16, సెప్టెంబర్ 2026, బుధవారం

ఆలివ్ ఆయిల్ తో ఆరోగ్యం..

 ఈనాడు ప్రపంచమంతటా ఆరోగ్య పరిరక్షణకు , దీర్ఘ కాలం ఆనందంగా జీవించడానికి ఏది మంచో , ఏది చెడో అన్న ఆలోచనలతో మానవ మేధస్సు ఎక్కువ ఆలోచిస్తోంది. పూర్వం దూరదృష్టితో చూసే పెద్ద వాళ్ళు మంచి, చెడు చెప్పేవారు. 

ఇప్పుడు శాస్త్రం మనిషి వ్యక్తిగతంగానూ మారి తన శ్రేయస్సుకు ఏది మంచో చూస్తున్నాడు. అలాగే ఆరోగ్యానికి ప్రసిద్ధి చెందింది ఆలివ్ ఆయిల్. 

ప్రపంచమంతటా ఇంత ప్రాచుర్యం పొందడానికి ఆలివ్ తో ఉన్న అనేక ప్రయోజనాంశాలు సమాజపరంగా, వైద్య పరంగా ముఖ్యంగా సహజ ఆహార పదార్థంలో ఉండే జీవ శక్తి వల్ల దీని ప్రాచుర్యం ఎక్కువైంది. 

మెడిటరేనియన్ లో ప్రజలు అనాది నుంచి ఒక ఆహార పదార్థంగానే కాకుండా మంచి మందులా, మంచి అద్భుతంలా సౌభాగ్యానికి, అధికారానికి , కీర్తికి సూచికగా భావిస్తారు, అభిమానిస్తారు. ఈ చెట్టుని అపరిమితమైన శక్తికి , కీర్తికి , శాంతికి చిహ్నంగా భావిస్తారు. 

ఈ చెట్టు విచ్చుకున్న ఆకులతో కూడిన ఆకృతిని స్నేహ పూర్వకంగా జరిగే ఆటలలో విజయ చిహ్నంగా ఉపయోగిస్తారు. రక్తం పారే యుద్ధాలలో శాంతికి ఆలవాలంగా పూర్వులు దీన్ని కీర్తించారు. దీని పండు నుంచి స్రవించే నూనె చరిత్రలో అసామాన్యులుగా కీర్తించబడ్డ చక్రవర్తుల తలలను అభ్యంగనం చేసింది. 

గ్రీకు నాగరికతలో..

ఆలివ్ ఆయిల్ ప్రత్యేకత ఏమిటంటే జీవశక్తిని హరించే వాటిని నిర్మూలించే శక్తి ( యాంటీ ఆక్సిడెంట్స్) విటమిన్ ఎ, ఇ లు ఉన్నాయి. ఇవి మన శరీరంలో కాన్సర్ కలిగించే కారణాలను నివృత్తి చేస్తాయి. 

ఇది మోనో అన్ సాచురేటెడ్ కనుక చెడును కలిగించే , LDL కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అదే సమయంలో మంచిని కలిగించే HDL ను తగ్గించదు. దీని వల్ల రక్త ప్రసారం సమగ్రంగా ఉండి బీపీ ని పెరగనివ్వదు. తద్వారా హృదయ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. 

ఈ మధ్య కాలంలో జరిగిన పరిశోధనల్లో ఆలివ్ ఆయిల్ రొమ్ము క్యాన్సర్, ఎముకల వ్యాధులు రాకుండా నివారించడంలో మంచి ఫలితాలు ఇస్తుందని తేలింది. ఇందులో ఉన్న అధిక ఒలియక్ యాసిడ్ మన రక్త వాహికలను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు సహాయ పడుతుంది. అందువల్లనే పూర్వులు తమ ప్రత్యేక వంటలలో దీన్ని వాడేవారు. 

జీవితమే మారిపోతుంది..

మరో ముఖ్య విశేషం ఈ ఆలివ్ ఆయిల్ ఉష్ణ సహన శక్తి. దీని వల్ల ఒక్క వేపుడు కూరలు తప్ప అన్ని వంటకాలలోనూ దీనిని వాడచ్చు. ఆలివ్ ఆయిల్ తో చేసిన పదార్థాలు చల్లని చోట్ల అంటే రిఫ్రిజిరేటర్ లో ఉంచితే సుమారు సంవత్సరం దాకా పాడవకుండా ఉంటాయి. అందుకే గ్రీకు నాగరికతలో దీన్ని ప్రత్యేకంగా చూసే వారు. మరో విశేషం ఈ ఒలియక్ యాసిడ్ అసాధారణంగా వచ్చే ALD వ్యాధిని ఎదుర్కునే ఒకే ఒక మందు. తలలోని తెల్ల పదార్థం శిధిలమయ్యే అసాధారణ వ్యాధి. 

మీరు ఆలివ్ ఆయిల్ కొనేటప్పుడు శుద్ధమైనది కొనకండి. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కొనండి. ఎందుకంటే అది ఆలివ్ గింజలను నొక్కినప్పుడు వచ్చిన మొదటి నూనె కనుక. దానిలో చాలా తక్కువ ఆమ్లం ఉంటుంది. అలాగే ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. గుండెకు , జీవ శక్తి కి మంచిదైన ఈ ఆలివ్ ఆయిల్ మీ ఆహారంలో కొంచెమైనా చేర్చుకోండి. 

నాలుకకి దీని రుచిని అలవాటు చేస్తే అది మీ గుండెను , మెదడును మొత్తం మీ జీవనాన్ని ఆహ్లాద పరుస్తుంది. మీ మాంసాహారం, చేపలు, రొట్టెలలో ఇది వాడడం మంచిది. ఆలివ్ ఆయిల్ ను ఎప్పుడూ స్టౌ పక్కన, ఎండలో ఉంచకండి. పాడైపోతుంది. వేడి, ఎండ లేని చోట ఉంచండి. ఆలివ్ ఆయిల్ సుమారు 700 రకాల గింజల నుండి సేకరించ బడుతుంది. 

ఇది పచ్చగా ఉండవచ్చు,నీలంగా ఉండవచ్చు. దీని రుచి ఘాటుగా , తీయగా , జిడ్డుగా ఉండవచ్చు. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తొందరగా జీర్ణం అవుతుంది. కొవ్వుని కరిగిస్తుంది. విటమిన్లు ఏ, డి, కె వంటి వాటిని తొందరగా వంట పట్టిస్తుంది.  ఇది కొన్ని కూల్ డ్రింకుల లో రంగు , రూపు నిలవడానికి ఉపయోగపడుతుంది. 

మంచి రుచి కలిగిన ఆలివ్ ఆయిల్ అత్యుత్తమమైనది. ఇది సహజమైన ప్రకృతిలోని పళ్ళ నుండి నేరుగా తీసిన నూనె కనుక దాన్ని అలాగే వాడినా చెడు చేయదు. ఇంత వరకు జరిగిన పరిశోధనలో ఈ ఆలివ్ ఆయిల్ గుండె జబ్బులను నివారించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తుందని తేలింది.ఎందుకంటే ఇంకా  ఏ ఇతర సహజమైన నూనెలలో దీనిలో ఉన్నంత మోనో అన్ సాచురేటెడ్ శక్తి లేదు కనుక.

మన ఆమాశయంలో ( stomach) ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది .అందులో ఉండే పుండ్లు( అల్సర్స్), చీము ( gastritis) ను తగ్గిస్తుంది. బైల్ ఉత్పత్తిని పెంచుతుంది, గాల్ స్టోన్స్ ను తగ్గిస్తుంది.

ఆలివ్ ఆయిల్ కు మన అన్నవాహిక లో వచ్చే క్యాన్సర్ ను నివారించే శక్తి ఉన్నదని దీన్ని ఆహారంలో చేరిస్తే మంచి ఫలితాలు ఇచ్చిందని స్పానిష్ శాస్త్రజ్ఞుల పరిశోధనలలో నిరూపించబడింది.

ఆలివ్ ఆయిల్ ఎక్స్ట్రా వర్జిన్,వర్జిన్, ప్యూర్, ఎక్స్ట్రా లైట్ అని నాలుగు రకాలుగా దొరుకుతుంది.అందులో మొదటిది మంచిది.మనం రోజూ వాడే నూనెల్లో వేరు శనగ నూనె హితం కాదు. నువ్వుల నూనె ఒళ్ళు తగ్గడానికి, కీళ్ల నొప్పులు రాకుండా ఉండడానికి హితకరం. నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ తలంటుకోవడం కంటే అభ్యంగన స్నానానికి,ప్రత్యేక వంటకాలకు హితకరం. అందుకే మన పెద్దలు ఇలా అంటారు " హితమైనది మితమైనా అప్పుడప్పుడు తీసుకోవాలి " అని .


వాపులు, గడ్డలు, మర్మాంగ బలహీనత, రేచీకటి.. ఆయుర్వేద పరిష్కారాలు

 శరీరమంతా వాపులు , గడ్డలు.. ఆయుర్వేద పరిష్కారాలు.. 

రోజూ రెండు పూటలా 7 సార్లు వడపోసిన దేశవాళీ గోమూత్రం పావుకప్పు నుంచి అరకప్పు మోతాదుగా అరకప్పు మంచి నీళ్లు, ఒక చెంచా పటిక బెల్లం పొడి కలిపి సేవిస్తుంటే అతి త్వరగా రక్త శుద్ధి జరిగి కొత్త గడ్డలు పుట్టకుండా ఉంటాయి. 

తుమ్మ చెట్టు వేరుపై ఉండే బెరడు పొడి వస్త్ర ఘాలితము పట్టింది 50 గ్రాములు , మూసాంబరం పొడి 20 గ్రాములు , ముల్లంగి గింజల పొడి 20 గ్రాములు, ఆవాల పొడి 20 గ్రాములు, గుగ్గిలం పొడి 20 గ్రాములు సేకరించి అన్నింటిని వస్త్ర ఘాలితము పట్టి తయారుగా ఉంచుకోండి. ఈ చూర్ణంలో తగినంత మేలు రకమైన కొబ్బరి నూనె గానీ, నెయ్యి గానీ పోసి మెత్తని గుజ్జు లాగా నూరి నిలువ చేసుకోవాలి. ఈ మలాం ను పైన లేపనం చేస్తుంటే అన్ని రకాల వాపులు, గడ్డలు, పుండ్లు హరించిపోతాయి. 

పురుష మర్మాంగ బలహీనత సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు 

పుష్కర మూలం, బల వేళ్ళు, అతి బల వేళ్ళు, వస కొమ్ములు, పెన్నేరు గడ్డలు , గజ పిప్పళ్లు, ఎర్ర గన్నేరు వేళ్ళ పై బెరడు .. వీటిని సమ భాగాలుగా తీసుకుని, విడి విడిగా దంచి జల్లించి వస్త్ర ఘాలితము పట్టి అన్నింటినీ కలిపి గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు తగినంత చూర్ణం తీసుకుని అందులో వెన్న కలిపి గుజ్జులా నూరి ఆ మిశ్రమాన్ని మర్మాంగము ముందు భాగం విడిచి పెట్టీ వెనుక భాగానికి పైన రాసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం పూట కడుగుతూ ఉండాలి. ఇలా చేస్తుంటే బలహీన పడిన మర్మాంగము క్రమంగా దృఢంగా పూర్తి శక్తివంతంగా మారుతుంది. 

రేచీకటి సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..

సోంపు గింజల పొడి 100 గ్రాములు తీసుకుని దంచి జల్లించి వస్త్ర ఘాలితము పట్టి సిద్ధం చేసుకోవాలి. తగినన్ని తమలపాకులు ఆరబెట్టి పొడి చేసి పైన చెప్పిన పొడికి సమానంగా కలిపి ఉంచాలి. అదే మోతాదుగా ప్రశస్తమైన పట్టు తేనె సంపాదించుకుని మూడు పదార్థాలు కలిపి గరుకు లేకుండా మెత్తగా నూరి కాటుక డబ్బాలో నిలువ చేయాలి. రోజూ రాత్రి పడుకునే ముందు పెసర బద్దంత ఈ కాటుకను కళ్ళల్లో పెట్టుకొంటూ ఉంటే  ఆశ్చర్య కరమైన మార్పు ఒకటి రెండు వారాల్లోనే కనిపిస్తుంది. రేచీకటి సమస్య అంతమై దృష్టి శక్తి పెరుగుతుంది. 

దంతాలు , పేలు, చుండ్రు, సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు

పేలు, చుండ్రు సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు 

 గానుగలో తీసిన స్వచ్ఛమైన కొబ్బరి నూనె అర లీటర్ తీసుకుని ఒక పాత్రలో పోసి చిన్న మంట పెట్టండి. తర్వాత బాగా పండిన 5 నిమ్మ కాయలను గింజలు తీసి రసం తీసి నూనెలో పోయండి . క్రమంగా నిమ్మరసం పోయి నూనె మాత్రమే మిగిలే వరకు వేచి ఉండాలి. పాత్రను దించి నూనె వడ పోసి గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. 

ఈ తైలాన్ని రోజూ గోరు వెచ్చగా తలకు పట్టిస్తుంటే చుండ్రు, పేలు పోయి వెంట్రుకలు దృఢంగా మరి తలకట్టు అందంగా మారుతుంది. 


దంతాలు కదిలే సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..

నల్ల తుమ్మ చెట్టు బెరడు 20 గ్రాములు, దోరగా వేయించిన శొంఠి పొడి 3 గ్రాములు తీసుకోవాలి. తుమ్మ చెట్టు బెరడు కడిగి  చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టి పొడి చేసుకోవాలి. శొంఠిని కూడా దోరగా వేయించి దంచి పొడి చేసి.. రెంటినీ కలపాలి.ఆ పొడికి తగినంత ఎవరికి ఎంత అవసరమో అంత సైంధవ లవణం పొడిని కలిపి నిలువ చేసుకోవాలి.

ఈ మిశ్రమ చూర్ణాన్ని ప్రతి రోజూ రెండు పూటలా పళ్ళు తోముకోవడానికి వాడుతుంటే కదులుతున్న దంతాలు గట్టి పడి దృఢంగా మారుతాయి. ఎంతో సులువుగా తయారు చేసుకునే ఈ చూర్ణాన్ని అందరూ వాడుకోవచ్చు.


కిడ్నీలో రాళ్లు, సంతాన సమస్య.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 మూత్రపిండాలలో రాళ్ల సమస్య ఆయుర్వేద పరిష్కారాలు.. 

ఉలవలు..8 గ్రా, సైంధవ లవణం 3 గ్రాములు, వెంపలి వేళ్ళు 2 గ్రాములు తీసుకుని వీటన్నింటినీ కచ్చా పచ్చగా దంచి ముప్పావు లీటర్ మంచినీటిలో కలిపి పొయ్యి మీద పెట్టాలి . చిన్న మంట పైన సగం కషాయం మిగిలే టట్లు మరిగించి దించి వడపోయాలి. ఈ కషాయాన్ని 3 భాగాలుగా చేసి, మూడు పూటలా కొంచెం కొంచెం తాగుతుంటే నాలుగైదు రోజుల లోనే మూత్ర పిండాలలోని , మూత్ర నాళంలోని రాళ్ళు కరిగి పడిపోతాయి. 

సంతాన ప్రాప్తి సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..

రావి చెట్టు పండ్లు సేకరించి కడిగి ముక్కలు చేసి నీడలో బాగా ఆరబెట్టి నిలువ చేసుకోవాలి. ఆ ముక్కలను దంచి మెత్తగా చూర్ణం చేసి పలుచని బట్ట లో వస్త్ర ఘాలితము పట్టి , దానికి సమానంగా పటిక బెల్లం పొడి కలిపి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. రోజూ రెండు పూటలా భార్యాభర్తలు ఇద్దరూ ఒక చెంచా మోతాదుగా చప్పరించి తిని, ఒక గ్లాసు గోరు వెచ్చని పాలలో పటిక బెల్లం పొడి కలిపి 40 రోజుల పాటు సేవిస్తూ పూర్తి బ్రహ్మ చర్యం పాటించాలి. తర్వాత దాంపత్య వేదంలో సూచించినట్లుగా సంసారం చేస్తుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది. 

14, సెప్టెంబర్ 2026, సోమవారం

ఎముకలు, స్తనాల సమస్యలు.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 ఎముక విరిగి ,వాపు వచ్చి, ఒళ్ళు పెరిగిన సమస్యలకు.. 

1.) మేలైన తుమ్మ బంక తెచ్చి చిన్న ముక్కలు కొట్టి కొన్ని చుక్కల నెయ్యితో చిన్న మంట పైన వేయించి దంచి జల్లించి దానితో సమానంగా పటిక బెల్లం పొడి కలిపి నిలువ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని రెండు పూటలా ఒక చెంచా మోతాదుగా చప్పరించి తిని ఒక కప్పు గోరు వెచ్చని ఆవు పాలు తాగించాలి. దీనివల్ల విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. 2.) కరక్కాయ పొడి, ఉసిరి కాయ పొడి, తాని కాయ పొడి , శొంఠి పొడి, మిరియాల పొడి, పిప్పళ్లు పొడి, సైంధవ లవణం సమ భాగాలుగా కలిపి నిలువ చేసుకోవాలి. 

రెండు పూటలా ఆహారానికి అర గంట ముందు అర చెంచా పొడి ఒక చెంచా తేనె కలిపి తినిపించాలి. దీని వల్ల పెరిగిన కొవ్వు తగ్గడమే కాక దెబ్బ తిన్న కాలిలో చేరిన చెడు నీరు కూడా తగ్గి పోయి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. 

వక్షోజాలు కిందికి జారిన సమస్య..ఆయుర్వేద పరిష్కారాలు..

డిసెంబర్, జనవరి మాసాలలో పొలాలలో విరివిగా దొరికే  బోడ తరం మొక్కల పూలు , వేళ్ళు ఒక్కొక్కటి సమభాగాలుగా 200 గ్రాముల చొప్పున తీసుకుని అందులో పిప్పళ్లు 100 గ్రాములు కలిపి మెత్తగా నలగ గొట్టి పాత్రలో వేసి అందులో రెండు లీటర్లు నీళ్లు పోసి అర లీటర్ కషాయం మిగిలే వరకు మరిగించి వడ పోసుకోవాలి. ఆ కషాయంలో పావు లీటరు నువ్వుల నూనె పోసి, నూనె మాత్రమే మిగిలే వరకు చిన్న మంట పైన మరిగించి వడపోసి నిలువచేసుకోవాలి. 

ఈ తైలాన్ని పలుచగా దూదితో తడిపి ఆ దూదిని స్థనాల పైన వేసి పొడి దూదిని పైన పెట్టి ఊడిపోకుండా గుడ్డ కట్టి ఉదయం పూట తీసివేయాలి. దాంతో పాటు అదే తైలాన్ని రెండు మూడు చుక్కల మోతాదుగా ముక్కలలో వేసుకుని లోపలికి పీల్చాలి. ఇలా చేస్తుంటే స్తనాలు గట్టి పడి తగిన ప్రమాణంగా పెరుగుతాయి. 

చెవిలో హోరు, మూత్ర సమస్య.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 మూత్రం తక్కువగా నడుస్తూ ,శరీరం నీటితో ఉబ్బిన సమస్య , .. ఆయుర్వేద పరిష్కారాలు 

పుల్ల దానిమ్మ పండు రసం, చిన్న ఏలకులలోని గింజల పొడి , దోరగా వేయించి దంచిన జిలకర పొడి, సైంధవ లవణం పొడి .. వీటి ఒక్కొక్కరిని 3 గ్రా మోతాదుగా ఒక కప్పు మజ్జిగలో కలిపి రోజూ ఉదయం పరగడుపున తాగిస్తుండాలి. దీని వల్ల మూత్రం బాగా జారీ అవుతుంది. 

2. ) మోదుగ చెట్టు పూలను ఎక్కువగా తెచ్చుకొని నిలువ చేసుకోవాలి. రోజూ ఒక సారి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు తగినన్ని పూలను మంచి నీటితో మెత్తగా గుజ్జులా నూరి బొడ్డు చుట్టూ పట్టించండి. ఈ పట్టు వేసిన 5,10 నిమిషాలలో మూత్రం ధారాళంగా బయటకు వస్తుంది. 

3.) దోస గింజల పొడి 50 గ్రాములు, అతి మధురం పొడి 50 గ్రాములు, మాను పసుపు పొడి 50 గ్రాములు కలిపి నిలువ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని రెండు పూటలా 3 గ్రాముల మోతాదుగా అర కప్పు బియ్యం కడిగిన నీటితో కలిపి తాగుతుంటే మూత్రం సాఫీగా జారీ అవుతుంది. 

చెవిలో హోరు సమస్యకు.. అన్ని చెవి రోగాలను అణచి వేసే అద్భుత కర్ణ తైలం..

ఆయుర్వేద అంగళ్లలో లభించే పిప్పలి కట్టె,సైంధవ లవణం,శొంఠి, తుంగ ముస్తలు, పుష్కర మూలం, వస కొమ్ములు, వెల్లుల్లి పాయలు ..ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకుని మెత్తగా దంచి జల్లించి ఆ చూర్ణాన్ని 300 గ్రాముల నువ్వుల నూనెలో వేయాలి. అలాగే ఆ నూనెలో జిల్లేడాకుల నుంచి దంచి తీసిన రసం కూడా 300 గ్రాములు కలిపి చిన్న మంట పైన మరిగించాలి.క్రమంగా నీరంతా ఇంకిపోయి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి వడపోసి సీసాలో నిలువ చేసుకోవాలి.

ఈ తైలాన్ని రెండు పూటలా గోరు వెచ్చగా నాలుగైదు చుక్కలు చెవులలో వేస్తుంటే , చెవి హోరు మాత్రమే కాక మిగిలిన అన్ని రకాల చెవి సమస్యలు,చెవుడు కూడా క్రమంగా తగ్గిపోతాయి.


13, సెప్టెంబర్ 2026, ఆదివారం

పసుపు తో.. ఆయుర్వేదం..

1 . పింపుల్స్ తగ్గుటకు..




మొటిమలు తగ్గుటకు


పసుపు పొడి - 1 చిటికెడు
పుదీనా రసం - తగినంత

పై రెండింటిని కలిపి ,రాత్రి పడుకునే ముందు మొటిమలపైన రాయాలి.


ఉపయోగాలు - మొటిమలు తగ్గిపోతాయి.


2 . ఫైలేరియా తగ్గుటకు..




పసుపు పొడి - 1 భాగం
బెల్లం - 1 భాగం 

పై వాటిని కలిపి మెత్తగా నూరి ,రోజుకు రెండు సార్లు కుంకుడు కాయ పరిమాణంలో గోమూత్రంతో వేసుకోవాలి.


ఉపయోగాలు - బోదకాలు తగ్గిపోతుంది.


3 . పైల్స్ వ్యాధి తగ్గుటకు..




పసుపు పొడి - 1 భాగం
కలబంద గుజ్జు - 1 భాగం

పై రెండింటిని కలిపి ,మెత్తగా నూరి ,మొలలు పైన లేపనం చేయాలి.

ఉపయోగాలు - మొలల బాధ, రక్త స్రావం తగ్గుతాయి. 

గర్భాశయంలో గడ్డలు, బహిష్టు సరిగా రాని సమస్యలు..

 1.) అధిక బరువు, అండాశయాల్లో నీటి బుడగలు, బహిష్టు సరిగా రాని సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు.. 

