ఆయుర్వేద అభిమాన పాఠకులారా! మనరాష్ట్రంలోని దాదాపుగా అన్ని గ్రామాలలో కనిపించే
చెట్టు అతిబల. దాదాపుగా ఇది తెలియని గ్రామీణులు వుండరు. అమితమైన బలాన్ని అందించే శక్తి
ఇందులో వుంది. కాబట్టే దీనికి అతిబల అని పేరు వచ్చింది. ప్రాచీనకాలంలో కూడా
రామాయణంలోనూ, భారతంలోనూ ఆ తరువాత కాలాలలో కూడా ఈ అతిబల మొక్క ప్రశంస
చాలాచోట్ల కనిపిస్తుంది. దీని ఆకులు, పూలు, గింజలు, వేర్లు సర్వాంగాలు శక్తివంతమైనవి.
ఇలాంటి అసాధారణమైన ఔషధ శక్తిగల ఓషధులు గ్రామ గ్రామాన వుండి కూడా వాటి గురించి
తెలుసుకోలేక ఉపయోగించుకోలేక మన భారత జాతి బలహీనమైపోతుందంటే ఇది ఎంత
దురదృష్టమో ఆలోచించండి. ఇప్పటికైనా ఈ మొక్క గురించిన వాస్తవాలు ప్రజలందరికి తెలియజేసి
అందరిని శక్తివంతులుగా మార్చడానికి ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాము.
అతిబల- పేర్లు
సంస్కృతంలో అతిబల అని, హిందీలో కంగి అని,
తెలుగులో ముద్రబెండ, తుత్తురుబెండ, దువ్వెనకాయల
చెట్టు, అతిబల అని, లాటిన్లో Mallya Rotondifolia
ఆంగ్లంలో Mallow Tree అంటారు.
అతి బల- రూప గుణ ధర్మాలు..
తుత్తురుబెండ ఆకులు మృదువుగా, జిగట కలిగి
మేహశాంతిని కలుగజేస్తయ్. శరీరంలోని సకల
మలినాలను బయటికి తోసివేసి శుద్ధి చేస్తయ్,
గడ్డలను ,వ్రణాలను మెత్తపరచి, పక్వంచేసి మాన్పి
వేస్తయ్. ఇంకా అనేక ఉపయోగాలు తెలుసుకుందాం.
మూత్రంలో మంట, రాళ్ళు వుంటే ?
తుత్తురుబెండ నాలుగైదు ఆకులు నలిపి పావు
లీటరు నీటిలో వేసి సగానికి మరగబెట్టి వడపోసి
చల్లార్చి ఒకచెంచా కండచక్కెర కలిపి మూడు పూటలా
తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోయి రాళ్ళు
కరిగి మూత్రం ద్వారా పడిపోతయ్.
నేత్ర దోషాలకు - ఆకు కషాయం..
పైన చెప్పినట్లు కషాయంచేసి చల్లార్చి ఆ కషా
యాన్ని మూసిన కండ్ల పైన కడుగుతూవుంటే కంటి
దోషాలు హరించి కంటిచూపు పెరుగుతుంది.
జ్వర తీవ్రత లో - అతి బల..
అతి బలాకులను నీటిలో నానబెట్టి వడపోసి
అందులో కొద్దిగా కండచక్కెర కలిపి కొద్ది కొద్దిగా
తాగుతూ వుంటే వేడి తగ్గి జ్వరం శాంతిస్తుంది.
* ఇదేనీరు మూడుపూటలా సేవిస్తుంటే
మూత్రంలో మంట, చురుకు, మూత్రాశయంలో వాపు,
దీర్ఘకాలిక దగ్గులు కూడా హరించిపోతయ్.
పిచ్చి కుక్కవిషానికి - అతి బల
పిచ్చికుక్క కరచిన వెంటనే అతిబల ఆకుల రసం,
70 గ్రా. మోతాదుగా తాగించాలి. ఆకు ముద్దను
కాటు పైన వేసి కట్టు కట్టాలి. ఇలా చేస్తుంటే విషం విరిగి
పోతుంది.
శీఘ్ర స్కలనానికి - అతి బల
తుత్తురుబెండ గింజలు 50గ్రా,శతావరి వేర్ల పొడి
100గ్రా, ఆ రెండింటికి సమంగా పటిక బెల్లంపొడి
కలిపి నిలువ వుంచుకోవాలి. రోజు రెండుపూటలా
ఒక చెంచా పొడి చప్పరించి తిని ఒక కప్పు పాలు
తాగుతూ వుంటే శీఘ్రస్కలనం మాయమై పోయి వీర్యం
గట్టిపడి యౌవనం పెరుగుతుంది.
