7, సెప్టెంబర్ 2026, సోమవారం

డెంగీ తదితర వ్యాధుల విషయంలో..

 డెంగీ తదితర వ్యాధుల విషయంలో అనవసరంగా యాంటీ బయోటిక్స్, నొప్పి నివారణ మందులు ఇవ్వకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డెంగీ అని నిర్ధారణ కాకుంటే జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నా ' పారాసిటామల్ ' మందు తీసుకుంటే సరిపోతుంది. 

డెంగీ, డెంగీ ని పోలిన విష జ్వరాల చికిత్సలకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలు. 

డెంగీ లక్షణాలు..

తలనొప్పి ,కంటి వెనుక భాగంలో నొప్పి, కండరాల నొప్పులు ,శరీరంపై దద్దుర్లు,  ముక్కు,చిగుర్లు, నోటి నుండి రక్తం కారడం ,వాంతులు కావడం, మలం నల్లగా ఉండడం, నిద్రలేమి ,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, నాలుక తడి ఆరిపోవడం, చర్మం పొడిబారిపోవడం వంటి లక్షణాలతో జ్వరతీవ్రత ఉంటే వైద్యుడిని సంప్రదించి వారి సూచనల మేరకు వైద్య పరీక్షలు చేయించాలి. రక్త కణాల సంఖ్య 80000 కంటే తగ్గితే వైద్యుల పర్యవేక్షణలో తప్పకుండా చికిత్స చేయించాలి. రోగికి రక్తపోటును వైద్య సిబ్బంది నిరంతరం గమనిస్తూ ఉండాలి. రక్త కణాల సంఖ్య 40 వేల కంటే తగ్గితే ప్రతి గంటకు ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తూ, రక్త కణాల సంఖ్య ఇంకా తగ్గుతూ ఉంటే డెంగీ నిర్ధారణ కోసం" ఎలిసా " పరీక్ష చేయించాలి .ఈ పరీక్ష లో పాజిటివ్గా నిర్ధారణ అయితే డెంగ్యూ చికిత్స ప్రారంభించాలి. 

చికిత్స విధానాలు..

డెంగీ నిర్ధారణ అయిన రోగుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ప్రతి గంటకు సమీక్షిస్తూ ..సెలైన్ ( ఐసోటోనిక్ క్రిష్టలాయిడ్ సొల్యూషన్ )ఇవ్వాలి. 

రోగికి రక్తస్రావం అవుతూ ఉంటే ఈ క్రిస్టలాయిడ్ సొల్యూషన్ స్థానంలో డెక్స్ట్రాన్ / ప్లాస్మా ఎక్కించాలి. 

రక్తస్రావం ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటే సెలైన్ ఎక్కువగా ఇవ్వడంతో పాటు రక్తం కూడా ఎక్కించాలి. అవసరమైతే కృత్రిమ శ్వాస కూడా అందించాలి

రోగి కోలుకుంటున్నట్లు కనిపిస్తే సెలైన్ మోతాదు క్రమంగా తగ్గించుకుంటూ రావాలి .

డెంగీ నిర్ధారణ కాకున్నా రక్తస్రావం అవుతుంటే రక్తం ఎక్కించాలి.

చేయకూడనివి..

రోగికి కండరాలు ,ఒళ్ళు నొప్పుల నివారణకు ఆస్ప్రిన్, బ్రూఫిన్ లాంటివి ఇవ్వ కూడదు. 

డెంగ్యూ తరహా లక్షణాలు నిర్ధారణ కాకుంటే నరాల ద్వారా సెలైన్ వంటివి కూడా ఇవ్వకూడదు.

యాంటీబయాటిక్ మందులు అసలు వాడకూడదు. 

రోగికి భరించలేని స్థాయిలో నొప్పులు ఉన్నా ఉపశమనం కోసం స్టిరాయిడ్స్ ఇవ్వకూడదు.

రోగికి సెలైన్ ఒకే వేగం /మోతాదుతో ఎక్కించాలి. మోతాదును పెంచడం ,తగ్గించడం వీలైనంత వరకు చేయకూడదు .

ఉపశమనం లక్షణాలు..

 రోగినాడీ తీరు ,శ్వాస తీరు, రక్తపోటు నిలకడగా ఉండడం, శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి రావడం, రక్తస్రావం, వాంతులు లేకపోవడం ,మూత్రం బాగా  వస్తూ ఉండాలి.

