12, సెప్టెంబర్ 2026, శనివారం

ముట్టు నొప్పి, అతి దురద సమస్యలు.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 ముట్టు నొప్పికి.. ఆయుర్వేద పరిష్కారాలు 

మన ప్రాంతంలో దొరికే ముదురు చింత బెరడు తీసుకొచ్చి ముక్కలు చేసి ఎండబెట్టి కాల్చి బూడిద చేసి జల్లించి నిలువ చేసుకోవాలి. మరో రెండు రోజుల లో బహిష్టు రాబోతుందనగా కంది గింజంత చింత బూడిదను ఉదయం పూట చెంచా నిమ్మ రసంలో కలిపి , సాయంత్రం పూట చెంచా తేనె తో కలిపి బహిష్టు వచ్చి ఆగిపోయే వరకు తింటూ ఉంటే నొప్పి తగ్గిపోయి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. 


విపరీతంగా దురద బాధిస్తుంటే.. ఆయుర్వేద పరిష్కారాలు.


వేప చిగుళ్ళు,పసుపు సమ భాగాలుగా తీసుకుని కొంచెం నీటితో మెత్తగా నూరి ఆ గుజ్జును దురదల పైన పట్టించి ఒక గంట ఆగి వేడి నీటితో స్నానం చేయండి. అలాగే మంచి పసుపు 50 గ్రాములు, పాత బెల్లం 100 గ్రాములు కలిపి దంచి నిలువ చేసుకోవాలి. పూటకు 5 గ్రాములు మోతాదుగాను చప్పరించి తిని మజ్జిగ తాగాలి. 

ఆహారంలో వంకాయ ,గోంగూర ,ఆవకాయ , మాంసాహారం, చేపలు , గుడ్లు , వేడి చేసే వస్తువులు మాని వేయండి. దురద సమస్య బాధించదు. 

సంసార సమస్య, పిప్పి పన్ను సమస్యలు.. ఆయుర్వేద పరిష్కారాలు

 సంసార సమస్య..ఆయుర్వేద పరిష్కారాలు 

అశ్వగంధ దుంపలు 50 గ్రాములు, నేల గుమ్మడి గడ్డలు 50 గ్రాములు, గొబ్బి గింజలు 50 గ్రాములు, పటిక బెల్లం పొడి 80 గ్రాములు కలిపి చూర్ణించి పొడి చేసుకోవాలి. అన్నిటిని కలిపి నిలువ చేసుకోవాలి. రోజూ రెండు పూటలా ఒకటి, రెండు చెంచాల పొడి, పావు లీటరు వేడి పాలలో కలిపి సేవిస్తుండాలి. క్రమంగా సమస్య పరిష్కారమవుతుంది. ఆ సమయంలో పూర్తి బ్రహ్మ చర్మం పాటించాలి. 


పిప్పి పన్ను సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు 


పిప్పి పన్ను ఎడమ వైపు వస్తే కుడి చెవిలోనూ, కుడి వైపు వస్తే ఎడమ చెవిలోనూ కాకి దొండాకు పసరు ఐదారు చుక్కలు పోసి కొంచెం ఆగి చెవిని పక్కకు వంచి ఆ రసాన్ని బయటకు కార్చి వేయాలి. దీని వల్ల అప్పటికప్పుడే పిప్పి పన్ను సమస్య పరిష్కారమవుతుంది. 

10, సెప్టెంబర్ 2026, గురువారం

కమలా పండ్లు.. గుమ్మడి..

 కమలా పనులను వీలైనంత అధికంగా తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరమే కాకుండా అందం కూడా పెరుగుతుంది. చర్మాన్ని కాంతులు ఈనేలా చేస్తాయి వృద్ధాప్య ఛాయాల్ని తగ్గిస్తాయి. 

కమలా పండును యథాతతంగా తిన్న ప్రసంగా రసాన్ని తాగిన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కండరాలు బలోపేతం అవుతాయి ముడతలు మచ్చలు పూర్తిగా తగ్గుతాయి. 

కమల పండు తొక్కలను ఎండబెట్టుకొని పొడి చేసుకుని సౌందర్య సాధనంగా వివిధ రకాలుగా వాడవచ్చు. 

