డిప్రెషన్ - చిన్న చిన్న పిల్ల నుంచే వేధిస్తున్న సమస్య ఇది.అల్ల డిప్రెషన్ బారిన పడిన దేశాల్లో మొదటి స్థానంలో మన భారతదేశమే ఉండడం ఇప్పుడు కలవరపరుస్తున్న అంశం.ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం తేటతెల్లమైంది.భారత్ తర్వాత చైనా,అమెరికాలున్నాయి.మారుతున్న జీవన విధానాలు కావచ్చు,ఉద్యోగ కుటుంబ బాధ్యతలు కావచ్చు,మనిషి మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని తన నివేదికలో తెలిపింది.మానసిక సమస్యలకు చికిత్స చేసే వైద్యులు తక్కువగా ఉండడమూ పరిస్థితి తీవ్రమవడానికి కారణమౌతోందని హెచ్చరించింది.
సగం మంది కార్పొరేట్ ఉద్యోగులు డిప్రెషన్ బాధితులు - కాలంతో పాటు జీవితం ఉరుకులు పరుగులు పెడుతోంది.డబ్బు సంపాదించాలి,పేరు తెచ్చుకోవాలి,గుర్తింపు పొందాలి,ఎక్కువ మందిలో ఇదే తపన.ఐతే ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగంలో సమయం లేకుండా వారిలో 42.5 శాతం మందికి డిప్రెషన్ ఉంది.గత సంవత్సరం అసోచాం చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే వారిపైనే డిప్రెషన్ ఎక్కువగా దాడి చేస్తోందని తేలింది.తక్కువ జీతంతో ఎక్కువ సేపు పని చేయించుకోవడం వల్ల ,ఉద్యోగుల్లో అలసట చాయలు కనిపిస్తున్నాయని అధ్యయనం స్పష్టం చేస్తోంది.అదే ఒత్తిడి,ఫ్రస్ట్రేషన్ వరకు వెళుతున్నాయని ,చివరకు డిప్రెషన్ బారిన పడుతున్నారని స్పష్టమైంది.బ్రిటన్ ( 33 గంటలు ),అమెరికా ( 40 గంటలు ) తో పోలిస్తే భారత్ లో సగటు వేతన జీవి ఎక్కువగా పని చేస్తున్నాడు.వారానికి 48 నుంచి 50 గంటలు పని చేయాల్సివస్తోంది.జీతం విషయంలో మాత్రం ఆ దేశాలకన్నా చాలా తక్కువలోనే ఉంది భారత్.లివింగ్ కాస్ట్,ఇండెక్ష్ ప్రైసింగ్ లను తీసేసిన తర్వాత కూడా 6 రెట్లు ఎక్కువగా ఆ దేశాలు జీతాలిస్తున్నాయి.భారత్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది.ఫలితంగా మానసిక వత్తిడి పెరిగి పోతోంది.పని ఒత్తిడి ఎక్కువవడంతో నిద్ర కూడా సరిగ్గా పోలేని స్థితి ఉంది.
టీనేజ్ నుంచే ఒత్తిడి - 14 యేళ్ళ ప్రాయం వయసంటే ఆడుతూ పాడుతూ గెంతే వయసు.చదువులు,ఫ్రెండ్స్ తో సరదాలు ఇలా ఉంటూ ఉంటాయి.కానీ ,బలవంతంగా రుద్దుతున్న చదువులు ఒత్తిడిని పెంచేస్తున్నాయి.పెరిగిన టెక్నాలజీ వారి అలవాట్లను మార్చేస్తోంది.సెల్ ఫోన్ కు బానిసై పోవడం,అశ్లీల కంటెంట్ వైపు మొగ్గు చూపడం వంటివి పెరుగుతున్నాయి.మందు కొట్టడం,సిగరెట్లు తాగడం,డ్రగ్స్ వాడడం వంటి వాటితో డిప్రెషన్ తాలూకు చాయలు పెరిగిపోతున్నాయి.మానసికంగా సతమతం చేస్తున్నాయి.తల్లి దండ్రులు నిఘా పెట్టకపోవడమూ పరిస్థితిని తీవ్రతరం చేస్తోంది.