థైరాయిడ్ సమస్యతో మిగతా సమస్యలు ఏర్పడతాయి. ముందు థైరాయిడ్ అనుభవ యోగాలు ఆచరించాలి. సహజంగా మిగతా సమస్యలు తగ్గిపోతాయి.

తిప్పతీగ పొడి 100 గ్రాములు, కిస్ మిస్ పండ్లు 100 గ్రాములు కలిపి మెత్తగా దంచి నిలువ చేసుకోవాలి. రెండు పూటలా 10 గ్రాముల మోతాదుగా తింటుంటే బహిష్టు వస్తుంది. రాగానే తినటం ఆపాలి. మరలా బహిష్టుకు పది రోజుల ముందు ఆరంభించాలి. ఇలా మూడు మాసాలు బహిష్టు సమయంలో ఆచరిస్తే ఆ తర్వాత బహిష్టు సక్రమంగా వస్తుంది. 

2.) గర్భాశయంలో గడ్డల సమస్య..ఆయుర్వేద పరిష్కారాలు..

శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, నల్ల నువ్వులు , గంటు బారంగి, బెల్లం .. ఈ పదార్థాలను ఆయుర్వేద దుకాణాల్లో ఒక్కొక్కటి 50 గ్రాములు చొప్పున తెచ్చుకొని, బెల్లం తప్ప మిగిలిన వాటిని దోరగా వేయించి దంచి జల్లించి వస్త్ర ఘాలితము పట్టి ఆ మెత్తని పొడి లో బెల్లం కలిపి దంచి నిలువ చేసుకోవాలి. ఈ అద్భుతమైన ఆహార ఔషధాన్ని పూటకు 10 గ్రాముల మోతాదుగా ఆహారానికి గంట ముందు రెండు పూటలా తింటుండాలి. దీని వల్ల గర్భాశయంలో గడ్డలు క్రమంగా కరిగిపోతాయి. బహిష్టు సక్రమంగా వచ్చి ఆరోగ్యం కుదుట పడుతుంది. 

అధిక దాహం, ఆకలి,తిమ్మిర్లు.. షుగర్ లేకుండా.. ఆయుర్వేద పరిష్కారాలు

 అధిక దాహం, అధిక ఆకలి, కాళ్లు చేతుల తిమ్మిర్లు .. మధుమేహం లేకుండా ఉన్న సమస్యకు.. ఆయుర్వేద పరిష్కారాలు.. 

అధిక వేడి కలిగించే పదార్థాలు బాగా తగ్గించి మాంసాహారాన్ని పూర్తిగా మాని వేయాలి. ఉత్తరేణి గింజలు సంపాదించి ఎండబెట్టి దంచి జల్లించి పొడి చేసుకోవాలి. ఆ పొడితో సమానంగా పటిక బెల్లం పొడి కలిపి నిలువ చేసుకోవాలి. రోజూ ఉదయం, సాయంత్రం అర చెంచా మోతాదుగా ఒక కప్పు వేడి పాలలో కలిపి సేవిస్తుండాలి. దీని వల్ల అధిక ఆకలి, అధిక కొవ్వు తగ్గిపోతాయి. ఎండు ఉసిరి ముక్కలు బుగ్గన పెట్టుకుని చప్పరిస్తుండాలి. అధిక దాహం తగ్గిపోతుంది. రోజూ గోరు వెచ్చని నువ్వుల నూనెతో ఒళ్ళంతా రుద్దుకుని గంటాగి వేడి నీటితో స్నానం చేస్తుండాలి. తిమ్మిర్లు తగ్గుతాయి. 

2.) మర్మాంగము చిన్నగా ఉన్న సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు 

శృంగారవంతమైన ఆలోచనలు , అనుకూల వతి అయిన స్త్రీ , అనువైన వాతావరణం , శరీరంలో తగినంత వీర్య పటుత్వం ..ఇవన్నీ ఉన్నప్పుడే ఏ పురుషుడికైనా  మర్మాంగము ఆ సమయానికి తగినట్లు పెద్దదవుతుంది. అలాంటి పరిస్థితి లేకుండా మనసంతా చదువు మీద ఉన్నప్పుడు ఎవరికైనా అంగం చిన్నదిగానే ఉంటుంది. ఈ నిజం అర్థం చేసుకుని మనసు చదువు మీద దృష్టి పెట్టి మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలి. 

శరీరంలో మంటలు, ముఖం మీద మచ్చలు.. ఆయుర్వేద పరిష్కారాలు

 గొంతులో, కడుపులో, ఛాతీలో మంటలు, నరాల్లో వాపు, ఊపిరితిత్తుల్లో కఫం పెరగడం సమస్యలకు ఆయుర్వేద పరిష్కారాలు.. 

1 . ) రోజూ ఉదయం పూట లేదా సాయంత్రం పూట గోరు వెచ్చని నువ్వుల నూనె తో శరీరమంతా మర్దనా చేసుకోవాలి.చెవుల్లో, ముక్కులో రెండు రెండు చుక్కలు వేసుకోవాలి. ఒక గంట ఆగి తర్వాత స్నానం చేయాలి. దీని వల్ల నరాల వాపులు తగ్గి రక్త ప్రసరణ పెరిగి శక్తి ఉత్పన్నమవుతుంది. 

2 .) దేశవాళీ గోమూత్రం ఉదయం సేకరించి ఏడు సార్లు వడపోసి 50 గ్రాములు మోతాదుగా పరగడుపున రోజూ సేవిస్తుండాలి. దీని వల్ల అధిక కఫం, మంటలు తగ్గి రక్త వృద్ధి, రక్త శుద్ధి కలుగుతుంది. 

3. ) గోధుమ పిండి 150 గ్రాములు తీసుకుని అందులో 30 గ్రాములు వంటాముదం కలిపి రొట్టె కాల్చుకుని అందులో కొంచెం నెయ్యి , పంచదార అద్దుకొని తింటూ ఉండాలి. 

ఇలా నాలుగైదు రోజులు తింటూ వుంటే అన్ని రకాల ఉదర సంబంధిత రోగాలు తగ్గిపోతాయి.


ముఖం పై దురదతో కూడిన నల్లని మచ్చలు.. ఆయుర్వేద పరిష్కారాలు. 

1 .) మంజిష్ట,కరక్కాయ పెచ్చులు , ఉసిరి కాయ పెచ్చులు ,తానికాయ పెచ్చులు , పాత చింతపండు , వస కొమ్ములు, దేవదారు చెక్క, పసుపు, తిప్ప తీగ వీటన్నింటినీ సమ భాగాలుగా తీసుకుని కలిపి మెత్తగా దంచి నిలువ చేసుకోవాలి. రోజూ పావు లీటరు మంచి నీటిలో ఈ పదార్థాన్ని 20 గ్రాములు వేసి సగం కషాయం మిగిలే వరకు మరగబెట్టి వడపోసి రోజూ పరగడుపున తాగుతుంటే శరీరంలో చెడు రక్తమంతా శుద్ధి చెంది దురదలు, కురుపులు, మచ్చలు, గడ్డలు, పుండ్లు మొదలైన అన్ని రకాల చర్మ వికారాలు తగ్గిపోతాయి. 

2 . ) జటా మాంసి తెచ్చుకొని పొడి చేసి ఉంచుకొని తగినంత పొడిని నిద్రించే ముందు మంచి నీటితో గుజ్జులా నూరి మచ్చల పైన లేపనం చేసి , ఉదయం గోరు వెచ్చని నీటితో కడిగితే సమస్య పరిష్కారమవుతుంది. 

12, సెప్టెంబర్ 2026, శనివారం

వేయి లాభాల.. వావిలి..

 నిర్గుండీ పుష్పం తిక్తోష్ణం కృమి వాత కఫాపహం

గుల్మ ప్లీహా రుచిం కుష్టం శోఫమ్ జయేత్కటు.. 


భోజన కుతూహలం పాక శాస్త్ర గ్రంథం వావిలి పూల గురించి పై శ్లోకంలో వివరించింది. వావిలి పూలు కొద్దిగా చేదుగా ఉంటాయి. చలవనిస్తాయి. వాత వ్యాధులు అన్నిటిపైనా పని చేస్తాయి. కఫాన్ని తగ్గిస్తాయి. కడుపులో ఏర్పడే అనేక వ్యాధుల పైన వీటి ప్రయోగం ఉంది. ముఖ్యంగా స్ప్లీన్ లో వచ్చే వ్యాధులన్నింటిపైనా బాగా పని చేస్తాయని భోజన కుతూహలం గ్రంథంలో తెలిపారు. 

నోటికి రుచి తెలియకపోవడం , అన్న హితవు కలగక పోవడం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. వావిలి పూలను సేకరించి, నీడన ఆరనిచ్చి , కొద్దిగా నెయ్యి వేసి వేయించాలి. 

ధనియాలు,జీలకర్ర, శనగ పప్పు,మిరియాలు, మినప్పప్పును కూడా పైపైన వేయించి, మెత్తగా దంచిన కారప్పొడి తినడానికి అనుకూలంగా ఉంటుంది. తెలుగు వారికి బాగా అందుబాటులో ఉండే మొక్క ఇది. రైతులను గానీ, మొక్కల గురించి బాగా తెలిసిన వారిని గానీ అడిగితే ఖచ్చితంగా తెలుస్తుంది. చాలా సార్లు చూసిన మొక్కే ఇది. ఒక్కో కణుపు దగ్గర ఐదు ఆకుల చొప్పున ఉంటాయి. ఈ మొక్కను గుర్తు పట్టడానికి ఇదే కొండ గుర్తు. శనగ గింజంత నీలి రంగు పూలు పూస్తాయి. 

కీళ్ల నొప్పులు, కీళ్ల వాతము,  వాపులు తగ్గించే ఆయుర్వేద ఔషధాలలో వావిలి ని కూడా చేరుస్తారు. దీని ఆకులు చవకగా దొరుకుతాయి. వావిలి ఆకులు, పూలు, పండ్లు , గింజలు, వేళ్ళు.. వీటన్నింటికీ వాతాన్ని తగ్గించే శక్తి ఉంది. వీటితో కీళ్ల వాతము పైన పని చేసే నిర్గుండీ తైలాన్ని తయారు చేస్తారు. 

వావిలి పూలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఎక్కువ. " సింధు వారస్య పుష్పెణ బద్దో ముచ్యేత బంధనాథ్ " అని" పుష్ప చింతామణి"  అనే గ్రంథం పేర్కొంది. 

వావిలి పువ్వులు సమర్పిస్తే అన్ని అడ్డంకులు తొలగి , బంధనాల నుంచి విముక్తి పొందుతారని అర్థం. ఈ పూలు సూర్యుడికి ప్రీతి పాత్రమని , వావిలి వలన పుత్ర లాభం కూడా కలుగుతాయని ఈ గ్రంథం పేర్కొంది. 

భోజన కుతూహలం వావిలి పూల ఆహార యోగ్యతను మాత్రమే సూచించింది కానీ, వీటిని ఎలా వండుకోవచ్చో చెప్పలేదు. ఐతే వేప పూలను ఏ విధంగా ఉపయోగిస్తామో వావిలి పూలను కూడా అలాగే వాడుకోవచ్చు. 

చరకుడు వావిలి పూలను విష దోషాలు హరించేదిగా పేర్కొన్నాడు. ఎలర్జీ కారణంగా వచ్చే చర్మ రోగాలు , దురదలు, ఉబ్బసం, నీరు పట్టి ఉబ్బు ఏర్పడే వ్యాధుల్లో , ఊపిరి తిత్తులు, మూత్ర , స్త్రీల వ్యాధుల్లో వావిలి పని చేస్తుంది. 

పిల్లల మతిమరుపు, అధిక ఋతు రక్త స్రావం సమస్యలు.. ఆయుర్వేద పరిష్కారాలు

 పిల్లల మతిమరుపు సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు.. 

మన బిడ్డలకు తగిన ఆహార ఔషధం, మన ఇంట్లోనే, మన చేతుల్లోనే ఉంది. సోంపు గింజలు, ధనియాల గింజలు కొంచెం దోరగా వేయించి , కొంచెం నలగ గొట్టి, పొట్టు తీసి, విడి విడిగా దంచి చూర్ణాలను తయారు చేసుకోవాలి. వాటితోపాటు చిన్న ఏలకులు పొడిచేసి, ఇంకా సీమ బాదం పప్పులు తెచ్చి ఒక రాత్రి నానబెట్టి పై తోలు తీసి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. అలాగే పటిక బెల్లం కూడా పొడి చేసుకుని , అన్ని చూర్ణాలూ సమ భాగాలుగా కలిపి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని రోజూ ఒక చెంచా మోతాదుగా ఒక కప్పు వేడి పాలతో కలిపి రాత్రి భోజనం తర్వాత మూడు గంటలు ఆగి నిద్రించే ముందు తాగాలి. దీని వల్ల మెదడు బలపడి, శరీరం కూడా పుష్టికరంగా మారి , జ్ఞాపక శక్తి అపారంగా పెరుగుతుంది. 


బహిష్టులో అధిక రక్త స్రావ సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..

అతి మధురం పొడి అరచెంచా మోతాదుగా ఒక కప్పు బియ్యం కడిగిన నీటితో కలిపి రోజూ మూడు పూటలా తాగాలి. అతి త్వరలోనే అధిక ఋతు రక్త స్రావం ఆగిపోతుంది. మొదటి రోజు లోనే చాలా మంచి ఫలితం కనిపిస్తుంది. 

రక్త హీనత, తీవ్ర మలబద్దక సమస్య.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 రక్తం తగ్గిపోయే సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు. 


తెల్ల గలిజేరు చెట్టుకు పూజ చేసి దాని వేళ్ళు తీసుకొచ్చి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టి , ఆ ముక్కలను దారంతో దండలాగ కట్టి ఎల్లప్పుడూ మెడలో వేసి ఉంచుకోవాలి. దీని వల్ల క్రమంగా కాలేయం శక్తివంతమౌతుంది. దీంతో పాటు ఒక చెంచా అల్లం రసం, ఒక చెంచా నిమ్మ రసం , ఒక చెంచా టమాటా రసం, ఒక చెంచా తేనె కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు తాగాలి. దీని వల్ల ఆకలి పెరిగి ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ఆయుర్వేద అంగడిలో బోడ తరం పూలు తీసుకొచ్చి పొడి చేసి సమంగా పటిక బెల్లం పొడి కలిపి పూటకు పావు చెంచా పొడి మంచి నీటితో రెండు పూటలా సేవించాలి. ఇలా చేస్తూ అరగని పదార్థాలు, బంగాళా దుంపలు, గరం మసాలా, మాంసం, చల్లని పదార్థాలు వాడవద్దు. బార్లీ బియ్యం, సగ్గు బియ్యం , పెసర కట్టు, ముల్లంగి దుంపలు , నారింజ, ఆపిల్, బత్తాయి మొదలైనవి వాడాలి. క్రమంగా సహజమైన రక్తోత్పత్తి జరుగుతుంది. 


తీవ్ర మలబద్దక సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..

పొట్టు తీయకుండా ఆడించిన గోధుమ పిండిలో అర చెంచా నుండి ఒక చెంచా వరకు వంటాముదం, పావు చెంచా జీలకర్ర పొడి , పావు చెంచా మిరియాల పొడి , పావు చెంచా అల్లం రసం, పావు చెంచా సైంధవ లవణం పొడిని కలిపి రొట్టెలాగా చేసి రాత్రి ఆహారంగా తింటుంటే హాయిగా సుఖ విరేచనం అవుతుంది. ఆహారంలో నెయ్యిని బాగా ఉపయోగించాలి. 

ముట్టు నొప్పి, అతి దురద సమస్యలు.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 ముట్టు నొప్పికి.. ఆయుర్వేద పరిష్కారాలు 

మన ప్రాంతంలో దొరికే ముదురు చింత బెరడు తీసుకొచ్చి ముక్కలు చేసి ఎండబెట్టి కాల్చి బూడిద చేసి జల్లించి నిలువ చేసుకోవాలి. మరో రెండు రోజుల లో బహిష్టు రాబోతుందనగా కంది గింజంత చింత బూడిదను ఉదయం పూట చెంచా నిమ్మ రసంలో కలిపి , సాయంత్రం పూట చెంచా తేనె తో కలిపి బహిష్టు వచ్చి ఆగిపోయే వరకు తింటూ ఉంటే నొప్పి తగ్గిపోయి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. 


విపరీతంగా దురద బాధిస్తుంటే.. ఆయుర్వేద పరిష్కారాలు.


వేప చిగుళ్ళు,పసుపు సమ భాగాలుగా తీసుకుని కొంచెం నీటితో మెత్తగా నూరి ఆ గుజ్జును దురదల పైన పట్టించి ఒక గంట ఆగి వేడి నీటితో స్నానం చేయండి. అలాగే మంచి పసుపు 50 గ్రాములు, పాత బెల్లం 100 గ్రాములు కలిపి దంచి నిలువ చేసుకోవాలి. పూటకు 5 గ్రాములు మోతాదుగాను చప్పరించి తిని మజ్జిగ తాగాలి. 

ఆహారంలో వంకాయ ,గోంగూర ,ఆవకాయ , మాంసాహారం, చేపలు , గుడ్లు , వేడి చేసే వస్తువులు మాని వేయండి. దురద సమస్య బాధించదు. 

సంసార సమస్య, పిప్పి పన్ను సమస్యలు.. ఆయుర్వేద పరిష్కారాలు

 సంసార సమస్య..ఆయుర్వేద పరిష్కారాలు 

అశ్వగంధ దుంపలు 50 గ్రాములు, నేల గుమ్మడి గడ్డలు 50 గ్రాములు, గొబ్బి గింజలు 50 గ్రాములు, పటిక బెల్లం పొడి 80 గ్రాములు కలిపి చూర్ణించి పొడి చేసుకోవాలి. అన్నిటిని కలిపి నిలువ చేసుకోవాలి. రోజూ రెండు పూటలా ఒకటి, రెండు చెంచాల పొడి, పావు లీటరు వేడి పాలలో కలిపి సేవిస్తుండాలి. క్రమంగా సమస్య పరిష్కారమవుతుంది. ఆ సమయంలో పూర్తి బ్రహ్మ చర్మం పాటించాలి. 


పిప్పి పన్ను సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు 


పిప్పి పన్ను ఎడమ వైపు వస్తే కుడి చెవిలోనూ, కుడి వైపు వస్తే ఎడమ చెవిలోనూ కాకి దొండాకు పసరు ఐదారు చుక్కలు పోసి కొంచెం ఆగి చెవిని పక్కకు వంచి ఆ రసాన్ని బయటకు కార్చి వేయాలి. దీని వల్ల అప్పటికప్పుడే పిప్పి పన్ను సమస్య పరిష్కారమవుతుంది. 

10, సెప్టెంబర్ 2026, గురువారం

కమలా పండ్లు.. గుమ్మడి..

 కమలా పనులను వీలైనంత అధికంగా తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరమే కాకుండా అందం కూడా పెరుగుతుంది. చర్మాన్ని కాంతులు ఈనేలా చేస్తాయి వృద్ధాప్య ఛాయాల్ని తగ్గిస్తాయి. 

కమలా పండును యథాతతంగా తిన్న ప్రసంగా రసాన్ని తాగిన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కండరాలు బలోపేతం అవుతాయి ముడతలు మచ్చలు పూర్తిగా తగ్గుతాయి. 

కమల పండు తొక్కలను ఎండబెట్టుకొని పొడి చేసుకుని సౌందర్య సాధనంగా వివిధ రకాలుగా వాడవచ్చు. 

జిడ్డు చర్మం పోవాలంటే..

ముల్తానీ మట్టి, కమలా పండు తొక్కు, గంధం పొడి సమ భాగాలుగా తీసుకుని , ఒక టీ స్పూన్ టమోటా గుజ్జు కలిపి చర్మానికి మర్దనా చేసుకుని కొద్దిసేపయ్యక కడిగేయాలి. 

ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేయాలి.

కాంబినేషన్ స్కిన్.. 

రెండు చుక్కల ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుని ముఖానికి మర్దనా చేయాలి. 

ముఖాన్ని వేడి నీటిలో ముంచిన మెత్తటి టవల్ తో కంప్రెస్ చేయాలి.

ముడతలు..

టేబుల్ స్పూన్ ప్రోటీనెక్స్ , పెరుగు కలిపి పేస్ట్ తయారు చేసుకుని , ఒక టీ స్పూన్ ఆపిల్ తురుము , రెండు చుక్కలు ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ముఖానికి మాస్క్ వేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తుంటే ముడతలు తగ్గుతాయి. 


గుమ్మడి..

ఏ కాలంలో నైనా వ్యాధులను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది గుమ్మడి. కారణం దీనిలో పుష్కలంగా ఉండే కెరోటినాయిడ్ లే. గుమ్మడి తో చేసిన పదార్థాలను తరచూ తీసుకునే వారిలో వ్యాధి నిరోధక శక్తి అధికం. ముఖ్యంగా బీటా కెరోటిన్ ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ . దీనికి చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే శక్తి అధికం. గుండె నాళాల్లో అడ్డంకులు తొలగించి గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. 

మేని నిగనిగలకు..

వయసుతో సంబంధం లేకుండా మేని నిగారింపు కోరుకునే వారు .. గుమ్మడి చక్కని యాంటీ ఏజింగ్ పదార్థమని తెలుసుకోవాలి . దీనిలోని ఆల్ఫా కెరోటిన్ వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది. కంటి శుక్లాలు రాకుండా చూస్తుంది. 

పీచు పుష్కలం..

గుమ్మడిలో పీచు పుష్కలంగా ఉంటుంది.దాంతో మలబద్ధక సమస్య అదుపులో ఉంటుంది. శరీరానికి మేలు చేసే కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్లు అధికంగా లభిస్తాయి. ఒక కప్పు తరిగిన గుమ్మడి నుంచి కాల్షియం 37 mg లభిస్తే , మెగ్నీషియం 22 mg లభిస్తుంది. 

ఆటలాడే అమ్మాయిలకు ప్రత్యేకం..

పొటాషియం స్థాయిలు పుష్కలంగా ఉండే గుమ్మడిని ఏదో ఒక రూపంలో తీసుకునే వారిలో రక్త పోటు అదుపులో ఉంటుంది. కప్పు గుమ్మడి నుంచి 564 mg పొటాషియం లభిస్తుంది . క్రీడా కారిణులకు ఏర్పడే సమస్య పొటాషియం లోపం. తరచూ వ్యాయామాలు చేయడం వల్ల స్వేదం కారణంగా చెమట రూపంలో పొటాషియం కోల్పోతారు క్రీడా కారిణులు. అటువంటి వారు గుమ్మడి తో చేసిన కూరలను, డెజర్ట్ లను స్వీకరించాలి. పైగా ఇది ఎముక బలానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటితో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచే జింక్ కూ కొదవలేదు. 

విటమిన్లు పుష్కలం..

వండిన గుమ్మడిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, మేని అందానికి తోడ్పడే విటమిన్ ఇ , కంటి చూపునకు సహకరించే విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఒక గిన్నెడు గుమ్మడి నుంచి 3 Mg ల విటమిన్ ఇ లభిస్తే, 12 Mg ల విటమిన్ సి లభిస్తుంది. 

7, సెప్టెంబర్ 2026, సోమవారం

డెంగీ తదితర వ్యాధుల విషయంలో..

