Sunday 29 May 2016

చిరుధాన్యాలు - ఆరోగ్యానికి రక్ష





 పెను సవాలు విసురుతోంది నీటి
సమస్య దైనందిన జీవితంలో సగటు మానవుడు సుమారు 4వేల లీటర్లకు పైగా
నీటిని పరోక్షంగా వినియోగించుకుంటున్నాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు
మొత్తంగా ఒక కేజీ బియ్యం మన ముందు ప్రత్యక్షమయ్యేందుకు 3వేల లీటర్లు
ఖర్చవడమే అందుకు ఉదాహరణగా సూచిస్తున్నారు. అంతేకాదండోయ్ ప్రపం
చానికి చెమటలు పుట్టిస్తోన్న నీటి సమస్యను చిరుధాన్యాలతో జయించవచ్చని
సూచిస్తున్నారు. వరితో పోల్చితే మూడో వంతుకన్నా తక్కువ నీరు తీసుకొని
దిగుబడినిచ్చే గోదుమ, జొన్న, సజ్జలు, కొర్రలు వంటి పంటలకు జైకొట్టాలని నిపు
ణులు సూచిస్తున్నారు. వీటితో చక్కటి ఆరోగ్యం కూడా సాధ్యమవుతుందని ఉస్మా
నియా విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రారంభమైన పురాతన విత్తన ప్రదర్శన
చాటి చెప్పింది. రైతు స్వరాజ్ వేదిక ఇక్కడి దూరవిద్య కేంద్రంలో ఏర్పాటుచేసిన
మూడు రోజుల ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల రైతులు వారి వారి సేంద్రియ పంట
లను, పురాతన విత్తనాలను ఉంచి నేటి తరాన్ని మేల్కొలుపుతున్నారు.
కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు,
బరిగెలు, సజ్జలు, జొన్నలు, రాగులు,
అందుకొర్రల వంటి అనేక రకాల చిరు
ధాన్యాతో చేసిన వంటలే గతంలో
ప్రధాన ఆహారం సంగటి, అంబలి,
రొట్టెలు తిని నాటి ప్రజలు ఎంతో ఆరో
గ్యంగా, ద్రుఢంగా జీవించారని ఇప్ప
టికీ పెద్దలు చెబుతుంటారు. హరిత
విప్లవంలో భాగంగా వరి పంటకు
ప్రాధాన్యం పెరగడం, దాని పోషణకు
సంబంధించి ప్రభుత్వం ప్రోత్సాహ
కాలు, ఎరువులకు రాయితీలు ఇవ్వ
డంతో చిరుధాన్యాలను పండించే
రైతులు తగ్గిపోతూ వచ్చారు. రాగులు,
జొన్నలు, సజ్జలు తప్ప మిగిలిన ధాన్యాలను నేటి తరానికి చూపించలేని పరిస్థితి
వచ్చింది. ఇక నేడు విపరీతమైన ఆహార అలవాట్ల కారణంగా ఎక్కువ శాతం
ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఫలితంగా మధుమేహం, హృద్రోగం,
అధిక బరువు వంటి రుగ్మతలు పట్టిపీడిస్తున్నాయన్నారు. ఒకప్పుడు ఇంటి భోజ
నంలో రాజుల్లా మెలిగిన చిరుధాన్యాలు లేకపోవడమే దీనికి కారణం. ఏదిఏ
మైనా పిజ్జాలు, బర్గర్లు, ఇతర జంకప్పుడు అలవాటుపడిన నేటి తరం మళ్లీ నాటి
వంటలవైపు మొగ్గుచూపుతోంది. అనేకమంది ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు
వీటిని తీసుకుంటున్నారు. మార్కెట్లోనూ చిరుధాన్యాలకు ప్రాధాన్యం పెరుగుతోం
ది"అని రైతు స్వరాజ్ వేదిక రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఆశాలత చెబుతున్నారు.
ఎంత నీరు అవసరమంటే
• కేజీ బియ్యం ఉత్పత్తికి 3000
లీటర్ల నీరు
• కేజీ గోధుమల ఉత్పత్తికి 1,350
లీటర్ల నీరు
• కేజీ జొన్నలకు 900లీటర్ల నీరు
•కేజీ సజ్జలకు 850లీటర్ల నీరు

