనం చేసింది. 

గ్రీకు నాగరికతలో..

ఆలివ్ ఆయిల్ ప్రత్యేకత ఏమిటంటే జీవశక్తిని హరించే వాటిని నిర్మూలించే శక్తి ( యాంటీ ఆక్సిడెంట్స్) విటమిన్ ఎ, ఇ లు ఉన్నాయి. ఇవి మన శరీరంలో కాన్సర్ కలిగించే కారణాలను నివృత్తి చేస్తాయి. 

ఇది మోనో అన్ సాచురేటెడ్ కనుక చెడును కలిగించే , LDL కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అదే సమయంలో మంచిని కలిగించే HDL ను తగ్గించదు. దీని వల్ల రక్త ప్రసారం సమగ్రంగా ఉండి బీపీ ని పెరగనివ్వదు. తద్వారా హృదయ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. 

ఈ మధ్య కాలంలో జరిగిన పరిశోధనల్లో ఆలివ్ ఆయిల్ రొమ్ము క్యాన్సర్, ఎముకల వ్యాధులు రాకుండా నివారించడంలో మంచి ఫలితాలు ఇస్తుందని తేలింది. ఇందులో ఉన్న అధిక ఒలియక్ యాసిడ్ మన రక్త వాహికలను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు సహాయ పడుతుంది. అందువల్లనే పూర్వులు తమ ప్రత్యేక వంటలలో దీన్ని వాడేవారు. 

జీవితమే మారిపోతుంది..

మరో ముఖ్య విశేషం ఈ ఆలివ్ ఆయిల్ ఉష్ణ సహన శక్తి. దీని వల్ల ఒక్క వేపుడు కూరలు తప్ప అన్ని వంటకాలలోనూ దీనిని వాడచ్చు. ఆలివ్ ఆయిల్ తో చేసిన పదార్థాలు చల్లని చోట్ల అంటే రిఫ్రిజిరేటర్ లో ఉంచితే సుమారు సంవత్సరం దాకా పాడవకుండా ఉంటాయి. అందుకే గ్రీకు నాగరికతలో దీన్ని ప్రత్యేకంగా చూసే వారు. మరో విశేషం ఈ ఒలియక్ యాసిడ్ అసాధారణంగా వచ్చే ALD వ్యాధిని ఎదుర్కునే ఒకే ఒక మందు. తలలోని తెల్ల పదార్థం శిధిలమయ్యే అసాధారణ వ్యాధి. 

మీరు ఆలివ్ ఆయిల్ కొనేటప్పుడు శుద్ధమైనది కొనకండి. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కొనండి. ఎందుకంటే అది ఆలివ్ గింజలను నొక్కినప్పుడు వచ్చిన మొదటి నూనె కనుక. దానిలో చాలా తక్కువ ఆమ్లం ఉంటుంది. అలాగే ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. గుండెకు , జీవ శక్తి కి మంచిదైన ఈ ఆలివ్ ఆయిల్ మీ ఆహారంలో కొంచెమైనా చేర్చుకోండి. 

నాలుకకి దీని రుచిని అలవాటు చేస్తే అది మీ గుండెను , మెదడును మొత్తం మీ జీవనాన్ని ఆహ్లాద పరుస్తుంది. మీ మాంసాహారం, చేపలు, రొట్టెలలో ఇది వాడడం మంచిది. ఆలివ్ ఆయిల్ ను ఎప్పుడూ స్టౌ పక్కన, ఎండలో ఉంచకండి. పాడైపోతుంది. వేడి, ఎండ లేని చోట ఉంచండి. ఆలివ్ ఆయిల్ సుమారు 700 రకాల గింజల నుండి సేకరించ బడుతుంది. 

ఇది పచ్చగా ఉండవచ్చు,నీలంగా ఉండవచ్చు. దీని రుచి ఘాటుగా , తీయగా , జిడ్డుగా ఉండవచ్చు. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తొందరగా జీర్ణం అవుతుంది. కొవ్వుని కరిగిస్తుంది. విటమిన్లు ఏ, డి, కె వంటి వాటిని తొందరగా వంట పట్టిస్తుంది.  ఇది కొన్ని కూల్ డ్రింకుల లో రంగు , రూపు నిలవడానికి ఉపయోగపడుతుంది. 

మంచి రుచి కలిగిన ఆలివ్ ఆయిల్ అత్యుత్తమమైనది. ఇది సహజమైన ప్రకృతిలోని పళ్ళ నుండి నేరుగా తీసిన నూనె కనుక దాన్ని అలాగే వాడినా చెడు చేయదు. ఇంత వరకు జరిగిన పరిశోధనలో ఈ ఆలివ్ ఆయిల్ గుండె జబ్బులను నివారించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తుందని తేలింది.ఎందుకంటే ఇంకా  ఏ ఇతర సహజమైన నూనెలలో దీనిలో ఉన్నంత మోనో అన్ సాచురేటెడ్ శక్తి లేదు కనుక.