 డెంగీ తదితర వ్యాధుల విషయంలో అనవసరంగా యాంటీ బయోటిక్స్, నొప్పి నివారణ మందులు ఇవ్వకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డెంగీ అని నిర్ధారణ కాకుంటే జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నా ' పారాసిటామల్ ' మందు తీసుకుంటే సరిపోతుంది. 

డెంగీ, డెంగీ ని పోలిన విష జ్వరాల చికిత్సలకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలు. 

డెంగీ లక్షణాలు..

తలనొప్పి ,కంటి వెనుక భాగంలో నొప్పి, కండరాల నొప్పులు ,శరీరంపై దద్దుర్లు,  ముక్కు,చిగుర్లు, నోటి నుండి రక్తం కారడం ,వాంతులు కావడం, మలం నల్లగా ఉండడం, నిద్రలేమి ,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, నాలుక తడి ఆరిపోవడం, చర్మం పొడిబారిపోవడం వంటి లక్షణాలతో జ్వరతీవ్రత ఉంటే వైద్యుడిని సంప్రదించి వారి సూచనల మేరకు వైద్య పరీక్షలు చేయించాలి. రక్త కణాల సంఖ్య 80000 కంటే తగ్గితే వైద్యుల పర్యవేక్షణలో తప్పకుండా చికిత్స చేయించాలి. రోగికి రక్తపోటును వైద్య సిబ్బంది నిరంతరం గమనిస్తూ ఉండాలి. రక్త కణాల సంఖ్య 40 వేల కంటే తగ్గితే ప్రతి గంటకు ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తూ, రక్త కణాల సంఖ్య ఇంకా తగ్గుతూ ఉంటే డెంగీ నిర్ధారణ కోసం" ఎలిసా " పరీక్ష చేయించాలి .ఈ పరీక్ష లో పాజిటివ్గా నిర్ధారణ అయితే డెంగ్యూ చికిత్స ప్రారంభించాలి. 

చికిత్స విధానాలు..

డెంగీ నిర్ధారణ అయిన రోగుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ప్రతి గంటకు సమీక్షిస్తూ ..సెలైన్ ( ఐసోటోనిక్ క్రిష్టలాయిడ్ సొల్యూషన్ )ఇవ్వాలి. 

రోగికి రక్తస్రావం అవుతూ ఉంటే ఈ క్రిస్టలాయిడ్ సొల్యూషన్ స్థానంలో డెక్స్ట్రాన్ / ప్లాస్మా ఎక్కించాలి. 

రక్తస్రావం ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటే సెలైన్ ఎక్కువగా ఇవ్వడంతో పాటు రక్తం కూడా ఎక్కించాలి. అవసరమైతే కృత్రిమ శ్వాస కూడా అందించాలి

రోగి కోలుకుంటున్నట్లు కనిపిస్తే సెలైన్ మోతాదు క్రమంగా తగ్గించుకుంటూ రావాలి .

డెంగీ నిర్ధారణ కాకున్నా రక్తస్రావం అవుతుంటే రక్తం ఎక్కించాలి.

చేయకూడనివి..

రోగికి కండరాలు ,ఒళ్ళు నొప్పుల నివారణకు ఆస్ప్రిన్, బ్రూఫిన్ లాంటివి ఇవ్వ కూడదు. 

డెంగ్యూ తరహా లక్షణాలు నిర్ధారణ కాకుంటే నరాల ద్వారా సెలైన్ వంటివి కూడా ఇవ్వకూడదు.

యాంటీబయాటిక్ మందులు అసలు వాడకూడదు. 

రోగికి భరించలేని స్థాయిలో నొప్పులు ఉన్నా ఉపశమనం కోసం స్టిరాయిడ్స్ ఇవ్వకూడదు.

రోగికి సెలైన్ ఒకే వేగం /మోతాదుతో ఎక్కించాలి. మోతాదును పెంచడం ,తగ్గించడం వీలైనంత వరకు చేయకూడదు .

ఉపశమనం లక్షణాలు..

 రోగినాడీ తీరు ,శ్వాస తీరు, రక్తపోటు నిలకడగా ఉండడం, శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి రావడం, రక్తస్రావం, వాంతులు లేకపోవడం ,మూత్రం బాగా  వస్తూ ఉండాలి.

ఈ లక్షణాలు ఉంటే మూడు రోజులు ఆస్పత్రిలో ఉంచుకొని, డిశ్చార్జ్ చేసేముందు ఒకసారి రక్త కణాల సంఖ్య పరీక్షించాలి .ఇందులో 50 వేల కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలితే ఇక ఎలాంటి అపాయము ఉండదు .

డెంగీ నిర్ధారణ కాకపోతే చికిత్స..

జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటూ, కండరాల నొప్పులు ఎక్కువగా ఉన్నా .. డెంగీ కాదు. ఇలాంటి జ్వరాలకు పేరాసిటమాల్ మాత్రలు రోజుకు గరిష్టంగా నాలుగు సార్లు తీసుకుంటే సరిపోతుంది.

జ్వరం రెండు రోజులకు తగ్గకపోతే నిపుణుల సూచనల మేరకు పారాసెటమాల్ మందును కొనసాగించాలి.

జ్వరం ఉన్నా తేలికగా  జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవచ్చు .

దీనికి అదనంగా సూపు ,పాలు ,పండ్ల రసాలు ,కొబ్బరి నీళ్లు, నీరు ఎక్కువగా తీసుకోవాలి .

రోగి ఎలాంటి శారీరక శ్రమకు గురికాకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవాలి .

పారాసెటమాల్ మందు మోతాదు ఇలా 

ఏడాదిలోపు వయసు వారికి 60 మిల్లీ గ్రాములు, ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల వయసు గల వరికి 60 నుంచి 120 మిల్లీగ్రాముల వరకు, ఐదు సంవత్సరాల కు పైబడి వయసు ఉంటే రెండు వందల నలభై మిల్లీ గ్రాములు ఇవ్వాలి.


6, సెప్టెంబర్ 2026, ఆదివారం

ఎక్కిళ్ళు.. ఆయుర్వేద పరిష్కారాలు

 అమ్మ.. ఎక్కిళ్ళు ఆగడం లేదు, ప్రతి ఐదు నిమిషాలకు వస్తున్నాయి. నీళ్లు తాగుతున్నాను, గొంతుకి అమృతాంజనం రాసుకున్నాను, అయినా.. అబ్బా మళ్ళీ ఎక్కిళ్ళు.. అది కాదు, అదేంటి నీ తలపై అంత పెద్ద గడ్డ పుట్టుకొచ్చింది. . హఠాత్తుగా ఆశ్చర్యంతో అడిగింది. . ఆ అమ్మాయిని వాళ్ళమ్మ. గడ్డా.. ఎక్కడా.. ఆశ్చర్యంతో తలని చూసుకుంది ఆ అమ్మాయి. గడ్డలేదు కానీ ఎక్కిళ్ళు ఆగి పోయాయి. హఠాత్తుగా వచ్చే ఎక్కిళ్ళను , హఠాత్తుగా వినే సంగతులు ఆపు చేస్తాయి. 

ఎక్కిళ్ళు హఠాత్తుగా వస్తాయి .గుండెకు పొట్టకు మధ్య ఉండే పలుచని పొర ను డయాఫ్రమ్ అంటారు. అది అనుకోకుండా ముడుచుకుంటుంటే వచ్చే" హిక్ " అనే శబ్దం నోటి నుంచి బయటకు రావడాన్ని" ఎక్కిళ్ళు"  అంటారు.

ఈ డయాఫ్రమ్ చాలా సార్లు ముకులించుకోవడం వల్ల మన గొంతులో ఇరువైపులా ఉన్న శబ్ద గ్రంధులు మధ్య ఉండే దారి మూసుకొని గాలిని అడ్డగించడం వల్ల హిక్ లేదా ఎక్ అనే శబ్దం వస్తుంది. దాని దగ్గర ఉన్న నరాలు ఉద్రేక పడడం వల్ల గొంతు నుండి ఛాతీ దాకా చలించి ఈ ఎక్కిళ్ళు ఎక్కువవుతాయి. 

ఎక్కిళ్ళు చాలా కారణాల వల్ల వచ్చినా తాత్కాలికంగానే ఉంటాయి. కానీ కొన్ని వ్యాధుల వల్ల వచ్చే ఎక్కిళ్ళు ప్రమాదాన్ని సూచిస్తాయి. ముఖ్యంగా న్యుమోనియా , మూత్ర పిండాలు పాడై పోయిన వ్యాధులు , గుండె జబ్బులు వంటి వాటిలో ఇవి రాకూడదు. 

ఎందుకు ,ఎప్పుడు వస్తాయి అంటే..

రక్తంలో చెడు పదార్థం ఏదైనా తయారు అవుతున్నప్పుడు ఈ ఎక్కిళ్ళు వస్తాయి. ఈ హిక్ లేదా ఎక్ అనే శబ్దం ఆగకుండా అస్తమానం వస్తుండటానికి కారణం లారింక్స్ అనే గొంతు భాగాన్ని ఆనుకుని ఉన్న పలుచని పొర తెరుచుకుని మూసుకోవడం వల్ల జనిస్తుంది. మన ఉచ్చ్వాస నిశ్వాసాలను పైకీ కిందికీ క్రమ పద్ధతిలో కదల్చటం వల్ల డయాఫ్రమ్ అనే పొర క్రమ పరుస్తుంది.

ఈ క్రమంలో తాత్కాలికంగా కానీ , మరే ఇతర బలవత్తరమైన కారణం వల్ల కానీ అడ్డుపడితే నోటి నుండి హిక్ అనే శబ్దం వస్తుంది. అది తిరిగి సరి అయిన స్థితికి వచ్చే వరకు వస్తూ ఉంటుంది. ఇది కొద్ది నిమిషాలు ఉండవచ్చు. కొద్ది రోజుల పాటు ఉండవచ్చు. ఒక్కొక్కప్పుడు కొన్ని వారాల పాటు కూడా ఉండవచ్చు. 

ఈ ఎక్కిళ్ళు ఆగకుండా ఒక రోజు కన్నా ఎక్కువగా ఉంటే , అది మన శరీరంలో జరుగుతున్న ఏదో మార్పుకు లేదా వ్యాధికి సూచన అనుకోవాలి.. 

కామెర్లు, తీవ్రమైన ఎలర్జీ వ్యాధులు , తీవ్ర అజీర్ణ వ్యాధులలోనూ , మూత్రాశయ వ్యాధులలోనూ ఇది ఒక్కొక్కప్పుడు ఉపద్రవ సూచిక. తొందర తొందరగా నమిలి తినడం వల్ల కూడా ఎక్కిళ్ళు రావచ్చు. ఆయుర్వేదంలో దీనిని " హిక్క" వ్యాధి అని పిలుస్తారు. 

చాలా వ్యాధులలో ఎక్కిళ్ళు వస్తాయి,కానీ ఆ ఎక్కిళ్ళు రావడానికి , ఆ వ్యాధికి అనుసంధాన కారణం కనిపించదు. మీరు తొందర తొందరగా తింటున్నప్పుడు ఎక్కువ గాలి తెలియకుండా లోపలికి వెళుతుంది. ఆ రెండింటి అవరోధం వల్ల తాత్కాలికంగా ఎక్కిళ్ళు వస్తాయి. 

ఎక్కువ మసాలా ఉన్నటువంటి మాంస పదార్థాలు , ఘాటుగా ఉన్న మద్యం తాగుతున్నప్పుడు మన డయాఫ్రమ్ చలించి ఎక్కిళ్ళు వస్తాయి. షుగర్ వ్యాధి వల్ల, ఎక్కువగా మందు తాగడం వల్ల, పొగ తాగడం వల్ల , నోటి లోపల పూత,క్యాన్సర్ వల్ల , మెడ నొప్పి వల్ల, ఏదైనా కారణంగా స్పృహ కోల్పోవడం , ఎక్కువ కారం తినడం వల్ల పలుమార్లు ఎక్కిళ్ళు వస్తాయి. 

మన గుండె కింద ఉన్న పొరలో తెలియని కదలికలు వచ్చినప్పుడు నోటి ద్వారా వచ్చే హిక్ శబ్దం ముఖ్యంగా నరాల కదలిక వల్ల కనక, హఠాత్తుగా చెప్పే మాట వల్ల ఒక్క అర క్షణం మన వ్యవస్థ ఆగి కదిలితే ఇది సమ స్థితికి రావచ్చు. కానీ ఇది సామాన్యంగా వచ్చే ఎక్కిళ్ళకు మాత్రమే ఉపయోగ పడుతుంది. 

ఒక రోజంతా ఆగకుండా ఎక్కిళ్ళు వస్తుంటే డాక్టర్ ను సంప్రదించాలి. సాధారణంగా ఎక్కిళ్ళు వైద్య పరంగా ప్రమాద సూచిక కాదు. కానీ ఆగకుండా రోజంతా వస్తూ రక్తపు చుక్కలు కనిపిస్తుంటే అది ఉపద్రవ సూచిక అని గ్రహించి వైద్యుణ్ణి సంప్రదించాలి. 

ఎక్కిళ్ళు ఆగకుండా వస్తుంటే..

కొద్ది సేపు ఊపిరి తీసుకుని బిగపట్టి ఉంచుకోండి.

గబ గబా గ్లాసుడు నీళ్ళు తాగండి.

ఉప్పుని వాసన చూడండి.

నాలుక చివర చేత్తో పట్టుకుని కిందికీ పైకీ లాగండి.

ఒక చెంచా పంచదార నాలుక కింద ఉంచుకుని చప్పరిస్తూ ఉండండి.

పెరుగులో ఉప్పు కలుపుకుని చెంచా తో తింటుంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

చిన్న చిన్న ముక్కలుగా తరిగిన అల్లం ముక్కలు నములుతుంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. 

యాలక్కాయలు తొక్కతో సహా నాలుక మీద పెట్టుకుని రసం మింగుతుంటే మంచిది. 

కళ్ళు మూసుకుని ఊపిరి బిగ పట్టి ఉంచండి.క్రమంగా కళ్ళు తెరవండి. ఎక్కిళ్ళు తగ్గుతాయి. 

ఆధునిక వైద్యంలో క్లోర్ప్రోమోజైన్ బ్యాక్లోఫెన్ వంటి మందులు వాడతారు. 

తీవ్ర వ్యాధిలో డయాఫ్రమ్ ను నియంత్రించే నరం ఫెరోనిక్ నర్వ్ చెడిపోయినప్పుడు ఆపరేషన్ అవసరం అవుతుంది. కానీ ఇది చాలా అసాధారణం. 

ఎక్కిళ్ళు చాలా వరకు తాత్కాలికం. వ్యాధులు ఉన్నప్పుడు వస్తే అశ్రద్ధ చేయవద్దు.

5, సెప్టెంబర్ 2026, శనివారం

దేహ దుర్గంధ సమస్య - డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారం

 శరీర దుర్వాసన సమస్యకు.. ఆయుర్వేద పరిష్కారాలు..

ముందుగా శరీరంలోని అతి వేడి పూర్తిగా తగ్గితేనే దేహ దుర్గంధ సమస్య పరిష్కారమవుతుంది. వేడి పుట్టించే పదార్థాలు తినడం మాని చలువ చేసే పదార్థాలు తినడం మొదలు పెట్టాలి. ముఖ్యంగా బార్లీ పాయసం అతి వేడి ని త్వరగా తగ్గిస్తుంది. దానితో పాటు ధనియాల కషాయం కూడా చక్కెర కలిపి రెండు పూటలా సేవిస్తుండాలి. 

మాంసాహారం పూర్తిగా నిషేధించాలి. వాటితో పాటు కరక్కాయ పై బెరడు , వేపాకు, లొద్దుగ పట్ట, నాగ కేసరాలు, వట్టి వేళ్ళు, తామర పూలు, శ్రీ గంధం, మాచిపత్రి, మరువం, మామిడి పూలు, మొగిలి పూలు , చిన్న ఏలకులు , తుంగ గడ్డలు, జటా మాంసి, కర్పూరం , కచ్చోరాలు, ఆకు పత్రి.. వీటిలో దొరికినన్ని తెచ్చుకుని విడి విడిగా చూర్ణాలు చేసి అన్నీ కలిపి నిలువ చేసుకోవాలి. 

రోజూ స్నానానికి గంట ముందుగా తగినంత పొడిని మంచి నీటితో గుజ్జులాగా నూరి ఆ గుజ్జును శరీరమంతా రుద్ది ఎండిపోయిన తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తుంటే అతి త్వరగా శరీర దుర్వాసన హరించి పోతుంది. 

పేల సమస్య - ఆయుర్వేద పరిష్కారం

 పేల సమస్య.. ఆయుర్వేద పరిష్కారం 

తల శుభ్రంగా..

సమయం చిక్కినప్పుడు కాకుండా వారంలో  కనీసం మూడు సార్లు తల స్నానం చేయాలి. శిరోజాలు పూర్తిగా ఆరాకే జడ వేసుకోవాలి. చిన్నారుల జుట్టు సాధ్యమైనంత వరకు చిన్నగా ఉంటేనే మంచిది. జుట్టును మరీ బిగుతుగా కట్టడం వల్ల దురద అధికం అవుతుంది. ఇక సమస్య మరీ ఎక్కువగా ఉంటే కొబ్బరి నూనెలో తగినంత వెనిగర్ కలిపి ,షాంపుతో తల రుద్దుకున్నాక ఈ నూనెను పట్టించాలి. అరగంట అయ్యాక మళ్ళీ ఘాటైన షాంపుతో స్నానం చేయాలి. వెనిగర్ ప్రభావానికి పేలు పోతాయి.

మర్దన తో మేలు..

నోటి దుర్వాసనను దూరం చేసే మౌత్ వాష్ అందుబాటులో ఉంటే దాన్ని తలకు రాసి కాసేపయ్యాక కడిగేయాలి. దీని వల్ల పేలు పోతాయి. ఎంతో మార్పు ఉంటుంది. రాత్రి పూట గోరు వెచ్చని నూనెతో తలంతా మర్దన చేసి మర్నాడు తాజా నిమ్మ రసం మాడుకు పట్టించాలి. గంట తర్వాత తల దువ్వితే పేలు ఇవతలకు వచ్చేస్తాయి. ఐతే తలలో ఇన్ఫెక్షన్లు ,దద్దుర్లు బాధిస్తుంటే నిమ్మ రసానికి దూరంగా ఉండాలి.

వాడే వస్తువులు జాగ్రత్తగా..

పేలు ఉన్నవారు వాడే దువ్వెనలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. తల స్నానం చేసిన ప్రతి సారీ దువ్వెనలు, హెయిర్ బ్యాండ్ లు, క్లిప్పుల వంటివి డిటర్జెంట్ కలిపిన వేడి నీటిలో అరగంట పాటు ఉంచి శుభ్ర పరచుకొని ఆ తర్వాతే వాడుకోవాలి. పేల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు , ఇతర సమస్యలు దూరమవుతాయి. ఔషధ గుణాలు ఉన్న షాంపూ వాడకం వల్ల సమస్య తగ్గుతుంది. దాన్ని నీటిలో కలపకుండా జుట్టుకి రుద్ది , అర గంట తర్వాత కడిగేసుకోండి. ఇక ఇలాంటి వారు వాడే దిండ్లు,దుప్పట్లను ఎప్పటికప్పుడు శుభ్ర పరుస్తూ ఉండాలి.

ఉల్లితో ఉపశమనం..

ఉల్లి పాయలను సన్నగా తరిగి మిక్సీలో వేసి మెత్తని గుజ్జు చేసి దాన్నుంచి రసం తీయాలి. ఆ రసాన్ని తల స్నానం చేసిన మర్నాడు జుట్టుకు పట్టించాలి. నాలుగు గంటలు అయ్యాక శుభ్ర పరచుకుంటే దురద సమస్య బాధించదు. రెండు వారాలకోసారి ఇలా చేస్తే పేలూ తగ్గు ముఖం పడతాయి. సీతా ఫలం గింజలను ఎండ బెట్టి పొడి చేసి తగినన్ని నీళ్లు కలిపి తలకు పూతలా వేయాలి. రాత్రి తలకు వస్త్రాన్ని చుట్టి పడుకుని మర్నాడు షాంపూ తో కడిగేసుకుంటే సరి పోతుంది. దీంతో చుండ్రు సమస్య కూడా నియంత్రణలో ఉంటుంది.

వెల్లుల్లి తో సమస్య దూరం..

సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు .. వెల్లుల్లిని మెత్తగా చేసుకుని ఆ గుజ్జులో పావు కప్పు నిమ్మ రసం కలిపి తలకు రాయాలి. ఆ ఘాటు వాసన కు పేలు పోతాయి..అలాగే ఆపిల్ ను సన్నగా తరిగి మిక్సీలో వేసి గుజ్జుగా చేసి దాన్ని తలకు రాసి గంటయ్యాక తల స్నానం చేస్తే ఫలితం ఉంటుంది. ఆలివ్ నూనె ను మరగ కాచి రాత్రి పూట తలంతా మర్దన చేసి ఏదైనా వస్త్రాన్ని చుట్టాలి. ఇలా మూడు రోజులకోసారి చేస్తుంటే చుండ్రు, దురద వంటి సమస్యలు తగ్గిపోతాయి.

తులసి చేసే మేలు..

పది బాదం పలుకులను నానబెట్టి మర్నాడు మెత్తగా చేసి పావు కప్పు నిమ్మ రసం కలిపి తలకు పూతలా వేసుకుని, గంటయ్యాక చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది. గుప్పెడు చొప్పున తులసి, వేప ఆకులు తీసుకుని మెత్తని ముద్ద చేసి మాడుకు రాసి రెండు గంటలయ్యాక తల స్నానం చేయాలి. ఇలా పది రోజులకోసారి చేస్తుంటే క్రమంగా సమస్య పరిష్కారమవుతుంది.

ముఖం పై నల్లని చారలు - ఆయుర్వేద పరిష్కారాలు

 అద్దం మన ముఖమునే కాదు ,దానిపై వస్తున్న నల్లని చారలు, కంటి కింద నల్లని మెరుపు, బుగ్గపై చిన్న చిన్న పొక్కులు...  రంగు బారిన చెక్కిళ్ళు.. వీటన్నింటినీ చూపిస్తుంది .ఇవి మీరు అనుకుంటున్నట్లు చర్మవ్యాధులే కానక్కరలేదు,  కౌమార దశలో ఉన్న పిల్లలలో హార్మోన్ల హెచ్చుతగ్గులను, నడి వయస్సులో, మధ్యలో మానసిక అశాంతిని ,కొంతమందిలో రక్త దోషాన్ని సూచిస్తుంది. 

ప్రకాశవంతమైన ముఖ చర్మం ఆనందానికి దర్పణం వంటిది. ఇది మనం ఎక్కువగా పట్టించుకోము కానీ పట్టణాలలో, నగరాలలో నాడు, నేడు ఇలాంటి మచ్చలు రంగు మారడం, నలుపు చాయ రావడం లాంటివి రాకుండాను ,వచ్చినవి పోయి ముఖ చర్మం అందంగా , ఆకర్షణీయంగా ఉండాలని ఉంచుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. 

నైలునది నాగరికతలోనూ, పురాణకాల సంస్కృతిలోనూ, ఇతిహాస కాలంలో కూడా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రత్యేక చికిత్సలు, చికిత్స చేసే సుందరిమణులు ఆ కాలంలో ఉండేవారు. ఈనాటి రసాయనాలు ఉపయోగించే బ్యూటీ పార్లర్ల కన్నా సహజ సౌందర్య సాధనాలతో చేసే నిలయాలు అప్పుడు కూడా ఉండేది.

