శరీర బలహీనత / బాడీ వీక్ నెస్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శరీర బలహీనత / బాడీ వీక్ నెస్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, మే 2021, ఆదివారం

చిక్కిపోతున్నవారికి ఆయుర్వేద చికిత్స

 చిక్కిపోవడానికి శరీరంలోపల ఏదైనా వ్యాధు కారణంగా ఉందేమో ముందుగా పరీక్ష చేయించాలి. ఈ కింది ఉపాయాలు పాటించాలి.


1.ఆకలి బాగా పెరిగేందుకు ఆల్లం, శొంఠి లాంటివాతిని వాడుతుండాలి.

2.రాత్రిపూట వేడి అన్నంలో పాలు పోసి ఆ అన్నంతో సహా తోడుపెట్టి ఉదయాన్నే తీసుకొంటూ ఉంటే చిక్కిపొతున్నవారు బలం పుంజుకొంటారు. వేడి తగ్గుతుంది. ఢనియాలు, జిలుకర, శొంఠి ఈ మూడింటినీ సమానంగా తీసుకొని మెత్తగా దంచి ఈ తోడు అన్నంలో నంజుకొంటూ తింటే తేలికగ అరుగుతుంది. ఇంకా బాగ ఉపయోగపడ్తుంది.

3.పిల్లిపీచర వేళ్ళు ఎండించినవి మార్కెట్లో దొరుకుతాయి, వీటిని దంచిన పొడిని చెంచా మోతాదులో తీసుకొని పాలలోవేసి పంచదార కలిపి తాగాలి. 

4.బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, దూలగొండి విత్తులు, జాజికాయ, జాపత్రి, అశ్వగంధ, నేలగుమ్మడి, పిల్లిపీచర వేళ్ళు, శుగంధి పల లోపల పుల్ల తీసేసిన బెరడు వీటిని సమానంగా తీసుకుని శుభ్రంచేసి మెత్తగా దంచి పొడిచేసి , చాలా కొద్దిగా పచ్చకర్పూరం కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. చెంచా పొడిని పాలలో కలిపి తాగిస్తే చిక్కిపోతున్నవారు శక్తిమంతులౌతారు. రోజూ రెండు పూటలా తాగించండి.

5.శిలాజిత్యాదియోగం ఔషధాన్ని రోజూ తీసుకొంటుంటే వివిధ దోషాలు తగ్గి రక్త పుష్టి కలుగుతుంది. రోగి బలసంపన్నుడౌతాడు. 

6. ముఖం ఎండుకుని పోయినట్లు ,పిక్కు పోయినట్లు ఉంటుందా నలుగురు మిమ్మల్ని చూసినప్పుడల్లా ఏంటోయ్ ఇలా ఎండి పోతున్నావ్ అని పలకరిస్తున్నా రా, బాగా ఎండిన దాల్చిన చెక్కని మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరుచు కోండి .గుమ్మపాలు దొరికితే మంచిది లేకపోతే మామూలు పాలు పచ్చివి గాని కాచినది గాని తీసుకొని ,ఒక గ్లాసు పాలలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని కలిపి పంచదార వేసుకొని  రోజు ఉదయం పూట తాగండి, ఉత్సాహం వస్తుంది. ఒంట్లో వాతము ,వేడి తగ్గుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది .జీర్ణశక్తిని పెంచుతుంది .శరీరం కండపట్టి పుష్టిగా ఉంటుంది. అసలైన విషయం, శుక్రా న్ని వృద్ధి చేసి లైంగిక శక్తిని పెంపొందింప చేసే అద్భుతమైన ద్రవ్యాలలో దాల్చిన చెక్క కూడా ఒకటి..

25, జనవరి 2019, శుక్రవారం

ప్రాణాంతక వ్యాధులు - ఆయుర్వేద చికిత్స


టి.బి.,ఎయిడ్స్,కండరాలను శుష్కింప జేసే వ్యాధుల్లోనూ రోగి రోజురోజుకు క్షీణించి పోవడం జరుగుతుంది.దీనిని నివారించి ,వ్యాధి నిరోధక శక్తిని పెంచే చికిత్సలు ఆయుర్వేదంలో కొన్ని ఉన్నాయి.