ఈ లక్షణాలు ఉంటే మూడు రోజులు ఆస్పత్రిలో ఉంచుకొని, డిశ్చార్జ్ చేసేముందు ఒకసారి రక్త కణాల సంఖ్య పరీక్షించాలి .ఇందులో 50 వేల కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలితే ఇక ఎలాంటి అపాయము ఉండదు .

డెంగీ నిర్ధారణ కాకపోతే చికిత్స..

జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటూ, కండరాల నొప్పులు ఎక్కువగా ఉన్నా .. డెంగీ కాదు. ఇలాంటి జ్వరాలకు పేరాసిటమాల్ మాత్రలు రోజుకు గరిష్టంగా నాలుగు సార్లు తీసుకుంటే సరిపోతుంది.

జ్వరం రెండు రోజులకు తగ్గకపోతే నిపుణుల సూచనల మేరకు పారాసెటమాల్ మందును కొనసాగించాలి.

జ్వరం ఉన్నా తేలికగా  జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవచ్చు .

దీనికి అదనంగా సూపు ,పాలు ,పండ్ల రసాలు ,కొబ్బరి నీళ్లు, నీరు ఎక్కువగా తీసుకోవాలి .

రోగి ఎలాంటి శారీరక శ్రమకు గురికాకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవాలి .

పారాసెటమాల్ మందు మోతాదు ఇలా 

ఏడాదిలోపు వయసు వారికి 60 మిల్లీ గ్రాములు, ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల వయసు గల వరికి 60 నుంచి 120 మిల్లీగ్రాముల వరకు, ఐదు సంవత్సరాల కు పైబడి వయసు ఉంటే రెండు వందల నలభై మిల్లీ గ్రాములు ఇవ్వాలి.


6, సెప్టెంబర్ 2026, ఆదివారం

ఎక్కిళ్ళు.. ఆయుర్వేద పరిష్కారాలు

 అమ్మ.. ఎక్కిళ్ళు ఆగడం లేదు, ప్రతి ఐదు నిమిషాలకు వస్తున్నాయి. నీళ్లు తాగుతున్నాను, గొంతుకి అమృతాంజనం రాసుకున్నాను, అయినా.. అబ్బా మళ్ళీ ఎక్కిళ్ళు.. అది కాదు, అదేంటి నీ తలపై అంత పెద్ద గడ్డ పుట్టుకొచ్చింది. . హఠాత్తుగా ఆశ్చర్యంతో అడిగింది. . ఆ అమ్మాయిని వాళ్ళమ్మ. గడ్డా.. ఎక్కడా.. ఆశ్చర్యంతో తలని చూసుకుంది ఆ అమ్మాయి. గడ్డలేదు కానీ ఎక్కిళ్ళు ఆగి పోయాయి. హఠాత్తుగా వచ్చే ఎక్కిళ్ళను , హఠాత్తుగా వినే సంగతులు ఆపు చేస్తాయి. 

ఎక్కిళ్ళు హఠాత్తుగా వస్తాయి .గుండెకు పొట్టకు మధ్య ఉండే పలుచని పొర ను డయాఫ్రమ్ అంటారు. అది అనుకోకుండా ముడుచుకుంటుంటే వచ్చే" హిక్ " అనే శబ్దం నోటి నుంచి బయటకు రావడాన్ని" ఎక్కిళ్ళు"  అంటారు.

ఈ డయాఫ్రమ్ చాలా సార్లు ముకులించుకోవడం వల్ల మన గొంతులో ఇరువైపులా ఉన్న శబ్ద గ్రంధులు మధ్య ఉండే దారి మూసుకొని గాలిని అడ్డగించడం వల్ల హిక్ లేదా ఎక్ అనే శబ్దం వస్తుంది. దాని దగ్గర ఉన్న నరాలు ఉద్రేక పడడం వల్ల గొంతు నుండి ఛాతీ దాకా చలించి ఈ ఎక్కిళ్ళు ఎక్కువవుతాయి. 

ఎక్కిళ్ళు చాలా కారణాల వల్ల వచ్చినా తాత్కాలికంగానే ఉంటాయి. కానీ కొన్ని వ్యాధుల వల్ల వచ్చే ఎక్కిళ్ళు ప్రమాదాన్ని సూచిస్తాయి. ముఖ్యంగా న్యుమోనియా , మూత్ర పిండాలు పాడై పోయిన వ్యాధులు , గుండె జబ్బులు వంటి వాటిలో ఇవి రాకూడదు. 

ఎందుకు ,ఎప్పుడు వస్తాయి అంటే..

