14, సెప్టెంబర్ 2026, సోమవారం

ఎముకలు, స్తనాల సమస్యలు.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 ఎముక విరిగి ,వాపు వచ్చి, ఒళ్ళు పెరిగిన సమస్యలకు.. 

1.) మేలైన తుమ్మ బంక తెచ్చి చిన్న ముక్కలు కొట్టి కొన్ని చుక్కల నెయ్యితో చిన్న మంట పైన వేయించి దంచి జల్లించి దానితో సమానంగా పటిక బెల్లం పొడి కలిపి నిలువ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని రెండు పూటలా ఒక చెంచా మోతాదుగా చప్పరించి తిని ఒక కప్పు గోరు వెచ్చని ఆవు పాలు తాగించాలి. దీనివల్ల విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. 2.) కరక్కాయ పొడి, ఉసిరి కాయ పొడి, తాని కాయ పొడి , శొంఠి పొడి, మిరియాల పొడి, పిప్పళ్లు పొడి, సైంధవ లవణం సమ భాగాలుగా కలిపి నిలువ చేసుకోవాలి. 

రెండు పూటలా ఆహారానికి అర గంట ముందు అర చెంచా పొడి ఒక చెంచా తేనె కలిపి తినిపించాలి. దీని వల్ల పెరిగిన కొవ్వు తగ్గడమే కాక దెబ్బ తిన్న కాలిలో చేరిన చెడు నీరు కూడా తగ్గి పోయి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. 

వక్షోజాలు కిందికి జారిన సమస్య..ఆయుర్వేద పరిష్కారాలు..

డిసెంబర్, జనవరి మాసాలలో పొలాలలో విరివిగా దొరికే  బోడ తరం మొక్కల పూలు , వేళ్ళు ఒక్కొక్కటి సమభాగాలుగా 200 గ్రాముల చొప్పున తీసుకుని అందులో పిప్పళ్లు 100 గ్రాములు కలిపి మెత్తగా నలగ గొట్టి పాత్రలో వేసి అందులో రెండు లీటర్లు నీళ్లు పోసి అర లీటర్ కషాయం మిగిలే వరకు మరిగించి వడ పోసుకోవాలి. ఆ కషాయంలో పావు లీటరు నువ్వుల నూనె పోసి, నూనె మాత్రమే మిగిలే వరకు చిన్న మంట పైన మరిగించి వడపోసి నిలువచేసుకోవాలి. 

ఈ తైలాన్ని పలుచగా దూదితో తడిపి ఆ దూదిని స్థనాల పైన వేసి పొడి దూదిని పైన పెట్టి ఊడిపోకుండా గుడ్డ కట్టి ఉదయం పూట తీసివేయాలి. దాంతో పాటు అదే తైలాన్ని రెండు మూడు చుక్కల మోతాదుగా ముక్కలలో వేసుకుని లోపలికి పీల్చాలి. ఇలా చేస్తుంటే స్తనాలు గట్టి పడి తగిన ప్రమాణంగా పెరుగుతాయి. 

చెవిలో హోరు, మూత్ర సమస్య.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 మూత్రం తక్కువగా నడుస్తూ ,శరీరం నీటితో ఉబ్బిన సమస్య , .. ఆయుర్వేద పరిష్కారాలు 

పుల్ల దానిమ్మ పండు రసం, చిన్న ఏలకులలోని గింజల పొడి , దోరగా వేయించి దంచిన జిలకర పొడి, సైంధవ లవణం పొడి .. వీటి ఒక్కొక్కరిని 3 గ్రా మోతాదుగా ఒక కప్పు మజ్జిగలో కలిపి రోజూ ఉదయం పరగడుపున తాగిస్తుండాలి. దీని వల్ల మూత్రం బాగా జారీ అవుతుంది. 

2. ) మోదుగ చెట్టు పూలను ఎక్కువగా తెచ్చుకొని నిలువ చేసుకోవాలి. రోజూ ఒక సారి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు తగినన్ని పూలను మంచి నీటితో మెత్తగా గుజ్జులా నూరి బొడ్డు చుట్టూ పట్టించండి. ఈ పట్టు వేసిన 5,10 నిమిషాలలో మూత్రం ధారాళంగా బయటకు వస్తుంది. 

3.) దోస గింజల పొడి 50 గ్రాములు, అతి మధురం పొడి 50 గ్రాములు, మాను పసుపు పొడి 50 గ్రాములు కలిపి నిలువ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని రెండు పూటలా 3 గ్రాముల మోతాదుగా అర కప్పు బియ్యం కడిగిన నీటితో కలిపి తాగుతుంటే మూత్రం సాఫీగా జారీ అవుతుంది. 

చెవిలో హోరు సమస్యకు.. అన్ని చెవి రోగాలను అణచి వేసే అద్భుత కర్ణ తైలం..