గుండె సమస్యలు - ఆయుర్వేదం


గుండెకు సంబంధించిన సమస్యలకు స్టెంట్స్ వేయడం, గుండె రక్త
నాశాలకు సంబంధించిన పెద్దాపరేషన్లు చేస్తుంటారు కదా. మరి
ఆయుర్వేదంలో ఆ సమస్యలకు నివారణ మార్గాలు, చికిత్స,
ఔషధాలు ఉన్నాయా? దయచేసి తెలియజేయండి.
- వి. పట్టాభిరామ్, విజయనగరం
గుండె ఒక రకమైన ప్రత్యేక కండరం. జీవితాంతం లయ
బద్ధంగా స్పందించే ప్రకృతి నిర్మిత యంత్రం. దీని సామర్థ్యం జీవి
తాంతం సాగిపోవాలంటే ఐదు అంశాలు అత్యంత ప్రధానమైనవి.
1.దీని నిర్మాణంలో పుట్టుకతో వచ్చే లోపాలు ఉండకూడదు. 2.
దీనికి లభించే ప్రత్యేకమైన విద్యుత్ సరఫరాలో తేడాలు రాకూ
డదు. 3. ఈ కండరానికి 'కొరనరీ ధమనుల ద్వారా రక్తప్రసరణ
జరుగుతుంది. ఈ రక్తప్రసరణలో అవరోధాలు ఏర్పడకూడదు. 4.
కొన్ని సూక్ష్మక్రిములు గుండె పారలను, కవాటాలను పాడు
చేస్తాయి. సాధారణ వైద్య పరిభాషలో వాటిని ఇన్ఫెక్షన్లు అంటారు.
అవి సంభవించకుండా జాగ్రత్త తీసుకోవాలి. 5. మానసిక ఒత్తిడి
లేకుండా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి.
హార్ట్ ఎటాక్ లో గుండెకు జరిగే రక్తప్రసరణలో
అంతరాయం
కలుగుతుంది. క్రమబద్ధంగా గుండె స్పందనలు ప్రకృతిపరంగా
నిరంతరం సాగే నిరంతర ప్రక్రియ. గుండె సంకోచించినప్పుడు
ఆయా ధమనుల ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తం
సరఫరా అవుతుంది. అలాగే గుండెకు కూడా కొరనరీ ధమనుల
ద్వారా రక్తం అందుతుంది. తనలోనే ఉన్న రక్తాన్ని శోషణక్రియ
ద్వారా గుండె పీల్చుకోలేదు. గుండెలాంటి క్రమశిక్షణే మనిషి
కూడా పాటిస్తూ, తన ఆహార విహారాల మీద నియంత్రణ కొనసా
గిస్తే హార్ట్ ఎటాక్లు నివారితమవుతాయి.
నివారణ: ఇది చిన్న వయసునుంచీ సాధన చేయాల్సిన
అంశం.
ఆలా కాకపోయినా ఏ వయసునుంచి అయినా ప్రారంభించవచ్చు.
ఆహారం: తాజా పండ్లు, శాకాహారం, అవసరమైన ప్రమాణం
లోనే పాలు, పెరుగు, నెయ్యి, నూనెలు తీసుకోవడం, పీచుపదాఆర్థాలు
తీసుకోడానికి, తగినంత నీరు తాగ 
డానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఆహారంలో 
అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్త 
తీసుకోవడం, చక్కెర పదార్థాలు, కొవ్వులు
ఎక్కువగా ఉండే ఆహారాన్ని, జంక్
పుడు, శీతలపానీయాలను తీసుకోకపోవడం వంటి జాగ్రత్తలు
పాటించాలి.
విహారం: వయసును, వృత్తిని బట్టి ప్రతిరోజూ వ్యాయామం చేసి
తీరాలి. (ఉదాహరణకు నడక, ఆటలు, యోగాసనాలు, ఇంట్లోనే
అన్ని కీళ్లకూ కదలికలు కల్పించడం మొదలైనవి). ఖాళీ కడుపుతో
రోజుకు రెండుపూటలా ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి.
పొగతాగడం, మద్యం, గుట్కా వంటి వ్యసనాల జోలికిపోకూడదు
ఔషధాలు: అల్లం5 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు 5. పసుపు ఐదు
చిటికెలు, దాల్చిన చెక్క చూర్ణం 5 గ్రాములు కలిపి కషాయం
కాచుకుని రోజూ 30మి.గ్రా (ఆరు చెంచాలు) తాగాలి. పరగడు
పున గానీ లేదా ఎప్పుడు తాగినా మంచిదే. ఎంతకాలం తాగినా
పర్వాలేదు. దీనివల్ల అన్ని అవయవాలకూ రక్తప్రసరణ బాగా జరు
గుతుంది. రక్తంలో కొవ్వులు ఎక్కువ కావు. మధుమేహానికీ,
హైబీపీకి కూడా ఇది నివారణగా పనిచేస్తుంది. ఆహారం జీర్ణం
కావడం కూడా బాగా జరుగుతుంది.
మద్ది (అర్జున) చెట్టు 'తెలుపు, నలుపు' అని రెండు రకాలు.
తెల్లమద్ది చెక్క చూర్ణం, గోధుమల చూర్ణం రెండేసి గ్రాములు
కలిపి ఆవు నెయ్యి, బెల్లం కలిపి రెండుపూటలా సేవిస్తే గుండెకు
మంచిది. ఆవు నెయ్యికి బదులు మేకపాలు కూడా వాడుకోవచ్చు
ఉనల్లమద్ది చెక్క కషాయాన్ని 5 చెంచాలు రోజుకొకసారి మూడు
రోజులు తాగితే గుండెనొప్పి తగ్గుతుంది.
బజారులో లభించే మందులు: • ప్రభాకరవటి లేదా నాగార్జునాష్ట్ర
రస మాత్రలు ఉదయం 1,
రాత్రి 1 వాడాలి - త్రిఫలా చూర్ణం 5
గ్రాములు రోజూ రాత్రి పడుకోబోయేప్పుడు నీళ్లతో సేవించాలి.