రక్తంలో చెడు పదార్థం ఏదైనా తయారు అవుతున్నప్పుడు ఈ ఎక్కిళ్ళు వస్తాయి. ఈ హిక్ లేదా ఎక్ అనే శబ్దం ఆగకుండా అస్తమానం వస్తుండటానికి కారణం లారింక్స్ అనే గొంతు భాగాన్ని ఆనుకుని ఉన్న పలుచని పొర తెరుచుకుని మూసుకోవడం వల్ల జనిస్తుంది. మన ఉచ్చ్వాస నిశ్వాసాలను పైకీ కిందికీ క్రమ పద్ధతిలో కదల్చటం వల్ల డయాఫ్రమ్ అనే పొర క్రమ పరుస్తుంది.

ఈ క్రమంలో తాత్కాలికంగా కానీ , మరే ఇతర బలవత్తరమైన కారణం వల్ల కానీ అడ్డుపడితే నోటి నుండి హిక్ అనే శబ్దం వస్తుంది. అది తిరిగి సరి అయిన స్థితికి వచ్చే వరకు వస్తూ ఉంటుంది. ఇది కొద్ది నిమిషాలు ఉండవచ్చు. కొద్ది రోజుల పాటు ఉండవచ్చు. ఒక్కొక్కప్పుడు కొన్ని వారాల పాటు కూడా ఉండవచ్చు. 

ఈ ఎక్కిళ్ళు ఆగకుండా ఒక రోజు కన్నా ఎక్కువగా ఉంటే , అది మన శరీరంలో జరుగుతున్న ఏదో మార్పుకు లేదా వ్యాధికి సూచన అనుకోవాలి.. 

కామెర్లు, తీవ్రమైన ఎలర్జీ వ్యాధులు , తీవ్ర అజీర్ణ వ్యాధులలోనూ , మూత్రాశయ వ్యాధులలోనూ ఇది ఒక్కొక్కప్పుడు ఉపద్రవ సూచిక. తొందర తొందరగా నమిలి తినడం వల్ల కూడా ఎక్కిళ్ళు రావచ్చు. ఆయుర్వేదంలో దీనిని " హిక్క" వ్యాధి అని పిలుస్తారు. 

చాలా వ్యాధులలో ఎక్కిళ్ళు వస్తాయి,కానీ ఆ ఎక్కిళ్ళు రావడానికి , ఆ వ్యాధికి అనుసంధాన కారణం కనిపించదు. మీరు తొందర తొందరగా తింటున్నప్పుడు ఎక్కువ గాలి తెలియకుండా లోపలికి వెళుతుంది. ఆ రెండింటి అవరోధం వల్ల తాత్కాలికంగా ఎక్కిళ్ళు వస్తాయి. 

ఎక్కువ మసాలా ఉన్నటువంటి మాంస పదార్థాలు , ఘాటుగా ఉన్న మద్యం తాగుతున్నప్పుడు మన డయాఫ్రమ్ చలించి ఎక్కిళ్ళు వస్తాయి. షుగర్ వ్యాధి వల్ల, ఎక్కువగా మందు తాగడం వల్ల, పొగ తాగడం వల్ల , నోటి లోపల పూత,క్యాన్సర్ వల్ల , మెడ నొప్పి వల్ల, ఏదైనా కారణంగా స్పృహ కోల్పోవడం , ఎక్కువ కారం తినడం వల్ల పలుమార్లు ఎక్కిళ్ళు వస్తాయి. 

మన గుండె కింద ఉన్న పొరలో తెలియని కదలికలు వచ్చినప్పుడు నోటి ద్వారా వచ్చే హిక్ శబ్దం ముఖ్యంగా నరాల కదలిక వల్ల కనక, హఠాత్తుగా చెప్పే మాట వల్ల ఒక్క అర క్షణం మన వ్యవస్థ ఆగి కదిలితే ఇది సమ స్థితికి రావచ్చు. కానీ ఇది సామాన్యంగా వచ్చే ఎక్కిళ్ళకు మాత్రమే ఉపయోగ పడుతుంది. 

ఒక రోజంతా ఆగకుండా ఎక్కిళ్ళు వస్తుంటే డాక్టర్ ను సంప్రదించాలి. సాధారణంగా ఎక్కిళ్ళు వైద్య పరంగా ప్రమాద సూచిక కాదు. కానీ ఆగకుండా రోజంతా వస్తూ రక్తపు చుక్కలు కనిపిస్తుంటే అది ఉపద్రవ సూచిక అని గ్రహించి వైద్యుణ్ణి సంప్రదించాలి. 