పైత్యపు - గుండెదడకు
అతిబల ఆకులు ఏడు తీసుకొని మంచినీటితో
నూరి బట్టలో వడపోసి ఆ రసంలో చక్కెర కలిపి
తాగుతూ వుంటే అధిక వేడి వల్ల కలిగిన గుండెదడ
తీవ్రంగా హరించి పోతుంది.
నడుము నొప్పికి - నాణ్యమైన మార్గం..
పైన తెలిపినట్లు అతి బల ఆకులతో కాచిన
కషాయం రెండుపూటలా తాగుతూ ఆకులను నలగగొట్టి
వేడిచేసి నొప్పుల పైన వేసి కట్టు కడుతూ వుంటే
కేవలం నడుము నొప్పేకాక ఎక్కడి నొప్పులైనా తగ్గి
పోతయ్.
మొలల కు - అతి బల ఆకుకూర
అతి బల ఆకులను కూర లాగా వండి రెండు పూటలా
తింటుంటే మొలల నుండి కారే రక్తం ఆగిపోతుంది.
స్త్రీల - స్తనాల వాపుకు
అతి బలవేరును నిలువ చేసుకొని, రోజూ రెండు
పూటలా కొంచెం నీటితో సానరాయిపైన ఆ వేరును
అరగదీసి ఆ గంధాన్ని వాపుల పైన పట్టిస్తూ వుంటే
రొమ్ముల వాపు తగ్గిపోతుంది.
అలాగే కండరాల వాపు పైన కూడా పట్టిస్తూ వుంటే
ఆ వాపు తగ్గుతుంది.
దగ్గు, ఉబ్బసం - హరించిపోవుటకు
బాగా ముదిరిన అతి బల చెట్టును సమూలంగా
పెకలించి తెచ్చి ముక్కలుగా చేసి కడిగి ఎండలో
ఎండబెట్టాలి. తరువాత దాన్ని కాల్చి బూడిదగా
చేయాలి. ఆ బూడిదను ఒక కుండలో పోసి నిండా
నీరుపోసి మూడు రోజులపాటు వుంచాలి. రోజుకు
ఒకసారి కర్రతో కలుపుతూ వుండాలి.
నాలుగవ రోజున పైకి తేలిన నీటిని మాత్రమే
ఉంచుకొని చిన్న మంట పైన మరిగిస్తే అంతా తెల్లటి
క్షారంగా మిగులుతుంది.దాన్ని మెత్తగా నూరి నిలువ
చేసుకోవాలి.
ఈ క్షారం రెండు మూడుచిటికెల మోతాదుగా
ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తు వుంటే దగ్గు,
ఉబ్బసం హరించిపోతయ్.
మూత్రపిండాల - నొప్పి తగ్గుటకు
అతి బల ఆకులను 50 గ్రా. తీసుకొని మెత్తగా
నూరి చిన్నచిన్న బిళ్ళలుగా తయారుచేయాలి.
తరువాత ఆవునెయ్యి 50 గ్రా. పాత్రలో పోసి పొయ్యి
మీద పెట్టి నెయ్యి మరుగుతుండగా ఈ బిళ్ళలను
అందులో వేయాలి. బిళ్ళలన్నీ వేగేవరకువుంచి దించి
వడపోసి వాటిని నిలువ చేసుకోవాలి. రోజూ
రెండుపూటలా ఒకటి లేక రెండు చెంచాల మోతాదుగా
వాటిని సేవిస్తుంటే మూత్రపిండాల నొప్పి తగ్గి
పోతుంది.
నులిపురుగులు హరించుటకు..
అతి బల గింజలను నిప్పుల పైన వేసి ఆ పొగను
పిల్లల గుద స్థానమునకు తగిలేటట్లుగా చేస్తే దాని
ప్రభావానికి లోపలి నులిపురుగులు హరించి పోతయ్.
మొలల కు - అతి బల గోలీలు..
అతిబల ఆకులు ఇరవై ఒకటి, అలాగే మిరియాలు
ఇరవై ఒకటి తీసుకొని మొత్తం మెత్తగా నూరి ఏడు
గోలీలు చేయాలి. రోజు ఒక గోలీ చొప్పున ఏడు
రోజులు పరగడుపున ఒక గోలీని మంచినీటితో సేవి
స్తుంటే వాత దోషంవలన కలిగిన మొలలు హరించి
పోతయ్.
గుండె బలానికి - ముఖ కాంతికి
అతి బలవేర్లను దంచి పొడిచేసి జల్లించి నిలువ
వుంచుకోవాలి. ఈ పొడిని మూడునాలుగు చిటికెల
మోతాదుగా ఆవునెయ్యితో కలిపి రెండుపూటలా
ఆహారానికి గంటముందు సేవిస్తుంటే గుండెకు
బలం కలగడమే కాక ముఖం కూడా కాంతివంతంగా
మారుతుంది. *