Saturday 28 May 2016

ఇడ్లీలు తినడం మంచిదేనా?

ఇడ్లీలు తినటం మంచిదేనా?
* ఇడ్లీల్ని మన పూర్వులు ఇద్దెనలు' అని పిలిచేవారు.
వాటిని తీపి వంటకంగా కూడా చేసుకునే వాళ్లు, పంచదార
పాకంలో నానబెట్టుకుని తినేవాళ్లు కూడా! అల్లప్పచ్చడి, శనగ
చట్నీ సాంబారులతో మాత్రమే తినాలనే విధానం తెలుగువారిది
కాదు. ఉడిపి కాఫీ హోటళ్ల పుణ్యమా అని, మొత్తం దక్షిణ భారతదే
శంలోనే ఇడ్లీ ఒక ప్రాథమిక వంటకం అయ్యింది. ప్రొద్దునపూట
చలిది అన్నం వదిలేసి, ఐదులుగా టిఫిన్ చేయటం అలవాటయ్యింది.
అట్టు, బజ్జీ, పునుగు, పూరీల్లా నూనె పదార్థం కాదు కదా... ఇడ్లీ 'సేఫ్
పుది అనడానిక్కూడా వీల్లేదు. కొబ్బరి శనగ చట్నీ, నెయ్యీకారప్పొడి,
సాంబారు, అల్లం పచ్చడి వీటి వలన కడుపులో ఆమ్లసముద్రా
లేర్పడి, అల్సర్లు పెరుగుతాయి. వీటితో ఇడ్లీ తిని వెంటనే కాఫీ
తాగితే కడుపులో పాలు విషపదార్థాలుగా మారిపోతాయి.
ఇద్దెనల కన్నా ఆవిరి కుడుములే కొంతలో కొంత మేలు. మినప్పప్పులో
కొద్దిగా బియ్యం, కాసిన్ని మెంతులు
వేసి రుబ్బి పూటే ఇద్దెను వేసుకుంటే
దాన్నే ఆవిరికుదుములంటారు. బడికి
వెళ్లే పిల్లలకు, వయోవృద్ధులకు ఇవి
ఎక్కువ శక్తిదాయకంగా ఉంటాయి.
వాతాన్నీ, వేడిని తగ్గిస్తాయి. అన్ని
వ్యాధుల్లోనూ పెట్టదగినవిగా
ఉంటాయి. బలహీనంగా ఉన్న
వారికీ, చిక్కి శల్యమై పోతున్న వారికీ మేలు చేస్తాయి. స్థూలకాయం, షుగరు
వ్యాధి ఉన్న వారిక్కూడా పెట్టవచ్చు. ఇందులో అల్లం, మిరియాలు, కొత్తిమీర
లాంటివి కూడా తగుపాళ్లలో కలుపుకుని వండుకుంటే తేలికగా అరుగుతాయి.

పచ్చళ్ళు తినవచ్చా ? తినకూడదా?

రోటి పచ్చళ్లు

వచ్చళ్లు తినవచ్చా తినకూడదా?
* పచ్చది లేకపోతే కడుపు నిండినట్టు అనిపించదు. నిండదు కూడా! పచ్చడి,
మన ప్రాచీన వంటకాల్లో ఒకటి. ఏరోజుకారోజు తినేందుకు చేసే పచ్చళ్లను రోటి
పచ్చళ్లంటారు. చింతపండు కలపకుండా చేసే రోటీ పచ్చళ్లు కూరతో సమానమైన
గుణ ధర్మాలు కలిగి ఉంటాయి. వంకాయ కూరకీ - వంకాయ పచ్చడికీ, బీర
కాయ కూరకీ - బీరకాయ పచ్చడికీ సమానంగానే ఉపయోగపడతాయి. రుచి
కావాలి. రుచితో పాటు ఆరోగ్యం కూడా కావాలంటే పచ్చళ్లని చక్కగా ఉపయో
గించుకోవాలి.
తొక్కు పచ్చడి, నంజుపచ్చడి, ముక్కల పచ్చడి, బజ్జీ పచ్చడి ఇలా పచ్చళ్లను
చాలా రకాలుగా చేస్తుంటారు మనవాళ్లు, ఎలా చేసుకున్నా అందులో అతి
పులుపు, అతి మషాలాలు లేకుండా తయారుచేసుకుంటే వేపుడు కూరల కన్నా,
పులుసు కూరల కన్నా ఈ పచ్చళ్లే ఆరోగ్యానికి మెరుగైనవి. ఆవకాయ, మాగాయ
లాంటి ఊరగాయల్లో లేని శాకాహార స్ఫూర్తి రోటీ పచ్చళ్లలో ఉంది. కాయగూ
రల్నీ, ఆకుకూరల్నీ అధికంగా తీసుకోవడానికి పచ్చడి ఒక మంచి అవకాశం.
వాటిని ముచ్చటగా తినాలి.

