Monday 21 November 2016

శాఖాహారం మేలు చేస్తుంది.

పళ్ళు, కూరగాయలే ఎందుకు తినాలి?
మాంసంలో లేని ప్రత్యేకతలు కూరగాయల్లో
ఉన్నాయా?
* మనం పళ్ళు కూరగాయలు ఎందుకు తినా
లంటే వాటిలో సూక్ష్మ పోషకాలు నిలవుంటాయి
కాబట్టి, లవణాలు, ఖనిజాలు అతి కొద్ది మోతా
దులో మనిషికి ఆజన్మాంతం అవసరమౌతాయి.
కోబాల్ట్, క్రోంఇయం, రాగి, అయొడిన్, మ్యాంగ
నీసు, జింక్ లాంటి ఖనిజాలు, ఇంకా ఇతర విట
మిన్లు ఎక్కువగా రోజుకు 100 మి.గ్రా, మోతాదు
వరకూ అవసరం అవుతాయి.
పోషకాలు:
తక్కువ మోతాదులో ఎక్కువ శక్తిదాయకమైన
వీటిని సూక్ష్మ పోషకాలంటారు. ఇవి పళ్ళలోను,
కూరగాయల్లోను అత్యధికంగా ఉంటాయి. పీచు
పదార్థాలు, పిండిపదార్ధాల్లాంటి స్థూల(మక్రోపోష
కాలంటారు. ఇవి ఎక్కువ మోతాదులో శరీరానికి
అవసరం అవుతాయి కాబట్టి వీటికా పేరు వచ్చింది.
ఇవి కాక శరీరం తన పనిని తాను సమర్థవంతంగా
చేసుకునేందుకు కావలసిన పోషకాలను మొక్కలు
మాత్రమే మన శరీరానికి అందిస్తాయి. వీటిని
'పైటోన్యూట్రియంట్స్' అంటారు. ఇవి మొక్కల్లో
ఫంగస్ లాంటి చీడ పట్టకుండా కాపాడే రక్షణ
యంత్రాంగానికి సంబంధించినవి. మొక్కలకు
సంబంధించిన వాటిని ఆహారంగా తీసుకున్నప్పుడు
ఈ రక్షక రసాయనాలు పూర్తిస్థాయిలో మనకు
అందుతాయి.
కేవలం మాంసాహారం మీద ఆధారపడితే ఇవి
చాలినన్ని అందకుండా పోతాయి.
కాషాయం రంగు కూరగాయలు:
పిల్లల్లో కంటి చూపు పెరగడానికి, చర్మం
మృదుత్వం, లావణ్యం పొందడానికి, వ్యాధి నిరో
ధక శక్తి పెరగడానికి ఏ విటమిని అవసరంఅవు
తుంది. కేరట్లు, టమోటాలు, చిలకడదుంపలు,
బొప్పాయి, మామిడి పండు లాంటి ఎరుపు రంగు
కలిగిన పండ్లు, కాయగూరల్లో కెరటోనాయిడ్స్ అనే
పోషకాలు శరీరానికి రక్షణ కలిగించే ద్రవ్యాలను
బాగా అందిస్తాయి.
సివిటమిన్:
టమోటాలాంటి
కూరగాయల్లోనూ,
జామ అరటి లాంటి
పండ్లల్లోనూ ఉండే 'సి
విటమిన్ పూర్తిస్థాయిలో
మనం ఉపయోగించుకో
లేకపోతున్నాం. వాటిని అధిక ఉష్ణోగ్రత దగ్గర
వండటం కారణంగా సి విటమిన్ ఎగిరిపోతోంది.
చారు, సాంబారు, పప్పుచారు, కలగూర పప్పు
లాంటివి వండినప్పుడు పొయ్యి మీంచి దించబోయే
ముందుటమోటా రసం కలపటం మంచిది. సివిట
మిన్ని అతిగా వండితే త్వరగా ఆవిరైపోతుంది.
అందువలన కూర రుచి కూడా దెబ్బతింటుంది. ని
విటమిన్ ఎక్కువగా కలిగిన పండ్లను, కాయగూర
లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వాటిలోని
ఇనుముకు సంబంధించిన ఫోలిక్ యాసిడ్ అనేది
శరీరానికి బాగా వంటబడ్తుంది.
పీచుపదార్ధాలు:
కాయగూరల్లోనూ, ఆకు కూరల్లోనూ అధి
కంగా ఉండే పీచుపదార్థాలు జీర్ణశక్తిని పెంచు
తాయి. పేగులను బలసంపన్నం చేస్తాయి. రోజూ
కాలవిరేచనం అయ్యేలా చేస్తాయి. పేగుల్లో కేన్సర్
లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా కాపాడ
తాయి. పీచుపదార్థాలతో నిండిన ఆహారం తీసుకు
న్నప్పుడు కొవ్వు పదార్థాలు, పంచదార పదార్థాలు
- రక్తంలోకి ఎక్కువగా చేరకుండా అని అడ్డుకుం
దాయి. ఆ విధంగా స్థూలకాయం, షుగరు వ్యాధుల్ని
5 అదుపులో పెట్టడానికి పీచుపదార్థాల అవసరం
ఎంతైనా ఉంది.
కూరల్ని ఇలా వండాలి:
కూరల్ని అతిగా చింతపండు, అల్లం, వెల్లుల్లి
మసాలాలు వేయకుండా వండుకుంటే కూర ఎక్కు
వగానూ, అన్నం తక్కువగానూ తినటం సాధ్యం
అవుతుంది. ఏ కూరగాయనైనా నూనెలో బాగా
వేయిస్తే ఆ కూరగాయ ప్రబావం సగం చచ్చిపో
తుంది. పోషాకాలు మాడి పోతాయి. అతిగా
వేగడం వలన అందులో కేన్సర్ కారకమైన ఆకీల
మైడ్ అనే విషరసాయనం పుడుతుంది. ఈ సంగతు
లను గమనించి కూరగాయలను మందాగ్ని మీద
తేలికగా ఉడికించుకుని కూరలు తయారు చేసుకో
వాలి.
మాంసానికి ప్రత్యామ్నాయం?
మాంసాహారానికి ప్రత్యామ్నయంగా కూరగా
యలను, పప్పుధాన్యాలను, తీసుకోవచ్చు. కానీ
- కూరగాయలకు మాంసాహారం ప్రత్యామ్నాయం
కానే కాదు. కూరగాయల్లోని పోషకాలు తేలికగా
అరిగే స్వభావాన్ని కలిగి ఉంటాయి.
ఇటీవల కాలంలో పనస ముక్కల పలావ్,
దొండకాయ టిక్కాలాంటి వంటకాలు మాంసాహా
రాన్ని వండే పద్ధతిలో కూరగాయల్ని ఎక్కువగా
వండుతున్నారు. ముఖ్యంగా విందు భోజనాల్లో కేట
రర్లు ఇలాంటి వంటకాలను సృష్టిస్తున్నారు. అక్కడ
తిని, ఇంట్లో కూడా అలాంటివే వండుతూ ఆహా
రాన్ని విషతుల్యం చేసుకుంటున్నాం. కొద్దిపాటి వేడి
మీద కొంచెంసేపు ఉమ్మగిలనిస్తే కూర తినడానికి
రుచిగానూ, ఆరోగ్యదాయకం గానూ ఉంటుంది.

Saturday 5 November 2016

తిప్పతీగ - ఆయుర్వేదం

తిప్పతీగ తో ప్రయోజనాలు.

తిప్పతీగ పేరును బట్టే ఇది లత అని అర్థమవుతుంది.
సన్నటి కాండంతో వేరొక చెట్టు మీదగానీ లేదా దేనినైనా
ఆసరా చేసుకుని, చుట్టుకుని పాకే మొక్క. దీని ఆకులు ఇంచు
మించు తమలపాకుల ఆకారంలో (గుండె ఆకారంలో)
ఉంటాయి. బెరడు నూగు (ధూళి)పూసిన ఆకుపచ్చరంగులో
ఉంటుంది. బెరడు అంతా కంతులు కలిగి ఉంటుంది. వేసవిలో
పువ్వులు, శీతాకాలంలో పండ్లు ఉంటాయి. ఈ పండ్లు చిన్నగా,
ఎర్రగా ఉంటాయి. వృక్షశాస్త్రంలో దీని పేరు 'టైనోస్పోరా కార్డి
ఫోలియా'. దీనికి 'అమృత, గుడూచీ, చక్రాంగీ, మధుపర్డీ'
అనే పర్యాయపదాలుంటాయి. హిందీలో 'గిలోయా'
అంటారు. దీని రుచి చేదు, కారంగా ఉంటుంది.
ఔషధ గుణాలు : ఇది వాత, పిత్త, కఫ వికారాలన్నింటినీ
తగ్గిస్తుంది. అన్ని రకాల జ్వరాలనూ తగ్గిస్తుంది. ఆకలి
పుట్టించి, జీర్ణక్రియను పెంచుతుంది. అమ్మపిత్త (ఎసిడిటీ)
వికారాన్ని పోగొడుతుంది. వాంతులు, దప్పికను తగ్గిస్తుంది.
రక్తశుద్ధి చేసి చర్మరోగాలను దూరం చేస్తుంది. శరీర భాగాల్లోని
మంట, మూత్రంలో మంట, దగ్గు, కీళ్లనొప్పుల వంటి వివిధ
బాధలను తగ్గిస్తుంది. రక్తహీనతను పోగొడుతుంది. హీమోగ్లో
బిన్ ను పెంచుతుంది. నీరసాన్ని పోగొడుతుంది. మూలశం
కను కూడా తగ్గిస్తుంది. మధుమేహ నివారణ, చికిత్సలకు ఉప
యోగపడుతుంది.
భావప్రకాశ : దోషత్రయామ తృట్ దాహమేహకాసాంశ్చ
పాండుతాం: కామలా కుష్ట వాతాస్త్ర జ్వరకృమి
వమీన్ హరేత్ ..... హృద్రోగవాతనుత్"
వాడుకునే విధానం : దీని ఆకులు, పువ్వులు, పండ్లు,
కాండం, దుంప... అన్నీ ఉపయోగకరమే.
స్వరసం ( పసరు) : పైన చెప్పిన భాగాలలో లభ్యమైనవా
టిని పరిశుభ్రంగా నీటితో కడిగి, పచ్చివాటిని దంచి స్వరసం
తీయాలి.  ఒకటి రెండు చెంచాల మోతా
దులో తేనెతో రెండుపూటలా సేవించాలి.
చూర్ణం: లభించిన భాగాలను బాగా
ఎండబెట్టి పొడి చేయాలి. మోతాదు :3
నుంచి 5 గ్రాములు నీటితో లేక తేనెతో
రెండుపూటలా సేవించాలి. చూర్ణాలను
తయారు చేసి ఆరు నెలల లోపు వాడుకో
వాలి.
కషాయం: లభించిన భాగాలను
పచ్చివిగానీ, ఎండువిగానీ లేక చూర్ణాన్ని
గానీ ఉపయోగింయచి కషాయం
తయారు చేసుకోవాలి (పది గ్రాముల
ద్రవ్యానికి సూమారు 120 మిల్లీలీటర్ల
నీటిని కలిపి, నాల్గవ వంతు మిగిలేవరకు
మరిగించి, వడగట్టుకోవాలి. (మోతాదు
ఐదారు చెంచాలు (3మి.లీ.)
రెండు పూటలా ఖాళీ కడుపున
తాగాలి.
సత్వం : దీన్నే సత్తు
అంటారు. ఈ ద్రవ్యానికి
సంబంధించి తిప్పసత్తు. లభిం
చిన భాగాలన్నింటినీ, పచ్చివా
టినీ, పరిశుభ్రంగా కడిగి,
బాగా దంచి, నీటిలో 12
గంటల పాటు నానబెట్టి, ఆ