ఆధునీకులు తెల్లని చారికలు ఏర్పడటం, చర్మపు రంగు మారి మచ్చలు ఏర్పడటాన్ని బ్లిమిషెస్ అంటారు. ఈ బ్లిమిషెస్ లో పైన చెప్పినవే కాకుండా తెల్లని గట్టి మొటిమల లాంటివి, నల్లని, లేత ఎరుపు తో కూడిన పొక్కులు లాంటివి ఏర్పడటమూ ఉంటుంది. 

క్రీములు కొనేటప్పుడు..

ఇందులో కొన్ని తెల్లని చారికలు లాంటివి ఏర్పడడం. దీనికి పుట్టుకతో వచ్చిన దోషం కారణం కావచ్చు .మరికొందరిలో మొటిమలు ,ఉబ్బిన చిన్న చిన్న పొక్కులు ఏర్పడతాయి. వీటికి కారణం కొంత హార్మోన్ల హెచ్చుతగ్గులు అయితే ఎక్కువ భాగం వారు వాడే రకరకాల క్రీములు, పౌడర్లు నూనెలు వంటివి. చర్మానికి ఇవి పడకపోతే ఇలాంటివి వస్తాయి .రాత్రులు చర్మానికి రాసుకునే క్రీములు ఇలాంటివి కలుగ చేస్తుంటాయి. 

ఇలా చర్మానికి బిమిషస్ కలగజేసే క్రీములను ' comedo genics ' అంటారు. అందుచేత మీరు క్రీములను కొనేటప్పుడు వాటిపై 'non comedo genics' అని ఉందో లేదో చూసి కొనండి. వాతావరణంలో మార్పులు, ముఖ్యంగా కలుషితమైన గాలి, నీటిలో తేమ మీ చర్మ కాంతిని సౌకుమార్యాన్ని పాడు చేస్తాయి. ముఖంపై కురుపులు, చారికలు వంటివి, చర్మాన్ని ఉద్రేకపరిచే వెంట్రుకల రాపిడి, వాడే బట్టల రాపిడి ఎక్కువ చేస్తాయి. 

మానసిక ఒత్తిడి, హార్మోన్లలో హెచ్చుతగ్గులు వీటికి ముఖ్య కారణాలుగా గుర్తించబడింది. ముఖ్యంగా ఆండ్రోజన్ అనే హార్మోను దీనికి ముఖ్య కారణంగ భావించ బడుతుంది. ఎలాగంటే ఈ హార్మోన్ల చర్మాన్ని రాపిడి సెబమ్ అనే సహజ స్నిగ్ధ పదార్థాన్ని పెంచుతుంది. ఈ నూనె పదార్థం ఒకచోట ఎక్కువగా చేరడం వల్ల సూక్ష్మ జీవులు చేరి చర్మాన్ని పాడు చేసి ఈ చిన్న చిన్న కురుపుల లాంటి వాటిని తీసుకొస్తాయి. ముఖ్యంగా స్త్రీలు, ఎదుగుతున్న పదహారేళ్ళ వయసు వారి నుండి నడి వయసు ఉన్న 30 ఏళ్ల వయసు వారి వరకు ఈ హార్మోన్ల హెచ్చుతగ్గులకు ఆలవాలం అవుతున్నారు. 

అలాగే ఋతుచక్రం ఆగిపోతున్న వయస్సులో అంటే 45 ఏళ్ల వయసులో ఈ హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల చర్మ సౌందర్యం పాడవుతుంది. గర్భిణీ కాలంలోనూ, నెలసరి వచ్చే సమయంలోనూ ఎక్కువ అవుతాయి. యాంటీ ఆండ్రోజన్స్ వంటి మందులు , కార్టికో స్టిరాయిడ్స్ వంటి మందులు వాడినా వాటి ఫలితం తో పాటు కొంత అసౌకర్యం కూడా ఉంటుంది. అందుకే సహజమైన చిన్న చిన్న వాటితో ఈ స్థితిని మనం దూరం చేసుకోవచ్చు. 

ముఖానికి వెలుగునిచ్చేవి ఏమంటే..

 బెల్లం ,నువ్వులు కలిపిన నువ్వుల ఉండలు ఆడపిల్లలు తినడం మంచిది. అన్నం మొదటి ముద్దలో నువ్వుల పొడి రెండు చెంచాలు కలుపుకొని తినడం, తలంటు పోసుకునేటప్పుడు ముఖానికి పసుపు, పెసర పిండితో నలుగు పెట్టుకోవడం, నువ్వుల నూనెతో వారానికి ఒసారైనా ఒంటికి గట్టిగా రాసుకుని నలుగు పెట్టుకుని వేడి నీటితో తలస్నానం చేయడం హితకరం. ఇవి స్త్రీ పురుషులు ఇద్దరికీ ఉపకరిస్తాయి. 

మీరు ఒలుచుకొని పడేసే అరటిపండు తొక్క లోపలి భాగంలో అద్భుతమైన సౌందర్య సాధనము ఉంచాడు ఆ భగవంతుడు. దానితో కానీ బొప్పాయి పై తొక్కతో కానీ ముఖాన్ని రుద్దుకుంటే ఇలాంటి చారికలు తగ్గిపోతాయి. 

బంగాళాదుంపలు పై  పొరతో కూడిన దాన్ని ఒక గుడ్డలో ఉంచి నలగగొట్టి రసం తీయండి. ఆ రసంలో తొమ్మిది నిమ్మరసం చుక్కలు వేయండి. ఒక చెంచా తేనె వేసి కలియబెట్టండి. దాన్ని మీ ముఖం పైన రాయండి లేదా నల్లని చారికలు ఉన్నచోట కానీ ,మచ్చలు, మొటిమలు ఉన్నచోట కానీ రాయండి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. దీనిలో ఉన్న బ్లీచింగ్ ఏజెంట్స్ ముఖాన్ని చక్కగా చేస్తాయి. ముఖమంతా రాసుకుంటే మొటిమలు రావు. 

మీరు ఇంట్లో ఎప్పుడైనా నారింజ రసం కానీ, నిమ్మ రసం కానీ ,బత్తాయి రసం గానీ చేసుకుంటే పుల్లకు దూది చుట్టి ఆ రసంతో కొంచెం ముఖానికి రుద్దుకొని కాసేపయ్యాక గోరు వెచ్చని నీటితో కడిగేసుకోండి. మీ ముఖం ప్రకాశ వంతంగా అందంగా మెరిసి పోతుంది. 

మన ఇంట్లో ఉండే నిమ్మ కాయలు ముఖం మీద, చర్మం పై ఉండే ముడతలను, చారికలను తొలగించే అద్భుతమైన మందు. దాన్ని అలాగే రాసుకోవచ్చు. లేదా పసుపు, గంధపు పొడి కలిపి రాసుకోవచ్చు. 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం ప్రకాశ వంతంగా మెరిసి పోతుంది. 

పాత నిమ్మకాయ పచ్చడి తినడం,టొమోటో, పాల మీద మీగడ, పెరుగు పై తరకలు అందాన్ని అందించే అపురూప వరాలు. నాలుగు చెంచాల టమోటా రసం, 4 చెంచాల నిమ్మ రసం కలిపి దూదితో రోజూ ముఖం పైన రుద్దుకుని అరగంట తర్వాత కడుక్కోండి. దీన్ని ఎక్కువగా చేసుకుని ఫ్రిజ్ లో భద్ర పరిచి రోజూ రాసుకోవచ్చు. ఇది సహజ సౌందర్య సాధనం. 

నిమ్మ కాయ రసం తీసిన తొక్కలపై కొంచెం పంచదార అద్ది ముఖానికి ప్రతి రోజూ రుద్దుకుని 10 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. ముఖం పై మొటిమలు తగ్గిపోతాయి. మంచి గంధం పొడి, రోజ్ వాటర్ తో కలిపి ముద్దగా చేసి దాన్ని ముఖానికి రాసుకోండి. ఇలా చేస్తే కళ్ళ కింద నల్లని చారలు పోయి చక్కగా ఉంటారు. 

బాదం పలుకులు ఒక రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తేనె, నిమ్మ రసం కలిపి ముద్దగా చేసి చర్మం పై రాయండి. పావు గంట తర్వాత కడిగేసుకోండి. మీ ముఖం మృదువుగా , కాంతి వంతంగా ఉంటుంది. 

గనేరియా ,కడుపులో బల్ల సమస్యలు - డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 1. సెగ రోగ / గనేరియా సమస్య - ఆయుర్వేద పరిష్కారం 

ముందే సెగ రోగం ఉన్న పురుషునితో స్త్రీలు కలవడం కానీ , అదే రోగం ఉన్న స్త్రీతో పురుషుడు కలవడం వల్ల కానీ ఈ రోగం అంటుకుని వారి శరీరంలో జీర్ణించుకు పోయి వదలకుండా దీర్ఘ కాల వ్యాధి లాగా పట్టి పీడిస్తుంది. దీనిని అశ్రద్ధ చేస్తే ఈ వ్యాధి ఉన్నవారికి పుట్టే బిడ్డలకు కూడా ఈ వ్యాధి సంక్రమించి వారి జీవితాన్ని కూడా నరక ప్రాయం చేస్తుంది. 

దీనికి ఈ వర్షా కాలంలో ప్రతి చోట లభ్యమయ్యే దూసరి చెట్టు / సిబ్బి తీగ ఆకులు దివ్యమైన ఔషధంగా పని చేస్తాయి. చెట్టును పూజించి , రోజూ ఉదయం పూట దాని ఆకులు తెచ్చి దంచి తీసిన రసం 20 గ్రాములు మోతాదుగా ఒక చెంచా పటిక బెల్లం పొడి కలిపి పరగడుపున తాగుతుంటే మూడు, నాలుగు వారాల్లో ఎంత దీర్ఘ కాలం నుంచి బాధిస్తున్న సెగ రోగమైనా తగ్గిపోతుంది. 


2. ) కడుపులో బల్ల రోగం - ఆయుర్వేద పరిష్కారం 

ఉన్న ఊరు కన్న తల్లి అని మన పెద్దలు చెప్పిన మాట ఈ నాడు మనం మరచిపోవడం వల్ల ఇలాంటి సమస్యలు పరిష్కారం కావడం లేదు. కడుపులో బల్ల సమస్యకు దేశవాళీ ఆవు ఉదయం పూట పోసే మూత్రం మొదటి మరియు చివరి మూత్రాన్ని విడిచిపెట్టి మధ్యలో మూత్రాన్ని ఒక గ్లాసులో పట్టుకొని ఏడు సార్లు బట్టలో వడపోసి అందులో చిటికెడు ఉప్పు కలిపి రోజూ ఉదయం పూట పరగడుపున సేవించాలి. ఇలా వరుసగా రెండు లేదా మూడు వారాల పాటు తాగుతుంటే తిరిగి కాలేయ ప్లీహాలు బాగా పని చేసి బల్ల హరించి పోయి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది. సులభంగా జీర్ణం అయ్యే ఆహారం మాత్రమే సేవించాలి. 

పిల్లల కడుపులో క్రిముల సమస్య, బుడ్డ సమస్య - డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

  1. ) పిల్లలకు కడుపులో క్రిముల సమస్య - ఆయుర్వేద పరిష్కారం 

పిల్లలకు చాక్లెట్లు, బజారు తిండ్లు అలవాటు చేయడం వల్ల, అకాల భోజనం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీని పరిష్కారం కోసం దేవదారు చెక్క, మునగ చెక్క , కరక్కాయ బెరడు, తానికాయ బెరడు, ఉసిరి కాయ బెరడు,పిప్పళ్లు, వాయు విడంగాలు సమాన భాగాలుగా తీసుకుని దంచి పొడి చేసుకుని, అన్నీ కలిపి నిలువ చేసుకోవాలి. రోజూ అరగ్లాసు నీటిలో అరచెంచా పొడి వేసి, పావు గ్లాసు కషాయానికి మరిగించి వడపోసి రెండు పూటలా పూటకు ఒక చెంచా కషాయాన్ని ఆహారానికి  ముందుగా తాగిస్తుంటే కడుపులోని పురుగులన్నీ మలం ద్వారా పూర్తిగా బయటకు పడి పోయి , పిల్లలకు చక్కటి ఆరోగ్యం కలుగుతుంది . 

2.) బుడ్డ దిగిన సమస్య - ఆయుర్వేద పరిష్కారం 

 A .) ఇంతకు ముందు చెప్పినట్లుగా దేశవాళీ ఆవు మూత్రం ఏడు సార్లు వడపోసి రోజూ పరగడుపున ఒక కప్పు మోతాదుగా తీసుకుని అందులో పావు టీ స్పూన్ మాను పసుపు పొడి కలిపి తాగించాలి. 

B.) కరక్కాయ పొడి, శొంఠి పొడి, గసగసాల పొడి , తెగడ పొడి ఒక్కొక్కటి 50 గ్రాములు చొప్పున తీసుకుని కలిపి ఆ మొత్తాన్ని స్వచ్ఛమైన వంటాముదంతో నూరి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. ఈ లేహ్యాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు 5 గ్రాములు మోతాదుగా తినాలి. 

C.) కానుగ గింజల పప్పు, ఆముదపు గింజల పప్పు గచ్చ కాయలలోని పప్పు సమాన భాగాలుగా తీసుకుని వంటాముదంతో నూరి నిలువ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ లేపనాన్ని వాచిన వృషణం పైన పట్టు లాగా వేసి పైన దూది అంటించి అది ఊడిపోకుండా గోచి పెట్టుకుని పడుకోవాలి. 

ఇలా ఆచరిస్తూ, వాతం చేసే పదార్థాలు,మాంసాహారం తినడం మానివేస్తే అతి త్వరగా సమస్య ఆపరేషన్ తో పని లేకుండా పరిష్కారమవుతుంది. 

4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

రక్త స్రావం ఆగకపోవడం, భగంధరం - డా. ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు.

 1.) రక్త స్రావం ఆగని సమస్య - డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారం. 

అడ్డసరం మొక్కను సంపాదించుకోవాలి. దాని కొమ్మ దొరికినా, తెచ్చి నాటితే మొక్కగా బతుకుతుంది. దాని ఆకులు తీసుకుని నీళ్ళు కలపకుండా దంచి ఆ ముద్దను బట్టలో వేసి పిండితే వచ్చే రసాన్ని గిన్నెలో పోసి చిన్న మంట పైన రసం విరిగే వరకు మరిగించాలి. తర్వాత వడపోసి, ఆ విరిగిన అడ్డసరం నీటిని 50 గ్రాముల మోతాదుగా తాగాలి. తాగిన మరుక్షణమే శరీరంలో ఏ భాగం నుండి కారే రక్తమైనా తప్పకుండా ఆగుతుంది. 

2.) భగంధరం సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు.. 

ఆవు నెయ్యి 20 గ్రాములు తీసుకుని ఇనుప కళాయి పాత్రలో వేసి పొయ్యి మీద పెట్టి, అది మరిగేటప్పుడు అతి మెత్తని తెల్ల గుగ్గిలం పొడి 10 గ్రాములు వేసి కలిపి వెంటనే పాత్రను కిందికి దింపి ఆ పదార్థాన్ని ఒక కంచు గిన్నెలో కానీ లేక పళ్ళెంలో కానీ పోయాలి. తర్వాత ఆ పదార్థంలో నీళ్ళు పోసి ఆ మిశ్రమాన్ని కడిగి నీటిని వంచి వేయాలి. మరలా నీళ్ళు పోసి మరలా కడిగి నీటిని తీసివేయాలి. ఇలా ఓపికతో ఆ పదార్థాన్ని వంద సార్లు కడిగితే అద్భుతమైన ఔషధం తయారవుతుంది. 

దాన్ని ఒక గాజు సీసాలో నిలువ చేసుకొని రోజూ రాత్రి పడుకునే ముందు తగినంత పదార్థాన్ని దూదికి రాసి ఒత్తిలాగా తీసుకోవడం చేసి ఆ వత్తిని భగంధర రంధ్రంలో లోపలి దాకా పెట్టి పైన దూది అంటించి కదలకుండా ప్లాస్టర్ అంటించాలి. ఇలా రోజూ ఒక సారి ఒక ఒత్తిని నలభై రోజుల పాటు భగంధరంలో ఎక్కిస్తూ ఉంటే ఆ వ్యాధి సమూలంగా నిర్మూలనము అవుతుంది. 

రేచీకటి, వాత రోగపు నొప్పుల సమస్య - డా. ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 1.) రేచీకటి సమస్య - ఆయుర్వేద పరిష్కారం

తెల్ల మిరియాలు 20 గ్రాములు తెచ్చుకుని వాటిని చింతాకు రసంతో మెత్తగా గుజ్జులా నూరి శనగ గింజంత గోళీలు చేసి నీడకు ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత నిలువ చేసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక మాత్రను సాన రాయిపై కొంచెం నీళ్ళు చల్లి గంధం తీయండి. ఈ గంధాన్ని నిద్రించే ముందు పెసర బద్దంత మోతాదుగా కంటి కొసలలో పెట్టుకుంటూ ఉంటే రేచీకటి హరించిపోయి కళ్ళకు మంచి దృష్టి కలుగుతుంది. 

2.) ఊరంతా వాత రోగపు నొప్పుల సమస్యలు.. ఆయుర్వేద పరిష్కారాలు..

ఒక ఆదివారం నాడు వావిలి చెట్టు కు పూజ చేసి అడుగున తవ్వి ఆ వేళ్ళ మీద ఉండే వేరు బెరడును కొడవలితో గీకి తీసుకోవాలి. గీకిన చోట వేరుకు హాని కలుగకుండా ఆవు పేడ పూసి పూర్తిగా మట్టి కప్పి నీరు పోసి చెట్టుకు నమస్కరించి రావాలి. అలా తెచ్చిన వావిలి వేరును కడిగి ఆరబెట్టి దంచి పొడి చేసుకోవాలి. అలాగే దానితో పాటు శొంఠి, పిప్పళ్లు, మిరియాలు , పిప్పలి కట్టె వీటిని కూడా కొంచెం దోరగా వేయించి దంచి పొడి చేసుకోవాలి. అన్ని పదార్థాలను సమ భాగాలుగా కలిపి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని పూటకు అర చెంచా మోతాదుగా ఒక చెంచా తేనె తో కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు గానీ, గంట తర్వాత కానీ సేవించాలి. దీని వల్ల ఎంతో కాలం నుంచి మంచాన పడ్డ పక్షవాత రోగులు , కీళ్ల వాత రోగులు, అలాగే మిగిలిన దీర్ఘ కాలం వాత వ్యాధులతో బాధ పడే వారంతా పూర్తి స్వస్థతను పొందగలుగుతారు. 

సంతాన సమస్య, పాముల సమస్య - డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 సంతాన లేమి సమస్య - ఆయుర్వేద పరిష్కారం.


గతంలో జరిగిన పొరపాట్ల గురించి ఎంత చింతించినా లాభం ఉండదు. ప్రస్తుతం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. మనం నివసించే ప్రాంతంలో ఉన్న నల్ల తుమ్మ చెట్టు ను పూజించి సమస్యను మనసులోనే తెలిపి , దాని నుండి తుమ్మ చిగుర్లు సేకరించి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి. అలాగే అప్పుడప్పుడే గింజ పడుతున్న పచ్చి తుమ్మ కాయలను గ్రహించి చిన్న ముక్కలుగా చేసి కొద్దిగా నలగ గొట్టి నీడలో బాగా గాలి తగిలే చోట ఆరబెట్టి ఎండిన తర్వాత నిలువ చేసుకోవాలి. అలాగే తుమ్మ చెట్టు నుండి సహజంగా దొరికే తుమ్మ బంక దొరికినంత తెచ్చుకొని చిన్న ముక్కలుగా నలగ గొట్టి కొంచెం నేతితో దోరగా వేయించి నిలువ చేసుకోవాలి. ఈ మూడు పదార్థాలను రెండు మూడు నెలలకు ఒకసారి కావలసి నంత మోతాదుగా తీసుకుని విడి విడిగా దంచి జల్లించి అన్నింటిని కలపాలి. ఆ మిశ్రమ చూర్ణం ఎంత ఉంటే అంత మోతాదుగా పటిక బెల్లం పొడి కలిపి నిలువ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ముందుగా పావు చెంచా నుండి అర చెంచా వరకు అరచేతిలో వేసుకొని కొద్ది కొద్దిగా నాలుకతో అద్దుకొని తిని అనుపానంగా గోరు వెచ్చని పాలు తాగుతుండాలి. ఇలా రెండు పూటలా ఆహారానికి రెండు గంటల ముందు సేవిస్తుంటే క్రమంగా కోల్పోయిన వీర్య శక్తి, అంగ దృఢత్వం , శారీరక పునరుజ్జీవనం అన్నీ ప్రాప్తిస్తాయి. దీని వల్ల వీర్యంలో జీవ కణాల సంఖ్య కూడా సమృద్ధిగా ఉత్పన్నమై సంతానం కలుగుతుంది. 

పాముల సమస్య - ఆయుర్వేద పరిష్కారం.

దూసరి ( సిబ్బి తీగ) చెట్లను పూజించి తవ్వి ఆ వేరును తీసుకొచ్చి కడిగి పసుపు కుంకుమ పూసి దేవుని వద్ద పెట్టి పూజించండి. ఆ తర్వాత వాటిని ఇంటి ప్రధాన గుమ్మాలకు వేలాడ దియాలి. దీనినే పాతాళ గరుడి అంటారు. దీని ప్రభావానికి ఎంతో దూరం నుండే పాములు వెనక్కి తిరిగి పోతాయి. దాని పరిసర ప్రాంతాలలోకి రాలేవు. దాంతో పాటు ఆవాలు, నవసాగరం సమ భాగాలుగా కలిపి దంచి ఆ మిశ్రమాన్ని పాములు సంచరించే చోట చల్లాలి. వాటి వాసన పడక ఆ ప్రాంతంలో ఉండే పాములు దూరంగా పారిపోతాయి. అంతే కాక మట్టి మూకుడులో పిడకలు అంటించి , ఆ నిప్పుల మీద వస కొమ్ముల పొడి చల్లి పాములున్న ప్రాంతంలో ఆ పొగ వేస్తుండాలి. ఇలా ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాముల భయం నుండి నివారణ పొందవచ్చు. 

మారేడు పూల హల్వా.. ఆయుర్వేద ఉపయోగాలు..

 నిహన్యాద్బిల్వజం పుష్పమతీ సారం తృషాం వమీం.. మారేడు చెట్టును శివుడిపై భక్తితో పెంచుకునే వారే ఎక్కువ.కానీ దాని పూలు, ఆకులు, కాయలు అన్నీ ఔషధ ప్రయోజనాలు కలిగించేవే.. 

మారేడు,మర్రి, రావి ఇవన్నీ వాతావరణం నుంచి ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకుని ఎక్కువ ఆక్సీజన్ ఇచ్చే చెట్లు. భోజన కుతూహలం గ్రంథంలో ఆహార యోగ్యమైన పువ్వుల గురించిన ప్రకరణం ప్రారంభిస్తూ మారేడు పూలను మొదటగా ప్రస్తావించారు. భక్తి ప్రాధాన్యత కాదు అది .. ఆరోగ్య ప్రాధాన్యత. మారేడు పూలు ( మారేడు - ఇండియన్ బేల్ ) విరేచనాలను తగ్గిస్తాయి. దప్పిక తీరుస్తాయి. వాంతుల్ని ఆపుతాయి అని భోజన కుతూహలం గ్రంథంలో తెలిపారు. 

