పేగు వ్యాధులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పేగు వ్యాధులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, డిసెంబర్ 2018, సోమవారం

మలబద్ధకం - అహార ,ఆయుర్వేద పరిష్కారాలు./ MALA BADDHAKAM - AHARA ,AYURVEDA PARISHKARALU.


ప్రస్తుత రోజుల్లో మలబద్ధకం చాలా మందికి ఒక సమస్యగా మారింది.దీనిని వెంటనే పరిష్కరించుకోకపోతే ఇది ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది .ఐతే ఆహారంలో కొన్ని మార్పులు ,ఇంకా కొన్ని సులభమైన పద్ధతులు పాటిస్తే ఈ సమస్యను సులభంగా అధిగమించి చక్కటి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.

1. ప్రతి రోజూ క్రమం తప్పకుండా 12 నుంచి 15 గ్లాసుల నీరు తాగాలి.పేగు వ్యవస్థలో కదలిక వస్తుంది.శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.

2. రెండు ఖర్జూర పండ్లు గ్లాసుడు వేడి నీటిలో నానబెట్టి రాత్రి పడుకునే ముందు తినాలి.ఆ నీటిని చల్లార్చిన తర్వాత తాగొచ్చు.

3. రాత్రి పడుకునే ముందు 5 నల్లని ఎండు ద్రాక్షలను 5-6 గంటలు నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తినాలి.దీనిఒతో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

4. రెండు బొప్పాయి ముక్కలను గ్లాసుడు వేడి నీటిలో నానబెట్టి రాత్రి పడుకునే ముందు తినాలి.

5. రెండు అంజీర పండ్లను గ్లాసుడు వేడి నీటిలో నానబెట్టి రాత్రి పడుకునే ముందు తినాలి.,

6. 30 మి.లీ. అలోవెరా జ్యూస్ ను గ్లాసుడు నీటిలో కలుపుకుని రాత్రి పడుకునే ముందు తాగాలి.

7. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు,కూరగాయల జ్యూస్ లు వీటితో పాటు తీసుకోవాలి.

8. ఈ సమస్య ఉన్నవారు చిప్స్,ఫాస్ట్ ఫుడ్ ,మాంసానికి దూరంగా ఉండాలి.

9. ఖచ్చితంగా ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.బయటి ఆహారానికి దూరంగా ఉండాలి.సమయానికి భోజనం చేయాలి.

1, మే 2017, సోమవారం

గుండె మంటకు / ఎసిడి టి - ఆహార ఔషధాలు - GUNDE MANTA KU AHARA OUSHADHALU.

గుండె మంటగా ఉండటం,ఎసిడిటి - ఆహారం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.





