Monday 21 November 2016

శాఖాహారం మేలు చేస్తుంది.

పళ్ళు, కూరగాయలే ఎందుకు తినాలి?
మాంసంలో లేని ప్రత్యేకతలు కూరగాయల్లో
ఉన్నాయా?
* మనం పళ్ళు కూరగాయలు ఎందుకు తినా
లంటే వాటిలో సూక్ష్మ పోషకాలు నిలవుంటాయి
కాబట్టి, లవణాలు, ఖనిజాలు అతి కొద్ది మోతా
దులో మనిషికి ఆజన్మాంతం అవసరమౌతాయి.
కోబాల్ట్, క్రోంఇయం, రాగి, అయొడిన్, మ్యాంగ
నీసు, జింక్ లాంటి ఖనిజాలు, ఇంకా ఇతర విట
మిన్లు ఎక్కువగా రోజుకు 100 మి.గ్రా, మోతాదు
వరకూ అవసరం అవుతాయి.
పోషకాలు:
తక్కువ మోతాదులో ఎక్కువ శక్తిదాయకమైన
వీటిని సూక్ష్మ పోషకాలంటారు. ఇవి పళ్ళలోను,
కూరగాయల్లోను అత్యధికంగా ఉంటాయి. పీచు
పదార్థాలు, పిండిపదార్ధాల్లాంటి స్థూల(మక్రోపోష
కాలంటారు. ఇవి ఎక్కువ మోతాదులో శరీరానికి
అవసరం అవుతాయి కాబట్టి వీటికా పేరు వచ్చింది.
ఇవి కాక శరీరం తన పనిని తాను సమర్థవంతంగా
చేసుకునేందుకు కావలసిన పోషకాలను మొక్కలు
మాత్రమే మన శరీరానికి అందిస్తాయి. వీటిని
'పైటోన్యూట్రియంట్స్' అంటారు. ఇవి మొక్కల్లో
ఫంగస్ లాంటి చీడ పట్టకుండా కాపాడే రక్షణ
యంత్రాంగానికి సంబంధించినవి. మొక్కలకు
సంబంధించిన వాటిని ఆహారంగా తీసుకున్నప్పుడు
ఈ రక్షక రసాయనాలు పూర్తిస్థాయిలో మనకు
అందుతాయి.
కేవలం మాంసాహారం మీద ఆధారపడితే ఇవి
చాలినన్ని అందకుండా పోతాయి.
కాషాయం రంగు కూరగాయలు:
పిల్లల్లో కంటి చూపు పెరగడానికి, చర్మం
మృదుత్వం, లావణ్యం పొందడానికి, వ్యాధి నిరో
ధక శక్తి పెరగడానికి ఏ విటమిని అవసరంఅవు
తుంది. కేరట్లు, టమోటాలు, చిలకడదుంపలు,
బొప్పాయి, మామిడి పండు లాంటి ఎరుపు రంగు
కలిగిన పండ్లు, కాయగూరల్లో కెరటోనాయిడ్స్ అనే
పోషకాలు శరీరానికి రక్షణ కలిగించే ద్రవ్యాలను
బాగా అందిస్తాయి.
సివిటమిన్:
టమోటాలాంటి
కూరగాయల్లోనూ,
జామ అరటి లాంటి
పండ్లల్లోనూ ఉండే 'సి
విటమిన్ పూర్తిస్థాయిలో
మనం ఉపయోగించుకో
లేకపోతున్నాం. వాటిని అధిక ఉష్ణోగ్రత దగ్గర
వండటం కారణంగా సి విటమిన్ ఎగిరిపోతోంది.
చారు, సాంబారు, పప్పుచారు, కలగూర పప్పు
లాంటివి వండినప్పుడు పొయ్యి మీంచి దించబోయే
ముందుటమోటా రసం కలపటం మంచిది. సివిట