తర్వాత, పైన తేలిన నీటిని పారబోసి, అడుగున ఉన్న
ముద్దను, నీడలో ఆరబెట్టాలి. అప్పుడు మెత్తగా
నూరితే 'సత్వం' తయారువుతుంది. ఇది ఎంతకా
లమైనా నిల్వ ఉంటుంది. మోతాదు -1-3
గ్రాములు తేనెతోగానీ, నీటితోగాని రెండుపూ
టలా సేవించాలి.
అమృతారిష్ట (ద్రావకం): ఇది ఆయుర్వేద
మందుల షాపులలో లభిస్తుంది. 'ఆసవ, 'ఆరిష్ఠ
రూపంలో మందుల్ని తయారు చేయడం ఇళ్లలో
సాధ్యం కాదు. ఫార్మశీలలో తయారు చేయాలి.
మోతాదు : 3 లేక 4 చెంచాలకు సమానంగా నీళ్లు
కలిపి మూడు పూటలా తాగాలి.
గమనిక : . ఈ లతను ఇళ్లల్లో, పెరళ్లలో లేదా
కుండీలలో పెంచుకోవచ్చు. ఈ వ్యాధులను బట్టి
దీనితో పాటు ఇతర మూలికల్ని కూడా కలుపు
కొని వాడతారు.


ఆస్త్మా - ఆయుర్వేదం

ఆస్తమా అంటే స్వేచ్చలేని శ్వాస. దీని బారిన పడిన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆలర్జీ రియాక్షన్
ద్వారా శ్వాసకోశాలు, ఊపిరితిత్తుల్లో గాలి చేరటాన్ని అడ్డుకుని శ్వాస పీల్చడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ
మహమ్మారి కారణంగా ప్రతి ఏడాది 2.5 లక్షల మంది మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఆస్తమాను ఆయుర్వేద వైద్య విధానంతో నయం చేయొచ్చు.
లక్షణాలు: ఆస్తమా బాధితుల్లో ఉబ్బసం వచ్చినప్పుడు శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసినప్పుడు గురక రావడం,
ఛాతీ బిగుతుగా ఉండి నొప్పిగా ఉండడం, కడుపు ఉబ్బరం, గడ్డం దగ్గులు, గొంతులో దురద, రాత్రివేళ
తరుచుగా దగ్గు రావడం, జలుబు, గుండె శరీరంలో బరువుగా ఉండడం, శ్లేష్మం ఎక్కువగా ఉండడం,
నడిచేటప్పుడు ఆయాసం,
రొప్పడం, నాడి వేగంగా కొట్టుకోవడం, నిద్రలేమి, కళ్ల దిగువన నల్లని చారలు,
చెమట పట్టడం, వినికిడి కష్టంగా ఉండడం, ఆందోళన తదితర లక్షణాలు ఉంటాయి.
కారణాలు: సహజమైన అలర్జీ, దుమ్మూదూళి ద్వారా ఆస్తమా వ్యాపిస్తుంది. బొద్దింకలు, పొగతాగడం, పీల్చడం
వల్ల కూడా సంక్రమిస్తుంది. వంశపారంపర్యంగా కూడా దీని బారిన పడతారు. బాల్యంలో శ్వాసకోశ
వ్యాధులు, వాతావరణ జీవరసాయన ప్రక్రియలు, హార్మోన్లలో మార్పులు మహిళల్లో), ఆహార విధానాలు,
వాతావరణ మార్పులు, జీర్ణకోశవ్యాధులు, ఆస్పిరిన్, నాన్ సైరోయిడల్ డ్రగ్స్ వాడడం, జంతు చర్మాలు, గడ్డి,
పుప్పొడి, దూళిరేణువులు, జీర్ణవాహికలో రుగ్మతలు కూడా ప్రధాన కారణాలు
ఇతర పరిణామాలు
ఆస్తమా బారిన పడిన వారిలో జీవన ప్రమాణం తగ్గడం, 80-90శాతం మందిలో శ్వాసకోశ నాళాలు
స్తంభించిపోవడం, గర్భిణుల్లో రక్తపోటు, మధుమేహం, రక్తస్రావ సమస్యలు, శిశువుల్లో బరువు తగ్గడం,
శ్వాసకోశ ఇబ్బందులు, హృద్రోగాలు, ఊపిరితిత్తుల్లో గాలి బయటకు రావడం, చర్మం పెలుసుగా మారడం,
ఎముకలు గుళ్లబారిపోవడం, చర్మ వ్యాధులు తదితర పరిణామాలు
చోటు చేసుకుంటాయి.
V
నిర్ధారణ పరీక్షలు
బ్రాంకియల్ ప్రొవోకేషన్
పల్మనరీ ఫంక్షన్
సీటీ స్కాన్
బోన్ డెన్సిటీ టెస్ట్
బోన్ స్కాన్
• స్పిరోమెట్రీ నిర్ధారణ

బ్రాంకో స్కోప్

• స్వీట్ టెస్ట్ (సిస్టిక్ ఫైబ్రోసెస్)

-ఎలర్జీ టెస్ట్
చికిత్స
ఆయుర్వేదంలో మూలికా వైద్యం, సహజ ప్రకృతి చికిత్స, ఆహార నియమాల నియంత్రణ ద్వారా ఉబ్బసాన్ని
తగ్గించొచ్చు.
- కొన్ని లవంగ మొగ్గలు అరటిపండు తొక్కలో ఉంచాలి. రాత్రంతా అలాగే ఉంచి పొద్దున్నే పరిగడుపున
తేనెతో తీసుకుంటే ఊపిరితిత్తులు బలోపేతమవుతాయి.
ఫైబ్రిఫ్యూజ్ (నేలములకు, ఎల్లో బెర్రీడ్ నైట్ షేడ్ మొక్క లేదా చోటికెటారీ(సోలనేమ్ సురటెన్స్ బర్న్) మొక్కను
పూర్తిగా కషాయంగా చేసి రోజుకు 7 - 14 మి.లీటర్ల చొప్పున రెండుపూటలా సేవిస్తే జలుబు, దగ్గు,
ఉబ్బసం తగ్గుతుంది.
ట్రైలిస్పెర్మం (ఇజీవాన్), తులసి, మిరియం, అల్లం టీ, కషాయం సేవిస్తే ఉబ్బసంతో ఉపశమనం కలుగుతుంది.
పంచకర్మతో ఉపశమనం కలుగుతుంది.
• శ్వాశారిరసం, అబ్రకభస్మ ప్రవలపిష్టి, త్రికూటచూర, తోస్తాది చూర్ణం(వైద్యుని సలహా మేరకు) తేనెతో 1
గ్రాము తీసుకుంటే ఉబ్బసం నుంచి ఉపశమనం కలుగుతుంది.
లక్ష్మీ విలాసరసం, సంజీవని మాత్రలు కూడా ఉపశమనం కలిగిస్తాయి.
టీ స్పూన్ పరిమాణంలో శ్వాసారి క్వాత్, ములేరిక్వాత్ తీసుకోవాలి. 400మి. లీటర్ల నీటిలో కలిపి 100
గ్రాములు అయ్యేవరకు బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, మధ్యాహ్నం సేవిస్తే ఉపశమనం
కలుగుతుంది.
పసుపు, లవంగం, ఆల్జీజియా రెబ్బక్ మూలిక, బే బెర్రీ పొడి. ఎపిడ్రా, అర్జున బెరడు శీతాది చూర్ణ.
మధురం(లిక్వోరైస్), యష్టిమధు, బొర్సె పొడి, తేనె మిశ్రమం కూడా ఉపయోగపడుతుంది.
• కరక్కాయ చెబులిక్ మైరోబలన్) నమలడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుంది.
-మిరియాలు, తేనె, ఉల్లిరసం, కలిపి తాగితే శ్వాసకోశంలో ఇబ్బంది తగ్గుతుంది.
వాయు, పుష్కర మూలం, ముల్లన్, జనజవైన్, నల్ల మిరియాలు, అవిసెగింజలు, అల్లం, మన్నా మిల్
(లోహబాన్) తదితర మూలికలు ఉపయుక్తంగా ఉంటాయి.
శ్వాసకోశనాళాలు కుచించుకుపోవడాన్ని ఎఫ్రిండ్రా, సినికా ఆరికడతాయి.
ఆహార నియమాలు
ఆహారాన్ని నమిలి మింగాలి. కడుపునిండా భోజనం చేయొద్దు. ఆకుకూరలు, తాజా పండ్లు తీసుకోవాలి. ఉల్లిని
ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మజాతి పండ్లలో విటమిన్-సీ ఉంటుంది. రోగ నిరోధక శక్తిని ఇది
పెంచుతుంది. ఆస్తమా వ్యాధి గ్రస్తులు శాఖాహార భోజనం చేయడం మంచిది. విటమిన్-ఏ ఉండే కూరలు
తినాలి. ఎమినోఏసిడ్స్, ఒమేగా-3 వల్ల శ్వాసకోశ నాళంలోని మంట తగ్గుతుంది. ఉబ్బసాన్ని నివారిస్తుంది.
తులసి చాలా మంచి ఔషధం పసుపు లేని అల్లం, మిరియాలు తరుచుగా తీసుకోవాలి. పిండిపదార్థాలు,
ప్రొటీన్లు, కొవ్వుపదార్ధాలు తక్కువగా తీసుకోవాలి. మాంసం, గుడ్లు, చేపలు, చాక్లెట్లు, ఫుడ్ ప్రెజర్వేటివ్స్
ఆసాని పెంచే కారకాలు రోజూ 10-12 గ్లాసులు నీళ్లు తాగాలి బాడీ లోషన్స్, షాంపోలు, డియోడరెన్స్,
షేవింగ్ లోషన్స్ వాడొద్దు.