డిప్రెషన్ లో టాప్ లో ఉన్న దేశాలు -
1. భారత్ - మన జనాభాలో 6.5 శాతం డిప్రెషన్ తో బాధ పడుతున్నారు.గ్రామాలు,పట్టణాలు,నగరాలు అన్న తేడా లేకుండా అందరినీ అది వేధిస్తోంది.దానిని నయం చేసేందుకు ప్రభావ వంతమైన పద్ధతులు ,చికితసలున్నా ,చేసేవారే కరువయ్యారని సంస్థ పేర్కొంది.సైకాలజిస్టులు,సైకియాట్రిస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపింది.లక్షకు ఒకరు మాత్రమే ఉన్నారని పేర్కొంది.మానసిక సంస్యలతో సగటున ప్రతి లక్షమందిలో 11 మంది ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు.
2. చైనా - డిప్రెషన్ తో బాధపడేవారిలో 91.8 శాతం మంది దాకా చికిత్సలు చేయించుకోవడం లేదు.చైనాలోనూ భారత్ లాంటి పరిస్థితే ఉంది.మానసిక ఆరోగ్యం పై వాళ్లు బడ్జెట్ లో కెటాయిస్తోంది కేవలం 2.35 శాతం మాత్రమే.
3. అమెరికా - ప్రతి 5 మందిలో ఒకరు మానసిక రోగాల బారిన పడుతున్నారు.అందులో కేవలం 41 శాతం మంది చికిత్స తీసుకుంటున్నారు.అంత అభివృద్ధి చెందిన అమేరికాలోనూ మానసిక ఆరోగ్య నిపుణులు చాలా తక్కువే.చికిత్స లేకుండానే దాని నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ దేశ ప్రజలు చెప్పడం విశేషం.
4. బ్రెజిల్ - లాటిన్ అమెరికాలో డిప్రెషన్ తో బాధపడేవాళ్లు ఎక్కువున్న దేశం బ్రెజిలే.హింస ,వలసలు,నిలువ నీడ లేకపోవడం వంటి కారణాలు డిప్రెషన్ లోకి తోసేస్తున్నాయి.
5. ఇండొనేషియా - జనాభాలో 90 లక్షల మంది ( 3.7 % ) డిప్రెషన్ బారిన పడ్డారు.యాంగ్జైటీ / మానసిక ఆందోళన కలుపుకుంటే మరింత పెరుగుతుంది.6% మంది మానసిక రోగాలతో బాధపడుతున్నారు.
6. రష్యా - ఆ దేశ జనాభాలో 5.5% మంది డిప్రెషన్ తో బాధ పడుతున్నారు.2012 ప్రకారం చూస్తే ప్రపంచ సగటు కన్నా మూడింతలు ఎక్కువగా టీనేజర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
AN EXCELLENT COLLECTION OF AYURVEDIC RECIPES OF EMINENT INDIAN AYURVEDIC PRACTITIONERS LIKE BABA RAMDEV , ELCHURI , CHIRUMAMILLA MURALIMANOHAR ,PEDDI RAMADEVI ETC FOR VARIOUS HEALTH PROBLEMS.EXPLAINED IN TELUGU .
మెదడు వ్యాధులు లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
మెదడు వ్యాధులు లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
29, డిసెంబర్ 2018, శనివారం
17, ఏప్రిల్ 2017, సోమవారం
నిద్ర చెడితే మెదడు చెడుతుంది.
Sleeplessness effects brain a lot.Hence we must take proper rest to keep good health of brain.నా వయసు డెబై యేక్కు రాత్రిళ్ళు సరిగా నిద్రరా
వటం లేదు. నాలుగైదు సారైనా మెలకువ
వస్తోంది. నివారణ చెప్తారా?