మారేడు కాయ గుజ్జు అమీబియాసిస్ వ్యాధి నియంత్రణకు పని చేస్తుంది కానీ మారేడు పూలు అతిసార వ్యాధిని కూడా అరికట్టగలదని దీని తాత్పర్యం. బ్యాక్టీరియా కారణంగా పేగులలో వచ్చే వ్యాధులను అరికట్టడానికి మారేడు పువ్వులు ఉపయోగపడతాయి. మనం అప్పుడప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కు గురవుతుంటాము. బయట ఆహారం తినడం తప్పనిసరి అయిన వారు తరచూ మారేడు పూలు, కాయలు లేదా ఆకులు .. వీటిలో ఏది దొరికినా వాడుకుంటూ ఉండాలి. దీని వల్ల పొట్ట మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. 

ఇవి తాజాగానే ఉండాలని లేదు .. ఎండించి,దంచి , భద్రపరచుకొని రోజూ ఒక చెంచా పొడిని నీళ్లలో వేసి మరిగించి టీ లాగా తాగవచ్చు. మారేడును వాత వ్యాధులను తగ్గించే ఔషధమని చరకుడు ప్రముఖంగా పేర్కొన్నాడు. 

మారేడు వేరు దశ మూలాలలో ఒకటి. దశ మూలాలు వాత వ్యాధులను హరించేవిగా ప్రసిద్ధి. మారేడు పూలు చలవ నిస్తాయి. పైత్యాన్ని తగ్గిస్తాయి, అందువల్ల ఎసిడిటీ కారణంగా వచ్చే సమస్యలన్నిటిపైనా చక్కగా పని చేస్తాయి. మారేడు పూలను నెయ్యితో వేయించి , హల్వా తయారు చేసుకుని, ఫ్రిజ్ లో భద్ర పరచుకొని రోజూ ఒక చెంచా మోతాదులో తీసుకోవచ్చు. 

తీసుకున్న ఆహారం వంట బట్టక పోవడం,తినగానే విరేచనానికి వెళ్ళాల్సి రావడం , మల బద్ధకం, గ్యాసు, పేగు పూత, , కడుపులో నొప్పి, నీరసం , నిస్సత్తువ లాంటి లక్షణాలన్నీ ఇరిటబుల్ బెవెల్ సిండ్రోమ్ IBS అనే వ్యాధిని సూచిస్తాయి. దీని పైన మారేడు ఆకులు, పూలు, కాయ లోపలి గుజ్జు ఔషధంగా పని చేస్తాయి. ఇది చిట్కా వైద్యం కాదు. ఆయుర్వేదంలో బిల్వారిష్ట, బిల్వాది గుళిక లాంటి ఔషధాలు దీని పైన పని చేసేవి మార్కెట్ లో దొరుకుతున్నాయి. వైద్యుడి సలహా మేరకు వాడుకోవచ్చు. 

2, సెప్టెంబర్ 2026, బుధవారం

ఏ వ్యాధి కలవారు.. ఏ ఔషధాలు వాడవచ్చు.

 వాత వ్యాధులకు..

 1. మహా రాస్నాది కషాయం లేక గోక్షూరాది గుటికలు. 2. అర్కాది తైలం . 3. త్రిఫల కల్పం. 4. అశ్వగంధ ఘృతం ( తీపిలేకుండా )+ శిలాజిత్ వాడుకోవాలి.

గ్యాస్ మొదలగు ఉదర వ్యాధులకు..

1. త్రిఫలా కల్పం 2. హింగ్వాష్టకం 3 . ఆర్ద్రక ఖండం వాడుకోవాలి.

దగ్గు, ఆస్తమా మొదలగు కఫ రోగాలకు..

1. సీతో ఫలాది చూర్ణం 2. తులసి మాత్రలు.3.త్రిఫల రసాయనం ( తేనెతో రాత్రి ) . 4. తులసి టీ.  5. భృగు హరీతకి ( నిర్మలీ) వాడుకోవాలి.

తెల్ల లేక ఎర్ర బొల్లి మచ్చల కు..

1. ఖదీరాది కషాయం 2. సుగంధ పాల లేహ్యం. 3. స్వర్ణ తైలం( గోల్డ్ ఆయిల్). 4. శ్విత్ర అధర లేపనం. 5. త్రిఫల రసాయనం వాడుకోవాలి.

చర్మ వ్యాధులకు..

1. మంజిష్టాది కషాయం .2. సుగంధ పాల లేహ్యం.3. సింధూరాది తైలం. 4. త్రిఫల కల్పం.5. ఖాదీరాది కషాయం.6. కామధేను అర్కం వాడుకోవాలి.

చర్మం పై పైత్య దురదలు ,దద్దుర్లకు..

 1. ఆర్ద్రక ఖండం.2. త్రిఫల రసాయనం. 3. గోక్షూరాది అవలేహ్యం . 4. సింధూరాది తైలం వాడుకోవాలి. 

వెంట్రుకల సమస్యలకు..

1. త్రిఫల రసాయనం. 2. కేశామృతం 3. భృంగరాజ తైలం. 4. త్రిఫల కల్ప జలం. 5. కేశ వృధ్ధి లేపనం. 

కంటి సమస్యలకు..

1. పునర్నవాది కషాయం  2. త్రిఫల రసాయనం( ఆవు నెయ్యి, తేనెతో ) వాడుకోవాలి . 

చెవి సమస్యలకు..

1. త్రిఫల రసాయనం. 2. అపామార్గ తైలం. 3. అశ్వగంధ ఘృతం. 4. షడ్బిందు తైలం. 

ముక్కు సమస్యలు తగ్గడానికి ..

1. తులసి మాత్రలు. 2. షడ్బిందు తైలం లేక వేప నూనె. 3. త్రిఫల రసాయనం ( తేనె తో)  4. అమృత ధార వాడుకోవాలి . 

లివర్ సమస్యకు..

1. పునర్నవాది కషాయం. 2. ఆర్ద్రక ఖండము. 3. త్రిఫల రసాయనం వాడుకోవాలి . 

హృదయ సమస్యలకు..

1. త్రిఫల రసాయనం. 2. హింగ్వాష్టకం . 3. అర్జునాది వటి వాడుకోవాలి.

 మధు మేహ వ్యాధికి.. 

1. త్రిఫల కల్పం. 2. అశ్వగంధ ఘృతం ( తీపి లేకుండా) + శిలజిత్. 3. మధు సంహారిణి లేదా మధురిహా చూర్ణం వాడుకోవాలి. 

మూత్ర పిండాలలో రాళ్లకు..

1. గోక్షూరాది కషాయం. 2. త్రిఫల కల్పం.  3. భృగు హరితకి లేహ్యం. 

శీఘ్ర స్ఖలనము - నపుంసకత్వం..

1. ఖర్జూరాది చూర్ణం. 2.  శతావరీ పాకం. 3.  వాసరీ గుటికలు. 4. అశ్వగంధ+ శిలాజిత్. 5. త్రిఫల రసాయనం. 6. అశ్వగంధ తైలం. 

దంత సమస్యలకు..

1. కణాది చూర్ణం ( పండ్ల పొడి ) .2. త్రిఫల కల్ప జలం. 3. అశ్వగంధ ఘృతం వాడుకోవాలి.

గొంతు సమస్యలకు - థైరాయిడ్ కు.

1. త్రిఫల రసాయనం ( తేనెతో ) .2. తులసి మాత్రలు. 3. అమలకాది చూర్ణం ( గళ రోగ హర ) వాడుకోవాలి.

ఆకలి లేని పిల్లలకు,పెద్దలకు ..

1. ఆర్ద్రక ఖండము. 2. త్రిఫల రసాయనం. 3. హింగ్వాష్టకం వాడుకోవాలి.

అర్శమొలలకు ( పైల్స్ కు ) ..

1. సూరణ వటుకములు. 2. త్రిఫల కల్పం ( మజ్జిగతో ) . 3. హింగ్వాష్టకం వాడుకోవాలి.

అండ వృద్ధి,వృషణాల వాపు, హెర్నియా..

1. మహా రాస్నాది కషాయం. 2. అండ వృద్ధి మాత్రలు. 3. త్రిఫల కల్పం. 4. అర్కాది తైలం వాడుకోవాలి.

పిల్లలు,పెద్దల జ్ఞాపక శక్తి కి..

1. సారస్వత చూర్ణం. 2. భృంగరాజ తైలం. 3. ఆర్ద్రక ఖండము. 4. త్రిఫల రసాయనం వాడుకోవాలి.

మానసిక వికలాంగులకు..

1. అజామోదాది చూర్ణం. 2. సారస్వతి చూర్ణం . 3. భృంగ రాజ తైలం. 4. త్రిఫల రసాయనం వాడుకోవాలి.

స్త్రీల బట్టంటు వ్యాధులకు..

1. ఇంద్ర యవాది చూర్ణం. 2. శతావరీ పాకం. 3. కుమారీ రసాయనం. 4. గోక్షూరాది కషాయం . 5. త్రిఫల కల్ప జలం ( డూషింగ్) వాడుకోవాలి .

స్త్రీల అతి రుతు రక్త స్రావానికి..

1. శాతావరీ రసాయనం. 2. కుమారీ రసాయనం. 3. అశ్వగంధ ఘృతం. 4. గోక్షూరాది కషాయం వాడుకోవాలి.

స్త్రీ పురుషుల అధిక రక్తపోటుకు ( హై బీపీ కి )..

1. అమృతాది చూర్ణం. 2.  త్రిఫల కల్పం. 3. గోక్షూరాది కషాయం వాడుకోవాలి.

స్త్రీ పురుషుల అల్ప రక్త పోటుకు ( లో బీపీ కి )..

1. త్రిఫల రసాయనం . 2. సుగంధ లేహ్యం. 3.  శతావరీ పాకం . 4. అశ్వగంధ ఘృతం + శిలాజిత్ వాడుకోవాలి.

స్త్రీల గర్భాశయ సమస్యలకు..

1. కుమారీ రసాయనం. 2.  శతావరీ పాకం. 3.  త్రిఫల రసాయనం. 4. అశ్వగంధ ఘృతం + శిలాజిత్ వాడుకోవాలి.

అతి మూత్ర సమస్య కలవారికి..

1. త్రిఫల రసాయనం. 2. గోక్షూరాది కషాయం . 3. భృగు హరీతకి లేహ్యం వాడుకోవాలి.

సంతానం లేని స్త్రీలకు..

1. శతావరీ పాకం. 2. అశ్వగంధ ఘృతం. 3.  నాగ కేసర. 4. గోక్షుర వాడుకోవాలి.

ముఖ సౌందర్యానికి..

1. ముఖ కాంతి లేపనం ( ఫేస్ ప్యాక్ ). 2. సుగంధ లేహ్యం. 3. కుంకుమాది తైలం. 4.  త్రిఫల రసాయనం వాడుకోవాలి.

చర్మ సౌందర్యానికి..

1. శరీర దుర్గంధ హర చూర్ణం ( బాత్ పౌడర్ ) . 2. సుగంధ లేహ్యం. 3. త్రిఫల రసాయనం వాడుకోవాలి. 

పాదాల పగుళ్ళకు..

1. సుగంధ లేహ్యం. 2. మదనాది లేపనం. 3.  గోక్షూరాది కషాయం. 4.  త్రిఫల రసాయనం వాడుకోవాలి. 

అతి కొవ్వు ( ఒబెసిటీ ) హరించుటకు ..

1. త్రిఫలాది చూర్ణం . 2. త్రిఫలాద్య తైలం. 3. పునర్నవాది కషాయం .4. గోక్షూరాది కషాయం వాడుకోవాలి. 

ఏ సమస్యా లేని వారికి సమస్య రాకుండా..

1. త్రిఫల కల్పం. 2.  పునర్నవ కషాయం 3.  అశ్వగంధ వాడుకోవాలి. 

ఏ వ్యాధి కలవారైనా ఆహార వేదం లాంటి ఆయుర్వేద గ్రంథాలు చదివి ఆహార,విహార ,వ్యవహారాలు పాటించాలి.

1, సెప్టెంబర్ 2026, మంగళవారం

ఫిట్స్, చెవి దగ్గర కాయ, మూత్రంలో మంట.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 1. ఫిట్స్ సమస్య .. ఆయుర్వేద పరిష్కారాలు 


నల్ల నువ్వులు దోరగా వేయించి దంచి జల్లించి చేసిన పొడి 100 గ్రాములు , వెల్లుల్లి దంచి తీసిన రసం 100 గ్రాములు .. ఈ రెండింటిని కలిపి మెత్తగా మాత్ర కట్టుకు వచ్చే వరకు నూరి బఠాణీ గింజంత గోళీలు కట్టి నీడలో గాలి తగిలే చోట ఆరబెట్టి పూర్తిగా నీరు ఇంకిపోయిన తర్వాత ఆ గోళీలను ఒక సీసాలో నిలువ చేసుకోవాలి. రోజూ సమస్య తీవ్రతను బట్టి రెండు లేక మూడు పూటలా ఒక మాత్ర మంచి నీటితో సేవిస్తుంటే క్రమంగా ఈ సమస్య పరిష్కారమవుతుంది. ఐతే ఫిట్స్ వచ్చిన వెంటనే సీతా ఫలం ఆకు మెత్తగా నలగ్గొట్టి వాసన చూపిస్తే క్షణ మాత్రంలోనే తెలివి వస్తుంది. ఈ విధంగా ప్రయత్నం చేస్తుంటే ఫిట్స్ సమస్య నుండి బయట పడవచ్చు. 

2 . చెవి కుట్టిన చోట కాయ పెరిగిన సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..

ఇంట్లో కొట్టుకున్న మంచి పసుపు ఒక చెంచా తీసుకొని సగం ముద్ద వేడి అన్నం పసుపుతో కలిపి మెత్తగా పిసికి ఆ కాయ మీద పెట్టి ఊడిపోకుండా దాని పైన దూది పెట్టి ప్లాస్టర్ అంటించాలి. ఇలా రోజూ రాత్రి పూట పెట్టి ఉదయం తీసివేస్తుండాలి. కొద్ది రోజులకు కాయ పెరగడం ఆగి నిదానంగా తగ్గడం మొదలవుతుంది.

3 . మూత్రంలో మంట సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు

మూలికలు అమ్మే దుకాణంలో నేల వేము, నేల ఉసిరి , సుగంధ పాల వేళ్ళు, గుంట గలగర , తిప్ప తీగ ఒక్కొక్కటి 200 గ్రాముల చొప్పున తెచ్చుకోవాలి.వీటిని విడి విడిగా పొడి చేసి కలిపి ఉంచుకోవాలి. రోజూ రెండు గ్లాసుల నీటిలో రెండు చెంచాల పొడి వేసి రెండు కప్పుల కషాయానికి మరిగించి వడపోసి పూటకు ఒక కప్పు కషాయం గోరు వెచ్చగా మాత్రమే ఒక చెంచా తేనె కలిపి తాగుతుండాలి. దీని వల్ల మూత్రంలో మంట,చురుకు మొదలైన సమస్యలు తగ్గిపోయి మూత్రం పూర్తిగా శుద్ధి చెందుతుంది. దాంతో పాటు రక్తం కూడా శుద్ధి చెందుతుంది.

శరీరానికి మంచి కాంతి, వర్చస్సు సిద్ధిస్తుంది.

 



జలుబు, దంతాల సమస్యలు.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 దీర్ఘ కాలికంగా జలుబు, పిల్లి కూతలతో ఆయాసం. . ఆయుర్వేద పరిష్కారాలు.

ఉత్తరేణి చెట్లు, వాకుడు చెట్లు,అడ్డసరం ఆకులు కాడలు సమ భాగాలుగా తెచ్చుకోవాలి . అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసి కడిగి ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత ఆ ముక్కలను శుభ్రమైన రాతి మీద పోసి నిప్పు అంటించి బూడిదగా చేయాలి. దానిని జల్లించి దానితో సమానంగా పటిక బెల్లం పొడి కలిపి గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. రోజూ రెండు లేదా మూడు పూటలా ఒక చెంచా పొడిని ఒక చెంచా తేనె తో కలిపి నిదానంగా సేవిస్తుండాలి. ఎంత కాలంనుండి ఉన్న ఆయాసమైనా, ఆస్తమా అయినా , పిల్లి కూతలైనా తప్పకుండా తగ్గిపోతాయి. 

దంతాలు కదలడం, ఎర్రగా మారడం వంటి సమస్యలు.. ఆయుర్వేద పరిష్కారాలు..

బాగా ముదిరి ఉన్న ఉత్తరేణి చెట్టును చూసుకుని పూజ చేసి సమస్యను మనసులోనే తెలిపి ఆ చెట్టును పీకి దాని వేళ్ళను ఇంటికి తెచ్చుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి చూపుడు వేలంత ముక్కలుగా తయారు చేసుకొని ఆరబెట్టాలి. రోజూ ఒక ముక్కతో నిదానంగా మృదువుగా  దంతాలను అన్ని వైపులా తోముతుండాలి. తోమిన తర్వాత అరగంట ఆగి గోరు వెచ్చని నీటితో పుక్కిలించాలి. ఈ విధంగా చేస్తుంటే క్రమంగా దంతాలు తెల్లబడి , దృఢంగా జీవిత కాలమంతా కళకళలాడుతుంటాయి. 

కళ్ళు, గర్భ సంచి సమస్యలు.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 కనురెప్పల్లో చీము గడ్డల సమస్య.. 

తలలో అధికమైన అనవసరమైన కఫం చేరడం వల్ల ఈ సమస్య కలుగుతుంది.

1. ) ముందుగా అధికంగా కఫం పెంచే పదార్థాలను ఆహారంలో తీసుకోవద్దు. 2. ) త్రిఫలాల ముక్కలు ఒక్కొక్కటి పది ముక్కల చొప్పున మొత్తం 30 ముక్కలు ఒక గ్లాసు వేడి నీటిలో రాత్రి వేసి ఉదయం వరకు ఉంచి వడపోసుకోవాలి. ఆ నీటిని ఉదయం పూట కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుని మూసిన కన్నులపైన తడపాలి. ఇలా ప్రతి రోజూ ఉదయం పూట చేయాలి. 3. ) ఒక పెద్ద గ్లాసు నీటిలో ఒక చెంచా పసుపు వేసి అర గ్లాసు కషాయానికి మరిగించి వడపోసి నూలు బట్ట నాలుగు మడతలు వేసి ఆ కషాయంలో ముంచి నీళ్ళు కారకుండా కొంచెం పిండి ఆ తడి బట్టను గోరు వెచ్చగా ఉన్నప్పుడు మూసిన కన్నులపైన వేసుకుని పది లేక పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా రోజుకు రెండు సార్లు ఆచరించాలి. 4.) పలుచగా ఉన్న ప్రశస్తమైన వేప నూనె రెండు ముక్కుల్లో రెండు రెండు చుక్కలు రెండు పూటలా ఆహారానికి అరగంట ముందుగా వేస్తుండాలి. 

గర్భ సంచి మందంగా మారిన సమస్య..

1.) కలబంద గుజ్జు ఆపకుండా మూడు నెలల వరకు సాయంత్రం పూట సేవించాలి. 2.) అశోక చెట్టు లేదా రావి చెట్టు లేదా మర్రి చెట్టు లేదా మేడి చెట్టు వీటిలో ఏదో ఒక చెట్టుకు పూజ చేసి మాను మీద ఉండే బెరడు 2,3 కేజీలు తీసుకోవాలి. తీసిన చోట మాను మీద దట్టంగా ఆవు పేడ పూసి రావాలి. ఆ బెరడును 50 గ్రాములు తూకం ఉండే విధంగా ముక్కలు కొట్టి కడిగి ఎండబెట్టి నిలువ చేసుకోవాలి. ఒక పెద్ద గ్లాసు నీటిలో ఒక ముక్క వేసి ఒక రోజు నానబెట్టి చిన్న మంట పైన ఒక కప్పు కషాయం మిగిలే వరకు మరగబెట్టి వడపోసి ఆ ముక్కను తీసివేసి , ఆ కషాయంలో ఒక చెంచా కండ చక్కెర పొడి కలిపి గోరు వెచ్చగా పరగడుపున తాగాలి. 3.) వేపాకు పావు కేజీ, మంచి పసుపు 20 గ్రాములు, కలబంద గుజ్జు 100 గ్రాములు , తగినన్ని నీళ్లు పోసి మిక్సీలో వేసి ముద్దలాగా చేసి వెల్లకిలా పడుకుని ఆ ముద్దను పొత్తి కడుపు పైన పట్టులాగా వేసి పలుచని బట్ట పైన వేసి ఆ గాలి తగలకుండా దుప్పటి కప్పుకుని అర గంట వరకు ఉంచి తీసివేయాలి. ఇలాగే రేగడి మట్టితో కూడా రెండవ పూట పట్టు వేసుకోవచ్చు. 4. ) పావు చెంచా మిరియాల పొడి , అర చెంచా ఉసిరి కాయల పొడి , ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో వేసి ఆహారానికి ఒక గంట ముందు కానీ తర్వాత కానీ సేవించాలి. 5.) కపాల భాతి ప్రాణాయామం , పశ్చిమోత్తాసనం, వక్రాసనం, పవన ముక్తాసనం , భుజంగాసనం , శలభాసనం రోజూ రెండు పూటలా పొట్ట ఖాళీగా ఉన్న సమయంలో ఆచరించాలి. ఇలా చేస్తుంటే సర్జరీతో అవసరం లేకుండా గర్భ సంచిలో గడ్డలు కరిగి పోతాయి. 

31, ఆగస్టు 2026, సోమవారం

మహాత్ముడు మెచ్చిన.. అవిసె గింజలు

 ఆయుర్దాయం పెరగడంలో ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు కీలక భూమిక పోషిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆయుర్దాయం పెంచుకోవడానికి ఇవాళ ఎన్నో అవకాశాలు, సులువైన ఆరోగ్య విధానాలు, ఆరోగ్య కరమైన ఆహార పద్ధతులు, ఆహార అలవాట్లు, విస్తృత శ్రేణిలో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆరోగ్యానికి హాని చేసే అలవాట్లకు దూరంగా ఉంటూ , తగిన శారీరక వ్యాయామం చేస్తూ , చక్కటి ఆహార అలవాట్లు పాటిస్తూ , పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తీసుకోవడం వల్ల నిత్యం శారీరకంగా ఎంతో చురుకుగా ఉండవచ్చని , ఆహార అలవాట్లు, జీవన శైలి జీవిత కాలాన్ని పెంచడంలో కీలకం కాగలవని పరిశోధకులు అంటున్నారు. 

ఇటీవలి కాలంలో ఎన్నో కొత్త ఐటమ్స్ తీసుకోదగ్గ ఆహార పదార్థాల జాబితాలో చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖంగా వినబడుతున్న అవిసె గింజలు కూడా ఈ కోవలోకే వస్తాయి. ఇవాళ కొత్తగా వినిపిస్తున్నా నిజానికి అవిసె గింజలకు వేన వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉంది. ఆవిసెలు ఎన్నో రకాల రుగ్మతలను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేయ గలవని ఇటీవలి పరిశోధనలు నిరూపిస్తున్నాయి. 