Wednesday 2 November 2016

ఆపరేషన్ చేయించుకునే ముందు




Pillalaku ఇంజక్షన్ అంటే భయం ఉన్నట్టే
పెద్దవాళ్ళకు ఆపరేషన్ అనేసరికి అదే మోస్తరు
భయం కలుగుతుంది.
“మీకు ఆపరేషన్ చేయాలి' అని వైద్యుడు చెప్పగానే
ఇంజక్షన్‌కి భయపడిన పిల్లాడిలా వెంటనే బిగ్గరగా ఏడుపు
అందుకోకపోయినా మనసులో అంతకురెట్టింపు భయం,
ఆందోళనలకు గురవుతారు. ఆక్షణంలో కలిగే మాన
సిక ఒత్తిడి అనుభవిస్తేగాని తెలియదు.
మిగిలినవాళ్ళకు ఎంతో ధైర్యం చెప్పినవారు కూడా
తమదాకా వచ్చేసరికి ఆపరేషన్ టేబుల్ మీద ఏమవు
తుందో, తిరిగి ఆరోగ్యంతో బయటకు రాగలుగుతానా,
ఆపరేషన్ ఫెయిల్క్అయితే ఎలా అనేటువంటి అనేక
సందేహాలతో సతమతమవుతారు.
ఎంతో సింపుల్ ఆపరేషన్లని చెప్పేకుటుంబనియం
త్రణ ఆపరేషన్క తాముభయపడి భార్యల్నిముందుకు
-నెట్టిన మగవాళ్ళు ఎందరో ఉన్నారు. ఇలాంటి ఇబ్బంది
కర మానసిక పరిస్థితి నుండి బయటపడాలంటే తమ
కున్న ఆరోగ్య పరిస్థితిగురించి, ఆ అనారోగ్యానికి అందు
బాటులో ఉన్న ప్రత్యామ్నాయ చికిత్సల గురించి రోగి
తప్పనిసరిగా వైద్యుని అడిగి తెలుసుకోవాలి.
»వైద్యులు మారారు
నేటి వైద్యులకు అంతగా తీరిక ఉండడం లేదు.వర
సగా వస్తున్న పేషెంట్లను గబగబా చూసి పంపటంలో
ఒక్కొక్కరోగితో ఎక్కువసేపు మాట్లాడటం లేదు.
కుటుంబ ఆరోగ్య చరిత్ర గురించి తెలుసుకుందా
మనుకునే వైద్యులు బహుతక్కువ. ఎక్కువశాతం 'క్లిని
కల్' పరీక్షల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా
అనారోగ్యం అంచనావేసి హడావుడిగా ఆపరేషన్ బల్ల
ఎక్కిస్తున్నారు. తమ ఆసుపత్రిలో ఉన్న సామాగ్రికి
పని కల్పించేందుకు ఆపరేషన్లు చేస్తున్నారో లేక ఆపరే
షన్ల ప్రాక్టీసుకోసం పేషెంట్లను వాడుకుంటున్నారో
అర్థంకాని పరిస్థితి నేడున్నది.
పైగా నిలువుదోపిడీ చేస్తున్న వైద్యులు చాలామంది
ఉన్నారు. ఆ మధ్య జాతీయస్థాయిలో జరిగిన
ఒక సర్వేలో మనదేశంలో హిస్ట్రక్టమీ (గర్భసంచీ
తొలగింపు) ఆపరేషన్ అనవసరంగా చేస్తున్న
వైనం బయటపడింది. గర్భసంచీ తొలగించటం
అవసరమా, ఒకవేళ అది తొలగిస్తే ఏమవు
తుంది అనే విషయం పట్టించుకోకుండా ఆపరే
షన్ చేసి తీసి పారేస్తున్నారు.
ఇటువంటిదే నేడు జరుగుతున్న సిజేరియన్
ఆపరేషన్. అలాగే అవసరం లేకున్నా హడావుడిగా
సిజేరియన్ చేస్తున్నారు. దీనిమీద జాతీయస్థాయిలో
పెద్ద ఆందోళనే జరిగింది. అంతమాత్రంచేత
కాలం పడుతుందో తెలుసుకోవాలి.
కున్న ఇతర చికిత్సా విధానాలగురించి అడగండి.
ఆ తర్వాత ఆపరేషన్ చేయాలని చెప్పిన భాగం
ఏది, ఆపరేషన్ ద్వారా ఏదైనా ఒక శరీర భాగం
అలా తొలగిస్తే ఎదురయ్యే ఇబ్బందులు
ఏమిటి, ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన
జాగ్రత్తలు ఏమిటి? కోలుకునేందుకు ఎంత
మ: మనదేశంలో వైద్యులు, కార్పోరేట్ ఆసుపత్రులు తమ
ము పద్ధతి మార్చుకుంటాయనలేం,
గి
ఇటీవల ముంబయిలోని ఒక సంస్థ చేసిన పరిశోధ
నలో మనదేశం మొత్తం మీద జరుగుతున్న ఆపరేషన్లలో
సగానికి సగం రోగికి అవసరం లేకుండా జరుగుతున్న
ఆపరేషనేనని తేలింది.
తాజాగా అనవసరపు ఆపరేషన్ల జాబితాలో మోకాలి
చిప్ప రీప్లేస్ మెంట్ చేరింది. అమెరికాలో గత సంవత్సరం
లో
చేసిన మోకాలుచిప్ప రీప్లేస్ మెంట్ ఆపరేషన్లలో
మూడవవంతు మందికి అసలు అటువంటి రీప్లేస్మెంట్
అవసరంలేనే లేదు అని తేలింది. మనదేశంలో పరిస్థితి
అంతకన్నా భిన్నంగా ఉండివుంటుందని అనలేం.
" ఒత్తిడిలో పేషెంట్స్
ఆపరేషన్ నగానే పేషెంట్తోపాటు వారి కుటుం
బం మొత్తం ఒత్తిడికి గురవుతుంది.
ఆపరేషన్ సమయంలో మద్దతుగా నిలబడేవారు
మానసికంగా ధైర్యం చెప్పేవారు లేకపోవటం వల్ల రోగులు
కోలుకోటానికి చాలా ఇబ్బందిపడుతున్నారు.
ఇరుకు ఇళ్ళలో ఆపరేషన్ తర్వాత పేషెంట్ ని ఉంచ
గలిగిన పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఇటువంటి
పరిస్థితుల్లో కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి,
కుటుంబసభ్యులు మానసికంగా ఎన్నో ఇబ్బందులకు
గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆపరేషన్
చేయాలి అనగానే కంగారుపడటం మానేసి తగినచర్యలు
మొదలు పెట్టాలి. వైద్యుడి దగ్గర దాపరికం అనవసరం.
అనారోగ్యస్థితి గురించి, ఆపరేషన్ ఎందుకు అవసర
మైందో వివరంగా చర్చించాలి.
తీవ్రంగా ప్రశ్నిస్తే తప్పించి వైద్యుల నుండి సరైన
సమాధానాలు రావు. మరో వైద్యుడి నుండి అభిప్రాయం
తీసుకునే హక్కు రోగికి ఉందనే విషయం మరవకండి.
ఆపరేషన్ చెయ్యాలని సర్జన్ చెప్పాడు కాబట్టి ఆ
విషయం మీద మరో సర్జన్ వెళ్ళి కలవటంకన్నా సర్జరీ
విభాగానికి చెందని వైద్యుడిని కలిసి ప్రస్తుత రోగాని
తొలగిస్తారా!
సమాచారం సేకరించాలి
అలాగే గతంలో ఇటువంటి ఆపరేషన్లు ఎన్ని ఆ
డాక్టర్ చేతి మీదుగా జరిగాయి, వారి పరిస్థితి ఎలా ఉంది
అనే అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి.
అందుకు సంబంధించిన ప్రశ్నలు ఆ సర్జన్ కి సంధించేం
దుకు వెనుకాడాల్సిన అవసరం లేదు. వైద్యులు ఆపరేష
” అంతా సవ్యంగా ఉంటుందని చెప్పకపోవచ్చు.
చాలా ఆసుపత్రుల్లో ఆపరేషన్ చేసే వైద్యులు
అక్కడ పనిచేసేవారు కాదు. నైపుణ్యం కలవారిని ఆప
రేషన్ కోసం పిలిపిస్తారు. తాను ఏ పేషెంట్ ఆపరేషన్
చేస్తున్నది కూడా తెలియకుండా ఆపరేషన్ ముగించి
ఫీజు తీసుకుని వెళ్ళిపోయే సర్జన్స్ ఉన్నారు. అదేవిధంగా
ఆపరేషన్సమయంలో కీలకపాత్ర పోషించేది ఎనస్తీషియా
ఇచ్చేవారు. అతని నైపుణ్యం గురించి కూడా ఆపరేషన్
ముందే తెలుసుకునే హక్కు రోగికి ఉంటుంది.
కాబట్టి ఆపరేషన్ ఎంటేనే ఒక పెద్ద రిస్క్ అయిన
పుడు ఆ రిస్క్ తో కూడిన నిర్ణయం తీసుకునే ముందు
మరెంతో జాగ్రత్తగా ఉండటం అవసరం కదా.