• నిద్ర పట్టడం లేదనేది (అనిద్ర) చాలామంది
అనుభవంలోని సమస్యే! మధ్య మధ్య మెలకువ
రాకుండా నిద్రపోయినప్పుడే సంతృప్తికరంగా నిద్ర
పట్టిందని భావిస్తారు. ముక్కలు ముక్కలుగా పట్టిన
నిద్రవలన రక్తనాళాలు గట్టిపడిపోయి, రక్త సరఫ
రాతో పాటు ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గిపో
తుంది. తగినంత ఆక్సిజన్ అందకపోతే, మెదడుకి
సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
నిద్ర మధ్యలో మెలకువ వచ్చినప్పుడు దాదాపు
61% వయోవృద్ధుల్లో మెదడు రక్తనాళాలు దెబ్బతిన
దాన్ని గమనించారు. నిద్రాభంగం అధికంగా అవు
తున్న కొద్దీ ఆక్సిజన్ కొరత ఎక్కువై ఈ తేడాలు
మరింత ప్రమాదకరంగా మారడాన్ని, నాడీ వ్యవస్థ
మరింత దెబ్బతినడాన్ని గుర్తించారు. ఈ నిద్రాభం
గానికి అంతర్గతమైన కారణాలు కూడా ఉన్నాయనే
విషయం మీద పరిశోధన కొనసాగిస్తున్నారు.
ఇది రోజువారీ సమస్యగా మారినప్పుడు తప్పని
సరిగా చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిద్ర
మాత్రలు వేసుకోవటం దీనికి సరైన నివారణ కాదు.
నిద్ర సరిగా పట్టనందువలన కూడా మానసిక ఒత్తిడి
ఏర్పడవచ్చు. జీర్ణశక్తి బలంగా లేకపోవటం, మలబ
ధ్ధత, వాతదోషం శరీరంలో వికటించే ఆహార విహా
రాలు కూడా నిద్రాభంగానికి కారణం అవుతాయి.
వాతం వికటించటం వలన ఫ్రాన్స్ లాంటి మానసిక
లక్షణాలు, కీళ్ళవాతంలాంటి ఇతర వాత వ్యాధులు
ఎక్కువగా అనిద్రకు కారణం అవుతాయి. శరీ
రంలో బాగా వేడి చేసినప్పుడు పడుకోగానే నిద్రప
ట్టినా, వెంటవెంటనే మెలకువ వచ్చేస్తుంటుంది.
గుండె దడ, భయంగా ఉండటంలాంటి బాధలేర్పడి
నిద్రాభంగాన్ని కలిగిస్తాయి. మెలకువ వచ్చిందంటే,
ఇంక నిద్రపట్టదు.
ఇందుకు చికిత్స ఆయా
దోషాలకు
అనుగుnanga
చేయవలసి
వస్తుంది.
నిద్రలో తేడా వస్తోం
దంటే తేలికగా అరిగే
ఆహారాన్ని చలవ చేసేపదార్థాలను మాత్రమే తీసుకోవాలి! ఊరగాయ
పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి మషాలాలు, పులుపు పదా
ర్థాలు, నూనె పదార్థాలను మానటం వలన సగం
చికిత్స పూర్తవుతుంది. శరీరానికి తగిన
వ్యాయామం, రాత్రి భోజనానికి ముందు కొద్దిసేపు
నడిచి పెందరాళే ఆహారం తీసుకోవటం, టీవీ
ఇంట్లో ఉందన్న సంగతి మరిచిపోయి 9-10 లోపే
నిద్రకు ఉపక్రమించటం వలన కొంత ప్రయోజనం
- కనిపిస్తుంది. కాఫీ, టీలు, పొగాకు ఉత్పత్తులు నిద్రా
-భంగాన్ని కలిగిస్తాయి. వగలు ఎట్టి పరిస్థితిలోనూ
-పడుకోకూడదు.రాత్రిపూట పుస్తక పఠనం నిద్రపట్టేం
దుకు మంచి ఉపాయాల్లో ఒకటి. మధ్య రాత్రిలో
మెలకువ వచ్చి తిరిగి నిద్రపట్టన్పుడు కూడా
-పుస్తకం అనే ఆయుధం ప్రయోగిస్తే, నిద్రను చెద
గొట్టే రాక్షసి వదిలిపోతుంది. రాత్రిపూట గోరు
చ్చని నీళ్ళతో స్నానం చేసి పడుకుంటే నిద్ర బాగా
వస్తుంది. సుఖవంతమైన శయ్య, ఆహ్లాదకరంగా
అలంకరించిన పడకగది కూడా మంచి నిద్రజన
కాలే!