ఎక్కిళ్ళు ఆగకుండా వస్తుంటే..

కొద్ది సేపు ఊపిరి తీసుకుని బిగపట్టి ఉంచుకోండి.

గబ గబా గ్లాసుడు నీళ్ళు తాగండి.

ఉప్పుని వాసన చూడండి.

నాలుక చివర చేత్తో పట్టుకుని కిందికీ పైకీ లాగండి.

ఒక చెంచా పంచదార నాలుక కింద ఉంచుకుని చప్పరిస్తూ ఉండండి.

పెరుగులో ఉప్పు కలుపుకుని చెంచా తో తింటుంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

చిన్న చిన్న ముక్కలుగా తరిగిన అల్లం ముక్కలు నములుతుంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. 

యాలక్కాయలు తొక్కతో సహా నాలుక మీద పెట్టుకుని రసం మింగుతుంటే మంచిది. 

కళ్ళు మూసుకుని ఊపిరి బిగ పట్టి ఉంచండి.క్రమంగా కళ్ళు తెరవండి. ఎక్కిళ్ళు తగ్గుతాయి. 

ఆధునిక వైద్యంలో క్లోర్ప్రోమోజైన్ బ్యాక్లోఫెన్ వంటి మందులు వాడతారు. 

తీవ్ర వ్యాధిలో డయాఫ్రమ్ ను నియంత్రించే నరం ఫెరోనిక్ నర్వ్ చెడిపోయినప్పుడు ఆపరేషన్ అవసరం అవుతుంది. కానీ ఇది చాలా అసాధారణం. 

ఎక్కిళ్ళు చాలా వరకు తాత్కాలికం. వ్యాధులు ఉన్నప్పుడు వస్తే అశ్రద్ధ చేయవద్దు.

5, సెప్టెంబర్ 2026, శనివారం

దేహ దుర్గంధ సమస్య - డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారం

 శరీర దుర్వాసన సమస్యకు.. ఆయుర్వేద పరిష్కారాలు..

ముందుగా శరీరంలోని అతి వేడి పూర్తిగా తగ్గితేనే దేహ దుర్గంధ సమస్య పరిష్కారమవుతుంది. వేడి పుట్టించే పదార్థాలు తినడం మాని చలువ చేసే పదార్థాలు తినడం మొదలు పెట్టాలి. ముఖ్యంగా బార్లీ పాయసం అతి వేడి ని త్వరగా తగ్గిస్తుంది. దానితో పాటు ధనియాల కషాయం కూడా చక్కెర కలిపి రెండు పూటలా సేవిస్తుండాలి. 

మాంసాహారం పూర్తిగా నిషేధించాలి. వాటితో పాటు కరక్కాయ పై బెరడు , వేపాకు, లొద్దుగ పట్ట, నాగ కేసరాలు, వట్టి వేళ్ళు, తామర పూలు, శ్రీ గంధం, మాచిపత్రి, మరువం, మామిడి పూలు, మొగిలి పూలు , చిన్న ఏలకులు , తుంగ గడ్డలు, జటా మాంసి, కర్పూరం , కచ్చోరాలు, ఆకు పత్రి.. వీటిలో దొరికినన్ని తెచ్చుకుని విడి విడిగా చూర్ణాలు చేసి అన్నీ కలిపి నిలువ చేసుకోవాలి. 

రోజూ స్నానానికి గంట ముందుగా తగినంత పొడిని మంచి నీటితో గుజ్జులాగా నూరి ఆ గుజ్జును శరీరమంతా రుద్ది ఎండిపోయిన తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తుంటే అతి త్వరగా శరీర దుర్వాసన హరించి పోతుంది. 

పేల సమస్య - ఆయుర్వేద పరిష్కారం

 పేల సమస్య.. ఆయుర్వేద పరిష్కారం 

తల శుభ్రంగా..

సమయం చిక్కినప్పుడు కాకుండా వారంలో  కనీసం మూడు సార్లు తల స్నానం చేయాలి. శిరోజాలు పూర్తిగా ఆరాకే జడ వేసుకోవాలి. చిన్నారుల జుట్టు సాధ్యమైనంత వరకు చిన్నగా ఉంటేనే మంచిది. జుట్టును మరీ బిగుతుగా కట్టడం వల్ల దురద అధికం అవుతుంది. ఇక సమస్య మరీ ఎక్కువగా ఉంటే కొబ్బరి నూనెలో తగినంత వెనిగర్ కలిపి ,షాంపుతో తల రుద్దుకున్నాక ఈ నూనెను పట్టించాలి. అరగంట అయ్యాక మళ్ళీ ఘాటైన షాంపుతో స్నానం చేయాలి. వెనిగర్ ప్రభావానికి పేలు పోతాయి.