SHOBHI KI AHARA CHIKITHSA

శోభికి ఆహార చికిత్స

జీపుమీద, మెడమీద మచ్చలు పడ్డాయి. ఆహారం,
ఇతర జాగ్రత్తలు చేస్తారా?
• శోభి మచ్చల్ని పిటీరియాసిస్ వెర్సీకలర్ అనే వ్యాధిగా పీలు
స్తారు. నీడన ఉన్నప్పుడు లేత తేనె రంగులో ఉండి, ఎండలోకి వెళ్ళగానే
బాగా ముదురు గోధుమ రంగులోకి మారి కనిపిస్తాయి. కాబట్టి రంగు
మార్చుకునే వ్యాధి అనే అర్థంలో ఈ పేరుతో పిలుస్తారు. ఇది
వార్ణచందు మెడ, వీపు భాగాలలోనే ప్రధానంగా వస్తుంది. ఈ వ్యాధి బాగా
చెమట పట్టే ఉష్ణ స్వభావం ఉన్నవారిలో ఎక్కువ. ఒక్కొక్కసారి
మరీ ఎక్కువ చెమట పడితే పొట్టు లేస్తుంటుంది కూడా. అయోడిన్ టింక్చరని
దూదితో తడిపి ఈ మచ్చ మీద రాస్తే, మచ్చలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇదే ఈ
వ్యాధికి మంచి పరీక్ష, ముగరు వ్యాధి, స్థూలకాయం, రక్తహీనత, అతిగా చెమటన
ట్టించే ఇతర వ్యాధుల్లో కూడా ఈ శోభి మచ్చలు రావచ్చు.
మందుల విషయం డాక్టర్లకు వదిలేయండి. శోభి మచ్చలు వచ్చిన వారు శరీ
రంలో వేడిని తగ్గించుకోవాలి. ఆ వేడిని చల్లార్చడానికి శరీరం ఎక్కువ చెమట
పట్టేలా చేస్తుంది. చెమ్మ వలన ఫంగస్ అనే బూజు జాతి శిలీంద్రాలు చర్మం మీద చేరి
శోళి, తామరలాంటి వ్యాధుల్ని తెస్తాయి. వేడి చేసే ఆహార విహారాలను తగ్గించుకుని
చలవ చేసే వాటిని ఆచరిస్తే చెమట
తగ్గుతుంది. పులుపు, అల్లం వెల్లుల్లి
మసాలాలు బాగా కలిపి వండిన
ఆహార పదార్థాలన్నీ వేడి చేసేవే!
ఊరుగాయలు, నూనె పదార్థాలు,
బిరియానీ, పలావు, పులిహోర
లాంటి పదార్థాలన్నీ వేడిచేస్తాయి.
వేడి చేసే శరీరతత్వం ఉన్నవారిని
మరింత ఇబ్బంది పెడతాయి. శోలి
తగ్గాలంటే, చలవ చేసేవి తినాలి.
పులుపు, మసాలాలు లేకుండా వండుకుంటే కూరగాయలన్నీ చలవ చేసేనని గుర్తిం
చండి. బూడిదగుమ్మడి బాగా చలవ చేస్తుంది. సబ్యాగింజలు,
బార్లీ గింజలు, నగు
బియ్యం, బాగా చిలికిన మజ్జిగ చెమటను తగ్గిస్తాయి. ఇలాంటి ఆహారం తీసు
కుంటూ, ఎంద నుండి రక్షణ ఉపాయాలు పాటిస్తే లోభి చాలా తేలికగా తగ్గుతుంది.
అది మొండి వ్యాధిగా మారితే తగ్గించటం కష్టం అవుతుంది.