సారస్వతారిష్ట, అశ్వగంధారిష్ట, ద్రాక్షారిష్ట,
అర్జునారిష్ట, నాల్గింటినీ కలిపిన ఔషధాన్ని రోజు
రెండుసార్లు ఆరు చెంచాల చొప్పున తీసుకుని
కొద్దిగా నీళ్ళు కలిపి తాగండి. క్రమేణా నిద్ర
వస్తుంది. క్షీరబలాతైలం గొట్టాలు ఆయుర్వేద
మందుల షాపుల్లో దొరుకుతాయి. వీటిని పూటకు
రెండు చొప్పున రెండు పూటలా తీసుకొంటూఉంటే నిద్రాభంగం తగ్గు
తుంది. ప్రాణాయామం నిద్ర
పట్టేందుకు
మంచి
ఉపాయం.
జాజికాయ, జాపత్రి,
మరాటీ మొగ్గలను 10
గ్రాముల చొప్పున తీసుకుని,
అందులో 5 గ్రాముల పచ్చ
కర్పూరం (పాయసంలో కలు
పుకునేది - హారతి కర్పూరం
కాదు) ఈ నాల్గింటినీ మెత్తగా
నూరి ఒక సీసాలో భద్రపర
చుకోండి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి రెండు
పూటలా గ్లాసు వేడి పాలలో పావుచెంచా పొడిని
కలిపి తాగుతుంటే మంచి నిద్ర వస్తుంది. కుముదే
శ్వర రసం, ఉదయభాస్కర రసం అనే ఔషధాలు
రెండూ వాడుతూ ఉంటే నిద్రను చెరిచే దోషాలు
తగ్గటాన్ని మా అనుభవంలో గమనించాము.
18, డిసెంబర్ 2012, మంగళవారం
శిరో ధార .. మనశ్శాంతి కి చక్కటి చికిత్స
నేటి యాంత్రిక జీవనంలో అన్ని వయసుల వారు ఏదోరకంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి లోనవుతున్నారు. దానివల్ల జీవితం పై ఒక రకమైన నిర్లిప్తత, జీవనంలో ఒక రకమైన అశాంతి. ఇది ఎక్కువైనప్పుడు విపరీతమైన నిర్ణయాలు. వీటికి తోడు మద్యపానం లాంటి ఏవేవో దురలవాట్లు. ఈ మనసుకి నిద్ర మాత్రలో, మత్తుమందులో కాదు కావాల్సింది.. విశ్రాంతి , నవోన్మేషం కావాలి. అది మన ఆర్య సంస్కృతి చూపించింది. అదే శిరో ధార. మానసిక ప్రశాంతతకు అద్భుత చికిత్స. శిరో అంటే మనస్సుకి కేంద్రమైన తల లేదా మెదడు.' ధార ' అంటే ఆగని ప్రవాహం.
మందులతో కలిసి చేసే ఈ శిరోధారకు శారీరక, మానసిక ప్రశాంతిని,
సమస్థితిని తీసుకురావడం ..తద్వారా మన ఉద్రేకాలను, నిస్పృహాలను నియంత్రించి ,సమాధాన పరచడం, దానివల్ల మన నిత్య జీవనానికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడం దాని ప్రయోజనం.