ఎక్కడైతే అవిసె గింజలను ప్రజలు తమ దైనందిన ఆహారంలో భాగం చేసుకుంటారో అక్కడ చక్కటి ఆరోగ్యం వెల్లివిరుస్తుంది అని మహాత్మా గాంధీ ఏనాడో అన్నారు. నిజమే.. ఈ చిరు గింజలలో పలు ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు అవిసె అత్యంత శక్తివంతమైనది. 

భారత దేశంలోని గ్రామాలలో అవిసె గింజలను కీళ్ల నొప్పులు , దగ్గు, జలుబు నయం చేయడానికి పచ్చళ్ళు చేయడానికి ఉపయోగిస్తారు. స్థానిక పచారీ కొట్టులన్నీ అద్భుతమైన ఈ అవిసె గింజలను నిల్వ చేసుకుంటాయి. మన పూర్వీకులు ఈ అవిసె గింజల తో ఎన్నో రకాలుగా వైద్యం చేసేవారు. ఇప్పటికీ బామ్మలు, అమ్మమ్మలు వీటితో ఏవో చిట్కా వైద్యాలు చేస్తుంటారు. 

ఈ అవిసె గింజల తో చట్నీలు, చెక్కీలు,పొడులు , లడ్డూలు చేస్తుంటారు. వాటిని తీయగానో, ఉప్పగానో పొడి రూపంలో తినవచ్చు. అవిసె గింజలను స్వల్ప పరిమాణంలో ఉపయోగించినప్పటికీ అవి అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి. ఆవిసెలు జీవక్రియ రేటు ను పెంచి ఆక్సీకరణను చైతన్య పరుస్తాయి. శరీరంలో శక్తి జనించేందుకు దోహదం చేస్తాయి. దీని వలన శరీరంలో వేడి పడుతుంది. చలి కాలం, వర్షా కాలంలో వచ్చే జలుబు, దగ్గులను నివారించడానికి ఈ వేడి ఉపకరిస్తుంది. 

అవిసె గింజల లో పీచు,ఖనిజాలు , విటమిన్ లతో పాటు మాంస కృత్తులు సమృద్ధిగా ఉన్నాయి. శారీరక ఎదుగుదలకు, శిరోజాలు ఆరోగ్యంగా పెరగడానికి మాంస కృత్తులు దోహదం చేస్తాయి. పీచు పదార్థాలు మల విసర్జన సాఫీగా జరగడానికి తోడ్పడతాయి. కొలోన్ ఆరోగ్యాన్ని క్రమ బద్ధం చేస్తాయి. మల బద్ధకం సమస్య తలెత్తదు. అవిసెలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ ను నివారించడం ద్వారా గుండె రోగాలు, కీళ్ల వాతం, ఉబ్బసం, షుగర్, ఇంకా కొన్ని క్యాన్సర్ల( ప్రత్యేకించి పౌరుష గ్రంధి క్యాన్సర్) నుంచి శరీరాన్ని కాపాడతాయి. 

లైంగిక దుర్భలతతో బాధ పడే వారికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వల్ల మేలు చేకూరుతుంది. ఈ గింజలలోని ఫోలిక్ యాసిడ్ వ్యంధ్య మహిళలకు తోడ్పడతాయి. అవిసె గింజల లో బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని క్షాళన చేస్తాయి. రక్తాన్ని శుద్ధి గావిస్తాయి. 

చర్మం, శిరోజాల పరిస్థితిని మెరుగు పరుస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి ఎంతో దోహదం చేస్తాయి. మామూలు జలుబు, దగ్గులనుంచి రక్షణ ఇస్తాయి. 

ఈ గింజల నుంచి తీసే అవిసె నూనె చుండ్రు, పొడి చర్మం, సూర్య రష్మి వేడిని తట్టుకోలేని సున్నితమైన చర్మాలకు బాగా పనిచేస్తుంది. ఎగ్జిమా లను నయం చేస్తుంది. ఎండ వల్ల చర్మం పేలడం , చెమట కాయలు రావడం లాంటి వాటిని నివారిస్తుంది. 

ఇబ్బందికరమైన రుతుచక్రం నిలిచి పోయే దశలో ఈ గింజలలోని ఫైటో ఈస్ట్రోజన్స్ స్త్రీలకు సహాయపడతాయి. మహిళల్లో రుతు క్రమానికి ముందు తలెత్తే ( పిలిమిలిన్ ) బాధాకరమైన నొప్పులను నివారించడంలో అవిసె గింజలు తోడ్పడతాయి. 

ఒక టీ స్పూన్ అవిసె గింజలను చప్పరించడం , నమలడం వలన ఉదర సంబంధిత సమస్యలు రావు. పెప్టిక్ అల్సర్లు నయమవుతాయి. శరీరం ముడతలు పడకుండా వాడే రసాయనిక క్రీములకు బదులుగా అవిసె నూనెను వాడవచ్చు. అవిసెలోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరాన్ని మృదువుగా , ముడతలు లేకుండా ఉంచుతాయి. అన్ని రకాల మైగ్రేన్ నొప్పులకు అవిసె నూనె బాగా పనిచేస్తుంది. ఆస్తమా , ఎలర్జీ లనుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. 

గోళ్లను, గోళ్ళ అందాలను ,ఆరోగ్యాన్ని కాపాడడంలో అవిసె గింజలు ఎంతో ఉపకరిస్తాయి. అవిసె గింజలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమయ్యే కొవ్వు ఆమ్లాల పరిమాణం పెంచితే .. గోళ్లు పెళుసు బారడం, చిట్లడం , చిన్న చిన్న ముక్కలుగా విరగడం వంటి సమస్యలు చోటు చేసుకోవు. 

వార్ధక్య లక్షణాలను అరికట్టడం... యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలు అవిసెలో మెండుగా ఉంటాయి. ఈ సుగుణాలు ప్రత్యేకించి మహిళలకు ఎంతో మేలు చేస్తాయి. రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. 

మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ కారణంగా తలెత్తే హాని కారక ప్రభావాలను అవిసెలలోని రసాయనాలు గణనీయంగా తగ్గిస్తాయి. శరీరంలోని కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్ నిల్వలను అవిసెలు బాగా తగ్గిస్తాయి. మానసిక ఏకాగ్రత, విశ్రాంతిని కల్పించడంలో ఈ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎంతో మేలు చేస్తాయి. 

చర్మం పై రంధ్రాలు మూసుకుపోకుండా , చర్మం ఎర్ర భారనీయకుండా నివారించడానికి రోజూ ఒక టేబుల్ స్పూన్ అవిసె నూనె తీసుకోవాలి. అవిసె గింజల లోని అత్యవసరమైన కొవ్వు ఆమ్లాలు కుంగుబాటు, వార్ధక్య లక్షణాలను అరికట్టడం లో ఎంతగానో ఉపకరిస్తాయి. 

వంటకాలలో....

ఎన్నో పౌష్టిక విలువలు, అపార ఔషధ సుగుణాలు ఉన్న అవిసె గింజలను ఆకు కూరలు , కాయ గూరలు, చేపలతో పాటు ఆహారంలో చేర్చుకోవాలి. ఏ రూపంలో తీసుకున్నా అవిసె గింజలు ఎన్నో కారణాల దృష్ట్యా ఎంతో విలువైనవి.అవిసెలను చట్నిగా, చెక్కీలుగా,లడ్డూలుగా ఏ రూపంలో నైనా తీసుకోవచ్చు. ఈ గింజలను బెల్లంతో కలిపి చక్కీలు చేసుకోవచ్చు. సలాడ్స్ పై వీటిని చల్లుకోవచ్చు. ఇవి శక్తిని,ఓపికను మెరుగు పరుస్తాయి.

పండ్ల రసాలు,షేక్స్,ఇతర మృదు పానీయాలలో వాడుకోవచ్చు.అవిసెలను కూరలకు, పానీయాలకు చేర్చడం వలన వాటికి అదనపు రుచి వస్తుంది. ఇంట్లో తయారు చేసిన జున్ను,యోగర్ట్ ఇంకా ఇతర ఆహారాలకు ఈ గింజలను చేర్చుకోవచ్చు.

వంటకాల తయారీలో అవిసె గింజల లోని పౌష్టిక విలువలు నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవిసె నూనెను మీ వంటకాలలో, ఆహార పదార్థాలలో చేర్చుకోండి. అవిసెల వాడకంతో మీ ఆరోగ్యంలో చోటు చేసుకునే అద్భుత ఫలితాలను ,పరిణామాలను గమనించండి .ఆరోగ్యం,ఆయుర్దాయం పెరిగే ప్రయత్నాన్ని ప్రారంభించండి.


30, ఆగస్టు 2026, ఆదివారం

కాసర కాయలు.. మినీ కాకర కాయలు..

 చూడడానికి చిన్న కాకర కాయల మాదిరిగా కనిపిస్తుంటాయి ఈ కాసర కాయలు. తెలుగు రాష్ట్రాల్లో రాయల సీమ ప్రాంతంలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా తెలియదు. ఎందుకంటే ఇది అడవులు , చేల గట్ల వెంబడి సహజంగా పెరిగే ఒక రకమైన అడవి కూర గాయ. కాకర కాయల మాదిరిగా మహా చేదుగా ఉంటాయి. అందువల్ల నూనెలో బాగా వేయించి , ఉప్పు, కారం చల్లి రాగి సంకటి, జొన్న రొట్టెలతో ఇష్టంగా తింటారు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తాయని , యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటాయని అనంతపురం ఆర్ట్స్ కళాశాల బోటనీ లెక్చరర్ డాక్టర్ రఘు రాములు చెప్పారు. అనంతపురంలోని పాతూరు మార్కెట్లో కిలో రూ. 300 పలుకుతున్నాయి. ఇవి మార్కెట్ లో ఎల్లప్పుడూ దొరకవు. వానాకాలంలో మాత్రమే అక్కడక్కడా లభిస్తాయి. 



భయం.. ఒక మానసిక సమస్య

 భయ పడడం అన్నది ఒక రకమైన మానసిక స్థితి. ఈ భయం ఎప్పుడైనా, ఎవరికైనా రావచ్చు. ఏ వయసులోనైనా రావచ్చు. అసంకల్పితంగా మన స్మృతిలో ఉన్నప్పుడు కానీ, తెలియని స్థితి లో కానీ హఠాత్తుగా ఏర్పడ్డ భావన మనస్సులో స్థిరపడి ఈ భయాలకు కారణం అవుతున్నది. 

అలాగే పాముని చూసి భయం ఉండవచ్చు. పాము ఏం చేయకపోయినా ఆ భయం వల్ల వచ్చే షాక్ వల్ల ప్రమాదం రావచ్చు. కాలేజీలో చదువుకునే ఓ  అమ్మాయికి తనని అద్దంలో చూసుకోవాలంటే భయమట. ఎందుకంటే మిగతా అమ్మాయిల కన్నా తాను అందంగా ఉండననే సంకుచిత భావం క్రమంగా పెరిగి తనని తాను అద్దంలో చూసుకోవడానికి భయం ఏర్పరచుకుంది. 

ఇది ఒక మానసిక న్యూనతా భావం నుంచి వచ్చిన ఒక రుగ్మత. దీన్ని " ఇసోట్రో ఫోబియా " అంటారు. 

ఈ మధ్య ఒక కాలేజీ అబ్బాయి వచ్చి సార్ నాకు ఇంగ్లీషులో పెద్ద పెద్ద వాక్యాలంటే భయం, చదవలేక పోతున్నాను అన్నాడు. ఇది కూడా మానసిక న్యూనత భావం నుంచి వచ్చిన రుగ్మతే . 

రకరకాల భయాలు..

నిజానికి మనమంతా భయం తోనే పుడతాం. భయం తోనే పెరుగుతాం. తెలియని, రాబోయే ప్రమాదాన్ని ఊహించుకుని దాన్ని ఆపడం తెలియక మనం పడే మానసిక వేదన ' భయం '. మరో రకంగా చెప్పాలంటే మనల్ని మనం రక్షించుకునే ఒక కవచం లాంటిది ' భయం '.

అది నిజం కాకపోవచ్చు,కానీ ఆ భయంలో ఉన్నప్పుడు మనని ఇతరులు బలవంతంగా ఏదైనా చేయిస్తే ఆ భయం నిజమై ప్రమాదం కావచ్చు. ఉదాహరణకు ఊగుతున్నప్పుడు ఎత్తుకు వెడితే భయం పుడుతుంది. అది అసంకల్పితంగా, స్వభావంగానే వచ్చే భయం. అప్పుడు అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. హాస్యానికైనా అప్పుడు అతన్ని ఎత్తుకు ఊపకూడదు. 

ఆ భయంతో ఏదైనా జరగవచ్చు. అసలు ఈ భయాలకు అర్థం ఏమిటి.. ఏదో ఒక స్థితిలో మనసులో ఏర్పడ్డ భావన వల్ల తెలియని భయం ఏర్పడి అది స్థిరపడి పోయి కలిగే ఒక మానసిక స్థితి. 

ఆ స్థితి ఊహించనంతగా పెరిగి పెద్దదై భయాన్ని మరీ ఉధృతం చేస్తుంది. అది ఎంతవరకు వెడుతుందంటే కొందరు గడ్డిలో నడవటానికి భయ పడతారు. . పాములు ఉంటాయేమోనని. కొంత మంది ఒంటరిగా ఉండటానికి, మరి కొంత మంది వెలుగుని చూసి భయ పడతారు. 

ఇదొక రకమైన విచిత్రమైన మానసిక బలహీనత. గ్రీకు భాష లో ఫోబియా అంటే భయం. మరో విచిత్రమేమిటంటే మనలో చాలా మందికి ఎంతో కొంత ఈ బలహీనత ఉంటుందన్నది నిజం. ఎవరైనా చనిపోతే అక్కడికెళ్లి వచ్చి కొంత సేపు భయంతో ఉండిపోతాం. కొంత మంది నదిలో స్నానం చేస్తే భయ పడతారు. దీన్ని అబూటో ఫోబియా అంటారు. కొంత మంది దయ్యాలున్నాయని భయ పడతారు. 

ఈ శతాబ్దంలో మరో విచిత్రమైన భయాలు పుట్టుకు వస్తున్నాయి. తమ సెల్ ఫోన్లు పోతాయేమోనని. విమానంలో పైకి వెళ్తున్నప్పుడు భయం. కారులో వేగంగా వెడుతుంటే భయం. మన కారు తలుపులు బిగుసుకు పోయాయని భయం. . ఇలాంటి విచిత్రమైన, వాస్తవం కాని భయాలు ఆధునిక సమాజంలో నేడు వస్తున్నాయి. 

ఈ చిన్న చిన్న భయాలు ఆందోళన కలిగించేవి కావు కానీ వీటి వల్ల వచ్చే ఆవేశం, మానసిక ఒత్తిడి, ఆందోళనల వల్ల వచ్చే మానసిక స్థితి , దాని వల్ల వచ్చే ప్రవర్తనలో మార్పులు వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. 

ఈ మధ్య ఒకాయన మరుగు దొడ్డి లో బల్లిని చూసి భయపడి దాంట్లోకి వెళ్ళడం మానేశాడట. అంతే కాదు, ఏ మరుగు దొడ్డి లోకీ వెళ్ళక నాలుగు రోజులకు కడుపు ఉబ్బరించి డాక్టర్ దగ్గరికి వెళ్ళ వలసి వచ్చిందట. బల్లిని, బొద్దింకలను చూసి భయపడి ఆకాశం , భూమిని, గోడలను చూడకుండా కళ్ళు మూసుకునే వారు కూడా ఉన్నారు. దీన్ని అరక్నో ఫోబియా అంటారు. 

చిన్న చిన్న భయాలు ఒక్కొక్కప్పుడు పెద్ద మానసిక సమస్యగా మారి మన జీవన విధానాన్ని భయ కంపితం చేసి బాధ పెట్టవచ్చు. మనలో చాలామందికి డెంటిస్ట్ దగ్గరికి వెళ్లాలంటే భయం. పళ్ళు లాగేస్తాడని. 

కొంత మందికి హాస్పిటల్ కి వెళితే తెలియని భయం వల్ల బీపీ పెరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. బయటకు రాగానే తగ్గిపోతుంది. 

దైవ ధ్యానం చేయాలి..

కొంత మంది లో భయం మరోలా ఉంటుంది. ఒక రోగిని చూడడానికి వెళ్ళినపుడో , ఒక ప్రమాదం జరిగిన చోటుకి వెళ్ళినప్పుడో భయం అంతర్లీనంగా వస్తుంది. అప్పుడు తెలీకుండా కళ్లలో నీరు ఆగకుండా వస్తుంది. మాట రాదు, ఇది కొద్ది సేపే ఉంటుంది. 

ఇది ఒక మానసిక బలహీన స్థితి. అలా అని ప్రతీ భయం మానసిక రుగ్మత కానక్కరలేదు. మనో వికృత స్థితి కానక్కరలేదు. కానీ ఈ భయాలను మనం నియంత్రించుకోకపోతే జీవన యానం కుంటు పడుతుంది.

ఆరు బయట కూర్చోవాలంటే భయం.. అగోరో ఫోబియా, స్కూలు కెళ్ళటానికి భయం .. డిడాస్ కటైనో ఫోబియా, మూత్ర విసర్జన కు వెళ్లాలంటే భయం.. యూరో ఫోబియా, పెళ్ళి చేసుకోవడమంటే భయం .. గామో ఫోబియా, పాములంటే భయం.. ఒఫిడియో ఫోబియా, సెల్ ఫోన్లు పోతాయేమోనని భయం.. ఫోబియా ఫోనియా . 

ఈ భయాలు బలహీనతలుగా మారి మనిషిలో శాశ్వత మవుతాయి. కాని తాత్కాలికంగా ఉండి కాల ప్రభావంలో మరుగున పడి పోయి తొలగిపోతాయి. 

అందుకే ఆయుర్వేదంలో ఆచార్యులు సత్వ రజో తమోగుణాలైన మానసిక శక్తులను నియంత్రించి పోషక పరిచే జీవన విధానాన్ని సూచించారు. 

అవేమిటంటే.. ప్రతి వారం, తలకి, వెన్నుపూసకి , పాదాలకు నువ్వుల నూనెతో అభ్యంగనం. అంటే మసాజ్ చేసుకొని తలంటు పోసుకోవడం. మేధో రసాయనాలతో చేయ బడిన చక్కెర పొంగలి , బెల్లంతో చేసిన పాయసం తినడం, ఉదయం, రాత్రి పడుకునే ముందు మనస్సును ఒక్క క్షణమైనా ప్రశాంతంగా ఉంచుకొని ధ్యానించాలి. 

అపరిశుభ్రమైన , ప్రమాద కరమైన స్థలాల కెళ్ళినపుడు తిరిగి వచ్చిన వెంటనే తల స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని రెండు చిటికెల జీలకర్ర , కాస్త పసుపు నోట్లో వేసుకోమని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఆ మానసిక బలహీనతకు కారణమైన వన్నీ తొలగిపోతాయి. 

29, ఆగస్టు 2026, శనివారం

అడవి మామిడి.. ఒక అపురూప వృక్షం

 ఆమ్రాతకం కషాయామామ్లమం బృహత్కంఠకర్షణం 

పక్వం తు మధురాంలాడ్యం స్నిగ్ధం కించిత్ కఫాపహం.

కొండ మామిడి లేదా అడవి మామిడి కాయలను " ఆమ్రాతకం " అనీ , కోశామ్రం అనీ పిలుస్తారు. కొండ అంటే హిమాలయాలనే. ఈ మామిడి కాయలను హిమాలయన్ మామిడి అని కూడా పిలుస్తారు. మన వైపు పండే మామిడిని శాస్త్ర పరంగా " మాంజిఫెరా ఇండికా" అని, హిమాలయాల మామిడిని " మాంజిఫెరా సిల్వాటికా" అని పిలుస్తారు. 

ఈ కాయ చివర కొస దేలి ఉంటుంది. సముద్ర మట్టానికి 600 అడుగుల ఎత్తున ఉండే చల్లని ప్రాంతాల్లోనే ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. దక్షిణ మధ్య, తూర్పు ఆసియా దేశాల లో , ముఖ్యంగా అసోం, బంగ్లాదేశ్, నేపాల్, కంబోడియా, మయన్మార్, అండమాన్ నికోబార్ దీవుల్లో వీటి వ్యాప్తి ఎక్కువ. 

మన మామిడి లాగానే జూన్,జూలై నెలల్లో ఈ కాయలు చేతికొస్తాయి. పర్యావరణ నిపుణులు ఈ అడవి మామిడి ని అంతరించిపోతున్న వృక్ష జాతులలో చేర్చారు.

పక్వానికి వచ్చినవి దొరికితే వాటిని వదలకండి. పలక బారి కండ పట్టిన కొండ మామిడి ఊరగాయ పచ్చళ్ళకు అనుకూలంగా ఉంటుందని చెప్తారు.పచ్చివి,లేతగా ఉన్న పిందెలు వగరు, చేదు,పులుపు కలిగి గొంతు నుస పెడతాయి. పలక బారిన కాయలు బాగా వేడి చేస్తాయి. కానీ, చర్మ వ్యాధులున్న వారికి మేలు చేస్తాయి. పండినవి రుచిగా ఉంటాయి. కఫాన్ని కొద్దిగా తగ్గిస్తాయని " భోజన కుతూహలం " గ్రంథంలో తెలిపారు. 

మనం చెత్త బుట్టలో పడేసే మామిడి టెంకే లోపలి జీడికి ఇప్పుడు ప్రపంచ మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. జీడి లో నుండి కొవ్వు పదార్థాలను వేరు చేస్తున్నారు. మన వైపు పండే మామిడి టెంకే లోని జీడి కన్నా ఈ అడవి మామిడి జీడిలో కొవ్వు ఎక్కువగా ఉంటుందని తేలింది. ఇటీవల నిర్వహించిన ఒక పరిశోధన లో చాక్లెట్ తయారు చేయడానికి ఉపయోగించే కోకో బటర్ తో సమానమైన కొవ్వు పదార్థం ఈ అడవి మామిడి జీడి నుంచి లభిస్తుందని , ఉత్పాదకత రీత్యా చూసినప్పుడు కోకో మొక్కల గింజల నుండి తీసే కొవ్వు కన్నా ఇది చాలా చవకగా లభిస్తుందనేది ఈ పరిశోధన సారాంశం . బంగ్లాదేశ్,భూటాన్ వంటి దేశాల్లో ఈ అడవి మామిడి ఎక్కువగా పండుతుంది.

28, ఆగస్టు 2026, శుక్రవారం

సహజ సాంత్వన ఇచ్చే.. సహజ నూనెలు

 ప్రకృతి నుంచి లభించే రకరకాల మొక్కల బీర్లు వేర్లు గింజలు, కాండం, పువ్వులనుంచి సేకరించిన నూనెలను అరోమా తైలాలు అంటారు. వీటిలోని మేలు చేసే కొన్ని పదార్థాలు ముక్కు నుండి మెదడుకు చేరి రక్త ప్రసరణ, ఆలోచన కేంద్రాలు , ఊపిరి తిత్తుల మీద పని చేస్తాయి. వీటిలో చెప్పుకో దగినవి నీలగిరి , జాజి తైలాలు. వీటి లోని కొన్ని పదార్థాలు వాతావరణం లోని క్రిములను సంహరించడానికి ఉపయోగపడతాయి. 