SUNNITHA AHARA VYAYAMALU

సున్నిత ఆహార వ్యాయామాలు
ఇ అన్నం మానేసి రన్నింగ్ చేస్తే స్థూలకాయం తగ్గి
ఎక్కువసేపు ఇంట్లోనో, ఆఫీసులోనో గడి పేకన్నా జయ
ఒకు వస్తే ఎంతో కొంత కేలరీల ఖర్చు జరుగుతుంది. కుర్చీకి
అంటుకుపోయే వృత్తి వ్యాహాల్లో ఉన్న వాళ్లు కూడా ప్రతి గంటకు
సారి పది నిమిషాలపాటు లేచి నిల్చుని, పనిచేసినా కొంత మేర క్యాల
డీలు చుపుతాయి. మైటోకాండ్రియా అనేవి శరీరంలో కణజాలానికి
శని సరహ చేసే కేంద్రాలు, శరీరానికి తగిన శ్రమను కల్పిస్తే, వీటి
సంఖ్య పెరిగి ఎక్కువ ఆక్సిజన్ ని తీసుకునే శక్తి కలుగుతుంది. అందువ
అవ గుండెకు, మెదడుకు రక్తప్రసారం బాగా జరిగి ఆక్సిజన్ ఎక్కువగా
అందుతుంది. అలాగని, అతిగా వ్యాయామాలకు పాల్పడితే
కండరాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది.
డా.జి.వి.పూ
స్థూలకాయం వలన కలిగే అవకారం ఒక ఎత్తయితే, దాన్ని
తగ్గించుకోవడానికి అతిగా డైటింగ్, అతిగా వ్యాయామం వలన కలిగే అవకారం
ఇంకో ఎత్తుగా ఉంటాయి. అతి వ్యాయామం కండరాల మీద సైన్స్ ని పెంచుతుంది.
అతి ఉపవాసం కండరాలకు
పోషకాలను అందకుండా
చేస్తుంది. కండరాలు బలహీన
పడి నొప్పులు పెడతాయి. మున
లితనం ముందుగానే ముంచుకు
రావటం, శరీరావయవాలలో
బలహీనతలు ఏర్పడటం, కేన్సర్
లాంటి బాధలకు ఈ 'అతి'
కారణం అవుతుంది. ఎంత
వరకూ ఆహార నియమాలు
పాటించగలరో అంతమేర నెమ్మ
దిగా అలవాటు చేస్తూ, మార్పు చేయండి. అలాగే, ఎంతమేర శరీరం శ్రమను తట్టు
కుంటుందో అంతవరకే వ్యాయామం చేయండి. క్రమేణా పెంపుచేయండి. 'అన్నప్రా
శనలో ఆవకాయ' సామెత ఇక్కడ వర్తించకూడదు. నలభైలు దాదాక పరుగులు
పెట్టటం, జమ్ములకు వెళ్ళటం, ఈతకొట్టటం, సైకిల్ తొక్కటం, ట్రెడ్ మిల్లు మీద నడ
వటం వీటిని కొత్తగా ప్రారంభించే వ్యక్తులు నిపుణుల సలహాతో క్రమేణా శరీరానికి
అలవాటు చేస్తూ ఆచరించాలి.
ఈ డైటింగులూ, వ్యాయామాలూ చాలామంది విషయంలో ఆరంభశూరత్వమే!
మూడ్డాళ్ళ ముచ్చటే! మానసికంగా శ్రమకు, కష్టానికి సిద్ధం కాకపోవడమే ఇందుకు
కారణం. డైటింగూ, వ్యాయామం మొదలు పెట్టిన నెలలో నాలుగైదు కేజీల బరువు
తగ్గుదల ఎవరికైనా కనిపిస్తుంది. అంతలోనే ఏదో అవాంతరం వస్తుంది. తిరిగి మొద
లుపెట్టడానికి బద్ధకం ఆవరిస్తుంది. ఈ లోగా తగ్గిన బరువుకు రెట్టింపు పెరుగు
తారు. మనిషి కడలిక శరీరం పైన చూపించే ప్రభావాన్ని అంచనా వేసే నిపుణుల్ని
Kinesiologists అంటారు. ఈ శాస్త్రాన్ని కైనేసియాలజీ అని పిలుస్తారు. శరీ
రాన్ని అతిగా హింసపెట్టడాన్ని 'స్ప్రింట్' అంటారు. శరీరం తట్టుకోవడాన్ని మించి
స్ప్రింట్ చేయటం వలన మామూలు ఆరోగ్యం దెబ్బతింటుందని ఈ నిపుణులు హెచ్చ
రిస్తున్నారు. కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, తీపి, పులుపు తగ్గించి తింటే స్థూల
కాయం అదుపులోనే వుంటుంది. వరిని తగ్గించి బదులుగా గోధుమ, జొన్న, సజ్జల్ని
కొంత మేర తీసుకుంటూ ఉండండి. నెమ్మదిగా నడవటంతో ప్రారంభించి వ్యాయా
మాలను ఒక్కటొక్కటే అలవాటు చేసుకోండి. మార్పు తప్పకుండా వస్తుంది.
రాత్రికి
రాత్రే మార్పులొచ్చేయాలనే అతి ప్రయత్నం వలన అవకారం జరుగుతుంది.

DALCHINA CHEKKA OUSHADHAME

దాల్చిన చెక్క ఔషధమే!