మిన్ని అతిగా వండితే త్వరగా ఆవిరైపోతుంది.
అందువలన కూర రుచి కూడా దెబ్బతింటుంది. ని
విటమిన్ ఎక్కువగా కలిగిన పండ్లను, కాయగూర
లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వాటిలోని
ఇనుముకు సంబంధించిన ఫోలిక్ యాసిడ్ అనేది
శరీరానికి బాగా వంటబడ్తుంది.
పీచుపదార్ధాలు:
కాయగూరల్లోనూ, ఆకు కూరల్లోనూ అధి
కంగా ఉండే పీచుపదార్థాలు జీర్ణశక్తిని పెంచు
తాయి. పేగులను బలసంపన్నం చేస్తాయి. రోజూ
కాలవిరేచనం అయ్యేలా చేస్తాయి. పేగుల్లో కేన్సర్
లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా కాపాడ
తాయి. పీచుపదార్థాలతో నిండిన ఆహారం తీసుకు
న్నప్పుడు కొవ్వు పదార్థాలు, పంచదార పదార్థాలు
- రక్తంలోకి ఎక్కువగా చేరకుండా అని అడ్డుకుం
దాయి. ఆ విధంగా స్థూలకాయం, షుగరు వ్యాధుల్ని
5 అదుపులో పెట్టడానికి పీచుపదార్థాల అవసరం
ఎంతైనా ఉంది.
కూరల్ని ఇలా వండాలి:
కూరల్ని అతిగా చింతపండు, అల్లం, వెల్లుల్లి
మసాలాలు వేయకుండా వండుకుంటే కూర ఎక్కు
వగానూ, అన్నం తక్కువగానూ తినటం సాధ్యం
అవుతుంది. ఏ కూరగాయనైనా నూనెలో బాగా
వేయిస్తే ఆ కూరగాయ ప్రబావం సగం చచ్చిపో
తుంది. పోషాకాలు మాడి పోతాయి. అతిగా
వేగడం వలన అందులో కేన్సర్ కారకమైన ఆకీల
మైడ్ అనే విషరసాయనం పుడుతుంది. ఈ సంగతు
లను గమనించి కూరగాయలను మందాగ్ని మీద
తేలికగా ఉడికించుకుని కూరలు తయారు చేసుకో
వాలి.
మాంసానికి ప్రత్యామ్నాయం?
మాంసాహారానికి ప్రత్యామ్నయంగా కూరగా
యలను, పప్పుధాన్యాలను, తీసుకోవచ్చు. కానీ
- కూరగాయలకు మాంసాహారం ప్రత్యామ్నాయం
కానే కాదు. కూరగాయల్లోని పోషకాలు తేలికగా
అరిగే స్వభావాన్ని కలిగి ఉంటాయి.
ఇటీవల కాలంలో పనస ముక్కల పలావ్,
దొండకాయ టిక్కాలాంటి వంటకాలు మాంసాహా
రాన్ని వండే పద్ధతిలో కూరగాయల్ని ఎక్కువగా
వండుతున్నారు. ముఖ్యంగా విందు భోజనాల్లో కేట
రర్లు ఇలాంటి వంటకాలను సృష్టిస్తున్నారు. అక్కడ
తిని, ఇంట్లో కూడా అలాంటివే వండుతూ ఆహా
రాన్ని విషతుల్యం చేసుకుంటున్నాం. కొద్దిపాటి వేడి
మీద కొంచెంసేపు ఉమ్మగిలనిస్తే కూర తినడానికి
రుచిగానూ, ఆరోగ్యదాయకం గానూ ఉంటుంది.