1.గోధుమలు,ఉలవలు,నెయ్యిలో వేయించిన శొంఠి,దానిమ్మ, గింజలు తీసిన ఉసిరి కాయలు,పిప్పళ్ళు ఈ ఆరింటిని కలిపి మేక మాంసం ఈ మిశ్రమానికి రెట్టింపు తీసుకుని ,మొత్తానికి 8 రెట్లు నీళ్ళు కలిపి పొయ్యి మీద ఉడికించాలి.దీనిలో నాలుగవ భాగం నీళ్ళు మిగిలేలా మరిగించాలి.పొయ్యి మీద నుంచి దించి చల్లార్చిన తర్వాత్ ఒక పలుచని గుడ్డలో దీన్ని పోసి బాగా పిండాలి.ఈ రసంలో శొంఠి పొడిని ,దానిమ్మ రసాన్ని ,ఉసిరిక పొడిని కొంచెం కలుపుకుని ,సైంధవ లవణాన్ని కొంచెం కలిపి రోజూ ఒకసారి తాగుతుంటే క్షీణిస్తున్న మనిషి కోలుకోవడం జరుగుతుంది.దీనివల్ల దగ్గు,ఆయాసం,గుండెల్లో నొప్పి,గొంతు మంట కూడా నివారిస్తాయి.

2 .  మేక పాలు,మేక మాంసం,  ఎక్కువగా తింటున్నచో రోగి బలాన్ని పుంజుకుంటాడు.



* కొంచెం పెరుగులో బెల్లం కలుపుకుని తింటే వేసవిలో కలిగే అతిదాహం తీరుతుంది.వాతాన్ని కూడా తగ్గిస్తుంది *

22, డిసెంబర్ 2018, శనివారం

ఎముకలు మెత్తబడుట - ఆయుర్వేద చికిత్స


మనం తినే ఆహారంలో ఫాస్ఫరస్,సున్నము,డి విటమిన్ లోపించినపుడు ఎముకలు మెత్తబడడం జరుగుతుంది.స్త్రీలలో డెలివరీ అయిన తర్వాత ఈ వ్యాధి ఎక్కువగా రావచ్చు.కింది చికిత్సలు రోగాన్ని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడగలవు.

1. క్షీర బలా తైలము,సువర్ణము,అమ్ర్తప్రాశ ఘృతము కలిపిన చ్యవన ప్రాశ వాడవచ్చు.

2. ఆక్రోట్ చెట్టు ఆకుల కషాయమును ఉదయం , సాయంత్రం ఒక కప్పు చొప్పున తీసుకోవాలి.

3. రోజూ పాలను తాగాలి.

4. ప్రతి రోజూ తాంబూలం వేసుకోవాలి.

కండరముల క్షీణత - ఆయుర్వేద చికిత్స



కొన్ని వ్యాధులు బాగా ముదిరినప్పుడు ,ముదిరి తగ్గినపుడూ కండరములు క్షీణించి ,శరీరం ఎండిపోవడం జరుగుతుంది.దీని వల్ల ఎక్కువగా నీరసమూ,మూత్రం స్వాధీనం తప్పుట,శరీరం తూలిపోవుట,జరుగుతుంది.అలాంటప్పుడు ఈ కింది చికిత్సలు బాగా ఉపకరిస్తాయి.

1. చ్యవనప్రాశ,మకరధ్వజము,అశ్వగంధ లేహ్యము,వసంత కుసుమాకరము బాగా పని చేస్తాయి.

2. ఒక కప్పు నీటిలో 3 స్పూన్ ల తేనె ను,ఒక నిమ్మ కాయ రసమును కలుపుకొని ప్రతి రోజూ తాగుతుండాలి.కొంత కాలానికి వ్యాధి తగ్గగలదు.

3. రత్న పురుష ఆకులు,అల్లపు రసము,ఎండు ద్రాక్షలను వాడుతూ ఉండాలి.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...