మన ఆమాశయంలో ( stomach) ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది .అందులో ఉండే పుండ్లు( అల్సర్స్), చీము ( gastritis) ను తగ్గిస్తుంది. బైల్ ఉత్పత్తిని పెంచుతుంది, గాల్ స్టోన్స్ ను తగ్గిస్తుంది.

ఆలివ్ ఆయిల్ కు మన అన్నవాహిక లో వచ్చే క్యాన్సర్ ను నివారించే శక్తి ఉన్నదని దీన్ని ఆహారంలో చేరిస్తే మంచి ఫలితాలు ఇచ్చిందని స్పానిష్ శాస్త్రజ్ఞుల పరిశోధనలలో నిరూపించబడింది.

ఆలివ్ ఆయిల్ ఎక్స్ట్రా వర్జిన్,వర్జిన్, ప్యూర్, ఎక్స్ట్రా లైట్ అని నాలుగు రకాలుగా దొరుకుతుంది.అందులో మొదటిది మంచిది.మనం రోజూ వాడే నూనెల్లో వేరు శనగ నూనె హితం కాదు. నువ్వుల నూనె ఒళ్ళు తగ్గడానికి, కీళ్ల నొప్పులు రాకుండా ఉండడానికి హితకరం. నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ తలంటుకోవడం కంటే అభ్యంగన స్నానానికి,ప్రత్యేక వంటకాలకు హితకరం. అందుకే మన పెద్దలు ఇలా అంటారు " హితమైనది మితమైనా అప్పుడప్పుడు తీసుకోవాలి " అని .


వాపులు, గడ్డలు, మర్మాంగ బలహీనత, రేచీకటి.. ఆయుర్వేద పరిష్కారాలు

 శరీరమంతా వాపులు , గడ్డలు.. ఆయుర్వేద పరిష్కారాలు.. 

రోజూ రెండు పూటలా 7 సార్లు వడపోసిన దేశవాళీ గోమూత్రం పావుకప్పు నుంచి అరకప్పు మోతాదుగా అరకప్పు మంచి నీళ్లు, ఒక చెంచా పటిక బెల్లం పొడి కలిపి సేవిస్తుంటే అతి త్వరగా రక్త శుద్ధి జరిగి కొత్త గడ్డలు పుట్టకుండా ఉంటాయి. 

తుమ్మ చెట్టు వేరుపై ఉండే బెరడు పొడి వస్త్ర ఘాలితము పట్టింది 50 గ్రాములు , మూసాంబరం పొడి 20 గ్రాములు , ముల్లంగి గింజల పొడి 20 గ్రాములు, ఆవాల పొడి 20 గ్రాములు, గుగ్గిలం పొడి 20 గ్రాములు సేకరించి అన్నింటిని వస్త్ర ఘాలితము పట్టి తయారుగా ఉంచుకోండి. ఈ చూర్ణంలో తగినంత మేలు రకమైన కొబ్బరి నూనె గానీ, నెయ్యి గానీ పోసి మెత్తని గుజ్జు లాగా నూరి నిలువ చేసుకోవాలి. ఈ మలాం ను పైన లేపనం చేస్తుంటే అన్ని రకాల వాపులు, గడ్డలు, పుండ్లు హరించిపోతాయి. 

పురుష మర్మాంగ బలహీనత సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు 

పుష్కర మూలం, బల వేళ్ళు, అతి బల వేళ్ళు, వస కొమ్ములు, పెన్నేరు గడ్డలు , గజ పిప్పళ్లు, ఎర్ర గన్నేరు వేళ్ళ పై బెరడు .. వీటిని సమ భాగాలుగా తీసుకుని, విడి విడిగా దంచి జల్లించి వస్త్ర ఘాలితము పట్టి అన్నింటినీ కలిపి గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు తగినంత చూర్ణం తీసుకుని అందులో వెన్న కలిపి గుజ్జులా నూరి ఆ మిశ్రమాన్ని మర్మాంగము ముందు భాగం విడిచి పెట్టీ వెనుక భాగానికి పైన రాసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం పూట కడుగుతూ ఉండాలి. ఇలా చేస్తుంటే బలహీన పడిన మర్మాంగము క్రమంగా దృఢంగా పూర్తి శక్తివంతంగా మారుతుంది. 

రేచీకటి సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..