Saturday 5 November 2016

తిప్పతీగ - ఆయుర్వేదం

తిప్పతీగ తో ప్రయోజనాలు.

తిప్పతీగ పేరును బట్టే ఇది లత అని అర్థమవుతుంది.
సన్నటి కాండంతో వేరొక చెట్టు మీదగానీ లేదా దేనినైనా
ఆసరా చేసుకుని, చుట్టుకుని పాకే మొక్క. దీని ఆకులు ఇంచు
మించు తమలపాకుల ఆకారంలో (గుండె ఆకారంలో)
ఉంటాయి. బెరడు నూగు (ధూళి)పూసిన ఆకుపచ్చరంగులో
ఉంటుంది. బెరడు అంతా కంతులు కలిగి ఉంటుంది. వేసవిలో
పువ్వులు, శీతాకాలంలో పండ్లు ఉంటాయి. ఈ పండ్లు చిన్నగా,
ఎర్రగా ఉంటాయి. వృక్షశాస్త్రంలో దీని పేరు 'టైనోస్పోరా కార్డి
ఫోలియా'. దీనికి 'అమృత, గుడూచీ, చక్రాంగీ, మధుపర్డీ'
అనే పర్యాయపదాలుంటాయి. హిందీలో 'గిలోయా'
అంటారు. దీని రుచి చేదు, కారంగా ఉంటుంది.
ఔషధ గుణాలు : ఇది వాత, పిత్త, కఫ వికారాలన్నింటినీ
తగ్గిస్తుంది. అన్ని రకాల జ్వరాలనూ తగ్గిస్తుంది. ఆకలి
పుట్టించి, జీర్ణక్రియను పెంచుతుంది. అమ్మపిత్త (ఎసిడిటీ)
వికారాన్ని పోగొడుతుంది. వాంతులు, దప్పికను తగ్గిస్తుంది.
రక్తశుద్ధి చేసి చర్మరోగాలను దూరం చేస్తుంది. శరీర భాగాల్లోని
మంట, మూత్రంలో మంట, దగ్గు, కీళ్లనొప్పుల వంటి వివిధ
బాధలను తగ్గిస్తుంది. రక్తహీనతను పోగొడుతుంది. హీమోగ్లో
బిన్ ను పెంచుతుంది. నీరసాన్ని పోగొడుతుంది. మూలశం
కను కూడా తగ్గిస్తుంది. మధుమేహ నివారణ, చికిత్సలకు ఉప
యోగపడుతుంది.
భావప్రకాశ : దోషత్రయామ తృట్ దాహమేహకాసాంశ్చ
పాండుతాం: కామలా కుష్ట వాతాస్త్ర జ్వరకృమి
వమీన్ హరేత్ ..... హృద్రోగవాతనుత్"
వాడుకునే విధానం : దీని ఆకులు, పువ్వులు, పండ్లు,
కాండం, దుంప... అన్నీ ఉపయోగకరమే.
స్వరసం ( పసరు) : పైన చెప్పిన భాగాలలో లభ్యమైనవా
టిని పరిశుభ్రంగా నీటితో కడిగి, పచ్చివాటిని దంచి స్వరసం
తీయాలి.  ఒకటి రెండు చెంచాల మోతా
దులో తేనెతో రెండుపూటలా సేవించాలి.
చూర్ణం: లభించిన భాగాలను బాగా
ఎండబెట్టి పొడి చేయాలి. మోతాదు :3
నుంచి 5 గ్రాములు నీటితో లేక తేనెతో
రెండుపూటలా సేవించాలి. చూర్ణాలను
తయారు చేసి ఆరు నెలల లోపు వాడుకో
వాలి.
కషాయం: లభించిన భాగాలను
పచ్చివిగానీ, ఎండువిగానీ లేక చూర్ణాన్ని
గానీ ఉపయోగింయచి కషాయం
తయారు చేసుకోవాలి (పది గ్రాముల
ద్రవ్యానికి సూమారు 120 మిల్లీలీటర్ల
నీటిని కలిపి, నాల్గవ వంతు మిగిలేవరకు
మరిగించి, వడగట్టుకోవాలి. (మోతాదు
ఐదారు చెంచాలు (3మి.లీ.)
రెండు పూటలా ఖాళీ కడుపున
తాగాలి.
సత్వం : దీన్నే సత్తు
అంటారు. ఈ ద్రవ్యానికి
సంబంధించి తిప్పసత్తు. లభిం
చిన భాగాలన్నింటినీ, పచ్చివా
టినీ, పరిశుభ్రంగా కడిగి,
బాగా దంచి, నీటిలో 12
గంటల పాటు నానబెట్టి, ఆ


తర్వాత, పైన తేలిన నీటిని పారబోసి, అడుగున ఉన్న
ముద్దను, నీడలో ఆరబెట్టాలి. అప్పుడు మెత్తగా
నూరితే 'సత్వం' తయారువుతుంది. ఇది ఎంతకా
లమైనా నిల్వ ఉంటుంది. మోతాదు -1-3
గ్రాములు తేనెతోగానీ, నీటితోగాని రెండుపూ
టలా సేవించాలి.
అమృతారిష్ట (ద్రావకం): ఇది ఆయుర్వేద
మందుల షాపులలో లభిస్తుంది. 'ఆసవ, 'ఆరిష్ఠ
రూపంలో మందుల్ని తయారు చేయడం ఇళ్లలో
సాధ్యం కాదు. ఫార్మశీలలో తయారు చేయాలి.
మోతాదు : 3 లేక 4 చెంచాలకు సమానంగా నీళ్లు
కలిపి మూడు పూటలా తాగాలి.
గమనిక : . ఈ లతను ఇళ్లల్లో, పెరళ్లలో లేదా
కుండీలలో పెంచుకోవచ్చు. ఈ వ్యాధులను బట్టి
దీనితో పాటు ఇతర మూలికల్ని కూడా కలుపు
కొని వాడతారు.