నీలగిరి తో నొప్పులు దూరం..

కప్పు నీళ్లలో 6 చుక్కల నూనె కలిపి పుక్కిలిస్తే నోటి పూత, ఫంగల్ ఇన్ఫెక్షన్లు బాధించవు. జ్వరంతో బాధ పడేవారికి చల్లటి నీళ్లలో 6 నుంచి 10 చుక్కల నీలగిరి తైలం వేసి ఒంటిని తడిపితే జ్వరం త్వరగా తగ్గుతుంది. 

జలుబు, దగ్గు, సైనస్ వల్ల వచ్చే తలనొప్పి బాధిస్తుంటే చేతి రుమాలులో 4 చుక్కలు వేసి పీల్చితే ఉపశమనం లభిస్తుంది. చిన్న పిల్లలకు కఫం పెరిగి గురక పెడుతుంటే 6 నుంచి 10 చుక్కలు నీళ్లలో వేసి పీల్చేలా చూడాలి. 

ఫ్లూ జ్వరం ఉన్నవారికి నీళ్లలో 2,3 చుక్కలు వేసి తాగిస్తారు. కండరాల నొప్పి, నరం పట్టుకు పోయినపుడు కొబ్బరి నూనె లో కొద్దిగా తైలం కలిపి పై పూతగా రాస్తే సమస్య దూరమై హాయిగా ఉంటుంది. 

నల్లులు,పురుగులను నిర్మూలించాలంటే నీలగిరి తైలాన్ని టర్పంటైన్ తైలంలో కలిపి అందులో చిన్న చిన్న కాటన్ ఉండలు వేసి బయటకు తీసి వాటిని మంచాల మూలల్లో, దుస్తుల అల్మారా లో పెడితే వాటి బెడద తగ్గుతుంది. 

నీలగిరి తైలాన్ని తేనె తో కలిపి మొటిమల మీద రాస్తే అవి త్వరగా మానిపోతాయి. ఐతే 6 ఏళ్ల లోపు చిన్నారులకు నోటి ద్వారా ఇవ్వకూడదు. 

హాయి నిద్రకు జాజి నూనె..

మానసిక ఒత్తిడి,ఆందోళనలో ఉన్నవారు వాడితే మంచి గుణం ఉంటుంది.గుండె పనితీరును పెంచుతుంది. ఒంటి నొప్పులతో బాధ పడేవారు కొబ్బరి నూనె తో కలిపి రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి.

బకెట్ నీళ్లలో కొద్దిగా జాజి నూనె ను కలిపి బాలింతలు స్నానం చేస్తే చక్కగా నిద్ర పడుతుంది.మనసుకు హాయిగా ఉంటుంది. ఒత్తిళ్ళు తగ్గుతాయి. అలానే నెలసరి సమయంలో కడుపు నొప్పి అనిపిస్తే పొత్తి కడుపు మీద రాస్తే మంచిది.

తలలో పేలు బాధిస్తుంటే కొబ్బరి నూనె లో జాజి తైలాన్ని కలిపి రాస్తుంటే ఇబ్బంది ఉండదు. చెంచా పాల మీగడలో 4 చుక్కలు  చేర్చి మర్దన చేస్తే ముఖం మీద మచ్చలు తగ్గు ముఖం పడతాయి.

జాజి తైలం..జాగ్రత్తలు..

ఈ తైలాన్ని కొబ్బరి, ఆలివ్ నూనె,తేనె .. ఏదో ఒక దానితో కలిపి కొంచెం వాడితే మంచి ఫలితం ఇస్తుంది. సుగంధ తైలాల వాడకంలో వీటిని ఇతర నూనెలతో కలిపి వాడుకోవాలి. ఇవి ఘాటైన ద్రవ్యాలు కాబట్టి పరిమితంగా వాడాలి. ఉప్పు,నూనె, ఏదైనా పిండిలో కానీ వేసి వాడుకోవాలి. సుమారు 10 నుండి 12 చుక్కలు మించి వాడకూడదు.

చిన్నారులు, వాసన పడని వారు వీటికి దూరంగా ఉండాలి. ఒక్కో సారి ఈ నూనె వల్ల గర్భ స్రావం అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి గర్భిణులు వాడక పోవడం మేలు. కొందరికి పడక వాంతులు,తలనొప్పి సమస్యలు బాధిస్తాయి . కాబట్టి గమనించి వాడుకోవాలి.


24, ఆగస్టు 2026, సోమవారం

శక్తి దాత.. సీతా ఫలం..

 సీతా ఫలం అనగానే తీయని మృదువైన గుజ్జు గుర్తుకు వస్తుంది. దీని లోపలి గుజ్జు కస్టర్డ్ లా మెత్తగా ఉంటుంది కాబట్టి దీనిని ఇంగ్లీష్ లో కస్టర్డ్ ఆపిల్ అని పిలుస్తారు. 

భోజన కుతూహలం గ్రంథంలో సీతా ఫలం గుజ్జును తియ్యని, చలవ చేసేదిగా , పైత్య దోషాలను తగ్గించేదిగా పేర్కొన్నారు. 

సీతా ఫలం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..

అన్నం సహించక, నోటికి రుచి తెలియని వారికి సీతా ఫలం రుచిని కలిగిస్తుంది. ఇది తినటం వలన ఎక్కువ కఫం పెరగదు. 

మిగల ముగ్గిన సీతా ఫలం లో సహజ చక్కెరలతో పాటు పిండి పదార్థాలు , పీచు, విటమిన్ సి, బి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలున్నాయి. వీటి వల్ల శరీరానికి త్వరగా శక్తి అందుతుంది. పీచు జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది. 

సీతా ఫలం పచ్చి కాయను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు.అతిసారం , నీళ్ల విరోచనం తగ్గటానికి దీనిని ఉపయోగిస్తారు. 

కొన్ని ప్రాంతాలలో పచ్చి కాయను బాగా ఎండబెట్టి దానిని పొడిగా దంచుతారు. చర్మ సమస్యలకు ఈ పొడి మంచి మందుగా పనిచేస్తుంది. 

సీతా ఫలం గింజలు నల్లగా మెరుస్తూ ఉంటాయి.అందుకే ఈ మొక్కకు " కృష్ణ బీజ" అనే పేరు కూడా వచ్చింది. ఇవి తినడానికి పనికి రావు. కానీ సంప్రదాయ వైద్యంలో ఈ గింజల పొడి ని చుండ్రు తగ్గించడానికి , పేలను తొలగించడానికి వాడతారు. 

సీతా ఫలం వేడి శరీర తత్వం ఉన్న వారికి చలవనిస్తుంది. దీనికి పిత్త వికారాలు, దాహం, మంట వంటి వాటిని శాంతింప చేసే గుణం ఉంది. 

సీతా ఫలాలు ఎక్కువగా తినటం మంచిది కాదు.ముఖ్యంగా మధుమేహం , స్థూల కాయం ఉన్న వారు వీటిని మితంగా తింటేనే మంచిది. 

16, ఆగస్టు 2026, ఆదివారం

సొర ఆకుల కూర.. ఆయుర్వేదం

 ఆనప్పాదు అనేది తెలుగులో ఒక అందమైన పద బంధము. శాక రాజము అనదగిన సొర కాయకు ఇది ఒక పర్యాయ పదం. ఆహార కొరతను తీర్చే ఒక ప్రకృతి వర ప్రసాదం కూడా ఇంటి పైకాపు మీదకి సురతీగ పాకి పైనుంచి కాయ ఒకటి తెగి జారీ వచ్చి కింద ఉన్న మేక నెత్తిన పడిందట పుటుక్కు జరజర డుబుక్కుమే అని జానపదలు సరదాగా చెప్పుకుంటున్నారు దీనిని. 

రావి కొండల రావు గారు అనప్పాదు గురించి తెలుగు మీస్టారి పాత్రలో సైలెన్స్ అంటూ చేసిన కామెడీ పాత తరానికి ఇంకా గుర్తుండే ఉంటుంది. పొడవుగా ఉండే వాటిని సొరకాయలని, గుండ్రంగా చిన్న కుండలా ఉండే వాటిని ఆనప కాయలు అని అంటారని కొందరు చెప్తారు. కానీ సొర, ఆనబ అని రెండింటిని పిలుస్తుంటారు. తుంబీ , కుంభ తుంబీ అని సంస్కృతంలో పిలుస్తారు వీటిని.

మనకు సొరకాయ వాడకం గురించి వేద కాలము కన్నా ముందు నుండే తెలుసు. 2024లో అమెరికాలోని కార్నల్ విశ్వవిద్యాలయంలో 197 రకాల సొరకాయల జన్యువు లను పరిశీలించడం జరిగింది. దక్షిణాఫ్రికాలో సుమారు 12000 సంవత్సరాల క్రితం పుట్టి అక్కడినుండి ఆసియా, అమెరికా ఖండాలకు సొరకాయ మొక్క వ్యాపించింది అని తేల్చారు. 

సొర మొక్క కాయగూరే కాదు, ఆకుకూర కూడా. వాన కాలంలోనూ, ఆ తర్వాత వచ్చే కార్తీకమాసం ఆహార కరువు కాలంలోనూ పూర్వం మనవాళ్లు ఈ అనబ ఆకులను కూరగా వండుకొని కమ్మగా తినేవారు. తినటానికి పనికొచ్చేది ,పోషకాలను కలిగి పుష్టి, రుచిని కూడా ఇచ్చేది అయినప్పుడు దానిని తినడానికి మనకు నామోషీ ఎందుకు..

ఆనబ ఆకులను సన్నగా తరిగి, ఒక బాండీలోకి తీసుకొని తగినంత ఉప్పు వేసి నీళ్ల మూత పెట్టి మగ్గనిచ్చి ఉల్లి ముక్కలు వగైరా చేర్చి దానిపైన కొంచెం పెరుగు, కొద్దిగా చింతపండు రసం ,కాసింత మినప పిండి కొద్దిగా పొడి బెల్లం కలిపి నెయ్యి వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మెంతులు, ఆవాలు ,జీలకర్ర ,నువ్వు, మినప్పప్పు లాంటివి విడివిడిగా వేయించి మెత్తగా దంచిన పొడిని తగినంతగా ఈ కూరలో కలిపి బాగా మగ్గనివ్వాలి. చివరలో ఇంగువ తాలింపు పెడితే సొర ఆకుల కమ్మని కూర సిద్ధం అయినట్లే. సోరలాంటి తీయ కూరలను అనవసరమైన మసాలాలు, అధికంగా చింతపండు రసాలు కలపకుండా తీపి, పులుపు, ఉప్పు ,కారం ,వగరు, చేదు ఆరు రుచులు ఉండేలాగా నలుడు చెప్పిన విధానం ఇది. 

పాలకూరతో చేసుకున్నట్లే పప్పు ,పులుసు కూర, రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. పాలక్ లాంటివి గాని, పకోడీలు, పరోటాలు గాని వండుకోవచ్చు. బచ్చలాకు లాగా, జిగురు తోటకూర లాగా వగరు ఉండవు కాబట్టి సోరాకులతో అన్నీ వండుకోవచ్చు. కంద- బచ్చలి లాగానే ఆవపెట్టిన కూర బాగుంటుంది .సోరాకుల సలాడ్ తింటే ఎసిడిటీ ,కడుపులో మంట ,ఇరిటేషన్లు తగ్గుతాయి. 

చింతపండు వేయకుండా పెసర లేదా కందిపప్పుతో కాచిన కట్టులు, సన్నగా తరిగిన సొర ముక్కలను, సొర ఆకులను కూడా కలిపి కాచిన పప్పుచారు లేదా సూపు పొట్టకు మేలు చేస్తుంది. సొర ఆకులను జ్యూస్  తీసి అందులో చారు పొడి వేసి కాచిన చారు చాలా రుచికరంగాను జీర్ణశక్తిని పెంచేదిగాను ఉంటుంది. 

సొరకాయ కున్న గుణాలన్నీ సొర ఆకులకు ఉన్నాయి. ఈ ఆకులలో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా ఉన్నాయి. ఖనిజ లోపాలతో బాధపడే వారికి ఈ ఆకులు వరప్రసాదం అని చెప్పవచ్చు. అమితంగా చలవ చేస్తాయి, శరీరానికి మృదుత్వాన్ని కలిగిస్తాయి .

పశ్చిమ బెంగాల్లో దీపావళికి ముందు జరిగే భూత చతుర్దశి సందర్భంగా చేసే చద్దోశాక్ అనే సంప్రదాయ వంటకంలో 14 రకాల ఆకుకూరలతో పాటు సొర ఆకును కూడా తప్పనిసరిగా కలుపుతారు. సొరాకు ముదిరే కొద్దీ దానిమీద నూగు, ముల్లలాంటి రోమాలు ఏర్పడతాయి. వాటిని తొలగించడం పెద్ద పని అందుకని బాగా లేత ఆకులను మాత్రమే ఎంచుకోవాలి. ఎండ పడే చోట కుండీలో  సొర విత్తులు నాలుగు పాతండి  చాలు, వారానికి ఒకటి రెండు సార్లు మీ ఇంటిల్లిపాది సొర ఆకులను కమ్మగా వండుకుని తినవచ్చు.

16, మే 2026, శనివారం

చిక్కిపోయే వారికి సార పప్పు

 సారపప్పునే చార పప్పు అంటుంటారు మన వాళ్ళు. మొరలి పండు గింజ లోపల ఈ సార పప్పు ఉంటుంది. మొరలి మొక్కనే చార మామిడి అని కూడా కొన్ని తెలుగు ప్రాంతాల్లో పిలుస్తారు. హిందీ వాళ్ళు చిరోంజీ అని,సంస్కృతంలో ప్రియాల అనీ అంటారు. సార చెట్టు అడవి మొక్క. తెలంగాణ,ఆంధ్ర, కర్ణాటక అటవీ ప్రాంతాల్లో ఎక్కువ గా పెరుగుతుంది.దీని పండును యాప్రికాట్ అంటారు. సార పండ్ల కు ఔషధ గుణాలు ఎక్కువ. తీపి, పులుపు రుచులతో జిగురుగా ఉంటుంది. వీటి గుజ్జుని శరీరం క్షీణించి పోయే వ్యాధుల్లో ఇస్తారు.బాదం బంక లాగానే ఈ చెట్టుకీ తుమ్మ లాంటి జిగురు వస్తుంది. ఈ జిగురుని ఎండ బెట్టి అమ్ముతారు. కముకు దెబ్బల్లోనూ , కీళ్ల వాపుల్లోనూ ఈ జిగురుని కడుపులోకి తీసుకుంటే వాతపు నొప్పులు తగ్గుతాయి.బాదం పప్పు లాగే సార పప్పు తియ్యగా ఉంటుంది.ఇది శరీరంలో శక్తిని పెంపొందింప చేస్తుంది. వాతాన్ని,వేడిని తగ్గిస్తాయి.గుండెకి మంచి చేస్తాయి. అతిగా తింటే మల బద్ధకం పెంచుతుంది.ఆలస్యంగా జీర్ణం అవుతాయి. అజీర్తి తో బాధ పడే వారు అతిగా తింటే కీళ్ల వాతం పెరుగుతుంది.వీటి వాడకం మిఠాయిల తయారీ పరిశ్రమలోనే ఎక్కువ.వక్కపొడి, బూందీ మిక్చర్ ,పాయసంలోనూ ఈ గింజల్ని కలుపుతుంటారు.

శరీరానికి మృదుత్వాన్ని ఇస్తాయి.పేగుల కదలికలను పెంచుతాయి.అందుకని సరైన మోతాదులో తీసుకుంటే విరేచనం అయ్యేలా చేస్తాయి.

వేరుశనగపప్పు లాగే ఇది కూడా నూనె గింజ దీని నుంచి తీసిన నూనెను చిరంజి నూనె లేదా సార పప్పు నూనె అంటారు ఈ నూనె తలకు రాసుకుంటే వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడతాయి. 

ఈ గింజలను కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేగించి మిక్సీ పట్టిన పొడిని మసాలాలతో పాటు కలిపి వాడుతుంటారు శుష్కించిపోయే పిల్లలకు వేయించిన గింజల పొడిని పావు చెంచా నుండి అర చెంచా మోతాదులో గ్లాసు పాలలో కలపాలి ఆ పాలను రోజు ఇస్తుంటే ఎదుగుదల బాగుంటుంది బరువు తగ్గటాన్ని నిరోధిస్తుంది అలాగని స్థూలకాయాన్ని కలిగించదు. సార పప్పు వేడి వలన వచ్చే అలసటను పేగుల్లో పెరిగిపోయిన ఉడుకును తగ్గిస్తుంది న్యూరోపతి లక్షణాలతో బాధపడే వారికి మేలు చేస్తుంది అరికాళ్ళలో మంటలు జ్వరం తగ్గుతుంది పొట్ట నిండినట్టుగా ఉంటుంది అందువల్ల ఆహార ఆహారాన్ని తక్కువగా తీసుకోవడానికి వీలవుతుంది ఇది పరోక్షంగా షుగరు ఊబకాయం వ్యాధులు ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

2, మే 2026, శనివారం

వృద్ధాప్యాన్ని జయించే ఉసిరి

 ఆమలకం కషాయామ్లం మధురం శీతలం లఘు.. దాహపిత్త వమీ  మేహా శోషజ్ఞంచ రసాయనం..

అమలకి అంటే పుట్టనిండా పోషకాలు నిండిన అమృతభాండం అని అర్థము. పూర్వం కార్తీక మాసం సమయంలోనే అందుబాటులోకి వచ్చేవి ఇప్పుడు వివిధ ప్రాంతాలకు చెందిన ఉసిరికాయలు ఏడాది పొడవునా మార్కెట్లకు వస్తున్నాయి కాబట్టి రకరకాల పద్ధతులను తాజా ఉసిరికాయలను అనునిత్యం వాడుకునే అవకాశం ఇప్పుడు ఉంది. 

ఆమ్లకిని ఆహారానికి ముందు ఆహారంతో పాటు కానీ ఆహారంగానూ ఆహారం తర్వాత కూడా తీసుకోవచ్చు. కీళ్ల నొప్పులు నడుము నొప్పి పక్షవాతంలాంటి వాత వ్యాధులు ఉన్నవారికి గ్యాస్ ఉబ్బరం ఉన్నవారికి ఆమ్లకి దివ్య ఔషధం దీని గుజ్జులు ఒక చెంచా స్వచ్ఛమైన నువ్వుల నూనె కలిపి తీసుకున తర్వాత వేడి నీళ్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. 

స్థూలకాయం షుగర్ వ్యాధి ఉబ్బసం ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు రోజు ఒక ఉసిరికాయ తినడం వలన మేలు జరుగుతుంది ఉసిరికాయ గుజ్జులు పసుపు అల్లం మిర్యాల పొడి కొత్తిమీర పుదీనా లాంటిది కలిపి టీ తయారు చేసుకుని ఉదయం తాగితే ఉపయోగకరంగా ఉంటుంది. 

కడుపులో మంట అల్సర్లు వాంతి వేడి చేసిన లక్షణాలతో బాధపడే వారికి ఉసిరికాయ గుజ్జుతో తేనె కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. 

ఉసిరికాయల గుజ్జు దాల్చిన చెక్క పొడి పసుపు ఒక కప్పు నీళ్లలో కలిపి మరిగించి రోజు తాగుతూ ఉంటే ఊపిరితిత్తుల వ్యాధులలో ఉపయోగకరం దగ్గు తీవ్రమైన జలుబు పడిశ భారానికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

ఉసిరికాయలు అమితంగా చలవనిస్తాయి వేసవిలో దప్పిక తీరుతుంది వడదెబ్బ నుండి రక్షణ కలుగుతుంది జీర్ణశక్తిని పెంపు చేస్తుంది వెన్నపూసతో తీసుకుంటే పేగులకు చలవతో పాటు మృతుత్వం కలుగుతుంది కొద్దిగా బెల్లం ఉసిరికాయ గుజ్జు కలిపి ఒక కప్పు నీళ్లు పోసి మిక్సీ పట్టి తాగితే వెంటనే ఉపశమనం కనిపిస్తుంది మూత్రశయానికి సంబంధించిన సమస్యలన్నిటికీ ఉపయోగపడుతుంది. 

రోజు ఒక ఉసిరికాయ తీసుకుంటే మూత్రపిండాలు లేవారు ఆరోగ్యవంతంగా ఉంటాయి కలబంద ఆమ్లాకి కలిపి జ్యూస్ తీసుకుని అరకప్పు చొప్పున రోజు తాగుతుంటే లివర్ బల సంపన్నం అవుతుంది. 

ఆమ్లకి తీపి క్యాండీలు బజార్లలో దొరుకుతాయి పిల్లలకు రోజు రెండు లేదా మూడు క్యాండిల్ ఇస్తుంటే వారి శారీరక మానసిక ఎదుగుదల బాగుంటుంది 

ఉసిరి మన ఆరోగ్య సిరి తేనెతోను బెల్లం తోను రోజు కొద్దిగా ఉసిరి చూసి ఇస్తూ ఉంటే పిల్లల్లో మేధా సంపత్తి పెరుగుతుంది దురదలు అకారణంగా వచ్చే జ్వరాలు దప్పిక అరికాళ్ళ మంటలు అజీర్తి అన్న హితవు లేకపోవడం మలబద్ధకం లాంటి సమస్యలన్నీ తగ్గటానికి ఉసిరికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది ఆమ్లకితో పప్పు రోటి పచ్చడి చేసుకోవచ్చు చారు కాచుకోవచ్చు ఆమ్లకు పులిహోర కమ్మగా ఉంటుంది ఉసిరికాయ అంటే పోషకం మాత్రమే కాదు ముసలితనం ముంచు కు రాకుండా శరీర కాంతిని కాపాడుతుంది.

29, ఏప్రిల్ 2026, బుధవారం

ఔషధ విలువల రావి చెట్టు

 రావి చెట్టు ...  శాంతి ,ఆయురారోగ్యాలకు సంకేతం అంటున్నది అధర్వణ వేదం. వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని నేనేన నీ, ఈ మహావృక్ష మూలాలు ఊర్ధ్వ లోకాలలో ఉన్నాయని, ఇది దివ్యమైన వృక్షం అని గీతాకారుడు నొక్కి చెప్పాడు. ఇందులో అతిశయోక్తి లేదని తాజా పరిశోధనలు నిరూపిస్తున్నాయి. అశ్వత్థం నీడన ధ్యానం వలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అనడం వెనక శాస్త్రీయత ఉంది.

సిద్ధార్థుడనే రాకుమారుడు ఈ చెట్టు కింద కూర్చుని జ్ఞాన బుద్ధుడు అయ్యాడని ,రావి చెట్టుని బోధి వృక్షమని, జ్ఞాన వృక్షం అని బౌద్ధులు మతపరమైన నమ్మకంతో అన్నది కాదు ..అది మెదడు పనితీరును పెంచే ఔషధ విలువలు కలిగిన వృక్షం అని ఇప్పుడు రుజువయ్యింద.

అధికంగా ఆక్సిజన్ విడుదల చేసే పర్యావరణ మిత్ర వృక్షాలలో అశ్వద్ధం ముఖ్యమైనది కూడా ప్రతి ఊరికి ఎనిమిదిక్కుల రావి చెట్లు ఉండాలన్నది నియమంగా కావాలి. 