జిడ్డు చర్మం పోవాలంటే..

ముల్తానీ మట్టి, కమలా పండు తొక్కు, గంధం పొడి సమ భాగాలుగా తీసుకుని , ఒక టీ స్పూన్ టమోటా గుజ్జు కలిపి చర్మానికి మర్దనా చేసుకుని కొద్దిసేపయ్యక కడిగేయాలి. 

ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేయాలి.

కాంబినేషన్ స్కిన్.. 

రెండు చుక్కల ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుని ముఖానికి మర్దనా చేయాలి. 

ముఖాన్ని వేడి నీటిలో ముంచిన మెత్తటి టవల్ తో కంప్రెస్ చేయాలి.

ముడతలు..

టేబుల్ స్పూన్ ప్రోటీనెక్స్ , పెరుగు కలిపి పేస్ట్ తయారు చేసుకుని , ఒక టీ స్పూన్ ఆపిల్ తురుము , రెండు చుక్కలు ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ముఖానికి మాస్క్ వేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తుంటే ముడతలు తగ్గుతాయి. 


గుమ్మడి..

ఏ కాలంలో నైనా వ్యాధులను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది గుమ్మడి. కారణం దీనిలో పుష్కలంగా ఉండే కెరోటినాయిడ్ లే. గుమ్మడి తో చేసిన పదార్థాలను తరచూ తీసుకునే వారిలో వ్యాధి నిరోధక శక్తి అధికం. ముఖ్యంగా బీటా కెరోటిన్ ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ . దీనికి చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే శక్తి అధికం. గుండె నాళాల్లో అడ్డంకులు తొలగించి గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. 

మేని నిగనిగలకు..

వయసుతో సంబంధం లేకుండా మేని నిగారింపు కోరుకునే వారు .. గుమ్మడి చక్కని యాంటీ ఏజింగ్ పదార్థమని తెలుసుకోవాలి . దీనిలోని ఆల్ఫా కెరోటిన్ వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది. కంటి శుక్లాలు రాకుండా చూస్తుంది. 

పీచు పుష్కలం..

గుమ్మడిలో పీచు పుష్కలంగా ఉంటుంది.దాంతో మలబద్ధక సమస్య అదుపులో ఉంటుంది. శరీరానికి మేలు చేసే కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్లు అధికంగా లభిస్తాయి. ఒక కప్పు తరిగిన గుమ్మడి నుంచి కాల్షియం 37 mg లభిస్తే , మెగ్నీషియం 22 mg లభిస్తుంది. 

ఆటలాడే అమ్మాయిలకు ప్రత్యేకం..

పొటాషియం స్థాయిలు పుష్కలంగా ఉండే గుమ్మడిని ఏదో ఒక రూపంలో తీసుకునే వారిలో రక్త పోటు అదుపులో ఉంటుంది. కప్పు గుమ్మడి నుంచి 564 mg పొటాషియం లభిస్తుంది . క్రీడా కారిణులకు ఏర్పడే సమస్య పొటాషియం లోపం. తరచూ వ్యాయామాలు చేయడం వల్ల స్వేదం కారణంగా చెమట రూపంలో పొటాషియం కోల్పోతారు క్రీడా కారిణులు. అటువంటి వారు గుమ్మడి తో చేసిన కూరలను, డెజర్ట్ లను స్వీకరించాలి. పైగా ఇది ఎముక బలానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటితో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచే జింక్ కూ కొదవలేదు. 

విటమిన్లు పుష్కలం..

వండిన గుమ్మడిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, మేని అందానికి తోడ్పడే విటమిన్ ఇ , కంటి చూపునకు సహకరించే విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఒక గిన్నెడు గుమ్మడి నుంచి 3 Mg ల విటమిన్ ఇ లభిస్తే, 12 Mg ల విటమిన్ సి లభిస్తుంది. 

7, సెప్టెంబర్ 2026, సోమవారం

డెంగీ తదితర వ్యాధుల విషయంలో..

 డెంగీ తదితర వ్యాధుల విషయంలో అనవసరంగా యాంటీ బయోటిక్స్, నొప్పి నివారణ మందులు ఇవ్వకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డెంగీ అని నిర్ధారణ కాకుంటే జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నా ' పారాసిటామల్ ' మందు తీసుకుంటే సరిపోతుంది. 