సోంపు గింజల పొడి 100 గ్రాములు తీసుకుని దంచి జల్లించి వస్త్ర ఘాలితము పట్టి సిద్ధం చేసుకోవాలి. తగినన్ని తమలపాకులు ఆరబెట్టి పొడి చేసి పైన చెప్పిన పొడికి సమానంగా కలిపి ఉంచాలి. అదే మోతాదుగా ప్రశస్తమైన పట్టు తేనె సంపాదించుకుని మూడు పదార్థాలు కలిపి గరుకు లేకుండా మెత్తగా నూరి కాటుక డబ్బాలో నిలువ చేయాలి. రోజూ రాత్రి పడుకునే ముందు పెసర బద్దంత ఈ కాటుకను కళ్ళల్లో పెట్టుకొంటూ ఉంటే  ఆశ్చర్య కరమైన మార్పు ఒకటి రెండు వారాల్లోనే కనిపిస్తుంది. రేచీకటి సమస్య అంతమై దృష్టి శక్తి పెరుగుతుంది. 

దంతాలు , పేలు, చుండ్రు, సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు

పేలు, చుండ్రు సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు 

 గానుగలో తీసిన స్వచ్ఛమైన కొబ్బరి నూనె అర లీటర్ తీసుకుని ఒక పాత్రలో పోసి చిన్న మంట పెట్టండి. తర్వాత బాగా పండిన 5 నిమ్మ కాయలను గింజలు తీసి రసం తీసి నూనెలో పోయండి . క్రమంగా నిమ్మరసం పోయి నూనె మాత్రమే మిగిలే వరకు వేచి ఉండాలి. పాత్రను దించి నూనె వడ పోసి గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. 

ఈ తైలాన్ని రోజూ గోరు వెచ్చగా తలకు పట్టిస్తుంటే చుండ్రు, పేలు పోయి వెంట్రుకలు దృఢంగా మరి తలకట్టు అందంగా మారుతుంది. 


దంతాలు కదిలే సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..

నల్ల తుమ్మ చెట్టు బెరడు 20 గ్రాములు, దోరగా వేయించిన శొంఠి పొడి 3 గ్రాములు తీసుకోవాలి. తుమ్మ చెట్టు బెరడు కడిగి  చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టి పొడి చేసుకోవాలి. శొంఠిని కూడా దోరగా వేయించి దంచి పొడి చేసి.. రెంటినీ కలపాలి.ఆ పొడికి తగినంత ఎవరికి ఎంత అవసరమో అంత సైంధవ లవణం పొడిని కలిపి నిలువ చేసుకోవాలి.

ఈ మిశ్రమ చూర్ణాన్ని ప్రతి రోజూ రెండు పూటలా పళ్ళు తోముకోవడానికి వాడుతుంటే కదులుతున్న దంతాలు గట్టి పడి దృఢంగా మారుతాయి. ఎంతో సులువుగా తయారు చేసుకునే ఈ చూర్ణాన్ని అందరూ వాడుకోవచ్చు.


కిడ్నీలో రాళ్లు, సంతాన సమస్య.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 మూత్రపిండాలలో రాళ్ల సమస్య ఆయుర్వేద పరిష్కారాలు.. 

ఉలవలు..8 గ్రా, సైంధవ లవణం 3 గ్రాములు, వెంపలి వేళ్ళు 2 గ్రాములు తీసుకుని వీటన్నింటినీ కచ్చా పచ్చగా దంచి ముప్పావు లీటర్ మంచినీటిలో కలిపి పొయ్యి మీద పెట్టాలి . చిన్న మంట పైన సగం కషాయం మిగిలే టట్లు మరిగించి దించి వడపోయాలి. ఈ కషాయాన్ని 3 భాగాలుగా చేసి, మూడు పూటలా కొంచెం కొంచెం తాగుతుంటే నాలుగైదు రోజుల లోనే మూత్ర పిండాలలోని , మూత్ర నాళంలోని రాళ్ళు కరిగి పడిపోతాయి. 

సంతాన ప్రాప్తి సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..

రావి చెట్టు పండ్లు సేకరించి కడిగి ముక్కలు చేసి నీడలో బాగా ఆరబెట్టి నిలువ చేసుకోవాలి. ఆ ముక్కలను దంచి మెత్తగా చూర్ణం చేసి పలుచని బట్ట లో వస్త్ర ఘాలితము పట్టి , దానికి సమానంగా పటిక బెల్లం పొడి కలిపి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. రోజూ రెండు పూటలా భార్యాభర్తలు ఇద్దరూ ఒక చెంచా మోతాదుగా చప్పరించి తిని, ఒక గ్లాసు గోరు వెచ్చని పాలలో పటిక బెల్లం పొడి కలిపి 40 రోజుల పాటు సేవిస్తూ పూర్తి బ్రహ్మ చర్యం పాటించాలి. తర్వాత దాంపత్య వేదంలో సూచించినట్లుగా సంసారం చేస్తుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది. 

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...