ఆస్త్మా - ఆయుర్వేదం

ఆస్తమా అంటే స్వేచ్చలేని శ్వాస. దీని బారిన పడిన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆలర్జీ రియాక్షన్
ద్వారా శ్వాసకోశాలు, ఊపిరితిత్తుల్లో గాలి చేరటాన్ని అడ్డుకుని శ్వాస పీల్చడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ
మహమ్మారి కారణంగా ప్రతి ఏడాది 2.5 లక్షల మంది మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఆస్తమాను ఆయుర్వేద వైద్య విధానంతో నయం చేయొచ్చు.
లక్షణాలు: ఆస్తమా బాధితుల్లో ఉబ్బసం వచ్చినప్పుడు శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసినప్పుడు గురక రావడం,
ఛాతీ బిగుతుగా ఉండి నొప్పిగా ఉండడం, కడుపు ఉబ్బరం, గడ్డం దగ్గులు, గొంతులో దురద, రాత్రివేళ
తరుచుగా దగ్గు రావడం, జలుబు, గుండె శరీరంలో బరువుగా ఉండడం, శ్లేష్మం ఎక్కువగా ఉండడం,
నడిచేటప్పుడు ఆయాసం,
రొప్పడం, నాడి వేగంగా కొట్టుకోవడం, నిద్రలేమి, కళ్ల దిగువన నల్లని చారలు,
చెమట పట్టడం, వినికిడి కష్టంగా ఉండడం, ఆందోళన తదితర లక్షణాలు ఉంటాయి.
కారణాలు: సహజమైన అలర్జీ, దుమ్మూదూళి ద్వారా ఆస్తమా వ్యాపిస్తుంది. బొద్దింకలు, పొగతాగడం, పీల్చడం
వల్ల కూడా సంక్రమిస్తుంది. వంశపారంపర్యంగా కూడా దీని బారిన పడతారు. బాల్యంలో శ్వాసకోశ
వ్యాధులు, వాతావరణ జీవరసాయన ప్రక్రియలు, హార్మోన్లలో మార్పులు మహిళల్లో), ఆహార విధానాలు,
వాతావరణ మార్పులు, జీర్ణకోశవ్యాధులు, ఆస్పిరిన్, నాన్ సైరోయిడల్ డ్రగ్స్ వాడడం, జంతు చర్మాలు, గడ్డి,
పుప్పొడి, దూళిరేణువులు, జీర్ణవాహికలో రుగ్మతలు కూడా ప్రధాన కారణాలు
ఇతర పరిణామాలు
ఆస్తమా బారిన పడిన వారిలో జీవన ప్రమాణం తగ్గడం, 80-90శాతం మందిలో శ్వాసకోశ నాళాలు
స్తంభించిపోవడం, గర్భిణుల్లో రక్తపోటు, మధుమేహం, రక్తస్రావ సమస్యలు, శిశువుల్లో బరువు తగ్గడం,
శ్వాసకోశ ఇబ్బందులు, హృద్రోగాలు, ఊపిరితిత్తుల్లో గాలి బయటకు రావడం, చర్మం పెలుసుగా మారడం,
ఎముకలు గుళ్లబారిపోవడం, చర్మ వ్యాధులు తదితర పరిణామాలు
చోటు చేసుకుంటాయి.
V
నిర్ధారణ పరీక్షలు
బ్రాంకియల్ ప్రొవోకేషన్
పల్మనరీ ఫంక్షన్
సీటీ స్కాన్
బోన్ డెన్సిటీ టెస్ట్
బోన్ స్కాన్
• స్పిరోమెట్రీ నిర్ధారణ

బ్రాంకో స్కోప్

• స్వీట్ టెస్ట్ (సిస్టిక్ ఫైబ్రోసెస్)