డెంగీ, డెంగీ ని పోలిన విష జ్వరాల చికిత్సలకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలు. 

డెంగీ లక్షణాలు..

తలనొప్పి ,కంటి వెనుక భాగంలో నొప్పి, కండరాల నొప్పులు ,శరీరంపై దద్దుర్లు,  ముక్కు,చిగుర్లు, నోటి నుండి రక్తం కారడం ,వాంతులు కావడం, మలం నల్లగా ఉండడం, నిద్రలేమి ,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, నాలుక తడి ఆరిపోవడం, చర్మం పొడిబారిపోవడం వంటి లక్షణాలతో జ్వరతీవ్రత ఉంటే వైద్యుడిని సంప్రదించి వారి సూచనల మేరకు వైద్య పరీక్షలు చేయించాలి. రక్త కణాల సంఖ్య 80000 కంటే తగ్గితే వైద్యుల పర్యవేక్షణలో తప్పకుండా చికిత్స చేయించాలి. రోగికి రక్తపోటును వైద్య సిబ్బంది నిరంతరం గమనిస్తూ ఉండాలి. రక్త కణాల సంఖ్య 40 వేల కంటే తగ్గితే ప్రతి గంటకు ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తూ, రక్త కణాల సంఖ్య ఇంకా తగ్గుతూ ఉంటే డెంగీ నిర్ధారణ కోసం" ఎలిసా " పరీక్ష చేయించాలి .ఈ పరీక్ష లో పాజిటివ్గా నిర్ధారణ అయితే డెంగ్యూ చికిత్స ప్రారంభించాలి. 

చికిత్స విధానాలు..

డెంగీ నిర్ధారణ అయిన రోగుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ప్రతి గంటకు సమీక్షిస్తూ ..సెలైన్ ( ఐసోటోనిక్ క్రిష్టలాయిడ్ సొల్యూషన్ )ఇవ్వాలి. 

రోగికి రక్తస్రావం అవుతూ ఉంటే ఈ క్రిస్టలాయిడ్ సొల్యూషన్ స్థానంలో డెక్స్ట్రాన్ / ప్లాస్మా ఎక్కించాలి. 

రక్తస్రావం ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటే సెలైన్ ఎక్కువగా ఇవ్వడంతో పాటు రక్తం కూడా ఎక్కించాలి. అవసరమైతే కృత్రిమ శ్వాస కూడా అందించాలి

రోగి కోలుకుంటున్నట్లు కనిపిస్తే సెలైన్ మోతాదు క్రమంగా తగ్గించుకుంటూ రావాలి .

డెంగీ నిర్ధారణ కాకున్నా రక్తస్రావం అవుతుంటే రక్తం ఎక్కించాలి.

చేయకూడనివి..

రోగికి కండరాలు ,ఒళ్ళు నొప్పుల నివారణకు ఆస్ప్రిన్, బ్రూఫిన్ లాంటివి ఇవ్వ కూడదు. 

డెంగ్యూ తరహా లక్షణాలు నిర్ధారణ కాకుంటే నరాల ద్వారా సెలైన్ వంటివి కూడా ఇవ్వకూడదు.

యాంటీబయాటిక్ మందులు అసలు వాడకూడదు. 

రోగికి భరించలేని స్థాయిలో నొప్పులు ఉన్నా ఉపశమనం కోసం స్టిరాయిడ్స్ ఇవ్వకూడదు.

రోగికి సెలైన్ ఒకే వేగం /మోతాదుతో ఎక్కించాలి. మోతాదును పెంచడం ,తగ్గించడం వీలైనంత వరకు చేయకూడదు .

ఉపశమనం లక్షణాలు..

 రోగినాడీ తీరు ,శ్వాస తీరు, రక్తపోటు నిలకడగా ఉండడం, శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి రావడం, రక్తస్రావం, వాంతులు లేకపోవడం ,మూత్రం బాగా  వస్తూ ఉండాలి.

ఈ లక్షణాలు ఉంటే మూడు రోజులు ఆస్పత్రిలో ఉంచుకొని, డిశ్చార్జ్ చేసేముందు ఒకసారి రక్త కణాల సంఖ్య పరీక్షించాలి .ఇందులో 50 వేల కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలితే ఇక ఎలాంటి అపాయము ఉండదు .