ఆయుర్వేద అంగళ్లలో లభించే పిప్పలి కట్టె,సైంధవ లవణం,శొంఠి, తుంగ ముస్తలు, పుష్కర మూలం, వస కొమ్ములు, వెల్లుల్లి పాయలు ..ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకుని మెత్తగా దంచి జల్లించి ఆ చూర్ణాన్ని 300 గ్రాముల నువ్వుల నూనెలో వేయాలి. అలాగే ఆ నూనెలో జిల్లేడాకుల నుంచి దంచి తీసిన రసం కూడా 300 గ్రాములు కలిపి చిన్న మంట పైన మరిగించాలి.క్రమంగా నీరంతా ఇంకిపోయి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి వడపోసి సీసాలో నిలువ చేసుకోవాలి.

ఈ తైలాన్ని రెండు పూటలా గోరు వెచ్చగా నాలుగైదు చుక్కలు చెవులలో వేస్తుంటే , చెవి హోరు మాత్రమే కాక మిగిలిన అన్ని రకాల చెవి సమస్యలు,చెవుడు కూడా క్రమంగా తగ్గిపోతాయి.


13, సెప్టెంబర్ 2026, ఆదివారం

పసుపు తో.. ఆయుర్వేదం..

1 . పింపుల్స్ తగ్గుటకు..




మొటిమలు తగ్గుటకు


పసుపు పొడి - 1 చిటికెడు
పుదీనా రసం - తగినంత

పై రెండింటిని కలిపి ,రాత్రి పడుకునే ముందు మొటిమలపైన రాయాలి.


ఉపయోగాలు - మొటిమలు తగ్గిపోతాయి.


2 . ఫైలేరియా తగ్గుటకు..




పసుపు పొడి - 1 భాగం
బెల్లం - 1 భాగం 

పై వాటిని కలిపి మెత్తగా నూరి ,రోజుకు రెండు సార్లు కుంకుడు కాయ పరిమాణంలో గోమూత్రంతో వేసుకోవాలి.


ఉపయోగాలు - బోదకాలు తగ్గిపోతుంది.


3 . పైల్స్ వ్యాధి తగ్గుటకు..




పసుపు పొడి - 1 భాగం
కలబంద గుజ్జు - 1 భాగం

పై రెండింటిని కలిపి ,మెత్తగా నూరి ,మొలలు పైన లేపనం చేయాలి.

ఉపయోగాలు - మొలల బాధ, రక్త స్రావం తగ్గుతాయి. 

గర్భాశయంలో గడ్డలు, బహిష్టు సరిగా రాని సమస్యలు..

 1.) అధిక బరువు, అండాశయాల్లో నీటి బుడగలు, బహిష్టు సరిగా రాని సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు.. 

థైరాయిడ్ సమస్యతో మిగతా సమస్యలు ఏర్పడతాయి. ముందు థైరాయిడ్ అనుభవ యోగాలు ఆచరించాలి. సహజంగా మిగతా సమస్యలు తగ్గిపోతాయి.

తిప్పతీగ పొడి 100 గ్రాములు, కిస్ మిస్ పండ్లు 100 గ్రాములు కలిపి మెత్తగా దంచి నిలువ చేసుకోవాలి. రెండు పూటలా 10 గ్రాముల మోతాదుగా తింటుంటే బహిష్టు వస్తుంది. రాగానే తినటం ఆపాలి. మరలా బహిష్టుకు పది రోజుల ముందు ఆరంభించాలి. ఇలా మూడు మాసాలు బహిష్టు సమయంలో ఆచరిస్తే ఆ తర్వాత బహిష్టు సక్రమంగా వస్తుంది. 

2.) గర్భాశయంలో గడ్డల సమస్య..ఆయుర్వేద పరిష్కారాలు..

శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, నల్ల నువ్వులు , గంటు బారంగి, బెల్లం .. ఈ పదార్థాలను ఆయుర్వేద దుకాణాల్లో ఒక్కొక్కటి 50 గ్రాములు చొప్పున తెచ్చుకొని, బెల్లం తప్ప మిగిలిన వాటిని దోరగా వేయించి దంచి జల్లించి వస్త్ర ఘాలితము పట్టి ఆ మెత్తని పొడి లో బెల్లం కలిపి దంచి నిలువ చేసుకోవాలి. ఈ అద్భుతమైన ఆహార ఔషధాన్ని పూటకు 10 గ్రాముల మోతాదుగా ఆహారానికి గంట ముందు రెండు పూటలా తింటుండాలి. దీని వల్ల గర్భాశయంలో గడ్డలు క్రమంగా కరిగిపోతాయి. బహిష్టు సక్రమంగా వచ్చి ఆరోగ్యం కుదుట పడుతుంది. 

అధిక దాహం, ఆకలి,తిమ్మిర్లు.. షుగర్ లేకుండా.. ఆయుర్వేద పరిష్కారాలు

 అధిక దాహం, అధిక ఆకలి, కాళ్లు చేతుల తిమ్మిర్లు .. మధుమేహం లేకుండా ఉన్న సమస్యకు.. ఆయుర్వేద పరిష్కారాలు.. 