మర్దన తో మేలు..

నోటి దుర్వాసనను దూరం చేసే మౌత్ వాష్ అందుబాటులో ఉంటే దాన్ని తలకు రాసి కాసేపయ్యాక కడిగేయాలి. దీని వల్ల పేలు పోతాయి. ఎంతో మార్పు ఉంటుంది. రాత్రి పూట గోరు వెచ్చని నూనెతో తలంతా మర్దన చేసి మర్నాడు తాజా నిమ్మ రసం మాడుకు పట్టించాలి. గంట తర్వాత తల దువ్వితే పేలు ఇవతలకు వచ్చేస్తాయి. ఐతే తలలో ఇన్ఫెక్షన్లు ,దద్దుర్లు బాధిస్తుంటే నిమ్మ రసానికి దూరంగా ఉండాలి.

వాడే వస్తువులు జాగ్రత్తగా..

పేలు ఉన్నవారు వాడే దువ్వెనలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. తల స్నానం చేసిన ప్రతి సారీ దువ్వెనలు, హెయిర్ బ్యాండ్ లు, క్లిప్పుల వంటివి డిటర్జెంట్ కలిపిన వేడి నీటిలో అరగంట పాటు ఉంచి శుభ్ర పరచుకొని ఆ తర్వాతే వాడుకోవాలి. పేల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు , ఇతర సమస్యలు దూరమవుతాయి. ఔషధ గుణాలు ఉన్న షాంపూ వాడకం వల్ల సమస్య తగ్గుతుంది. దాన్ని నీటిలో కలపకుండా జుట్టుకి రుద్ది , అర గంట తర్వాత కడిగేసుకోండి. ఇక ఇలాంటి వారు వాడే దిండ్లు,దుప్పట్లను ఎప్పటికప్పుడు శుభ్ర పరుస్తూ ఉండాలి.

ఉల్లితో ఉపశమనం..

ఉల్లి పాయలను సన్నగా తరిగి మిక్సీలో వేసి మెత్తని గుజ్జు చేసి దాన్నుంచి రసం తీయాలి. ఆ రసాన్ని తల స్నానం చేసిన మర్నాడు జుట్టుకు పట్టించాలి. నాలుగు గంటలు అయ్యాక శుభ్ర పరచుకుంటే దురద సమస్య బాధించదు. రెండు వారాలకోసారి ఇలా చేస్తే పేలూ తగ్గు ముఖం పడతాయి. సీతా ఫలం గింజలను ఎండ బెట్టి పొడి చేసి తగినన్ని నీళ్లు కలిపి తలకు పూతలా వేయాలి. రాత్రి తలకు వస్త్రాన్ని చుట్టి పడుకుని మర్నాడు షాంపూ తో కడిగేసుకుంటే సరి పోతుంది. దీంతో చుండ్రు సమస్య కూడా నియంత్రణలో ఉంటుంది.

వెల్లుల్లి తో సమస్య దూరం..

సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు .. వెల్లుల్లిని మెత్తగా చేసుకుని ఆ గుజ్జులో పావు కప్పు నిమ్మ రసం కలిపి తలకు రాయాలి. ఆ ఘాటు వాసన కు పేలు పోతాయి..అలాగే ఆపిల్ ను సన్నగా తరిగి మిక్సీలో వేసి గుజ్జుగా చేసి దాన్ని తలకు రాసి గంటయ్యాక తల స్నానం చేస్తే ఫలితం ఉంటుంది. ఆలివ్ నూనె ను మరగ కాచి రాత్రి పూట తలంతా మర్దన చేసి ఏదైనా వస్త్రాన్ని చుట్టాలి. ఇలా మూడు రోజులకోసారి చేస్తుంటే చుండ్రు, దురద వంటి సమస్యలు తగ్గిపోతాయి.

తులసి చేసే మేలు..