విశ్వాసం తగ్గుతోంది
'ఆపరేషన్
చేయించుకున్నా' కాని నా ఆరోగ్యస్థితిలో
ఏమంత మార్పులేదు' అని కొందరు చెప్పటం మనం
వింటుంటాం. వారు చెపుతున్నదానిలో ఏమాత్రం
అబద్ధం లేదు. కొన్ని రకాల అనారోగ్యాలు ఒక దశ దాటిన
తర్వాత చక్కదిద్దటం కుదరదు.
ఎంతో నైపుణ్యం ఉన్న సీనియర్ సర్జన్ ఆపరేషన్
చేసినా ఆ అనారోగ్యపు ఇబ్బందిలోనుండి బయటపడ
లేరు. అలాంటి స్థాయికి చేరిన దాని గురించి వైద్యులు
ముందుగానే చెప్పరు. ఆపరేషన్ ద్వారా నూటికి నూరు
శాతం తగ్గుతుందా లేక ఆపరేషన్లో పరిష్కారం ఫిఫ్టీ
ఫిథీనా అనేది వైద్యుని అడిగి తెలుసుకోవాలి.
ఆపరేషన్తో సక్సెస్ శాతం బాగుంటుందనుకుంటేనే
బల్ల ఎక్కటం మంచిది. వైద్యుడిని దేవుడితో సమానంగా
భావిస్తారు రోగులు. మరే ఇతర వృత్తిలో ఉన్నవారికి
రెండుచేతులు పెట్టి నమస్కారం చెయ్యరు.
కాని తమకు
చికిత్స అందునా ఆపరేషన్ వంటివాటిని చేసే డాక్టర్కి
రెండు చేతులెత్తి నమస్కారం చేస్తారు.
అంతటి పవిత్రమైన, గురుతర బాధ్యత కల్గిన 
Yeకైకవృత్తి వైద్య వృత్తి. అయితే సమాజంలోని అన్ని
వృత్తులలోకి వచ్చిచేరిన చెడు నేడు వైద్య వృత్తిలోకి
వచ్చి చేరింది. డబ్బుకు తప్ప మరేదానికి స్పందిం
చని కఠినాత్ములుగా మారారు వైద్యులు.
ఎవరికివారు తమవంతుగా రోగిని ఒక 'రౌండ్
వేసి చూసి వెళ్ళేవారే తప్పించి, నిలుచుని మాట్లాడి,
వివరించి వాస్తవాన్ని రోగి ముందుంచే వైద్యులు
బాగా తగ్గిపోయారు. వైద్యులమీద నమ్మకం తగ్గి ఇంట
ర్నెట్ సమాచారంమీద విశ్వాసము పెరుగుతున్న కాలం
ఇది. రోగం పేరు చెప్పగానే ముందుగా వెళ్ళి ఇంట
ర్నెట్లో గూగుల్ సెర్చ్ చేసుకుంటున్నారు రోగులు.
ప్రాథమిక సమాచారమే కాదు, పలు తాజా అంశా
లను గూగుల్ ద్వారా తెలుసుకుని వైద్యుడి దగ్గరకు
వస్తున్నారు.గతంలోలా వైద్యుడు చెప్పిందే ఫైనల్ అను
కోవటం లేదు రోగులు. రెండవ ఒపీనియన్ ముందుగా
ఇంటర్నెట్లో ఆ పైనే మరో వైద్యుడి దగ్గర.
అందుకే ఇప్పుడు రోగులు వేసే ప్రశ్నలు పెరిగాయి.
ఆ ప్రశ్నలు వైద్యులకు చిరాకు తెప్పిస్తున్నాయి. ఇంట
ర్నెట్, గూగుల్ ని తిట్టని వైద్యులు లేరు.
» ప్రశ్నలు సంధించాలి
అయినా సరే వైద్యుడి ముందు ప్రశ్నలు ఉంచక
తప్పదు. ఆపరేషన్ అనగానే కత్తితో ఏదో ఒక భాగం
కోసి తిరిగి కుట్లు వేస్తారనేది చాలామంది రోగులు
అనుకునేది.
కోసి తెరచి, తిరిగి మూసే మధ్యలో జరి
గేదే ప్రాముఖ్యమైన అంశం.
ఇందులో దెబ్బతిన్న అంగాలు తొలగించవచ్చు,
శరీరంలోపల ఏర్పడినలోపాలను చక్కదిద్దవచ్చు, పేరు
కున్న కొవ్వులను తొలగించవచ్చు లేదా అంగమార్పిడి
జరగవచ్చు. ఇలా ఆపరేషన్లు పలురకాలు.
అయితే ఆపరేషన్ చిట్టచివరిగా ఎంపిక చేసుకునేది
కావాలి. ఆ దశకు చేరి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళే
ముందు రోగి లేదా రోగి ఆప్తులెవరైనా వైద్యునికి తప్పని
సరిగా సంధించవలసిన ప్రశ్నలు పది ఉన్నాయి.
• అసలు ఆపరేషన్ ఎందుకనేది తొలి ప్రశ్న అవ్వాలి.
ఈ ఆపరేషన్ కాక ఇతరత్రా మందుల వాడకం లేదా
మరో ప్రత్యామ్నాయంతో రోగం తగ్గించగలరా లేదా
అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి.
• ఒకసారి ఆపరేషన్ తప్పదన్న నిర్ణయానికి వచ్చినతర్వాత మరో వైద్యునిదగ్గర రెండవ అభిప్రాయం
సేకరించుకునే
యత్నం
చేయాలి.
• ఒకరికన్నా ఎక్కువమంది ఆపరేషన్‌ పరిష్కారమని
స్పష్టం చేసిన ఆ ఆపరేషన్ ఎలా చేస్తారు. ఆప
రేషన్లో వచ్చే లాభం ఏమిటి? ఆపరేషన్ వల్ల ఏర్పడే
ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా?
• ఆపరేషన్ సమయంలో ఇచ్చే మత్తుమందు స్థాయి,
ఆపరేషన్ ఎన్ని గంటలు చేస్తారు? ఎన్ని గంటల
తర్వాత స్పృహలోకి వస్తారు అనే ప్రశ్నలు వేసి సరైన
సమాధానం రాబట్టాలి.
• ఆపరేషన్ కి ముందు నిర్వహించే ప్రశ్నలు, వేసు
కోవాల్సిన మందులు, ఆపరేషన్ కి రెడీ అవటం
ఎలా అనేవి వైద్యుని అడిగి తెలుసుకోవాలి.
ఈ ఆపరేషన్ఏ ఆసుపత్రిలో చేస్తారు? అక్కడ అందు
బాటులో ఉన్న సౌకర్యాలు, అక్కడి నియమనిబంధ
నలు వంటివి కూడా అడగాల్సిన ప్రశ్నలే.
• ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన ఆహార, ఇతరత్రా
శారీరక జాగ్రత్తల గురించి ముందుగానే అవగాహన
ఏర్పరచుకోవాలి. వైద్యుని అనుభవం, గతంలో ఇటు
వంటి ఆపరేషన్లు ఎన్ని చేసింది. వాటిలో ఎన్ని విజయ
వంతమైనది తెలుసుకోవాల్సిన అంశం.
మీకున్న ఆరోగ్య బీమా పాలసీ ఆ పాలసీలో మీ ఆప
రేషన్ కవర్ అయిందో లేదో కూడా తెలుసుకుని
ఉండటం అవసరం. చిన్న పామునైనా పెద్దకర్రతో
కొట్టాలన్నది నానుడి. అలాగే ఆపరేషన్ చిన్నదే అయినా
దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్దవే.

తప్పనిసరి అయితేనే
ఆపరేషన్ థియేటర్ వాతావరణం, అక్కడ
ఆపరేషన్ కి ముందు వైద్యుడి మీద నమ్మకం ఉంచి
అనుసరించే పరిశుభ్రత విధానాలు ఆపరేషన్
టంతోపాటు సంపూర్ణ సమాచారం ఇవ్వటం అవసరం. సక్సెస్ లో కీలకం. వైద్యుడి నేర్పుతోపాటుగా
గతంలో తీసుకున్న చికిత్స, వాడిన మందులు, ఇత
ఆయనకు సహాయం అందించే సిబ్బంది పాటించే
రత్రా ఏవైనా ఆపరేషన్లు చేయించుకునివుంటే ఆసమా జాగ్రత్తలు, ఆపరేషన్ కి ముందు, తర్వాత రోగిని
చారం వైద్యునికి ఇవ్వటం ద్వారా శస్త్రచికిత్స సమ
ఉంచే గది వాతావరణం వగైరాలన్నీ పరిగణనలోకి
యంలో వైద్యుడికి ఎంతో సహకరించినవారవుతారు.
తీసుకుని ఆపరేషన్స్ ఎంపిక చేసుకోవాలి.
ఆపరేషన్ తగిన సర్జన్‌తోపాటు మంచి ఆసుపత్రిని ఆపరేషన్ చేస్తుండగా అనుకోని సంఘటనలు
కూడా ఎంచుకోవాలి.
జరగవచ్చు. అటువంటి ఎమర్జన్సీ పరిస్థితులు
చాలా ఆపరేషన్లలో ఇబ్బందులు తలెత్తవు. నిజానికి తలెత్తినపుడు వాటిని ఎదుర్కొనేందుకు ఎంచు
ఆ ఇబ్బందులు ఆపరేషన్ చేసినందువల్ల కాక ఆపరేషన్ కున్న ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాల గురించి వైద్యు
జరిగిన వాతావరణంబట్టి వస్తాయి.
డిని ముందుగానే అడిగి తెలుసుకోవాలి.

Thursday 27 October 2016

వంటింటి లోనే పోషకాలు



ప్రతి ఆహార ద్రవ్యంలోనూ దేని పోషకాలు దానికి
ఉంటాయి కదా? కొన్నింటి గురించే ఎక్కువ
మంది వైద్యులు చెప్తున్నారు. ఆహారం ఎందుకు, ఎలా
తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఆహార లక్ష్యాలు వివరి
స్తారా?


ఆహారాన్ని దేశ, కాలమాన పరిస్థితులకు అను
గుణంగా ఒక పథకం ప్రకారం తీసుకోవటం విజ్ఞత.
శరీర ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచటం, శరీర బరువు
సమస్థితిలో ఉండేలా చూడటం, పోషకాలన్నీ తగుపా
ళ్లలో ఉండేలా జాగ్రత్త తీసుకోవటం పోషక లోపాల
వలన కలిగే వ్యాధులకు ఆస్కారం లేకుండా జాగ్రత్త
పడటం, ఆహారంవల్ల కలిగే వ్యాధులు దీర్ఘ వ్యాధు
లుగా మారకుండా జాగ్రత్త పడటం, ముంచుకొచ్చే
వృద్ధాప్యాన్ని నివారించి జీవనప్రమాణాన్ని పెంపొం
దించుకోవటం గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు,
స్త్రీబాల వృద్ధులకు తగినంత పోషకాలు అందేలా
చూడటం, పుట్టే బిడ్డ తగినంత బరువు, ఎదుగుదల
ఉండేలా చూడటం ఇవీ ఆహార లక్ష్యాలు. శరీర
తత్వాన్ని తెలుసుకుని తగినట్టుగా ఆహార పదార్థాలను
ఎంపిక చేసుకోవాలి. ఏవి తింటే శరీరానికి సౌక
ర్యంగా ఉంటుందో అవి తినాలి. వేటివలన అసౌ
కర్యం, అనారోగ్యం అనిపిస్తుందో వాటిని తగ్గిం
చటం, మానేయటం కూడా అవసరం.