డెంగీ నిర్ధారణ కాకపోతే చికిత్స..

జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటూ, కండరాల నొప్పులు ఎక్కువగా ఉన్నా .. డెంగీ కాదు. ఇలాంటి జ్వరాలకు పేరాసిటమాల్ మాత్రలు రోజుకు గరిష్టంగా నాలుగు సార్లు తీసుకుంటే సరిపోతుంది.

జ్వరం రెండు రోజులకు తగ్గకపోతే నిపుణుల సూచనల మేరకు పారాసెటమాల్ మందును కొనసాగించాలి.

జ్వరం ఉన్నా తేలికగా  జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవచ్చు .

దీనికి అదనంగా సూపు ,పాలు ,పండ్ల రసాలు ,కొబ్బరి నీళ్లు, నీరు ఎక్కువగా తీసుకోవాలి .

రోగి ఎలాంటి శారీరక శ్రమకు గురికాకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవాలి .

పారాసెటమాల్ మందు మోతాదు ఇలా 

ఏడాదిలోపు వయసు వారికి 60 మిల్లీ గ్రాములు, ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల వయసు గల వరికి 60 నుంచి 120 మిల్లీగ్రాముల వరకు, ఐదు సంవత్సరాల కు పైబడి వయసు ఉంటే రెండు వందల నలభై మిల్లీ గ్రాములు ఇవ్వాలి.


6, సెప్టెంబర్ 2026, ఆదివారం

ఎక్కిళ్ళు.. ఆయుర్వేద పరిష్కారాలు

 అమ్మ.. ఎక్కిళ్ళు ఆగడం లేదు, ప్రతి ఐదు నిమిషాలకు వస్తున్నాయి. నీళ్లు తాగుతున్నాను, గొంతుకి అమృతాంజనం రాసుకున్నాను, అయినా.. అబ్బా మళ్ళీ ఎక్కిళ్ళు.. అది కాదు, అదేంటి నీ తలపై అంత పెద్ద గడ్డ పుట్టుకొచ్చింది. . హఠాత్తుగా ఆశ్చర్యంతో అడిగింది. . ఆ అమ్మాయిని వాళ్ళమ్మ. గడ్డా.. ఎక్కడా.. ఆశ్చర్యంతో తలని చూసుకుంది ఆ అమ్మాయి. గడ్డలేదు కానీ ఎక్కిళ్ళు ఆగి పోయాయి. హఠాత్తుగా వచ్చే ఎక్కిళ్ళను , హఠాత్తుగా వినే సంగతులు ఆపు చేస్తాయి. 

ఎక్కిళ్ళు హఠాత్తుగా వస్తాయి .గుండెకు పొట్టకు మధ్య ఉండే పలుచని పొర ను డయాఫ్రమ్ అంటారు. అది అనుకోకుండా ముడుచుకుంటుంటే వచ్చే" హిక్ " అనే శబ్దం నోటి నుంచి బయటకు రావడాన్ని" ఎక్కిళ్ళు"  అంటారు.

ఈ డయాఫ్రమ్ చాలా సార్లు ముకులించుకోవడం వల్ల మన గొంతులో ఇరువైపులా ఉన్న శబ్ద గ్రంధులు మధ్య ఉండే దారి మూసుకొని గాలిని అడ్డగించడం వల్ల హిక్ లేదా ఎక్ అనే శబ్దం వస్తుంది. దాని దగ్గర ఉన్న నరాలు ఉద్రేక పడడం వల్ల గొంతు నుండి ఛాతీ దాకా చలించి ఈ ఎక్కిళ్ళు ఎక్కువవుతాయి. 

ఎక్కిళ్ళు చాలా కారణాల వల్ల వచ్చినా తాత్కాలికంగానే ఉంటాయి. కానీ కొన్ని వ్యాధుల వల్ల వచ్చే ఎక్కిళ్ళు ప్రమాదాన్ని సూచిస్తాయి. ముఖ్యంగా న్యుమోనియా , మూత్ర పిండాలు పాడై పోయిన వ్యాధులు , గుండె జబ్బులు వంటి వాటిలో ఇవి రాకూడదు. 

