శరీరమంతా వాపులు , గడ్డలు.. ఆయుర్వేద పరిష్కారాలు..
రోజూ రెండు పూటలా 7 సార్లు వడపోసిన దేశవాళీ గోమూత్రం పావుకప్పు నుంచి అరకప్పు మోతాదుగా అరకప్పు మంచి నీళ్లు, ఒక చెంచా పటిక బెల్లం పొడి కలిపి సేవిస్తుంటే అతి త్వరగా రక్త శుద్ధి జరిగి కొత్త గడ్డలు పుట్టకుండా ఉంటాయి.
తుమ్మ చెట్టు వేరుపై ఉండే బెరడు పొడి వస్త్ర ఘాలితము పట్టింది 50 గ్రాములు , మూసాంబరం పొడి 20 గ్రాములు , ముల్లంగి గింజల పొడి 20 గ్రాములు, ఆవాల పొడి 20 గ్రాములు, గుగ్గిలం పొడి 20 గ్రాములు సేకరించి అన్నింటిని వస్త్ర ఘాలితము పట్టి తయారుగా ఉంచుకోండి. ఈ చూర్ణంలో తగినంత మేలు రకమైన కొబ్బరి నూనె గానీ, నెయ్యి గానీ పోసి మెత్తని గుజ్జు లాగా నూరి నిలువ చేసుకోవాలి. ఈ మలాం ను పైన లేపనం చేస్తుంటే అన్ని రకాల వాపులు, గడ్డలు, పుండ్లు హరించిపోతాయి.
పురుష మర్మాంగ బలహీనత సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు
పుష్కర మూలం, బల వేళ్ళు, అతి బల వేళ్ళు, వస కొమ్ములు, పెన్నేరు గడ్డలు , గజ పిప్పళ్లు, ఎర్ర గన్నేరు వేళ్ళ పై బెరడు .. వీటిని సమ భాగాలుగా తీసుకుని, విడి విడిగా దంచి జల్లించి వస్త్ర ఘాలితము పట్టి అన్నింటినీ కలిపి గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు తగినంత చూర్ణం తీసుకుని అందులో వెన్న కలిపి గుజ్జులా నూరి ఆ మిశ్రమాన్ని మర్మాంగము ముందు భాగం విడిచి పెట్టీ వెనుక భాగానికి పైన రాసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం పూట కడుగుతూ ఉండాలి. ఇలా చేస్తుంటే బలహీన పడిన మర్మాంగము క్రమంగా దృఢంగా పూర్తి శక్తివంతంగా మారుతుంది.
రేచీకటి సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..
సోంపు గింజల పొడి 100 గ్రాములు తీసుకుని దంచి జల్లించి వస్త్ర ఘాలితము పట్టి సిద్ధం చేసుకోవాలి. తగినన్ని తమలపాకులు ఆరబెట్టి పొడి చేసి పైన చెప్పిన పొడికి సమానంగా కలిపి ఉంచాలి. అదే మోతాదుగా ప్రశస్తమైన పట్టు తేనె సంపాదించుకుని మూడు పదార్థాలు కలిపి గరుకు లేకుండా మెత్తగా నూరి కాటుక డబ్బాలో నిలువ చేయాలి. రోజూ రాత్రి పడుకునే ముందు పెసర బద్దంత ఈ కాటుకను కళ్ళల్లో పెట్టుకొంటూ ఉంటే ఆశ్చర్య కరమైన మార్పు ఒకటి రెండు వారాల్లోనే కనిపిస్తుంది. రేచీకటి సమస్య అంతమై దృష్టి శక్తి పెరుగుతుంది.