పది బాదం పలుకులను నానబెట్టి మర్నాడు మెత్తగా చేసి పావు కప్పు నిమ్మ రసం కలిపి తలకు పూతలా వేసుకుని, గంటయ్యాక చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది. గుప్పెడు చొప్పున తులసి, వేప ఆకులు తీసుకుని మెత్తని ముద్ద చేసి మాడుకు రాసి రెండు గంటలయ్యాక తల స్నానం చేయాలి. ఇలా పది రోజులకోసారి చేస్తుంటే క్రమంగా సమస్య పరిష్కారమవుతుంది.

ముఖం పై నల్లని చారలు - ఆయుర్వేద పరిష్కారాలు

 అద్దం మన ముఖమునే కాదు ,దానిపై వస్తున్న నల్లని చారలు, కంటి కింద నల్లని మెరుపు, బుగ్గపై చిన్న చిన్న పొక్కులు...  రంగు బారిన చెక్కిళ్ళు.. వీటన్నింటినీ చూపిస్తుంది .ఇవి మీరు అనుకుంటున్నట్లు చర్మవ్యాధులే కానక్కరలేదు,  కౌమార దశలో ఉన్న పిల్లలలో హార్మోన్ల హెచ్చుతగ్గులను, నడి వయస్సులో, మధ్యలో మానసిక అశాంతిని ,కొంతమందిలో రక్త దోషాన్ని సూచిస్తుంది. 

ప్రకాశవంతమైన ముఖ చర్మం ఆనందానికి దర్పణం వంటిది. ఇది మనం ఎక్కువగా పట్టించుకోము కానీ పట్టణాలలో, నగరాలలో నాడు, నేడు ఇలాంటి మచ్చలు రంగు మారడం, నలుపు చాయ రావడం లాంటివి రాకుండాను ,వచ్చినవి పోయి ముఖ చర్మం అందంగా , ఆకర్షణీయంగా ఉండాలని ఉంచుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. 

నైలునది నాగరికతలోనూ, పురాణకాల సంస్కృతిలోనూ, ఇతిహాస కాలంలో కూడా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రత్యేక చికిత్సలు, చికిత్స చేసే సుందరిమణులు ఆ కాలంలో ఉండేవారు. ఈనాటి రసాయనాలు ఉపయోగించే బ్యూటీ పార్లర్ల కన్నా సహజ సౌందర్య సాధనాలతో చేసే నిలయాలు అప్పుడు కూడా ఉండేది.

ఆధునీకులు తెల్లని చారికలు ఏర్పడటం, చర్మపు రంగు మారి మచ్చలు ఏర్పడటాన్ని బ్లిమిషెస్ అంటారు. ఈ బ్లిమిషెస్ లో పైన చెప్పినవే కాకుండా తెల్లని గట్టి మొటిమల లాంటివి, నల్లని, లేత ఎరుపు తో కూడిన పొక్కులు లాంటివి ఏర్పడటమూ ఉంటుంది. 

క్రీములు కొనేటప్పుడు..

ఇందులో కొన్ని తెల్లని చారికలు లాంటివి ఏర్పడడం. దీనికి పుట్టుకతో వచ్చిన దోషం కారణం కావచ్చు .మరికొందరిలో మొటిమలు ,ఉబ్బిన చిన్న చిన్న పొక్కులు ఏర్పడతాయి. వీటికి కారణం కొంత హార్మోన్ల హెచ్చుతగ్గులు అయితే ఎక్కువ భాగం వారు వాడే రకరకాల క్రీములు, పౌడర్లు నూనెలు వంటివి. చర్మానికి ఇవి పడకపోతే ఇలాంటివి వస్తాయి .రాత్రులు చర్మానికి రాసుకునే క్రీములు ఇలాంటివి కలుగ చేస్తుంటాయి. 

ఇలా చర్మానికి బిమిషస్ కలగజేసే క్రీములను ' comedo genics ' అంటారు. అందుచేత మీరు క్రీములను కొనేటప్పుడు వాటిపై 'non comedo genics' అని ఉందో లేదో చూసి కొనండి. వాతావరణంలో మార్పులు, ముఖ్యంగా కలుషితమైన గాలి, నీటిలో తేమ మీ చర్మ కాంతిని సౌకుమార్యాన్ని పాడు చేస్తాయి. ముఖంపై కురుపులు, చారికలు వంటివి, చర్మాన్ని ఉద్రేకపరిచే వెంట్రుకల రాపిడి, వాడే బట్టల రాపిడి ఎక్కువ చేస్తాయి. 