దాల్చిన చెక్క మాదక ద్రవ్యం కదా! దాన్ని తినాలని ఎలా చెప్తారు?
* మసాలా ద్రవ్యాలలో గసగసాలూ, దాల్చిన చెక్క ఈ రెండింటికీ 'అలవాటు
పడేలా చేసే ఎడిక్షన్ గుణం ఉంది. దాల్చిన చెక్కలో '
కౌమారిన్ అనే మత్తునిచ్చే
రసాయనం ఈ ఎడిక్షనుకు కారణం. అది లివర్ని దెబ్బతీస్తుంది. అలాగే గసగసా
ల్లోంచి నల్లమందు తీస్తారన్న సంగతి అందరికీ తెలుసు. అతిగా మసాలాలు తినే
వారికి ఇది హెచ్చరికే!
వైద్య పరంగా దాల్చినీ ఒక గొప్ప ఔషధం. ఔషధాన్ని ఔషధంగా తీసుకోవాలి.
పరిమితి దాటితే అది అపకారం చేసేదిగా మారిపోతోంది.
దాల్చిన చెక్కలో నిన్న
మాల్డిహైడ్ అనే అహార రసాయన ద్రవ్యం ఉంది. ఇది పేగులలో వచ్చే కొన్ని
రకాల కేన్సర్లను నివారించగలదు. నివారించటం అంటే రాకుండా చేయటం,
సున్నితమైన కండరాలలో వాపుని తగ్గించే గుణం కూడా దీనికి ఉంది. అందువ
లన ముఖ్యంగా కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు ఉన్న వారికి దాల్చిన చెక్క ఔష
ధంగా పనిచేస్తుంది. స్వరపేటిక సంబంధిత వ్యాధుల్లో ఇది ఔషధమే! సంగీతవే
త్తలు దాల్చినీ ముక్కని బుగ్గన పెట్టుకొని రసం మింగుతూ ఉంటే గొంతు
శ్రావ్యంగా ఉంటుంది. రక్తవృద్ధినీ, కళ్లకు కాంతినీ, వీర్య వృద్ధిని కలిగిస్తుంది. నోటి
దుర్వాసనని అరికడుతుంది. దాల్చినీ పంచదార కలిపి నూరిన పొడి జీర్ణకోశవ్యాధుల పైన పనిచేస్తుంది.
మైగ్రేన్ తలనొప్పిని కూడా తగ్గి
స్తుంది. పేగుపూత, అమీబి
యాసిస్, కామెర్లు లాంటి
| వ్యాధులున్న వాళ్లు దాల్చిన
చెక్కని ఔషధంగా తీసు
కుంటే మేలు చేస్తుంది.
దాల్చినీ, ఏలకులతో
సార్ణచందు
కాచిన టీ రుచికరంగా కూడా ఉంటుంది. కాఫీ, టీలను
మానాలనుకొనే వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. క్షయ
వ్యాధిలోనూ, క్షీణింపచేసే వ్యాధులలోనూ దాల్చిని గొప్ప ఔషధం అని తేలింది.
ముందే ముంచుకొచ్చే వృద్ధాప్యాన్ని నివారించి అల్జిమర్స్ అనే మతిమరుపు
వ్యాధిని ఇది తగ్గించగలదని 2011లో పరిశోధనలు చెప్తున్నాయి.
ఔషధ ప్రయోజనాలున్న ఆహార ద్రవ్యంగా దాల్చిని చెక్కని పరిమితంగా తీసు
కుంటూ ఉంటే ఆరోగ్యం దాల్చినట్టే!