ఒక క్రమ పద్ధతిలో, కొన్ని సహజ మూలికలతో చేసిన తైలాలు, నెయ్యి ,మజ్జిగ, పాలు వంటి వాటిని శిరస్సులో ఒక ప్రత్యేక బిందువు పై, సున్నితంగా జారే జలపాతం లాంటి ధారతో చేసే చికిత్స శిరోధార. అదీ ఒక ప్రత్యేక సమయంలో కొంత సేపు మాత్రమే.
చికిత్స విధానం ..
గోరువెచ్చని ఆ తైలం ధారగా పడుతున్నప్పుడు, ఆ ఎముకల లోని చిన్నచిన్న రంధ్రాల ద్వారా లోపలికి వెళ్లి మెదడును శాంత పరుస్తుంది. శిరోధార మన ఉద్రేకాలను, ఒత్తిడిలను తగ్గించి శాంతి ని, కొంత ప్రశాంతి ని ,మరికొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా ఎక్కువ సంపాదించాలని, ఇంకా ఎక్కువ ఆనందాన్ని, సుఖాన్ని పొందాలని ఆత్రుతతో యువత ,నడివయసు వాళ్ళు తొందరగా శారీరక సామర్థ్యాన్ని, మానసిక సంతోషాన్ని, సంతృప్తిని కోల్పోతున్నారు . పూర్వీకుల్లోని శుక్ర బీజ సామర్థ్యం నేటి తరంలో క్రమంగా తగ్గిపోతుందని సూచించబడింది. దానికి కారణం కూడా ఇదే.
మన మనసు తనకి మించిన ఒత్తిడికి లోనైతే, అది నరాల బలహీనతకు దారి తీసి, శారీరకంగానూ ,మానసికంగానూ నిర్వీరుడు అవుతున్నాడు. దానివల్ల షుగర్ వ్యాధి , థైరాయిడ్, రక్తపోటు ,లావు ఎక్కడము ,నడుము నొప్పి, సంభోగించే సామర్థ్యం తగ్గడం, తొందరగా వాపు రావడం, ముఖ్యంగా స్త్రీలలో అసంతృప్తి తో కూడిన నిర్లిప్తత వంటివి వస్తున్నాయి. ఆధునిక శాస్త్ర ప్రకారం నిద్రమాత్రలు, మత్తునిచ్చే మందులు తప్ప మరో మార్గం లేదు. నాటి ఆయుర్వేదం శారీరక, మానసిక ,ఆత్మజ ఆహ్లాద స్థితికి మనిషిని తేవడానికి చక్కటి మార్గాలను ప్రతిపాదించింది.
సహజమైన మూలికలే కాదు మనం చూసే నువ్వుల నూనె లాంటి వాటిలో కూడా మనసు ను క్లేద పరిచే ఓషద గుణాలు ఉన్నాయి .మనుషుల జీవ గడియారాల కీలు తిప్పడమే కాదు,
జీవాన్ని నిలిపే ఓషధ సంపదను కూడా ప్రకృతిలో నిక్షిప్తం చేశాడు ఆయన.
రాత్రి పరుండే ముందు పటిక బెల్లం కలిపిన పాలు తాగి, అరికాళ్ళకు నువ్వుల నూనెతో మర్దన చేసుకుని పడుకుంటే మనసు తేలికపడి చక్కగా నిద్ర పడుతుంది .తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఆయుర్వేదం అందించిన మరో చక్కటి వైద్య ప్రక్రియ శిరో ధార.ఈ శిరోధార మనో ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధులు అన్నింటికి చక్కటి చికిత్స.