మానసిక ఒత్తిడి, హార్మోన్లలో హెచ్చుతగ్గులు వీటికి ముఖ్య కారణాలుగా గుర్తించబడింది. ముఖ్యంగా ఆండ్రోజన్ అనే హార్మోను దీనికి ముఖ్య కారణంగ భావించ బడుతుంది. ఎలాగంటే ఈ హార్మోన్ల చర్మాన్ని రాపిడి సెబమ్ అనే సహజ స్నిగ్ధ పదార్థాన్ని పెంచుతుంది. ఈ నూనె పదార్థం ఒకచోట ఎక్కువగా చేరడం వల్ల సూక్ష్మ జీవులు చేరి చర్మాన్ని పాడు చేసి ఈ చిన్న చిన్న కురుపుల లాంటి వాటిని తీసుకొస్తాయి. ముఖ్యంగా స్త్రీలు, ఎదుగుతున్న పదహారేళ్ళ వయసు వారి నుండి నడి వయసు ఉన్న 30 ఏళ్ల వయసు వారి వరకు ఈ హార్మోన్ల హెచ్చుతగ్గులకు ఆలవాలం అవుతున్నారు. 

అలాగే ఋతుచక్రం ఆగిపోతున్న వయస్సులో అంటే 45 ఏళ్ల వయసులో ఈ హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల చర్మ సౌందర్యం పాడవుతుంది. గర్భిణీ కాలంలోనూ, నెలసరి వచ్చే సమయంలోనూ ఎక్కువ అవుతాయి. యాంటీ ఆండ్రోజన్స్ వంటి మందులు , కార్టికో స్టిరాయిడ్స్ వంటి మందులు వాడినా వాటి ఫలితం తో పాటు కొంత అసౌకర్యం కూడా ఉంటుంది. అందుకే సహజమైన చిన్న చిన్న వాటితో ఈ స్థితిని మనం దూరం చేసుకోవచ్చు. 

ముఖానికి వెలుగునిచ్చేవి ఏమంటే..

 బెల్లం ,నువ్వులు కలిపిన నువ్వుల ఉండలు ఆడపిల్లలు తినడం మంచిది. అన్నం మొదటి ముద్దలో నువ్వుల పొడి రెండు చెంచాలు కలుపుకొని తినడం, తలంటు పోసుకునేటప్పుడు ముఖానికి పసుపు, పెసర పిండితో నలుగు పెట్టుకోవడం, నువ్వుల నూనెతో వారానికి ఒసారైనా ఒంటికి గట్టిగా రాసుకుని నలుగు పెట్టుకుని వేడి నీటితో తలస్నానం చేయడం హితకరం. ఇవి స్త్రీ పురుషులు ఇద్దరికీ ఉపకరిస్తాయి. 

మీరు ఒలుచుకొని పడేసే అరటిపండు తొక్క లోపలి భాగంలో అద్భుతమైన సౌందర్య సాధనము ఉంచాడు ఆ భగవంతుడు. దానితో కానీ బొప్పాయి పై తొక్కతో కానీ ముఖాన్ని రుద్దుకుంటే ఇలాంటి చారికలు తగ్గిపోతాయి. 

బంగాళాదుంపలు పై  పొరతో కూడిన దాన్ని ఒక గుడ్డలో ఉంచి నలగగొట్టి రసం తీయండి. ఆ రసంలో తొమ్మిది నిమ్మరసం చుక్కలు వేయండి. ఒక చెంచా తేనె వేసి కలియబెట్టండి. దాన్ని మీ ముఖం పైన రాయండి లేదా నల్లని చారికలు ఉన్నచోట కానీ ,మచ్చలు, మొటిమలు ఉన్నచోట కానీ రాయండి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. దీనిలో ఉన్న బ్లీచింగ్ ఏజెంట్స్ ముఖాన్ని చక్కగా చేస్తాయి. ముఖమంతా రాసుకుంటే మొటిమలు రావు. 

మీరు ఇంట్లో ఎప్పుడైనా నారింజ రసం కానీ, నిమ్మ రసం కానీ ,బత్తాయి రసం గానీ చేసుకుంటే పుల్లకు దూది చుట్టి ఆ రసంతో కొంచెం ముఖానికి రుద్దుకొని కాసేపయ్యాక గోరు వెచ్చని నీటితో కడిగేసుకోండి. మీ ముఖం ప్రకాశ వంతంగా అందంగా మెరిసి పోతుంది. 

మన ఇంట్లో ఉండే నిమ్మ కాయలు ముఖం మీద, చర్మం పై ఉండే ముడతలను, చారికలను తొలగించే అద్భుతమైన మందు. దాన్ని అలాగే రాసుకోవచ్చు. లేదా పసుపు, గంధపు పొడి కలిపి రాసుకోవచ్చు. 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం ప్రకాశ వంతంగా మెరిసి పోతుంది. 