AJEERTHI NI ILA JAYINCHANDI

?
ఆజీర్తిని ఇలాజయించండి
విజయ కె.(ఒంగోలు)
| తరుచూ అజీర్తి, ఉబ్బరం, గ్యాసూ వస్తున్నాయి.
ఏవైనా ఉపాయాలు చెప్తారా?
* అజీర్తి సర్వసాధారణ లక్షణం. ఆహారపు అలవాట్లు,
జీవించే విధానం, రోజువారీ అలవాట్లే అజీర్తికి కారణమౌతాయి.
అజీర్తి వలనే కడుపు ఉబ్బరం, గుండెలో మంట, వాంతి, వికారం, విరేచ
నాలు, కొద్ది ఆహారానికే కడుపు నిండిపోవటం, భుక్తాయాసం, కడు
పులో మంట, గ్యాసు వస్తుంటాయి. వేళాపాళాలేని ఆహార అల
వాట్లు, కష్టంగా అరిగే పదార్థాలు, అన్నం తిన్న వెంటనే మంచం
ఎక్కటం, పొగత్రాగటం, మద్యపానం, గుట్కాలు, కొన్ని రకాల
మందులు కూడా అజీర్తికి కారణాలే!
అజీర్తి అనిపించిన వెంటనే కొన్ని రోజులపాటు తేలిగ్గా
డా.జి.వి.పూ
అరిగే వాటిని, జీర్ణశక్తిని పెంచే వాటిని తీసుకుంటూ కడుపులో
అగ్ని బలాన్ని పెంచే ప్రయత్నం చెయ్యాలి! ఎక్కువకాలం అజీర్తిని కొనసాగిస్తే, జీర్ణా
శయ వ్యవస్థ ధ్వంసం అవుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ అంటే గొంతులోకి ఆమ్లాలు ఎగ
జిమ్మే వ్యాధి, పేగుల్లో కేన్సర్, పేగుపూత, లివర్ వ్యాధుల్లాంటివి దీనివలన కలుగు
తాయి. కీళ్ళవాతం, ఎలర్జీ వ్యాధులు, ఇంకా అనేక
రోగాలకు అజీర్తి తలుపులు తెరు
స్తుంది.
అజీర్ణహర చూర్ణం
గింజ తీసిన కరక్కాయ బెరడు,
దానికి సమానంగా
పిప్పళ్ళను, సౌవర్చలవణం లేదా సైంధవలవణం ఈ
మూడింటినీ మెత్తగా దంచిన పొడి అరచెంచా మోతా
దులో తీసుకుని గ్లాసు మజ్జిగలో కలుపుకుని తాగితే
అజీర్తి బాధలు తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది.
ఇలాంటిదే ఇంకో ఫార్ములా కూడా ఉంది. సైంధవల
వణం, కరక్కాయ బెరడు, పిప్పళ్ళు, వాము, శొంఠి వీటి
న్నింటినీ మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరచుకోండి. కడుపులో బాగోలేదనిపించి
నప్పుడు, అజీర్తికరమైనవి తిన్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడూ ఈ పొడిని అర
చెంచా మోతాదులో గ్లాసు మజ్జిగలో కలిపి తాగండి. పొట్ట బాగౌతుంది.
అష్టగుణమండం
ఇంగువ, సైంధవలవణం, ధనియాలు, బిరియాని ఆకు ముక్కలు, శాంతి,
పిప్పళ్ళు, మిరియాలు....వీటిన్నింటినీ సమభాగం తీసుకుని మెత్తగా దంచిన పొడిని
ఒక సీసాలో భద్రపరచుకోండి. బియ్యంలో సగం చాయ పెసర పప్పు తీసుకుని నీరు
ఎక్కువగా కలిపి జావలాగా కాయండి. ఒక మనిషికి సరిపడిన జావలో ఈ పొడిని
ఒకటి లేదా ఒకటిన్నర చెంచా మోతాదులో కలిపి కాచి దింపండి. ఇది అజీర్తిని
తగ్గించే గొప్ప ఔషధం. రోజూ తాగినా మంచిదే!
వంటింటి వైద్యం
అజీర్తి కారణంగా వచ్చే కడుపునొప్పి తగ్గడానికి ఒకటి లేదా రెండు వెల్లుల్లి
గర్భాల్ని నమలకుండా మింగేయండి. ఫలితం కనిపిస్తుంది. మసాలాల్లో వెల్లుల్లి తిన
నివాళ్ళు దీన్ని ప్రయోగించుకోవచ్చు. ఒక చెంచా నేతిలో చిటికెడు ఉప్పు వేసి
కాయండి. భోజనం చేసిన తరువాత కడుపులో నొప్పి వస్తున్న వారికి ఈ ఉప్పు
వేసిన నేతిని మొదటి ముద్దగా కలిపి పెడితే నొప్పి తగ్గుతుంది.
వసకొమ్ముని దంచిన పొడి చిటికెడు తీసుకుని చిక్కని బ్లాక్ టీలాగా కాచుకుని
తాగితే అజీర్తి తగ్గుతుంది. కఫం తగ్గుతుంది. జ్వర తీవ్రత తగ్గుతుంది. విషదోషా
లకు విరుగుడుగా పనిచేస్తుంది. మలబద్ధకాన్ని హరిస్తుంది. మొలలున్న
వారికి ఉపశాంతినిస్తుంది. కడుపులో నులిపురుగులు పోగొడుతుంది. దగ్గు,
ఆయాసాల్ని తగ్గిస్తుంది.
బిరియానీ ఆకు (ఆకుపత్రి) పొడిని మజ్జిగలో వేసుకుని తాగితే,
మలబద్ధత, కడుపులో నొప్పి, పైత్యం తగ్గుతాయి. బాలింతలకు తల్లి
పాలు పెరుగుతాయి. కడుపులో వాతం, గ్యాసూ, ఉబ్బరం, దుర్గం
ధంతో కూడిన అపాన వాయువులు, విరేచనాలు ఆగుతాయి. నోటి
దుర్వాసన పోతుంది. అన్నానికి బదులుగా బియ్యపు నూకను
దోరగా వేయించి చిక్కగా కాచిన జావలో తగినంత ఉప్పు,
కార్ణచందు
మిరియాల పొడి వేసుకుని తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
బార్లీ జావ, సగ్గుబియ్యం జావ, పేలాలు, మరమరాలు (బొరుగులు) ఇలాంటివి జీర్ణ
శక్తిని కాపాడతాయి. అజీర్తిగా ఉన్నప్పుడు ఇలాంటి వాటితో కడుపు నింపుకోవడం
మంచిది. షుగరు వ్యాధి ఉన్న వారికి జొన్న పేలాలు, జొన్న అటుకులు చాలా మేలు
చేస్తాయి.
పెసర పప్పులో నీళ్ళు ఎక్కువ పోసి కాచిన కట్టులో
మిరియాలు పొడి కలుపుకుని అన్నం తింటే అజీర్తి తగ్గు
తుంది. లేత ముల్లంగి దుంపల జ్యూసు రోజూ ఉదయం
పూట తాగుతూ ఉంటే పేగులకు ప్రశాంతం నిచ్చి జీర్ణశ
క్తిని పెంచుతుంది.
కొత్తిమీర రసాన్ని ఒక చిన్న గ్లాసులో తీసుకొని
అందులో ఉప్పు, మిరియాలపొడి తగినంత కలిపి,
రోజూ
ప్రొద్దున పూట తాగుతూ ఉంటే అజీర్తి పటాపంచల్
తుంది. పైత్యం, కడుపులో యాసిడ్, పేగుపూత వ్యాధుల్లో
మంచిది. కొత్తిమీర మిరియాలపొడి మిశ్రమాన్ని మెత్తగా నూరి కారప్పొడిలాగా
అన్నంలో తినవచ్చు.
ఉసిరికాయ తొక్కుడు పచ్చడి (నల్లపచ్చడి)లో అల్లం, పసుపు కలిపి నెయ్య వేసు
కుని ఒకటి లేక రెండు ముద్దలు అయ్యేట్లుగా రోజూ తింటే శరీరంలో విషదోషాలు
నెమ్మదిస్తాయి. పైత్యం, అజీర్తి ఎక్కువగా ఉన్నప్పుడు, పెరుగన్నంలో దానిమ్మ
గింజలు కలుపుకుని తింటే ఉపశమనంగా ఉంటుంది.
ఒక్కోసారి పేగుల కదలిక (పెరష్టాలిసిస్) కు కారణమయ్యే కండరాలు బిగుసు
కుని అజీర్తి కలగవచ్చు. అందుకనే మన పూర్వులు అజీర్తి రాకుండా తరచూ విరేచ
నాలకు వేసుకునే వాళ్ళు. విరేచనాల మందు పేగులను బాగా కదిలేలా చేస్తుంది.