ఎందుకు ,ఎప్పుడు వస్తాయి అంటే..

రక్తంలో చెడు పదార్థం ఏదైనా తయారు అవుతున్నప్పుడు ఈ ఎక్కిళ్ళు వస్తాయి. ఈ హిక్ లేదా ఎక్ అనే శబ్దం ఆగకుండా అస్తమానం వస్తుండటానికి కారణం లారింక్స్ అనే గొంతు భాగాన్ని ఆనుకుని ఉన్న పలుచని పొర తెరుచుకుని మూసుకోవడం వల్ల జనిస్తుంది. మన ఉచ్చ్వాస నిశ్వాసాలను పైకీ కిందికీ క్రమ పద్ధతిలో కదల్చటం వల్ల డయాఫ్రమ్ అనే పొర క్రమ పరుస్తుంది.

ఈ క్రమంలో తాత్కాలికంగా కానీ , మరే ఇతర బలవత్తరమైన కారణం వల్ల కానీ అడ్డుపడితే నోటి నుండి హిక్ అనే శబ్దం వస్తుంది. అది తిరిగి సరి అయిన స్థితికి వచ్చే వరకు వస్తూ ఉంటుంది. ఇది కొద్ది నిమిషాలు ఉండవచ్చు. కొద్ది రోజుల పాటు ఉండవచ్చు. ఒక్కొక్కప్పుడు కొన్ని వారాల పాటు కూడా ఉండవచ్చు. 

ఈ ఎక్కిళ్ళు ఆగకుండా ఒక రోజు కన్నా ఎక్కువగా ఉంటే , అది మన శరీరంలో జరుగుతున్న ఏదో మార్పుకు లేదా వ్యాధికి సూచన అనుకోవాలి.. 

కామెర్లు, తీవ్రమైన ఎలర్జీ వ్యాధులు , తీవ్ర అజీర్ణ వ్యాధులలోనూ , మూత్రాశయ వ్యాధులలోనూ ఇది ఒక్కొక్కప్పుడు ఉపద్రవ సూచిక. తొందర తొందరగా నమిలి తినడం వల్ల కూడా ఎక్కిళ్ళు రావచ్చు. ఆయుర్వేదంలో దీనిని " హిక్క" వ్యాధి అని పిలుస్తారు. 

చాలా వ్యాధులలో ఎక్కిళ్ళు వస్తాయి,కానీ ఆ ఎక్కిళ్ళు రావడానికి , ఆ వ్యాధికి అనుసంధాన కారణం కనిపించదు. మీరు తొందర తొందరగా తింటున్నప్పుడు ఎక్కువ గాలి తెలియకుండా లోపలికి వెళుతుంది. ఆ రెండింటి అవరోధం వల్ల తాత్కాలికంగా ఎక్కిళ్ళు వస్తాయి. 

ఎక్కువ మసాలా ఉన్నటువంటి మాంస పదార్థాలు , ఘాటుగా ఉన్న మద్యం తాగుతున్నప్పుడు మన డయాఫ్రమ్ చలించి ఎక్కిళ్ళు వస్తాయి. షుగర్ వ్యాధి వల్ల, ఎక్కువగా మందు తాగడం వల్ల, పొగ తాగడం వల్ల , నోటి లోపల పూత,క్యాన్సర్ వల్ల , మెడ నొప్పి వల్ల, ఏదైనా కారణంగా స్పృహ కోల్పోవడం , ఎక్కువ కారం తినడం వల్ల పలుమార్లు ఎక్కిళ్ళు వస్తాయి. 

మన గుండె కింద ఉన్న పొరలో తెలియని కదలికలు వచ్చినప్పుడు నోటి ద్వారా వచ్చే హిక్ శబ్దం ముఖ్యంగా నరాల కదలిక వల్ల కనక, హఠాత్తుగా చెప్పే మాట వల్ల ఒక్క అర క్షణం మన వ్యవస్థ ఆగి కదిలితే ఇది సమ స్థితికి రావచ్చు. కానీ ఇది సామాన్యంగా వచ్చే ఎక్కిళ్ళకు మాత్రమే ఉపయోగ పడుతుంది. 