* ఒక్కోసారి ఆహారం తీసుకోగానే పై పొట్టలో
తాండవనాట్యం ప్రారంభమవుతుంది. పొట్టలోంచి
ఏదో తెలియని పుల్లని ద్రవం పైకి ఎగదట్టి గొంతు
లోంచి దేన్నో ముక్కులోకి, గొంతులోకి ఎగజిమ్ము
తుంది. గుండె దగ్గర బాధ పుడుతుంటుంది. ఓ
టన్ను బరువు తెచ్చి నా మీదకు ఎక్కించినట్టు బరు
వేక్కిపోవటం, త్రేన్సులు, ఎక్కిళ్ళు, హార్ట్ ఎటాక్
వచ్చిందేమోననే భయం... ఆ భయం వలన
ఒళ్ళంతా చెమటలు పట్టటం, చూసేవాళ్ళను కూడా
భయపెట్టే ఈ పరిస్థితినే గుండెల్లో మంట (హార్ట్
బర్న్) అంటారు.
గొంతు దగ్గర నుంచి పొట్టదాకా ఉండే పేగు
భాగాలలోపల సున్నితమైన పల్చని పొర ఉంటుంది.
దీన్ని మ్యూకస్ పొర అంటారు. పేగులోపల పెరిగిన
ఈ పులుపు పదార్థాలలో ఆమ్లాలు నిండడంతో ఈ
పొర భుగభగమంటుంది. లోపల ఏదో కాలుతున్న
ట్టనిపించటం వలన అది గుండెకు దగ్గరగా ఉండే
భాగంలో జరగడం వలన రోగి గుండెల్లో మండు
తోందంచాడు. కడుపు ఉబ్బరం, విరేచనానికో
మూత్రానికి వెళ్ళాల్సి రావటం, ఒకటి రెండు
వాంతులు అవటం ఇవన్నీ ఇందువలన కలుగు
తాయి.
మనకున్న జీర్ణశక్తినీ, అది అరిగించగల ఆహారాన్ని,
మనం తీసుకున్న ఆహారాన్ని గుణకారాలు Chesi ఎంత ఆమ్లాలను విడుదల చేయాలో నిర్ణయించే శక్తి
మెదడుకుంది. సాధారణంగా దాని లెక్కలు తప్పవు.
మనమే లెక్కలు వేసుకోవటంలో విఫలం అయి
గుండెలో మంట తెచ్చుకుంటూ ఉంటాం.
కడుపులో ఇలా తరచూ యాసిడ్ పెరిగిపోతుంటే
తక్కువ కాలంలోనే గొంతు నుంచి పేగులవరకూ
ఉన్న భాగంలో వాపు ఏర్పడడం, లోపల మ్యూకస్
పొర పొక్కి పోయి ఎర్రగా పూసినట్టు అవటం జరు
గుతాయి. దీన్నే రిఫ్లెక్స్
ఈసోఫేగైటిస్ అంటారు.
గుండెజబ్బు,
గుండెలో మంట జబ్బు
ఒకదానికొకటి ఆశ్రయ
ఆశ్రయీ
భావంలో
ఉంటాయి. అంటే ఒక
దాని వలన మరొకటివృద్ధి పొందుతాయన్నమాట. రిఫ్లెక్స్ ఈసో
ఫేగెటిస్ వలన కూడా ఎంజైనా అనే గుండే
నొప్పికి సంబంధించిన లక్షణాలు కనిపి
చిస్తాయి.
వంగుని ఏదైనా వస్తువును తీసుకుంటు
న్నప్పుడు పొట్టమీద వత్తిడికి గుండెలో
మంటగా నొప్పిగా అనిపిస్తే అది గుండె
మంట వ్యాధేగానీ గుండె నొప్పి కాకపోవచ్చు.
భోజనం చేయగానే డొక్కల్లోగానీ పొట్టలోగానీ
నొప్పి రావటం, వెల్లకిలా పడుకుంటే గుండె
-నొప్పిగా అసౌకర్యంగా ఉండడం, నోట్లో పుల్లటి
నీళ్లు ఊరటం, గొంతులోపల కారం పూసినట్టు
మంటగా ఉండడం, గ్యాసు పెరగటం, పొట్ట బిగదీ
యటం, వాంతి కూడా లోపల్నుంచి తన్నుకొచ్చినట్టు
కాకుండా పైనీళ్ళు పై నుండే వస్తున్నట్టు ధారగా
అవటం, భోజనం చెయ్యగానే వాంతి అవటం,
పచ్చళ్ళు కారాలు, అతిగా మసాలాలు, చింతపండు
వేసిన వంటకాలను తిన్న రోజున హార్ట్ ఎటాక్ హడా
విడి కలగటం, అర్ధరాత్రి పూట మంచి నిద్రలో
ఉండగా ముక్కులోకి, గొంతులోకి నీళ్ళు ఫౌంటెన్
చిమ్మినట్టు ఎగదట్టి, పుల్లనీళ్ళన్నీ వెనక్కి తగ్గి, ఆ
మంట చల్లారేవరకూ నిద్రపట్టకపోవటం, గొంతు
పూడుకుపోవటం, మాట పెగలకపోవటం ఇలాంటి
బాధలన్నీ పేగుల్లో యాసిడ్ పెరగటం వలన
ముంచుకొచ్చేవిగా ఉంటాయి. వీటన్నింటికీ కారణ
మైన పులుపు, మసాలాలు, కారాలను అపరిమితంగా తినడమేనని గుర్తించగలగటమే మంచి నినా
రణ.