అధిక వేడి కలిగించే పదార్థాలు బాగా తగ్గించి మాంసాహారాన్ని పూర్తిగా మాని వేయాలి. ఉత్తరేణి గింజలు సంపాదించి ఎండబెట్టి దంచి జల్లించి పొడి చేసుకోవాలి. ఆ పొడితో సమానంగా పటిక బెల్లం పొడి కలిపి నిలువ చేసుకోవాలి. రోజూ ఉదయం, సాయంత్రం అర చెంచా మోతాదుగా ఒక కప్పు వేడి పాలలో కలిపి సేవిస్తుండాలి. దీని వల్ల అధిక ఆకలి, అధిక కొవ్వు తగ్గిపోతాయి. ఎండు ఉసిరి ముక్కలు బుగ్గన పెట్టుకుని చప్పరిస్తుండాలి. అధిక దాహం తగ్గిపోతుంది. రోజూ గోరు వెచ్చని నువ్వుల నూనెతో ఒళ్ళంతా రుద్దుకుని గంటాగి వేడి నీటితో స్నానం చేస్తుండాలి. తిమ్మిర్లు తగ్గుతాయి. 

2.) మర్మాంగము చిన్నగా ఉన్న సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు 

శృంగారవంతమైన ఆలోచనలు , అనుకూల వతి అయిన స్త్రీ , అనువైన వాతావరణం , శరీరంలో తగినంత వీర్య పటుత్వం ..ఇవన్నీ ఉన్నప్పుడే ఏ పురుషుడికైనా  మర్మాంగము ఆ సమయానికి తగినట్లు పెద్దదవుతుంది. అలాంటి పరిస్థితి లేకుండా మనసంతా చదువు మీద ఉన్నప్పుడు ఎవరికైనా అంగం చిన్నదిగానే ఉంటుంది. ఈ నిజం అర్థం చేసుకుని మనసు చదువు మీద దృష్టి పెట్టి మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలి. 

శరీరంలో మంటలు, ముఖం మీద మచ్చలు.. ఆయుర్వేద పరిష్కారాలు

 గొంతులో, కడుపులో, ఛాతీలో మంటలు, నరాల్లో వాపు, ఊపిరితిత్తుల్లో కఫం పెరగడం సమస్యలకు ఆయుర్వేద పరిష్కారాలు.. 

1 . ) రోజూ ఉదయం పూట లేదా సాయంత్రం పూట గోరు వెచ్చని నువ్వుల నూనె తో శరీరమంతా మర్దనా చేసుకోవాలి.చెవుల్లో, ముక్కులో రెండు రెండు చుక్కలు వేసుకోవాలి. ఒక గంట ఆగి తర్వాత స్నానం చేయాలి. దీని వల్ల నరాల వాపులు తగ్గి రక్త ప్రసరణ పెరిగి శక్తి ఉత్పన్నమవుతుంది. 

2 .) దేశవాళీ గోమూత్రం ఉదయం సేకరించి ఏడు సార్లు వడపోసి 50 గ్రాములు మోతాదుగా పరగడుపున రోజూ సేవిస్తుండాలి. దీని వల్ల అధిక కఫం, మంటలు తగ్గి రక్త వృద్ధి, రక్త శుద్ధి కలుగుతుంది. 

3. ) గోధుమ పిండి 150 గ్రాములు తీసుకుని అందులో 30 గ్రాములు వంటాముదం కలిపి రొట్టె కాల్చుకుని అందులో కొంచెం నెయ్యి , పంచదార అద్దుకొని తింటూ ఉండాలి. 

ఇలా నాలుగైదు రోజులు తింటూ వుంటే అన్ని రకాల ఉదర సంబంధిత రోగాలు తగ్గిపోతాయి.


ముఖం పై దురదతో కూడిన నల్లని మచ్చలు.. ఆయుర్వేద పరిష్కారాలు. 

1 .) మంజిష్ట,కరక్కాయ పెచ్చులు , ఉసిరి కాయ పెచ్చులు ,తానికాయ పెచ్చులు , పాత చింతపండు , వస కొమ్ములు, దేవదారు చెక్క, పసుపు, తిప్ప తీగ వీటన్నింటినీ సమ భాగాలుగా తీసుకుని కలిపి మెత్తగా దంచి నిలువ చేసుకోవాలి. రోజూ పావు లీటరు మంచి నీటిలో ఈ పదార్థాన్ని 20 గ్రాములు వేసి సగం కషాయం మిగిలే వరకు మరగబెట్టి వడపోసి రోజూ పరగడుపున తాగుతుంటే శరీరంలో చెడు రక్తమంతా శుద్ధి చెంది దురదలు, కురుపులు, మచ్చలు, గడ్డలు, పుండ్లు మొదలైన అన్ని రకాల చర్మ వికారాలు తగ్గిపోతాయి. 

2 . ) జటా మాంసి తెచ్చుకొని పొడి చేసి ఉంచుకొని తగినంత పొడిని నిద్రించే ముందు మంచి నీటితో గుజ్జులా నూరి మచ్చల పైన లేపనం చేసి , ఉదయం గోరు వెచ్చని నీటితో కడిగితే సమస్య పరిష్కారమవుతుంది. 

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...