అందుకే పక్ష వాతం,ఎప్పటికీ తగ్గని రక్తపోటు, ముఖ పక్ష వాతం, కంటి నొప్పి, చూపు తగ్గడం, నిద్ర లేకపోవడం, శిరో వాతం, తరచూ వచ్చే తలనొప్పి, వీటి అన్నింటికి శిరో ధార చికిత్స సూచించ బడింది. అలాగే అతి నీరసంగా ఉన్న వాళ్ళకి , బీపీ తక్కువ ఉన్నవారికి , గర్భిణీ కాలంలోనూ, మెడ వ్యాధులలోనూ ,తలలో గడ్డలు/ బ్రెయిన్ ట్యూమర్, తాగుడు అలవాటు బాగా ఎక్కువగా ఉన్నవారు ఈ శిరో ధార చేయించుకోకూడదు.
శిరో ధార చేయించుకోవడం మనో ఒత్తిడి ఉన్న సామాన్యులు నెలకు ఒక సారి , దాని వల్ల వచ్చే వ్యాధులున్నవారు మిగతా చికిత్సలతో పాటు 9,11,21 రోజులు శిరో ధార చేయించుకోవాలి అదీ శాస్త్ర బద్ధంగా.
శిరో ధార పూర్వ కర్మ.. అంటే వ్యక్తిని ఈ చికిత్స కోసం తయారు చేయడం. ప్రధాన కర్మ అంటే ఒక వేగంతో, ఒకే ధార తో తగిన మందులతో కలిపిన తైలమో , మజ్జిగో నియమితమైన నుదుటికి , శిరస్సుకి మధ్య బిందువులో చికిత్స చేయడం.
పాశ్చాత్ కర్మ అంటే శిరో ధార తర్వాత వ్యక్తి సామాన్య స్థితికి వచ్చేటట్లు చేయడం తో కలిపి మూడు భాగాలుగా ఉంటుంది. దీనికి పథ్యం, అపథ్యం కూడా ఉంటాయి. అంటే ఆ కాలంలో ఫాస్ట్ ఫుడ్ వంటివి తిన కూడదు. చల్లటి మంచులోనూ, ఎర్రటి ఎండ లోనూ తిరగ కూడదు. ఆ చికిత్స జరిగిన రోజులో సంభోగం చేయ కూడదు.ఇలాంటివి ఆచరించాలి.. మరి దీని ప్రయోజనాలు ఏమిటి అంటే..
క్రమ పద్ధతిలో చేసుకునే శిరో ధార వల్ల రక్త ప్రసరణ చక్కగా జరిగి మేధో శక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. జుట్టు ఊడటం తగ్గి చక్కగా పెరుగుతుంది. మంచి నిద్ర పట్టి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శిరో ధార మానసిక ఒత్తిడిని తగ్గించి ,మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది.
తలకి, కళ్ళకి,చెవులకి,ముక్కుకి, మెడకి సంబంధించిన అన్ని రుగ్మతలకు చక్కటి సమాధానం ఇస్తుంది ఈ శిరో ధార. చాలా కాలం నుంచి ఉన్న ఈ నిద్రలేమికి , వణుకుడు వ్యాధికి , ఫిట్స్ వచ్చే వాళ్లకు ఇది చక్కగా ఉపకరిస్తుంది. చక్కటి స్వరం, మంచి వాక్కు కావాలనుకునే వారికి చక్కగా ఉపకరిస్తుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
Featured post
గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు
రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...
-
తెలుగు - తుమ్మ చెట్టు english - indian gum arabic tree హిందీ - బాబుల్ సంస్కృతం లో- బార్బరా మిత్రులారా తుమ్మ చెట్టుతో తయారుచేసిన నాగళ్...
-
మనం తినే ఆహార పదార్థాలలో మహా ఔషధ శక్తులు నుండి ఉన్న ముల్లంగి కూర కూడా ఒకటి. ఈ ముల్లంగి తల నుండి పాదాల వరకు వచ్చే సమస్త రోగాలను సర్వనాశనం...