గుండెలో మంట ఉన్నవాళ్ళు ఉదయం పూట టిఫిన్లు
తినటం మానేసి చల్లన్నం లేదా పెరుగన్నం తినటం
అవసరం. టిఫిన్లే ఎసిడిటీకి ముఖ్య కారణాలు,
శనగపిండి, చింతపండు, ఇతర పులుపు పదార్థాలు,
నూనెలో వేసి వేయించిన వేపుళ్ళు, బాగా వేడిచేసే
వస్తువులు... ఇవి ఎసిడిటీకి పెంపుడు తల్లులు, వాటి
మీద వ్యామోహం వదులుకోవాలి. బియ్యం, కంది
పప్పు, పెసరపప్పు, ఉలవలు వీటిని దోరగా
వేయించి వండుకోండి. తేలికగా అరుగుతాయి.
కేరట్, ముల్లంగి, యాపిల్ లేదా కర్బూజా లేదా
బొప్పాయి... వీటిని సమానంగా తీసుకుని మిక్సీ పట్టి
జ్యూసు చేసుకుని ఒక గ్లాసు మోతాదులో రోజు
రెండు పూటలా తాగండి. ఎసిడిటీ తగ్గుతుంది.
దాహం తీర్చుకోవడానికి మజ్జిగమీద తేరుకున్న నీటినిగానీ, పల్చని మజ్జిగను గానీ తాగటం మంచిది.
బార్లీజావ, సగ్గుబియ్యం జావ, సబ్బాగింజలు నానిన
నీళ్ళు లాంటివి తాగితే ఎసిడిటీ త్వరగా తగ్గుతుంది.
పాలు తాగితే ఎసిడిటీ పెరుగుతుంది. ఈ వ్యాధిలో
పాలు, పాల పదార్థాలు నిషేధం.
బూడిదగుమ్మడి, సొర, బీర, పొట్ల వీటి గుజ్జుతో
పెరుగుపచ్చడి చేసుకుని అన్నంలో తింటే ఎసిడిటీ
పెరగకుండా ఉంటుంది. పులిసిన, పులవబెట్టిన
పదార్థాలను పూర్తిగా మానేయండి. మరమరాల్లాం
టివి తేలికగా అరుగుతాయి.
దానిమ్మ, ఉసిరి కూడా
ఎసిడిటీని పెంచకుండా మేలుచేస్తాయి.
పండిన వెలగపండు ఎసిడిటీ పైన ఔషధంలా పనిచే
స్తుంది. అరటి,
జామ, బొప్పాయి, సపోచాలు మేలు
చేస్తాయి. వేసవిలో లేత తాటి ముంజెలు ఎసిడిటీని
తగ్గిస్తాయి.
కానీ అతిగా తినకూడదు.
అరుగుదల మీద దృష్టి పెట్టి ఆహారం తీసుకునే
వాళ్ళకు ఎసిడిటీ జన్మలో రాదు.




16, జనవరి 2016, శనివారం

అన్నం తినబుద్ధి కాకపోవడం / అజీర్ణం ,నోటికి రుచి తెలియకపోవడం జరిగినప్పుడు ఏం చేయాలి? / అల్లం - అజీర్ణం - ఆయుర్వేదం / ALLAM - AJEERNAM - AYURVEDAM


దీనిని అరుచి అంటారు.అజీర్త్ కారణంగానైన, లేదా ఇతర కారణాలవల్లనైన ఇది కలగవచ్చు. కారణం ఏదైనా ముందు జీర్ణ వ్యవస్థ బలకరం కావాలి.

ప్రతి రోజూ అల్లనికి తగినంత ఉప్పు వేసుకుని దంచి అన్నంలో మొదటి ముద్దగా కలుపుకుని నెయ్యి వేసుకుని తినాలి.నాలుక మీద జిగురు తగ్గి ,అన్న హితవు కలుగుతుంది.అన్నంలో మొదటి ముద్దగా అల్లం, ఉప్పు ( వీలైతే సైంధవ లవణం ) మిశ్రమాన్ని తినాలి.అరోగ్యవంతులు కూడా దీనిని పాటిస్తే భుక్తాయాసం కలుగదు.అహారం తేలికగా జీర్ణం అవుతుంది.అన్నం తినాలనే కోరిక కలుగుతుంది.ఉసిరికాయ తొక్కుడు పచ్చది లేద నల్ల పచ్చడిని ఈ అల్లం మిశ్రమానికి కలిపి తింటే మరీ మంచిది.భోజనంలో మొదటి పదార్థంగా దీనిని తీసుకోవాలి.
పచారీ కొట్లలో దొరికే పిప్పళ్ళను దోరగా వేయించి మెత్తగా దంచాలి.ఈ చూర్ణానికి ఆరు రెట్లు పంచదార కలిపి పాకం పట్టి కుంకుడు కాయంత ఉండలు చేసుకొని సీసాలో భద్రపరుచు కోవాలి.జీర్ణవ్యవస్థ బలంగా లేని వాళ్ళు వీటిని ఉదయం , రాత్రి ఒక్కొక్క మాత్ర చొప్పున తీసుకుంటూ వుంటే కడుపులో వాతం తగ్గి జీర్ణాశయం బలపడుతుంది.శరీరానికి నూతనోత్తేజం కలుగుతుంది.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...