మన ఆహారంలో తగినంత పోషకాలున్నాయా?
సామాన్యుడు వాటిని కొనగలడా? వైద్యశాస్త్రం ఆహా
రాన్ని పోషకాల పేరుతో మరింత ఖరీదు చేస్తోందం
వారా?
* పోషకాలు రోజువారీ మనం తినే ఆహారంలోనే
ఉన్నాయి. బజార్లో అమ్మే పదార్థాల మీద విటమిన్లు
వగైరా ఎంతెంత ఉంటాయో రాసి ఉంటుంది కాబట్టి
అనే పోషకాలని, ఇంట్లో వండుకునేవి బలకరమైనవి
కావనే అపోహ చాలా మందిలో ఉంది. పోషకాలనే
రుతో వ్యాపార పరంగా అమ్మే పాలపిండి డబ్బాల
ప్రకటనల్ని, వాటి ఖరీదుల్ని చూసి, పోషకాలు సామా
న్యుడుకి అందుబాటులో లేవంటున్నారు. ఆ డబ్బాల్లో
నిజంగా పోషకాలు ఎంత ఉన్నాయో దేవుడికెరుక.
పోషకాల కోసం మార్కెట్లో వెదకద్దు. వంటిం
బ్లోనే వెదకండి! రాగి,
జొన్న, సజ్జ, గోధుమ
ల్లాంటి ధాన్యాలు, కంది
పప్పు, వేరుశనగ,
నువ్వులు, ఆవాల్లాంటి
నూనె గింజలు, పంచ
దార, బెల్లం ఇవన్నీ పోష
కాలే! మన ఆహారంలో
పోషక విలువలు లేని పదార్ధామే లేదు.
నిజానికి ఆకుపచ్చని ఆకుకూరలు బాగానే దొరు
కుతున్నాయి. కానీ, వాటిని ఫథ్యం కూరలని తన
దించే వాళ్ళు ఎక్కువ. విందుభోజనాల్లో సాధార
-జంగా ఆకుకూరలు వడ్డించకపోవడానికి ఎక్కువ
- మంది తినరనే అభిప్రాయమే కారణం.
బాగా మసా
లాలు దట్టించి, నూనె పోసి వండితేనే అది వంటకం
అనే వాళ్ళు ఎక్కువ. వీళ్ళవలన తక్కిన వాళ్ళక్కూడా
పోషకాలు అందకుండా పోతున్నాయి. ఆకుకూరలు
- పెడితే నీళ్ళ విరేచనాలు అవుతాయని కొందరు ఆకు
-కూరల్ని వండరు. ఆకు కూరల్లో ఉండే పీచు పదా
-ర్థాలు (డైటరీ ఫైబర్స్) విరేచనం ఫ్రీగా కావడానికి
-కారణం అవుతాయి. ఈ ఫైబరు తగినంత మోతా
దులో పేగులకు అందితేనే జీర్ణకోశ వ్యవస్థ బలసంప
-న్నంగా ఉంటుంది. దీనివలన కొందరు పిల్లలకు
5 కొంచెం ఎక్కువ విరేచనాలు కావచ్చు. కొద్దికొద్దిగా
తినిపిస్తూ అలవాటు చేయటమే మంచిదికాని,
మాన్పించటం సరికాదు.
పిల్లలకు పసినాటి నుండే
రకరకాల కూరగా
యలు, ఆకు కూరలు,
షకాలు
పప్పు ధాన్యాలను కొద్ది
కొద్దిగా తినిపిస్తూ శరీ
రానికి అలవాటు
చేయాలి. అందువ
లన జీర్ణాశయ వ్యవ
స్థకూ, కూరలకూ,
పండ్లకూ మధ్య
స్నేహం కలుస్తుంది.
జీర్ణశక్తి బలపడు
తుంది.
వైద్యశాస్త్రం
వంటింట్లో దొరికే
పోషకాలను చక్కగా
ఉపయోగించుకోవా
లనే చెప్తోంది. మనమే
వాటిని బజార్లో వెదు
క్కునే ప్రయత్నం
చేస్తున్నాం. డబ్బు తగ
లేని ఆరోగ్యానికి బదు
లుగా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం.
-

గర్భవతులు ఎక్కువ తినాలా?


 గర్భవతులకు ఎక్కువ అన్నం పెట్టాలా?
మామూలుగా తింటే కడుపులో బిడ్డకు
సరిపోదా?

గర్భం దాల్చిన సమయంలో గర్భవతులకు
అదనపు ఆహారం అవసరమే! ఇద్దరు మనుషుల
తిండి తినాలని దీని భావం కాదు. బిడ్డ ఎదుగుద
లకు కావలసిన పోషకాలు అందేందుకు, పోషక
విలువలు కలిగిన అదనపు ఆహారం అవసరమే!
అట్టడుగు ప్రజలే కాదు, మన సమాజంలో
మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి స్త్రీలక్కూడా
పోషకాహార లోపం ఎక్కువగానే ఉంటోంది. చదువు
కున్నవారు, స్థితిమంతులు కూడా అనాలోచిత
వ్యామోహాలతో పోషక విలువలు లేని జంక్ ఫుడ్స్
మీద యావ వదులుకోలేకపోతున్నారు. పిజ్జాలు,
రోటీ కర్రీలే కాదు, ఇంట్లో తినే బజ్జీలు, పునుగులు
కూడా జంక్ ఫుడ్స్! గర్భం దాల్చిన సమయంలోనూ,
బిడ్డకు పాలిచ్చే సమయంలోనూ ఇలాంటి ఆహా
రాన్ని ఎక్కువగా తింటే స్థితిమంతులక్కూడా పోష
కాహార లోపం కలిగే ఆవకాశం ఉంది.
బిడ్డ తక్కవ బరువుతో అరకొర ఎదుగుదలతో
పుట్టాడంటే తల్లి ఆహార లోపం కూడా ఒక కారణం
కావచ్చునని అర్ధం చేసుకోవాలి. నిండు చూలాలు
గనక 10 కిలోల బరువు పెరిగితే కడుపులో బిడ్డ 3
కిలోల వరకూ బరువు పెరగటం అనేది ఆరోగ్యదా
యకంగా జరగాలి. మొదటి 3నెలల్లో ఒక అర
గ్రాము ప్రోటీను, నాలుగోనెల నుండీ 6వనెల వరకూ
7గ్రాముల ప్రోటీను 6వనెల నుండి ప్రసవించే
వరకూ 23 గ్రాముల ప్రోటీను అవసరం అవుతా
యని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండి
యన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి సూచన.
ఐరన్, కాల్షియం, ఎ విటమిన్, అయోడిన్ ఇతర ఖని
జాలు కూడా తగుపాళ్ళలో గర్భవతులకు అందాలి.
ఇందువలన బిడ్డలకు పుట్టుకతోనే వచ్చే వ్యాధులు,
తక్కువ బరువుతో పుట్టటం, అవయవ లోపాల్లాంటి
సమస్యలన్నీ నివారించవచ్చు.
ఆర్థిక స్తోమత లేకపోవటం, వాంతులు, గ్యాస్,
తినబుద్ధి కాకపోవటం, వండుకునే ఓపిక లేకపోవ
దాల వలన కూడా గర్భ
వతులు పోషకాహారం
తీసుకోలేకపోతున్నారు.
అతిగా మసాలాలు,
కారాలు, అమిత పులుపు
తిన్నప్పుడూ కడుపులో
పెరిగే బిడ్డ ఎక్కువ కదిలి
పడతాడు.
ఇబ్బంది
.
ఇబ్బంది పెడతాడు కూడా!
గర్భవతుల ఆహారం అంటూ ప్రత్యేకంగా ఏది
వ ఉండదు.
రోజు వారి తీసుకునే ఆహారంలోనే కూర
గాయలు, ఆకుకూరలు, పళ్ళు, పాలు తగినంతగా
ఉండేలా చూసుకోవాలి. తేలికగా అరిగే పద్ధతిలో
వండుకుంటే కడుపులో గ్యాసు ఏర్పడదు. అన్నం
-తక్కువ, కూర పప్పు ఎక్కువగా తినేట్లు వండుకో
వాలి. మంచి నెయ్యి వాడకం కూడా మంచిదే! తేలి
త కపాటి మాంసం, గ్రుడ్లు తీసుకోవచ్చు. ఆహార పదా
ర్ధాల ద్వారా సహజంగా వచ్చే పోషకాలు వంటబట్టి
-, నట్టు ఔషధ రూపంలో తీసుకునే విటమిన్లు వగైరా
- వంటబట్టవని గుర్తించాలి. పొట్టు తీయాల్సిన అవ
సరం లేని గోధమ, జొన్న, రాగి, సజ్జ వీటితో
తరుచూ చేతనైన వంటకాలు చేసుకు తినటం వలన
ఎక్కువ విటమిన్లు, పీచు పదార్థాలు, ఖనిజాలు శరీరా
నికి అందుతాయి.
పాలు, పెరుగు, చల్ల ఎక్కువగా తీసుకోవటం
వలన క్యాల్షియం తగినంత అందుతుంది. పొట్టలో

మృదుత్వం ఏర్పడుతుంది. ఉపయోగపడే బా!
రియా పేగులకు తగినంత అందుతుంది. గ్యాసు,
ఎసిడిటీ తగ్గుతాయి. మజ్జిగ లేదా పెరుగు తగినంత
తీసుకున్నప్పుడు మొత్తం ఆహారంలోని పోషకాలు
సమత్వాన్ని పొందుతాయి. మజ్జిగ మీద తేరిన నీటిని
తాగటం మంచిది. గర్భవతులు ఉప్పు తగినంత
తీసుకోవాలి. అకారణ ఉప్పు ద్వేషాన్ని కొందరు పని
గట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఉప్పు నిషేధాన్ని
లోకం మొత్తానికి వర్తింప చేయటం సరికాదు.
తరచూ బీవీ చూపించుకోవటం, బిడ్డ ఎదుగు
దల బాగా ఉందని నిర్ధారించుకోవటం, బరువుచూ
సుకోవటం, ధనుర్వాతం ఇంజెక్షను వగైరా తీసుకో
వటం ఇలా వైద్యుల పర్యవేక్షణలో ఉండటం
మంచిది. శరీరానికి కొంతలో కొంత వ్యాయామం
ఇవ్వటం అవసరం. ఏ ఆసుపత్రిలో ప్రసవం చేయిం
చుకోదలుచుకున్నారో ఆ వైద్యురాలిని మొదట్లో
లిసి ఆమె పర్యవేక్షణలో ఉండటం మంచిది. వైద్యు
లకు తెలియకుండా స్వంతంగానో, వారు వీరు
- చెప్పారనో ఏ మందులు వాడవద్దు. పోషక ఔష
ధాలు కొద్ది తప్ప సాధ్యమైనంతవరకూ ఆహారబలం
మీదే ఆధార పడటం అవసరం.
గర్భవతులకు, బాలింతలకు వాతపు నొప్పులు

సహజంగా వస్తుంటాయి. అజీర్తి చేసి ఆహార పదా
రైలు తిన్నప్పుడు వాతపు నొప్పులు పెరుగుతాయి.
ఒక క్యారట్, ఒక ముల్లంగి, ఒక యాపిల్ ఈ
మూడింటిని సమపాళ్ళలో తీసుకుని ఒక గ్లాసు
- జ్యూసు రోజు తాగితే గర్భవతులకు కావలసిన పోష
కాలు సమున్నతంగా అందుతాయి. ప్రసవించిన,
బిడ్డకు పాలిస్తున్నంత వరకూ రోజూ ఈ జ్యూసు
క తాగటం మంచిది. కాఫీ, టీలు, అడ్డపొగ ఇలాంటికి
- గర్భవతులుకు హాని చేస్తాయి. గుట్కాలు, పాన్ మసా
లాలు కడుపులో బిడ్డ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
-వాటికి గర్భవతులు దూరంగా ఉండాలి.