-ఎలర్జీ టెస్ట్
చికిత్స
ఆయుర్వేదంలో మూలికా వైద్యం, సహజ ప్రకృతి చికిత్స, ఆహార నియమాల నియంత్రణ ద్వారా ఉబ్బసాన్ని
తగ్గించొచ్చు.
- కొన్ని లవంగ మొగ్గలు అరటిపండు తొక్కలో ఉంచాలి. రాత్రంతా అలాగే ఉంచి పొద్దున్నే పరిగడుపున
తేనెతో తీసుకుంటే ఊపిరితిత్తులు బలోపేతమవుతాయి.
ఫైబ్రిఫ్యూజ్ (నేలములకు, ఎల్లో బెర్రీడ్ నైట్ షేడ్ మొక్క లేదా చోటికెటారీ(సోలనేమ్ సురటెన్స్ బర్న్) మొక్కను
పూర్తిగా కషాయంగా చేసి రోజుకు 7 - 14 మి.లీటర్ల చొప్పున రెండుపూటలా సేవిస్తే జలుబు, దగ్గు,
ఉబ్బసం తగ్గుతుంది.
ట్రైలిస్పెర్మం (ఇజీవాన్), తులసి, మిరియం, అల్లం టీ, కషాయం సేవిస్తే ఉబ్బసంతో ఉపశమనం కలుగుతుంది.
పంచకర్మతో ఉపశమనం కలుగుతుంది.
• శ్వాశారిరసం, అబ్రకభస్మ ప్రవలపిష్టి, త్రికూటచూర, తోస్తాది చూర్ణం(వైద్యుని సలహా మేరకు) తేనెతో 1
గ్రాము తీసుకుంటే ఉబ్బసం నుంచి ఉపశమనం కలుగుతుంది.
లక్ష్మీ విలాసరసం, సంజీవని మాత్రలు కూడా ఉపశమనం కలిగిస్తాయి.
టీ స్పూన్ పరిమాణంలో శ్వాసారి క్వాత్, ములేరిక్వాత్ తీసుకోవాలి. 400మి. లీటర్ల నీటిలో కలిపి 100
గ్రాములు అయ్యేవరకు బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, మధ్యాహ్నం సేవిస్తే ఉపశమనం
కలుగుతుంది.
పసుపు, లవంగం, ఆల్జీజియా రెబ్బక్ మూలిక, బే బెర్రీ పొడి. ఎపిడ్రా, అర్జున బెరడు శీతాది చూర్ణ.
మధురం(లిక్వోరైస్), యష్టిమధు, బొర్సె పొడి, తేనె మిశ్రమం కూడా ఉపయోగపడుతుంది.
• కరక్కాయ చెబులిక్ మైరోబలన్) నమలడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుంది.
-మిరియాలు, తేనె, ఉల్లిరసం, కలిపి తాగితే శ్వాసకోశంలో ఇబ్బంది తగ్గుతుంది.
వాయు, పుష్కర మూలం, ముల్లన్, జనజవైన్, నల్ల మిరియాలు, అవిసెగింజలు, అల్లం, మన్నా మిల్
(లోహబాన్) తదితర మూలికలు ఉపయుక్తంగా ఉంటాయి.
శ్వాసకోశనాళాలు కుచించుకుపోవడాన్ని ఎఫ్రిండ్రా, సినికా ఆరికడతాయి.
ఆహార నియమాలు
ఆహారాన్ని నమిలి మింగాలి. కడుపునిండా భోజనం చేయొద్దు. ఆకుకూరలు, తాజా పండ్లు తీసుకోవాలి. ఉల్లిని
ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మజాతి పండ్లలో విటమిన్-సీ ఉంటుంది. రోగ నిరోధక శక్తిని ఇది
పెంచుతుంది. ఆస్తమా వ్యాధి గ్రస్తులు శాఖాహార భోజనం చేయడం మంచిది. విటమిన్-ఏ ఉండే కూరలు
తినాలి. ఎమినోఏసిడ్స్, ఒమేగా-3 వల్ల శ్వాసకోశ నాళంలోని మంట తగ్గుతుంది. ఉబ్బసాన్ని నివారిస్తుంది.
తులసి చాలా మంచి ఔషధం పసుపు లేని అల్లం, మిరియాలు తరుచుగా తీసుకోవాలి. పిండిపదార్థాలు,
ప్రొటీన్లు, కొవ్వుపదార్ధాలు తక్కువగా తీసుకోవాలి. మాంసం, గుడ్లు, చేపలు, చాక్లెట్లు, ఫుడ్ ప్రెజర్వేటివ్స్
ఆసాని పెంచే కారకాలు రోజూ 10-12 గ్లాసులు నీళ్లు తాగాలి బాడీ లోషన్స్, షాంపోలు, డియోడరెన్స్,
షేవింగ్ లోషన్స్ వాడొద్దు.