పాత నిమ్మకాయ పచ్చడి తినడం,టొమోటో, పాల మీద మీగడ, పెరుగు పై తరకలు అందాన్ని అందించే అపురూప వరాలు. నాలుగు చెంచాల టమోటా రసం, 4 చెంచాల నిమ్మ రసం కలిపి దూదితో రోజూ ముఖం పైన రుద్దుకుని అరగంట తర్వాత కడుక్కోండి. దీన్ని ఎక్కువగా చేసుకుని ఫ్రిజ్ లో భద్ర పరిచి రోజూ రాసుకోవచ్చు. ఇది సహజ సౌందర్య సాధనం. 

నిమ్మ కాయ రసం తీసిన తొక్కలపై కొంచెం పంచదార అద్ది ముఖానికి ప్రతి రోజూ రుద్దుకుని 10 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. ముఖం పై మొటిమలు తగ్గిపోతాయి. మంచి గంధం పొడి, రోజ్ వాటర్ తో కలిపి ముద్దగా చేసి దాన్ని ముఖానికి రాసుకోండి. ఇలా చేస్తే కళ్ళ కింద నల్లని చారలు పోయి చక్కగా ఉంటారు. 

బాదం పలుకులు ఒక రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తేనె, నిమ్మ రసం కలిపి ముద్దగా చేసి చర్మం పై రాయండి. పావు గంట తర్వాత కడిగేసుకోండి. మీ ముఖం మృదువుగా , కాంతి వంతంగా ఉంటుంది. 

గనేరియా ,కడుపులో బల్ల సమస్యలు - డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 1. సెగ రోగ / గనేరియా సమస్య - ఆయుర్వేద పరిష్కారం 

ముందే సెగ రోగం ఉన్న పురుషునితో స్త్రీలు కలవడం కానీ , అదే రోగం ఉన్న స్త్రీతో పురుషుడు కలవడం వల్ల కానీ ఈ రోగం అంటుకుని వారి శరీరంలో జీర్ణించుకు పోయి వదలకుండా దీర్ఘ కాల వ్యాధి లాగా పట్టి పీడిస్తుంది. దీనిని అశ్రద్ధ చేస్తే ఈ వ్యాధి ఉన్నవారికి పుట్టే బిడ్డలకు కూడా ఈ వ్యాధి సంక్రమించి వారి జీవితాన్ని కూడా నరక ప్రాయం చేస్తుంది. 

దీనికి ఈ వర్షా కాలంలో ప్రతి చోట లభ్యమయ్యే దూసరి చెట్టు / సిబ్బి తీగ ఆకులు దివ్యమైన ఔషధంగా పని చేస్తాయి. చెట్టును పూజించి , రోజూ ఉదయం పూట దాని ఆకులు తెచ్చి దంచి తీసిన రసం 20 గ్రాములు మోతాదుగా ఒక చెంచా పటిక బెల్లం పొడి కలిపి పరగడుపున తాగుతుంటే మూడు, నాలుగు వారాల్లో ఎంత దీర్ఘ కాలం నుంచి బాధిస్తున్న సెగ రోగమైనా తగ్గిపోతుంది. 


2. ) కడుపులో బల్ల రోగం - ఆయుర్వేద పరిష్కారం 

ఉన్న ఊరు కన్న తల్లి అని మన పెద్దలు చెప్పిన మాట ఈ నాడు మనం మరచిపోవడం వల్ల ఇలాంటి సమస్యలు పరిష్కారం కావడం లేదు. కడుపులో బల్ల సమస్యకు దేశవాళీ ఆవు ఉదయం పూట పోసే మూత్రం మొదటి మరియు చివరి మూత్రాన్ని విడిచిపెట్టి మధ్యలో మూత్రాన్ని ఒక గ్లాసులో పట్టుకొని ఏడు సార్లు బట్టలో వడపోసి అందులో చిటికెడు ఉప్పు కలిపి రోజూ ఉదయం పూట పరగడుపున సేవించాలి. ఇలా వరుసగా రెండు లేదా మూడు వారాల పాటు తాగుతుంటే తిరిగి కాలేయ ప్లీహాలు బాగా పని చేసి బల్ల హరించి పోయి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది. సులభంగా జీర్ణం అయ్యే ఆహారం మాత్రమే సేవించాలి. 

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...