Friday 29 July 2016

బిపి ఉందని తెలిశాక...

Kalaరా,ప్లేgu,క్షయ... ఇలా ఎన్నెన్నో రకాల
వ్యాధులు మనుషులను కబళించివేస్తుండేవి.
మానవాళి మనుగడకు ముప్పుగా మారిన ఆ వ్యాధుల
మీద జరిపిన పరిశోధనలు టీకా మందులతో, వియం
త్రణ మార్గాలనో కనుగొనటంతో పలురకాల భయం
కర వ్యాధులను అంతం చెయ్యగలిగాము.
అయితే వాటిని అంతం చేసిన అనందం అట్టే
కాలం విలవటంలేదు. కొత్త వ్యారులు బయటపడు
తున్నాయి. మనుషులకు కలరిస్తూనే వున్నాయి.
మనుషులను వేధించే అంటువ్యాధుల విషయంలో
తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ జాగ్రత్తలతో
- బయటపడగలుగుతున్నారు. కాని మానవుడికి మరో
కరినుండి సోకక తన శరీరంలోనే సమస్యలను తెచ్చి
-పెట్టేకొత్తరకం రోగాలు ఇప్పుడు వెంటాడుతున్నాయి.
- వాటిలో అధిక రక్తపోటు ఒకటి. ఇది వారి వారి శరీరా
వికి సంబంధించిన ఇబ్బందులు.
తాజా గణాంకాల ప్రకారం వయసులో వున్న
వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరికి అధిక రక్తపోటు
సమస్య వుంటు
న్నది. 65 ఏళ్ళ
లోపు మరణిonche

అదుగురిలో ఒకరి మరణానికి కారణం. ఆయన
రక్తపోటు, ఇంటిలో పెద్దలకు అనారోగ్యం కలిగినప్పుడు
మరో రకంగానో ప్రతి ఒక్కరం ఏదో ఒక సమయంలో
అధిక రక్తపోటు గురించి వినటమో లేక మాట్లాడట
చేస్తాము. కాని వాస్తవంలో రక్తపోటు అంటే ఏమిటి
దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటో తెలుసుకునే
గుండె కొట్టుకుంటుంటే మనిషి బతికి వున్నట్టు
వారు చాలా తక్కువగా ఉంటున్నారు.
రక్తపోటు సమస్యలు ఏర్పడిన తర్వాత వైద్యులు
దగ్గరికి పరిగెట్టేసరికే కొంత సమయం పడుతుంది
ఈలోగా జరగాల్సిన నష్టం జరగవచ్చు. దీర్ఘకాలం
మందులు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
ముందుజాగ్రత్త ముఖ్యం
రక్తపోటు గురించి మనిషి ఆరోగ్యంగా వున్న
సమయంలోనే తెలుసుకుని తగిన జాగ్రత్తలు వహిం
చటం మంచిది. రక్తపోటు ప్రతి మనిషిలో వుండే..
లెక్క గుండె గనుక కొట్టుకుంటుంటే రక్తంలో
రంలో ప్రవహిస్తుంటుంది.
శరీరంలోని రక్తనాళాలగుండా ప్రవహించేటప్పుడు
ఆ రక్తనాళాల గోడల మీద రక్తంవల్ల ఏర్పడే ఒత్తిడిని
రక్తపోటు అంటారు. ఆ రక్తపోటు లేకుంటే రక్తం
నాళాలగుండా ప్రవహించదు. కాబట్టి మనిషి బతం
లంటే రక్తపోటు వుండి తీరాల్సిందే.
రక్తపోటు గురించి అర్థంచేసుకునేందుకు గుండె
పనితీరును తెలుసుకోవటం అవసరం. శరీరంలోని
కీలక అంగం గుండె. నిరంతరం పనిచేస్తుంది.
మానవగుండెలో నాలుగు గదులుంటాయి. వీటిలో
పైన వున్నవి కుడి, ఎడమ కర్ణికలు, కింద వున్నవి
కుడి, ఎడమలుగా విభజించబడిన జరరిక.
కర్ణికలు, జఠరికల్లోకి కవాట సహిత రంధ్రాలు
ద్వారా తెరచుకుంటాయి. కుడి కర్ణిక శరీరంలోని
మలిన రక్తాన్ని అందుకుని కుడి జఠరికలోకి పంపు
తుంది. కుడి జఠరికనుండి మలినరక్తం ఊపిరితిత్తు
లలో శుద్ధి చేసేందుకు పంపబడుతుంది.
ఊపిరితిత్తులలో ఆక్సిజన్ గ్రహించి ఎర్రబడిన
రక్తం తిరిగి ఎడమ కర్ణిక, అక్కడినుండి ఎడమ జర్
రికలకు చేరి, అక్కడి నుండి శుద్ధరక్తం శరీర భాగాల
న్నింటికి పంపుతుంది. ఇదంతా గుండె '
లబ్
అని కొట్టుకునేటప్పుడు జరిగే ప్రక్రియ.
గుండె ఒక పంపింగ్ మిషన్వంటిది. గుండె కండ
రాలు, గుండెలోని కవాటాలు అన్నీ సక్రమంగా పని
చేస్తున్నప్పుడే గుండె సంపూర్ణ సమర్థతతో పనిచేస్తుంది. సాధారణ ఆరోగ్యవంతుని గుండె నిమిషా
వికి 60 నుండి 90సార్లు మధ్య కొట్టుకుంటుంది.
60 నుండి 60సార్లు కొట్టుకుంటే 3 నుండి 5
లీటర్ల రికాన్ని నిమిషానికి శరీరానికి సరఫరా చేస్తుంది.
శరీర అవసరాన్ని బట్టి గుండె కొన్ని సందర్భాలలో
మరింత వేగంగా కొట్టుకుంటుంది.
పరిగెట్టినప్పుడు, భయపడినప్పుడు గుండె దడ
అనిపించటం అందరికి అనుభవమే. గుండె నుండి
నేరానికి శుద్ధ రక్తం తీసుకువెళ్ళే రక్తనాళాలను ధమ
నులని, శరీరంలో మలినపడిన రక్తాన్ని తిరిగి గుండెకు
చేర్చే నాళాలను శిరలని అంటారు.
గుండె పంప్ చేసిన రక్తం నాళాలలో తరంగంలా
ప్రవహిస్తుంది. దీనివలన ఆరక్త ఒత్తిడికి నాళం గోడ
పడి లేస్తుంటుంది. అలా రక్తనాళాలకు పెరిగిన ఒత్తిడి
సమయం సెస్టోల్'గా తగ్గిన సమయం 'డయాస్టోల్'గా
పిలుస్తారు. సిస్టోల్' అంటే ఒత్తిడి అధికం, డయా
స్టోల్ అంటే ఒత్తిడి కనిష్ఠం.
రక్తపోటు అంటే...."
సాధారణ సమయంలో సిస్టోలిక్ పోటు 160
మి.మీ. హెచ్.జిగా సిస్టోలిక్ పోటు 90 మి.మీ. హెచ్.
జిగా వుంటుంది. ఎమ్.ఎమ్ హెచ్.జి అని రక్తపోటు
కొలతను చెపుతారు. ఇందులో హెచ్.జి అనేది పాద
రసం రసాయనిక గుర్తు. మి.మీ. కొలత.
రక్తపోటును కొలిచేందుకు వాడే పరికరంలోని
సన్ననినాళంలో పాదరసం ఎంత ఎత్తుకు చేరిందో అది
సూచిస్తుంది. 160/90 కన్నా ఎక్కువవున్నా ఆరో
గ్యంగావున్నవారు లేకపోలేదు. ఐతే 160/90ని సాధా
రణ రక్తపోటుగా పేర్కొంటారు. మానవుని రక్తపోటును
కొలిచే సాధనాన్ని స్పిగ్మోమానో మీటర్' అంటారు.
ఈ రక్తపోటు మనిషిలో స్థిరంగా వుండదు. విశ్రాం
తిగాపడుకున్నా, నిద్రిస్తున్నా రక్తపోటు తక్కువగా
వుంటుంది. నిలబడినప్పుడు, నడిచినప్పుడు, మెట్లు
ఎక్కేటప్పుడు, పరిగెడుతున్నా ఆదుర్దా, ఆనందం,
భయంవేసినా రక్తపోటు పెరుగుతుంది.
పనిచెయ్యటం ఆపినా, ఆ భావోద్వేగాలనుండి
-వెనక్కి వచ్చినా తిరిగి రక్తపోటు సాధారణమవుతుంది.
గుండె, రక్తనాళాలు సాధారణ ఆరోగ్యస్థితిలో వున్న
5ప్పుడు ఇటువంటి రక్తపోటు హెచ్చుతగ్గుల్ని తట్టుకుని
నిలబడగలుగుతాయి.
5 అలాకాక అధిక రక్తపోటు- ఎక్కువసేపు నిలిచి
వుంటే అది ప్రమాదానికి దారితీస్తుంది.
గుర్తించటమెలా! -
అధిక రక్తపోటు వుందని చాలామందికి వెంటనే
తెలియదు. కీలక అంగాలకు దెబ్బ తగిలేవరకు
తాము తీవ్ర రక్తపోటు బాధితులమని తెలుసుకోరు.
రక్తపోటు సమస్యను నైపుణ్యం కలిగిన వైద్యుడు
- మాత్రమే గుర్తించగలడు.
కాబట్టి రక్తపోటు విషయంలో అప్పుడప్పుడు పరీ
క్షలు చేయించుకోవటం అవసరం. కారణాలు
స్పష్టంగా తెలియదు కాని కొన్ని వర్గాలలో మాత్రం
రక్తపోటు సమస్య వుంది.
భారీకాయంగలవారికి, ఆర్థిక సమస్యలతో సత
మతమయ్యేవారికి, 65 సంవత్సరాలు పైబడినవారు,
వంశంలో అధిక రక్తపోటు లక్షణం వున్నవారు రక్త
పోటును మధ్యమధ్యలో చెక్ చేయించుకోవాలి.
అలాగని ఆ వర్గాలకు చెందనివారికి పరీక్షలు
అక్కరలేదని కాదు. శారీరకంగా, ఆరోగ్యపరంగా
కనిపించే కొన్ని లక్షణాలను అధిక రక్తపోటు లక్షణా
లుగా భావించి పరీక్ష చేయించుకోవటం అవసరం.
తరచుగా తలనొప్పి, విడవకుండా ఆ తలనొప్పి
వేధించటం, అర్థంలేని అలసట, తల తిరుగుడు,
ఒత్తిడికి గురికావటం వంటివి కనిపిస్తే రక్తపోటు
పరీక్ష చేయించుకోవాలి. ఏదైనా పనిచేస్తున్నప్పుడు
ఊపిరి అందక ఇబ్బందిపడుతుంటే అది రక్తపోటు
తీవ్రత లక్షణంగా తెలుసుకోండి.
సైలెంట్ కిల్లర్
అధిక రక్తపోటు అనేది ప్రమాదకరమైనది. ఎటు
వంటి హెచ్చరిక లేకుండా చాటుగా దెబ్బతీస్తుంది.
ఒకసారి అధిక రక్తపోటు సమస్య ఏర్పడితే దానిని
2917.2016
నియంత్రించుకుంటూ జీవితకాలమంతా భరించటం
తప్పించిదానిని పూర్తిగా తగ్గించుకునే మార్గం లేదు.
ముందస్తు హెచ్చరికలు చేయకుండా లోపల
కీలక అంగాలైన గుండె, మూత్రపిండం, మెదడు
లను దెబ్బతీస్తుంది. కాబట్టి హైబీపిని సైలెంట్
కిల్లర్ అని అంటారు.
రక్తపోటు పెరిగినపుడు రక్తనాళాలలో రక్త ప్రవాహ
నికి అడ్డంకి ఏర్పడుతుంది. అటువంటి సమయంలో
రక్తాన్ని నాలాలలోకి సరిగా పంప్ చేసేందుకు గుండె
మరింత కష్టపడాల్సి వస్తుంది. సాధారణ స్థాయిని 4.
మించిన ఒత్తిడిలో గుండె పనిచేసినందున గుండె
కండరాలు అలసిపోయి చివరికి పనిచేయటం మాని
వేస్తాయి. అప్పుడు గుండెపోటు వస్తుంది.
రక్తపోటు తీవ్రత ప్రభావాన రక్తనాళాలలో ఒత్తిడి
అధికమై రక్తనాళ గోడలనుండి సూక్ష్మంగా రక్తస్రావం
జరగవచ్చు లేదా రక్తనాళాలు చిట్లవచ్చు.
గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్త
నాళాలు దెబ్బతింటే, గుండెకు అవసరమైన శక్తి
లభించక గుండెపోటు వస్తుంది.
అధిక రక్తపోటు ప్రభావాన మూత్రపిండాల పని
తీరు పాడవుతుంది. అసలు పూర్తిగా దెబ్బతినవచ్చు.
మెదడులో రక్త ప్రసరణ సమస్యవల్ల పక్షవాతం
వస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారికి సాధా
రణ ఆరోగ్యవంతులకన్నా పక్షవాతం, గుండెపోటు
ఇబ్బందులు రెండురెట్లు అధికంగా వుంటాయి.
ఎందుకు వస్తుంది.
అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ అనేది రెండు
రకాలు. వీటిలో ఒకదానిని 'మాలిగ్నెంట్ హైపర్
టెన్షన్' అని ఇక రెండవ దానిని బినైన్ హైపన్షన్
అని అంటారు.
మాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుందో
సరిగా తెలియదు. కాని ఇది యవ్వనంలో వున్న
వారికి వస్తుంది. దీనివలన కంటి చూపు కొంతమేర
2. దెబ్బతింటుంది. మూత్రపిండాల పనితీరు మంద
గించి క్రమంగా పూర్తిగా పనిచెయ్యవు. ఊపిరాడక
ఇబ్బంది పడతారు. హైపన్షన్లో గతంలో పలు
వురు మరణించేవారు. ఇప్పుడు దీనిని నియంత్రించే
మందులు మార్కెట్లోకి వచ్చాయి.
'బినైన్ అనే ఆంగ్ల పదానికి అర్థం అంతగా ప్రమాద
హేతువుకానిదని. కాని వేలాది మంది ప్రాణాలు
బలికొంటున్న దీనిని 'బినైన్ అని ఎలా అనగలం.
అయితే గతంలో ఎందుకో ఆ పేరు పెట్టారు.
ఇప్పటికీ అదే స్థిరపడింది.
'బినైన్ హైపర్టెన్షన్' ఎటువంటి ఇబ్బందులను
ప్రారంభంలో చూపించదు. ఏదీ హరాత్తుగా జర
గదు. క్రమంగా పెరుగుతూ రక్తనాళాలను, గుండెను
దెబ్బతీసి చివరికి గుండెపోటు తెస్తుంది.
'బినైన్ హైపర్ టెన్షన్' వచ్చిన వారిలో 90శాతం
మందిలో ఎటువంటి ఇబ్బందులు కనిపించవు. ఇది
వంశపారంపర్యంగా వస్తుంది. అయితే 30 ఏళ్ళు
దాటేవరకు బయటపడదు. తల్లిదండ్రులు ఇరువురు
హైపర్ టెన్షన్' కలిగిన వారైతే సంతానానికి ఆ
ఇబ్బంది వచ్చే అవకాశం అధికం.
వంశపారంపర్యంగా హైబిపి' వుండి ఉప్పు అధి
కంగా తినే అలవాటు వుంటే హైపర్ష రావటం
ఖాయం. తాగే నీటిలో కాల్షియమ్, మెగ్నీషియమ్
లేకున్నా, కాడ్మియమ్ కలిగివున్నా హైపన్షన్
వస్తుంది. తీవ్ర భావోద్వేగాలకు గురయ్యేవారు. నిరం
తర ఒత్తిడికి గురయ్యేవారికి హైపర్టెన్షన్ వస్తుంది.
రక్తనాళాల గోడలు గట్టిపడినా, సాగేగేణం తగ్గినా
రక్తపోటు వెంటనే పెరుగుతుంది.