Saturday 21 May 2016

MAMIDI PANDU VEDI CHESTHUNDHA ?


మామిడిపండ్లు తింటే వేడి
చేస్తుందని, ఒళ్లంతా సెగ్గ
డ్డలు వస్తాయని అంటుంటారు కదా... అది నిజమేనా. మధు
మేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లు తినవచ్చా?

సంస్కృతంలో మామిడికి అనేక పర్యాయపదాలు ఉన్నాయి.
ఆమ్ర, రసాల, సహకార, అతిసౌరభ, కామాంగ, చూతక,
మంజరీ మొదలైనవి. మామిడిపండ్లు రెండు రకాలు. మొదటివి
చెట్టుకు పండినవి. రెండోవి ముదిరిన కాయలను ఎండుగడ్డిలో
పదిలపరచి, వేడిమి ద్వారా ముగ్గబెట్టినవి. (గమనిక : కార్బైడు
వంటి రసాయనాల ద్వారా ముగ్గిస్తే మాత్రం అది విషతుల్యం.
అది సహజంగా ముగ్గబెట్టిన రెండో కోవలోకి రాదు).
సహజంగా సక్రమంగా ముగ్గబెట్టిన 'పండు' (కృత్రిమ పక్వ
ఫలం) గుణాలు : చాలా తియ్యగా ఉంటుంది (మధుర
రసం). చలవ చేస్తుంది (శీతవీర్యం), తేలికగా జీర్ణ
మవుతుంది (లఘువు). మలవిసర్జన సాఫీగా
అయ్యేలా చేస్తుంది (సరం). బలకరం. వీర్య
వర్థనం (శుక్రకరం). మొత్తం పండు తింటే
దీనివల్ల కలిగే ఫలం, ఫలితం కనిపిస్తాయి.
అదే పిండి కేవలం రసం మాత్రమే స్వీక
రిస్తే ప్రయోజనాలు తగ్గుతాయి. అలా
రసం మాత్రమే తీసుకుంటే కాస్త ఆల
స్యంగా జీర్ణమవుతుంది (గురువు). వాత
హరం. కఫకరం.
చెట్టుకు పండిన పండు : దీంట్లో తియ్యదనంతో
పాటు కొంచెం పులుపు కూడా ఉంటుంది (అమ్లరసం).
కాబట్టి పిత్తాన్ని వృద్ధి చేసి కొంచెం వేడిచేస్తుంది. వాతహరం.
పూర్తిగా మగ్గని పండు అమ్లరసంతో కూడి, ఉష్ణవీర్యమై, మలవి
సర్జనకు సహకారం అందించదు. కాబట్టి ఎలా పండినదైనా
వాటిని అతిగా తింటే అనర్ధమే.
శ్లోకం : "తదేవ వృక్షసంపర్వం గురు
వాతహరపరం మధురామరసం కించిత్ 
భవేత్ పిత్త ప్రకోపనం: ఆమ్రం కృత్రిమ 
పక్వంచ తత్ భవేత్ పిత్తనాశనం... ,
చూపితం తత్పరం రుచ్యం. బల్యం.

వీర్యకరం లము...

పక్వంతు మధురం వృష్యం సిద్ధం

బల సుఖ ప్రదం... హృద్యం, వర్ణం"
కాబట్టి మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా వేసవి
రాజ ఫలమైన మామిడిపండును ఆస్వాదించండి. ఒకవేళ పుల్లని
మామిడి పండ్లను తిన్నట్లయితే, వెంటనే అరచెంచాడు జీలక
గ్రను నమిలి తినండి. లేదా మూడు గ్రాముల శుంఠి చూర్ణాన్ని
తిని వేడినీళ్లు తాగండి. దుర్గుణాలకు ఇది విరుగుడుగా
పనిచేస్తుంది. ఇది పండ్లను అధికంగా తినడం వల్ల
కలిగే అనర్థాలకు కూడా విరుగుడుగా పని
చేస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు: తియ్యటి
పండ్లను ఒకపూట ఆహారంగా నిర్భయంగా
తినవచ్చు. అన్నం,
రొట్టెల వంటి ఆహారంతో
పాటు తినవద్దు. సాధారణంగా మధుమేహ
రోగులు పాటించే ఆహార విహార (వ్యాయా
మం, ప్రాణాయామం, తగినంత నిద్ర మొదలై
నవి) నియమాలను పాటిస్తూ, వ్యాధి తీవ్రతను
బట్టి వాడే మందులను వాడుకుంటూ, ఒకరోజు
మొత్తం మీద తీసుకోవాల్సిన ఆహారంలో భాగంగా మామిడి
పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. అప్పుడది వాతకరం
కాదు. కాబట్టి మధుమేహానికి వ్యతిరేకం కాదని ఆయుర్వేద
సిద్ధాంతం.