ఒక రోజంతా ఆగకుండా ఎక్కిళ్ళు వస్తుంటే డాక్టర్ ను సంప్రదించాలి. సాధారణంగా ఎక్కిళ్ళు వైద్య పరంగా ప్రమాద సూచిక కాదు. కానీ ఆగకుండా రోజంతా వస్తూ రక్తపు చుక్కలు కనిపిస్తుంటే అది ఉపద్రవ సూచిక అని గ్రహించి వైద్యుణ్ణి సంప్రదించాలి. 

ఎక్కిళ్ళు ఆగకుండా వస్తుంటే..

కొద్ది సేపు ఊపిరి తీసుకుని బిగపట్టి ఉంచుకోండి.

గబ గబా గ్లాసుడు నీళ్ళు తాగండి.

ఉప్పుని వాసన చూడండి.

నాలుక చివర చేత్తో పట్టుకుని కిందికీ పైకీ లాగండి.

ఒక చెంచా పంచదార నాలుక కింద ఉంచుకుని చప్పరిస్తూ ఉండండి.

పెరుగులో ఉప్పు కలుపుకుని చెంచా తో తింటుంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

చిన్న చిన్న ముక్కలుగా తరిగిన అల్లం ముక్కలు నములుతుంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. 

యాలక్కాయలు తొక్కతో సహా నాలుక మీద పెట్టుకుని రసం మింగుతుంటే మంచిది. 

కళ్ళు మూసుకుని ఊపిరి బిగ పట్టి ఉంచండి.క్రమంగా కళ్ళు తెరవండి. ఎక్కిళ్ళు తగ్గుతాయి. 

ఆధునిక వైద్యంలో క్లోర్ప్రోమోజైన్ బ్యాక్లోఫెన్ వంటి మందులు వాడతారు. 

తీవ్ర వ్యాధిలో డయాఫ్రమ్ ను నియంత్రించే నరం ఫెరోనిక్ నర్వ్ చెడిపోయినప్పుడు ఆపరేషన్ అవసరం అవుతుంది. కానీ ఇది చాలా అసాధారణం. 

ఎక్కిళ్ళు చాలా వరకు తాత్కాలికం. వ్యాధులు ఉన్నప్పుడు వస్తే అశ్రద్ధ చేయవద్దు.

5, సెప్టెంబర్ 2026, శనివారం

దేహ దుర్గంధ సమస్య - డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారం

 శరీర దుర్వాసన సమస్యకు.. ఆయుర్వేద పరిష్కారాలు..

ముందుగా శరీరంలోని అతి వేడి పూర్తిగా తగ్గితేనే దేహ దుర్గంధ సమస్య పరిష్కారమవుతుంది. వేడి పుట్టించే పదార్థాలు తినడం మాని చలువ చేసే పదార్థాలు తినడం మొదలు పెట్టాలి. ముఖ్యంగా బార్లీ పాయసం అతి వేడి ని త్వరగా తగ్గిస్తుంది. దానితో పాటు ధనియాల కషాయం కూడా చక్కెర కలిపి రెండు పూటలా సేవిస్తుండాలి. 

మాంసాహారం పూర్తిగా నిషేధించాలి. వాటితో పాటు కరక్కాయ పై బెరడు , వేపాకు, లొద్దుగ పట్ట, నాగ కేసరాలు, వట్టి వేళ్ళు, తామర పూలు, శ్రీ గంధం, మాచిపత్రి, మరువం, మామిడి పూలు, మొగిలి పూలు , చిన్న ఏలకులు , తుంగ గడ్డలు, జటా మాంసి, కర్పూరం , కచ్చోరాలు, ఆకు పత్రి.. వీటిలో దొరికినన్ని తెచ్చుకుని విడి విడిగా చూర్ణాలు చేసి అన్నీ కలిపి నిలువ చేసుకోవాలి. 

రోజూ స్నానానికి గంట ముందుగా తగినంత పొడిని మంచి నీటితో గుజ్జులాగా నూరి ఆ గుజ్జును శరీరమంతా రుద్ది ఎండిపోయిన తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తుంటే అతి త్వరగా శరీర దుర్వాసన హరించి పోతుంది. 

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...