తీసుకుని చర్చిస్తాడు.
.
.
- హైపర్టెన్షన్ కి పరీక్ష
హైపర్ టెన్షన్ కి పరీక్ష చేయించుకున్న తర్వాత
- వైద్యుడు మూడు ముఖ్యమైన అంశాలను పరిగణలోకి
• హైపర్ టెన్షన్ స్థాయి ఏ స్థాయిలో వున్నది... దాని
వల్ల ఇప్పటికే జరిగిన నష్టం
హైపన్షనికి గల కారణాలు ఏమిటి
మీరు ఏమిచేయటంవల్ల ఇప్పటికే వున్న
రోగం
ముదురుతున్నది.
వీటికోసం కీలక అంగాలన్నింటిని పరీక్షిస్తారు.
కారణం తెలిస్తే తప్పించి చికిత్సను మొదలు పెట్ట
లేరు. ఎడ్రినల్ గ్రంధిలో కణితి వంటిది కారణమైతే
- శస్త్ర చికిత్స ద్వారా తొలగిస్తే సరిపోతుంది. కిడ్నీలకు
సోకిన ఇన్ఫెక్షన్ కారణమైతే మందులు ఇస్తారు.
కాని 90 శాతం కేసుల్లో హైపన్షన్ వాస్తవ
కారణం స్పష్టంగా తెలియదు కాబట్టి వైద్యుడు ఆ
కారణం వెతికి పట్టే యత్నం చేస్తారు.
భారీకాయం, ఒత్తిడి, డయాబెటిస్, పొగతాగే
అలవాటు, కొలెస్టరాల్ అధికంగా వున్న ఆహారం,
ట్రైగ్లిసరిన్స్... ఇలా ఏవైనా కారణం అయి వుండవచ్చు.
కాబట్టి ముందుగా వాటిని ఒక వైద్యుడిని ఎంచుకున్న
తర్వాత ఆ నిపుణుడు చెప్పిన పద్ధతిలో జీవనవిధానం
మార్చుకోవటం, మందులు వేసుకోవటం చెయ్యాలి.
వైద్యుడి సూచన మేరకు తరచు పరీక్షలు చేయించు
కోవాల్సి ఉంటుంది.
చికిత్స అనేది హై బి.పి.ని అదుపులో వుంచే
యత్నమే గాని తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేది
కాదన్న వాస్తవం గుర్తించి దానికి తగినట్టుగా జీవితం
గడపటం ఎంతైనా అవసరం.
ఉప్పు తక్కువ ఆహారం, ఊరగాయలు లేని
భోజనం వంటివి సూచించినపుడు తు.చ. తప్పక
పాటించాలి. ఆహారం, అలవాట్ల విషయంలో వైద్యుడి
సమయానికి నిద్ర, తగినమేర వ్యాయామం, ఒక
అయితే వైద్యులు చెప్పనది, ఇప్పుడిప్పుడే రుం
నియమ నిబంధనల పాటింపు తప్పనిసరి. సరైన
గురవని జీవన విధానంతోపాటు తరచుగా వైద్య పరీ
వులతో అంగీకరించబడిన కొత్త ఔషదం "నప్పు...
నవ్వు హైటెన్షన్ని అదుపులో వుంచగలిగిన మాన
నవ్వినప్పుడు ప్రారంభ దశలో మనకు బి.పి.
పెరిగినట్టు అనిపించినా అది ఆ తర్వాత సాధారణ
క్షలు చేయించుకోవాలి.
సిక, శారీరక అంశం.
నవ్వితే ముఖం, మెడ,గొంతు, ఛాతి, ఉదర కండ
రాలన్నీ కదలటమే కాదు రిలాక్స్ అవుతాయి.
స్థాయికి తెస్తుంది.
1
ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆదుర్దా కలిగి
నప్పుడు ఎండార్ఫిన్స్ విడుదలై కార్టిసాల్ ప్రభావాన్ని
ఔషధంగా నవ్వుల
నప్పుడు విడుదలయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ రక్ష
నాళాలు కుచించుకుని రక్తపోటు పెరిగేలా చేస్తే నవ్వి
తగ్గించి ప్రశాంతతను తెచ్చి పెడతాయి. దీనితో బి.పి
సాధారణమవుతుంది.
నవ్వినప్పుడు రక్తప్రసరణ మెరుగవుతుంది.
రక్తంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇది కూడా
హైబి.పి. ఇబ్బందినుండి ఉపశమనం కలిగించేదే.
అయితే చిరునవ్వులు చిందించి నవ్వుతో లాభం
కలగలేదనుకోకండి. మనసారా నవ్వగలిగితేనే ఈ
లాభం పొందగలరు. మీరు ఎంత బిగ్గరగా నవ్వగలి
గితే అంత మంచిది.
నవ్వుతో బి.పి.అదుపులో వుంటుందని భారతీయ,
జపాన్ పరిశోధకులు ధృవీకరించిన తర్వాత నేడు
ప్రతి పట్టణంలో లాఫింగ్ క్లబు ఏర్పడుతున్నాయి.
రోజూ ఉదయం లేదా సాయంత్రం తప్పని సరిగా
నవ్వులలో తేలియాడే సాటిబృందం వుంటే మీ హైపర్
టెన్షన్ సమస్యను హాయిగా మరచిపోగలరు. కనీసం
రోజులో 15 నుండి 20 నిమిషాలు మనసారా నవ్వే
వారికి చక్కని మందు దొరికినట్టే.
హై బి.పి. అనగానే భయంతో వణికిపోయి
జీవితం అంతటితో సరి అన్న ఆలోచన రానివ్వవద్దు.
ఒక వైద్యుడి నుండి మరో వైద్యుడి దగ్గరికి మారి
నంత మాత్రాన తక్షణం ఈ రోగం తగ్గుతుందన్న
భ్రమవదలటం మంచిది.
భిన్నమైన అభిప్రాయాలు వైద్యులు చెప్పినందున
గందరగోళం పెరుగుతుందే కాని తగ్గదు. ఇక హైపర్
టెన్షన్ అదుపుకు ఎక్కువ సమయం పడుతుంది.
సహనం చాలా అవసరం.
శరీరంలో సైలెంట్ కిల్లర్' చేరింది కాబట్టి దాని
మీద సహనమనే ఆయుధమే పనిచేస్తుంది. ఆదుర్దా
పడితే ఆ 'కిల్లర్' సులభంగా దెబ్బతీస్తుంది.
హైపర్ టెన్షన్ ని అదుపులో వుంచుకుని హాయిగా
జీవనం సాగించినవారు వేలల్లో వున్నారు. ఆ అవగా
హనాలేమే అసలు ఇబ్బంది.