నరాలలో వాపు, ఆక్సిడేటివ్ ఒత్తిడి, కన సంకేత మార్గాల నియంత్రణ ఇవి ఆధునిక న్యూరో సైన్స్ లో ప్రధాన అంశాలు. రావి ఆకుల్లోనూ పండ్ల లోనూ సెరటోనిన్ సహా న్యూరో రసాయన మార్గాలను ప్రభావితం చేసే రసాయనాలు ఉన్నాయి. అది ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి మెదడు కణాలకు రక్షణనిస్తాయి. జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే న్యూరో ప్రొటెక్టివ్ గుణాలు వీటికున్నాయి.

న్యూరానులు అనే మెదడు కణాల సంఖ్యలో పెరుగుదల కణ నిర్మాణ నాణ్యతల్ని గమనించారు.  ఆమ్నేషియని తగ్గించి జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే గుణాల పైన అల్జీమర్స్ పార్కిన్ సోనిజం లాంటి న్యూరో డి జనరేటివ్ వ్యాధుల పైన దీని ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నారు ప్రస్తుతం. మెదడు పైన విష దోషం /న్యూరో టాక్సిసిటీ ప్రభావాన్ని తగ్గిస్తుందనేది సారాంశము .

మన పూర్వీకులు జ్ఞానముకు ప్రతీకగా భావించిన రావి చెట్టుకి మెదడును ఉత్తేజితం చేసే గుణాలు ఉన్నాయని కనుగొనడం గొప్ప పరిణామం అని చెప్పవచ్చు. 

మెకానిస్టిక్ ఇన్ సైట్స్ ఇన్ టు ది న్యూరో ప్రొటెక్టివ్ పోటెన్షియల్ ఆఫ్ సేక్రేడ్ ఫికస్ ట్రీ.. అనే పరిశోధన వ్యాసం ఎన్నో అద్భుత పరిశోధన అంశాలను అందించింది. 

జ్వరం , గ్యాస్ట్రిక్ అల్సర్ల నివారణ, క్యాన్సర్ నిరోధక శక్తి, మధుమేహ నియంత్రణ, కొలెస్ట్రాల్ తగ్గింపు గుణాలు రావి బెరడుకి ,ఆకులకి ,పండ్లకి ఉన్నాయని అంశం పైన ఇప్పుడు పరిశోధనలు కొనసాగుతున్నాయి. 

 దగ్గు ,ఆస్తమా, హృదయ రోగాలు ఉన్నవారికీ ఇది మేలు చేస్తుందని ,రక్తస్రావాన్ని అరికడుతుందని, రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రిస్తుందని ఆయుర్వేద గ్రంధాలు పేర్కొన్నాయి. గాయాలను మాన్పే హీలింగు గుణం దీనికి ఉన్నది .దీని బెరడు ,ఆకులు ,పండ్లను ఔషధాలలో విరివిగా వాడతారు. ఆకుల్ని, పండ్లని ఆహారంగా కూడా తీసుకోవచ్చు.

రావిపండ్లలో నరాలకు బలాన్ని ఇచ్చే సెరటోనిన్ వలన అవి మెంటాట్ లాంటి ఔషధాలతో సమానంగా పనిచేస్తాయని కూడా గుర్తించారు. ఈ పళ్ళు తియ్యగా ఉంటాయి, చలవచేస్తాయి, ఉద్రకాన్ని తగ్గిస్తాయి. పైత్యాన్ని ,అసిడిటీని, అల్సర్లను ,వాంతి వికారాలను తగ్గిస్తాయి. పండ్లను ఎండబెట్టి మెత్తగా దంచి రోజు టీ లాగా కాచుకుని తాగితే ఉబ్బసం తగ్గుతుంది. స్త్రీలలో గర్భాశయ దోషాలను, పురుషులలో వీర్య దోషాలను పోగొట్టి  సంతానయోగ్యతనిస్తాయి. గింజలకు కూడా ఇదే గుణాలు న్నాయి. 

గుండె ఆకారంలో ఉండే రావి ఆకులకు మెదడు వ్యాధులతో పాటు హృదయ దౌర్బల్యని తోలగించే ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ ఆకులు కూడా ఆహార పదార్ధంగ తీసుకోవచ్చు.

లేత రావి ఆకులకు సమానంగా చింతచిగురు లేదా చుక్కకూర కలిపి సన్నగా తరిగి మెత్తగా ఉడికించి పప్పు లేదా పొడి కూరగా చేసుకోవచ్చు. రావి ఆకులను ఇడ్లీ ప్లేట్ మీద పరచి వాటి మీద ఇడ్లీ పిండి వేసి పైన రావి ఆకులతో మూసి ఆవిరి మీద ఉడికిస్తే రావి ఆకు గుణాలు ఇడ్లీలకు అబ్బతాయి.

రావీ లేదా వేప చెట్టు కింద నాగదేవతా విగ్రహాలు ప్రతిష్టించుకుని పూజించడానికి రావి విష దోష హరం కావడం ఒక కారణం. మన సాంప్రదాయాలలోని సాంకేతికతను శాస్త్రీయతను అర్థం చేసుకొని వాటిని మెరుగుపరుచుకోగలడం మన విజ్ఞత. 

ఇన్ని అద్భుత గుణాలున్న రావి చెట్టు నుండి మనము ప్రయోజనాలను పొంది ఆరోగ్యంగా ఉండాలి.


14, మార్చి 2026, శనివారం

ఫలాలలోకెల్లా ఉత్తమం ద్రాక్ష

 ఆయుర్వేదంలో ద్రాక్షను ఫలోత్తమం అని ప్రశంసించడం జరిగింది. ద్రాక్షలో అనేక పోషక విలువలు ఉండటమే దీనికి ముఖ్య కారణం. మన పురాతన గ్రంథాల్లో ద్రాక్షపళ్లను ద్రాక్ష మృద్విక, గోస్తని, మధురస అనే పేర్లతో పేర్కొన్నారు.

 ప్రస్తుతం మనకు ప్రధానంగా ఆకుపచ్చ ద్రాక్ష, నల్ల ద్రాక్ష, కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష లభిస్తున్నాయి. ఈ మూడింటికి గుణాలు దాదాపు ఒకేలా ఉన్న ,తీపి పులుపు నిష్పత్తులలో తేడాలు ఉన్నాయి. అందుకే వాటి గుణాల్లో కూడా స్వల్ప మార్పులు కనిపిస్తాయి. ఇక ద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ఫలితాలు ఏమిటంటే ..

ద్రాక్ష శరీరానికి చలవనిస్తాయి. దద్దుర్లు తగ్గించడంలో సహాయపడతాయి .అలసటతో కూడిన నొప్పులను, అరికాళ్ళు, అరిచేతులలో కలిగే మంటలను తగ్గిస్తాయి. మూత్ర విసర్జనకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ద్రాక్ష వల్ల తొలగిపోతాయి .

నల్ల ద్రాక్ష ,ఆకుపచ్చ ద్రాక్షల మధ్య గుణాలలో తేడా ఉండదు. అయితే ఔషధాలు తయారీలో నల్ల ద్రాక్షను ఎక్కువగా వాడుతారు. నల్ల ద్రాక్ష మగత, బద్ధకం, ఆవులింతలు, అలసటలను తగ్గిస్తుంది .

బాగా పండిన నల్ల ద్రాక్ష దప్పికను, అలసటను తగ్గించి శరీర వేడిని ఉపశమింప చేస్తుంది. శరీరానికి బలం, మృదుత్వాన్ని ఇస్తుంది. ఉబ్బసం, గ్యాస్, ఉబ్బరాలను తగ్గించడంలో కూడా దోహదం చేస్తుంది.

 పచ్చి ద్రాక్ష ఎక్కువ పుల్లగా ఉండి వగరు రుచిని కలిగిస్తుంది. అది శరీరాన్ని వేడెక్కించి, రక్తస్రావాన్ని పెంచే అవకాశం ఉంది. అందువల్ల బాగా పండిన ద్రాక్షనే తినాలని ఆయుర్వేద గ్రంథాలు సూచిస్తాయి..

ఎండు ద్రాక్ష మలబద్ధకాన్ని తగ్గించి ,విరేచనాన్ని సులభంగా జరిగేలా చేస్తుంది. జ్వరము, ఊపిరితిత్తుల సమస్యలు, వాంతులు, కీళ్ల నొప్పులు, లివర్ వ్యాధులు, అరికాళ్ళ మంటలు ,చర్మం ఎండిపోవడం, కండరాల బలహీనత వంటి సమస్యల నివారణకు ఈ ద్రాక్ష ఉపకరిస్తుంది.

 నెలసరి సమయంలో మహిళలు ద్రాక్ష తినటం అలవాటు చేసుకోవడం మంచిది. నోరు చేదుగా ఉండడం, అజీర్తి ఉన్నప్పుడు వాటిని తగ్గించడంలో ద్రాక్ష ఉపకరిస్తుంది. మేలు చేస్తుంది .

ద్రాక్ష ఉపిరితిత్తులకు రక్షణ నిస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. ద్రాక్ష రసం తాగటం వల్ల మద్యపానం చేయాలని కోరిక కూడా తగ్గుతుంది.

9, ఫిబ్రవరి 2026, సోమవారం

అలనాటి.. అలసందల కూర.. ఉపయోగాలు

 నొసట చుట్టలు చుట్టలుగా తిరుగుతూ జీరాడే ముంగురుల వలయ ఆకారాన్ని సంస్కృతంలో అల్ అని పిలుస్తారు. సాంద్రత అంటే దట్టంగా ఉండటం .అల్ సాంద్ర గా ఉన్న కాయలు అలసంద కాయలు అయ్యాయి. మినుముల కన్నా ఎక్కువ సమయం బలకరమైనవిగా ఉండడంతో వీటికి రాజమాష అనే గౌరవనామం వచ్చింది. 

అలసందలు పొడవుగా ఉంటాయి, బొబ్బర్లు మాత్రం చిన్నవిగా ఉంటాయి. నవధాన్యాలలో వీటి గింజలు కూడా ఉన్నాయి. వగరుగా ఉండడం వల్ల షుగరు ,స్థూలకాయం నియంత్రణకు ఉపకరిస్తాయి .పురుషుల జీవకణాలను మరియు బాలింతలలో తల్లిపాలను పెంచుతాయి. అలసందలు తినిన వెంటనే పొట్ట బరువుగా, ఎసిడిటీ పెరిగినట్టుగా అనిపించినా.. జీర్ణ ప్రక్రియ పూర్తయ్యేసరికి అదే ఎసిడిటీని తగ్గిస్తాయి. తిన్న తర్వాత చాలాసేపు ఆకలి వేయనీయకుండా, పొట్ట దండిగా ఉండడంతో ఉదయం పూట షుగర్ మాత్రలు వేసుకునే వారికి అలసందల సలాడ్ చాలా  అనుకూలమైనది. ప్రోటీన్లు సమృద్ధిగా ఉండటం వల్ల దేహానికి పుష్టిని ,మనసుకు సంతోషాన్ని ఇస్తాయి.

అలసందల కూర ఎలా చేయాలి అంటే..

 నల మహారాజు పాకదర్పణంలో అలసందలను కూరగా వండుకోవడాన్ని వివరంగా చెప్పాడు. ఇది రాజ భోజనం, అంటే పోషక విలువల సంపన్నతను పెంపు చేసుకునే ఉపాయం కూడా..

1. అలసందలను ముక్కలుగా తరిగి ఉప్పు కలిపిన నీటిలో వేసి పది నిమిషాలు ఉంచి నీటిని వార్చేయాలి. 

2.పసుపు ,ఇంగువ ,ధనియాల పొడి కలిపి, మంచినీళ్లు పోసి ముక్కలు మెత్తబడేదాకా ఉడికించి, నీటిని వార్చేయాలి .

3.కొబ్బరి తురుము, తెల్ల నువ్వులు ..వీటిని పాలతో మెత్తగా నూరి ముద్దగా చేసి ఈ ముక్కలలో కలపాలి.

 4.కొద్దిగా పాలు పోసి పాలు ఇగిరే దాకా మళ్ళీ మృదువుగా ఉడికించి ,నెయ్యి వేసి పొయ్యి మీద నుండి దించేయాలి.

 5.కూర చల్లారాక ..పచ్చ కర్పూరం ,కస్తూరి, కుంకుమ పువ్వు ,ఆవాలు ,మిరియాలపొడి లను చిటికెడంత కలపాలి .నిమ్మ ముక్కలు ,మొగలిరేకులు ఇలాంటి పరిమళాలను కూడా చేర్చి మూత పెట్టి పక్కన ఉంచాలి.

 6.తినబోయే ముందు నిమ్మ ,మొగలి రేకులను తీసేసి ఈ కూర మొత్తాన్ని ఒక తెల్లని వస్త్రంలో మూటగట్టి కాగే నెయ్యిలో ఈ మూటని కాసేపు ఉంచి వడ్డించాలి.


 ఇది కేవలం వంట విధానం మాత్రమే కాదు.. రుచి, పరిమళం, జీర్ణశక్తి ,పోషణ ఈ నాలుగింటిని సమన్వయం చేసిన ప్రాచీన రాజస ఆహార శాస్త్రం. వేడివేడిగా అన్నంలో తింటే కమ్మగా, శక్తిదాయకంగా ఉంటుంది. వాతం, కఫం, ఎసిడిటీలు కలగకుండా ఉంటాయి. 

ఈ కూరని ఇలా ఎనిమిది అంచలుగానే చేయాలా లేక ఉడకబెట్టి తాలింపు పెడితే చాలదా అనే సందేహం రావచ్చు. మామూలు కూరలోని గుణ దోషాలను సరిచేసి శక్తి సంపన్నమైనదిగా తయారు చేసుకునే ఉపాయాలు తెలియజెప్పటమే పాకశాస్త్ర ప్రయోజనం. పచ్చ కర్పూరం, ఆవపిండి వీటిని చాలా కొద్దిగా మాత్రమే కలపాలి. ఎక్కువైతే చేదు వస్తుంది. కూర బాగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని కలపాలి. పచ్చ కర్పూరం పరిమళభరితమే కాకుండా కూరలోని పోషకాలు త్వరగా శరీరానికి వంట బట్టేలా చేస్తుంది. ఈ గుణాన్ని యోగ వాహి అని అంటారు. ఆవపిండి, మిరియాల పొడి కూడా పోషకాలను అవి పని చేసే అవయవానికి వేగంగా తీసుకువెళ్లేందుకు సహకరిస్తాయి. అంతేకాదు పచ్చ కర్పూరం పరిమళం తగలగానే ఆ వంటకం పట్ల మనకు పవిత్రమైన భావన కలుగుతుంది .అందువలన అది వంటబట్టే తీరు వేరుగా ఉంటుంది . అలాగే ఆవపిండి స్వల్ప మోతాదులోనే కలిపినా జీర్ణశక్తిని పెంచి వాతాన్ని పోగొడుతుంది. ఇలా అలసందలతో ఎన్నో రకమైన ఉపయోగాలు ఉండట వలన దానిని మనం చక్కగా సద్వినియోగం చేసుకొని మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి.

నల్ల జీలకర్ర..ఎంతో మేలు..

 సూపులూ,బ్రెడ్ ల పైన చల్లుకునే నల్లటి కళోంజి గింజలు తెలుసు కదా.. ఇది వంటకాలకి రుచి తీసుకురావడమే కాకుండా రక్తంలోని చెడు కొవ్వుని తగ్గించి గుండె జబ్బులు రాకుండా చూస్తాయట .నల్ల జీలకర్ర లేదా నైజల్లా అని కూడా పిలిచే ఈ గింజలని రోజువారి ఆహారంలో సుమారుగా ఒక ఐదు గ్రాముల వరకు తీసుకుంటే ఎనిమిది నుంచి పది వారాలలోపే రక్తంలోని చెడు కొవ్వు తగ్గుముఖం పడుతుందని అంటున్నారు జపాన్లోని ఒసాకా మెట్రోపాలిటన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. పరిశోధనలో భాగంగా కొంతమంది ఉబకాయులకు నల్ల జీలకర్ర గింజల్ని ఆహారంలో భాగం చేశారు. 8 వారాల్లోనే ఆ వ్యక్తుల్లో ట్రై గ్లిజరయిడ్లు, అంతర్గత వాపులు తగ్గడంతో పాటు బరువు కూడా నియంత్రణలోకి రావడం గమనించారు. ఈ గింజల్లోని థైమేక్వైనోన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కి శరీరంలో కొవ్వు పేరుకోకుండా చేసే శక్తి ఉందని ఈ పరిశోధనలో తేలింది. అయితే జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం, తగిన వైద్య సలహాలు తోడైనప్పుడే  వారిలో ఈ ఫలితాలు పూర్తిగా లభిస్తాయని సారాంశం.

30, జనవరి 2026, శుక్రవారం

తిండి తగ్గించినా బరువు తగ్గడం లేదా?

 బరువు తగ్గడానికి ఆహారంలో కేలరీలు తగ్గించారు. మొదట్లో కాస్త బాగానే బరువు తగ్గారు. కానీ ఆ తర్వాతే పెద్దగా మార్పు కనిపించడం లేదు. బరువు తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తే చాలా మది ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి కారణం లేకపోలేదు. కేలరీలు మరీ ఎక్కువగా తగ్గిస్తే శరీరం ఆకలితో మాడే స్థితిలోకి వెళ్తుంది. దీంతో జీవక్రియల వేగం నె మ్మదిస్తుంది. కొవ్వును ఇంధనంగా వాడుకోవడానికి బదులు నిల్వ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్ పరిశోధకులు కొత్త పరిష్కారాన్ని కనుగొనడం మీద దృష్టి సారించారు. జీవ క్రియల వేగం మందకించకుండా చూసే మందుతో పరువు తగ్గడాన్ని కొనసాగించుకోవచ్చని భావిస్తున్నారు.

రోజుకు ఎంత నూనె వాడాలి?

మనిషికి రోజుకు 20 మిల్లీలీటర్లు అంటే నాలుగు టేబుల్ స్పూన్లు మించకుండా చూసుకోవాలి .అంటే నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం నెలకు రెండున్నర లీటర్లకు మించి  ఉపయోగించకూడదు. ఐ సి ఎం ఆర్ సిఫారసు ప్రకారం చూసినా నాలుగు లీటర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ మించకూడదు.

మనదేశంలో ఒక్కో మనిషి సగటున ఏకంగా ఏడాదికి 23½ లీటర్ల వంటనూనె వాడేస్తున్నాడని అంచనా. 2001లో వంటనూనెల తలసరి వాడకం 8.2 లీటర్లు ఉంటే నాలుగేళ్లలో మూడింతలు అయింది. భారత వైద్య పరిశోధన మండలి ఐసిఎంఆర్ సిఫారసు ఏడాదికి 12 లీటర్లు మాత్రమే. ఏ లెక్కన చూసినా మన వినియోగం చాలా ఎక్కువ అన్నమాట .ఆహార పదార్థాల్లో నూనె ఎక్కువైతే ఊబకాయం ,గుండె సంబంధ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు .అంటే నూనెలకు అధిక మొత్తంలో ఖర్చు చేయడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా కొని తెచ్చుకుంటున్నాం.

ఎందుకింత వాడుతున్నాం అంటే..

గతంతో పోలిస్తే ప్రస్తుతం కుటుంబ ఆదాయాలు బాగా పెరిగాయి. ప్రజలు భిన్న రుచులకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటి వంట కంటే బయట తిండి పెరిగింది. ఆన్లైన్ ఆర్డర్లు పెరుగుతున్నాయి. 

మరి ఏ నూనె మేలు అంటే..

ఆవనూనె, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె శ్రేష్ఠం. నెల నెలా మార్చి వాడుకోవచ్చు. ఒకదానికి ఒకటి కలిపి ఉపయోగించుకోవచ్చు .రిఫైండ్ కంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ వినియోగించడం మేలు .నూనె ఎంత వాడాం అనేదే కాదు.. దాని నాణ్యత కూడా ముఖ్యమే .నూనెకు బదులుగా రోజుకు 20 మిల్లీలీటర్ల నెయ్యి వాడొచ్చు.

ఇలా అయితే అనారోగ్యాన్ని కొనుక్కున్నట్లే..

 సిఫారసు కు మించిన నూనె వాడటం ద్వారా అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. కడుపుబ్బరం తదితర సమస్యలు తలెత్తుతాయి. జీర్ణక్రియ పై ప్రభావం పడుతుంది . ఇన్సులిన్ సమస్య లను పెంచుతుంది. షుగర్ వ్యాధి కి దారి తీస్తుంది. ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులకి కారణం అవుతుంది. క్యాన్సర్ కు దారి తీసే ప్రమాదం ఉంది.

పదే పదే మరిగిస్తే..

ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడకూడదు. పొంగుతున్నా ,రంగు మారినా దాన్ని అసలే ఉపయోగించకూడదు. రోడ్డుపక్క బళ్ళపై వాడే నూనె చూస్తే నల్లగా జిగురుగా ఉంటుంది .దాన్నే మళ్ళీ ఉపయోగించి ఆహార పదార్థాలు తయారుచేస్తారు. వాటినే తింటుంటాం. ఇలా ఉపయోగించిన నూనెలను తిరిగి మళ్లీ వాడి కూరలు ఆహార పదార్థాలను వేయించొద్దు.

వంట నూనెను ఒకటి రెండు సార్లు వేడి చేయాలి. ఎక్కువసార్లు మరిగిస్తే హానికర సమ్మేళనాలను విడుదల చేస్తుంది. నూనె వేడి చేసినప్పుడు గాలిలోని ఆక్సిజన్తో సంకర్షణ చెంది అందులోని కొవ్వు ఆమ్లాలు విచ్ఛిన్నమైపోయి పెరాక్సైడ్ ఇతర ఆక్సీకరణ ఉత్పత్తులు ఏర్పడతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడతాయి . ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఆక్రోలిన్ , ఆల్టిహైడ్స్ వంటి విషపూరిత సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి .ఇవి దీర్ఘకాలంలో అవయవాలపై ప్రభావం చూపిస్తాయి. పదే పదే వేడి చేయడం వల్ల నూనెలోని విటమిన్ ఈ , పాలీ అన్ శాచూరేటెడ్ కొవ్వు ఆమ్లాలు ,ఆంటీ యాక్సిడెంట్లు,ఇతర పోషక విలువలు నాశనం అవుతాయి. నూనె రుచి మారుతుంది .ఆహార పదార్థాల రుచి చేదుగా తయారవుతుంది. 

వాడకం తగ్గించుకుంటే ఖర్చు ఆదా.. ఆరోగ్యం కాపాడుకోవచ్చు..

నెలకు నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం.. నాలుగు లీటర్ల వంటనూనెకు బదులు కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఖరీదైనా రెండు లీటర్లు వాడుకోవడం మేలు. నూనె వాడకం సగం తగ్గించుకుంటే ఇంటి ఖర్చు ఆదా అవుతుంది. ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. కూరలు వేపుడు కాకుండా ఎయిర్ రోస్టెడ్ ఫ్రై విధానం అనుసరించవచ్చు .అవసరమైతే రుచి కోసం కొంత నూనె వేసుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ 60% , ప్రోటీన్లు 20 శాతం, ఫ్యాట్ 20 శాతం తీసుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ప్రోటీన్ తగ్గించుకొని 15% తీసుకోవచ్చు.

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...