పగటి నిద్ర ,రాత్రి డ్యూటీలు చేసేవారికి ఆయుర్వేద , ఆరోగ్య వైద్య సలహాలు. / PAGATI NIDRA - RATHRI DUTIES - HEALTH TIPS

పగటి నిద్ర ,రాత్రి డ్యూటీలు చేసేవారికి ఆయుర్వేద , ఆరోగ్య వైద్య సలహాలు.

జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవలి నివేదిక ప్రకారం 5,6 ఏళ్ళ పాటూ రాత్రిళ్ళు మేల్కొని పని చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.ప్రకృతికి ఇలా విరుద్ధంగా జీవించటాన్ని సర్కాడియన్ రిథం డిస్రప్షన్ అంటారు .పాతికేళ్ళకు పైగా నైట్ డ్యూటీలు చేస్తున్నవాళ్ళు ఉన్నారు,వాళ్ళలో చాలామందికి పగటి డ్యూటీ వేస్తే చేయలేనంతగా రాత్రి డ్యూటీకి అలవాటు పడిపోయి ఉంటారు.కొన్ని తరాలపాటూ ఇలా జరిగితే అది జన్యుపరమైన మార్పులకు దారితీయవచ్చు కూడా.వీళ్ళు ఒక సామాజిక అవ్యవస్థకు / సోషల్ జెట్ లాగ్ గురవుతుంటారు.స్త్రీలలో ఈస్ట్రోజన్ లాంటి పునరుత్పాదక హార్మోనుల ప్రభావం తోడవడం వల్ల , నడివయస్సు దాటిన వారిలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.మన అవసరాలు గడవడం కోసం , బాహ్య ప్రకృతిని, పర్యావరణాన్నే కాకుండా , మన శరీర ప్రకృతులను కూడా మనం విధ్వంసం చేస్తున్నాము.అతిగా నిద్ర మేల్కోవడం వల్ల బుర్ర పని చేయడం తగ్గిపోతుంది.పనిలో నాణ్యత పడి పోతుంది.మనిషి పక్షవాతానికి, బీపీ,గుండె జబ్బులు,షుగరు,జీర్ణకోశవ్యాధులకు,కీళ్ళవాతానికి లోనవుతాడు.చీకట్లో మెలకువ, పగలు నిద్ర ప్రకృతి విరుద్ధాలే.తప్పనిసరిగా పనిచేసినపుడు శరీరంలో వాతం,వేడి పెరిగిపోతాయి.కావున ఆహారపదార్థాల ద్వారా వాతాన్ని తగ్గించి,చలువ చేసే వాటిని తీసుకోవాలి.రాత్రి జాగరణవల్ల వాతం వికారం చెందుతుందని ఆయుర్వేదం చెబుతుంది.ఇది పక్షవాతానికి కారణంకూడా కావచ్చని తాజా పరిశోధన తెలుపుతోంది.కాబట్టి చలువ చేసే ఆహారపదార్థాలకు ప్రాధాన్యతనివ్వాలి.పులుపులేని కూరగాయలు,ఆకుకూరలు అన్నీ మేలు చేస్తాయి.కానీ వాటిని అతిగా చింతపండుతోనో ,అల్లం వెల్లుల్లితోనో ,శనగపిండితోనో,నూనెతోనో వండినందువల్ల వేడి , వాతం చేసేవిగా మారిపోతాయి.

ఉదయాన్నే ఒక క్యారెట్, ఒక ముల్లంగి,ఒక ఆపిల్ / లెద పులుపు లేని ఒక పండు  ఈ మూడింటినీ కలిపి మిక్సీలో వేసి జ్యూస్ తీసి తాగాలి.వాతం , వేడి తగ్గుతాయి.శరీర అనుకూలత సాధించుకోవటానికి , వాతహరంగా, వేడిని రూపు మాపేదిగా ఉండే ఆహార పదార్థాల కోసం ప్రణాళిక వేసుకోవాలి. బూడిద గుమ్మడిని సోరకాయా పద్ధతిలో అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు.ఇది శరీరంలో నిద్రలేమి వల్ల కలిగే అలసటను పోగొడుతుంది.మర్నాడు నిద్రచాలక కలిగే ఇబ్బందులు తగ్గుతాయి.బార్లీ జావ , సగ్గు బియ్యం జావ , స్బజా గింజలు, సుగంధిపాల వేళ్ళ కషాయం, పల్లేరు కాయల కషాయం లాంటివి నైట్యూటీలు చేసేవారికి మేలు చేస్తాయి.అలసటను నివారిస్తాయి.
పెరుగు, మజ్జిగ చలవనిస్తాయి.రకరకాల కూరగాయల ముక్కలు వేసి చేసిన పెరుగు పచ్చడి జీర్ణకోశాన్ని బల సంపన్నం చేస్తుంది.ధనియాలు, జిలకర,శొంఠి లను సమానంగా తీసుకొని దంచిన పొడిని మజ్జిగలో కలుపుకొని , కొద్దిగా ఉప్పు వేసుకొని రోజూ ఒకటి రెండుసార్లు తాగాలి.

పొద్దున్నే నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని ఏమీ తినకుండా పడుకొని నిద్రపోవడం మంచిది.రాత్రి 10 గంటల తర్వాత ఎన్ని గంటలు మెలకువగా ఉన్నారో అందులో సగం సమయాన్ని ఇలాగే ఉదయం నిద్రపోతే నిద్రలేమి రాదు అని సుశ్రుతుడు చెప్పడం జరిగింది.పచ్చళ్లు, కారాలు, మసాలాలు మానేయాలి.మద్యం,సిగరెట్లు వాడడం రాత్రి డ్యూటీలు చేసేవారిలో అనారోగ్యాన్ని వేగవంతం చేస్తుందని గ్రహించాలి.

Sunday 19 June 2016

లడ్డూలు - ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాలుLADDOOLU AYURVEDA AROGYA PRAYOJANALU.


లడ్డూ అంటే తెలుగువారికెంతో భక్తి ,పవిత్రం , శుభం.ఇవి మన సంస్కృతిలో ఒక భాగం.సుఖ సంతోషాలకు లడ్డూ పర్యాయపదం.లడ్డూ చేసుకోవడం అంటే తెలుగు వారికి పండగ చేసుకోవడమే.పెళ్ళిళ్ళలో తొలి వడ్డన లడ్డు.తిరుపతి లడ్డు లాగా బందరు లడ్డు / తొక్కుడు లడ్డు కూడా ఎంతో ప్రసిద్ధికెక్కింది.

లడ్డూలను శనగపిండితోనే చేయాలని నియమం ఏమీ లేదు.సున్ని ఉండలు , కొబ్బరి ఉండలు ,నువ్వుండలు ఇవన్నీ లడ్డూలే.మహారాష్ట్ర , బెంగాళీల ప్రభావంతో స్వాతంత్రోద్యమ కాలంలో శనగ పిండి వంటకాలు మనకు ఎక్కువ అలవాటయ్యాయి.అంతకు పూర్వం మినప,జొన్న,సజ్జ,వరి ,గోధుమ,ధాన్యం వంటి చిరుతిళ్లన్నీ వండుకునే వాళ్లు.ఇటీవలి కాలంలో శనగ పిండి వాడకం వేలం వెర్రి అయింది.లడూకి ఆ రుచినిస్తుంది శనగ పిండి మాత్రమే కాదు అందులో చేర్చిన నెయ్యి , పటిక బెల్లం,పచ్చ కర్పూరం,జీడి పప్పు , కిస్మిస్ , యాలకులూ వగైరా.ఇవి సమృద్ధిగా ఉంటే ఏ పిండితో చేసినా రుచిగానే ఉంటాయి.

" ద " అనే అక్షరంలో ఉండే చిర్రి శనగలు లేదా దేశవాళీ శనగలతో చేసినదైతే శనగ పిండి మంచిదే.శనగ పప్పుని మర పట్టించిన శనగ పిండిని వాడుకోవడం మంచిది.బలకరం,కానీ కష్టంగా అరుగుతుంది.జీర్ణశక్తి బలకరంగా లేనివారికి అపకారం చేస్తుంది.పర్వతాలు ఫలహారం చేయగలవారికి శనగ పిండి మేలు చేస్తుంది.శనగ పిండి తిని తట్టుకోగలగాలి.అంతేకాని శనగ పిండి మంచిది కాదు అని ముద్ర వేయడం సరికాదు.