Wednesday 2 November 2016

ఆపరేషన్ చేయించుకునే ముందు




Pillalaku ఇంజక్షన్ అంటే భయం ఉన్నట్టే
పెద్దవాళ్ళకు ఆపరేషన్ అనేసరికి అదే మోస్తరు
భయం కలుగుతుంది.
“మీకు ఆపరేషన్ చేయాలి' అని వైద్యుడు చెప్పగానే
ఇంజక్షన్‌కి భయపడిన పిల్లాడిలా వెంటనే బిగ్గరగా ఏడుపు
అందుకోకపోయినా మనసులో అంతకురెట్టింపు భయం,
ఆందోళనలకు గురవుతారు. ఆక్షణంలో కలిగే మాన
సిక ఒత్తిడి అనుభవిస్తేగాని తెలియదు.
మిగిలినవాళ్ళకు ఎంతో ధైర్యం చెప్పినవారు కూడా
తమదాకా వచ్చేసరికి ఆపరేషన్ టేబుల్ మీద ఏమవు
తుందో, తిరిగి ఆరోగ్యంతో బయటకు రాగలుగుతానా,
ఆపరేషన్ ఫెయిల్క్అయితే ఎలా అనేటువంటి అనేక
సందేహాలతో సతమతమవుతారు.
ఎంతో సింపుల్ ఆపరేషన్లని చెప్పేకుటుంబనియం
త్రణ ఆపరేషన్క తాముభయపడి భార్యల్నిముందుకు
-నెట్టిన మగవాళ్ళు ఎందరో ఉన్నారు. ఇలాంటి ఇబ్బంది
కర మానసిక పరిస్థితి నుండి బయటపడాలంటే తమ
కున్న ఆరోగ్య పరిస్థితిగురించి, ఆ అనారోగ్యానికి అందు
బాటులో ఉన్న ప్రత్యామ్నాయ చికిత్సల గురించి రోగి
తప్పనిసరిగా వైద్యుని అడిగి తెలుసుకోవాలి.
»వైద్యులు మారారు
నేటి వైద్యులకు అంతగా తీరిక ఉండడం లేదు.వర
సగా వస్తున్న పేషెంట్లను గబగబా చూసి పంపటంలో
ఒక్కొక్కరోగితో ఎక్కువసేపు మాట్లాడటం లేదు.
కుటుంబ ఆరోగ్య చరిత్ర గురించి తెలుసుకుందా
మనుకునే వైద్యులు బహుతక్కువ. ఎక్కువశాతం 'క్లిని
కల్' పరీక్షల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా
అనారోగ్యం అంచనావేసి హడావుడిగా ఆపరేషన్ బల్ల
ఎక్కిస్తున్నారు. తమ ఆసుపత్రిలో ఉన్న సామాగ్రికి
పని కల్పించేందుకు ఆపరేషన్లు చేస్తున్నారో లేక ఆపరే
షన్ల ప్రాక్టీసుకోసం పేషెంట్లను వాడుకుంటున్నారో
అర్థంకాని పరిస్థితి నేడున్నది.
పైగా నిలువుదోపిడీ చేస్తున్న వైద్యులు చాలామంది
ఉన్నారు. ఆ మధ్య జాతీయస్థాయిలో జరిగిన
ఒక సర్వేలో మనదేశంలో హిస్ట్రక్టమీ (గర్భసంచీ
తొలగింపు) ఆపరేషన్ అనవసరంగా చేస్తున్న
వైనం బయటపడింది. గర్భసంచీ తొలగించటం
అవసరమా, ఒకవేళ అది తొలగిస్తే ఏమవు
తుంది అనే విషయం పట్టించుకోకుండా ఆపరే
షన్ చేసి తీసి పారేస్తున్నారు.
ఇటువంటిదే నేడు జరుగుతున్న సిజేరియన్
ఆపరేషన్. అలాగే అవసరం లేకున్నా హడావుడిగా
సిజేరియన్ చేస్తున్నారు. దీనిమీద జాతీయస్థాయిలో
పెద్ద ఆందోళనే జరిగింది. అంతమాత్రంచేత
కాలం పడుతుందో తెలుసుకోవాలి.
కున్న ఇతర చికిత్సా విధానాలగురించి అడగండి.
ఆ తర్వాత ఆపరేషన్ చేయాలని చెప్పిన భాగం
ఏది, ఆపరేషన్ ద్వారా ఏదైనా ఒక శరీర భాగం
అలా తొలగిస్తే ఎదురయ్యే ఇబ్బందులు
ఏమిటి, ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన
జాగ్రత్తలు ఏమిటి? కోలుకునేందుకు ఎంత
మ: మనదేశంలో వైద్యులు, కార్పోరేట్ ఆసుపత్రులు తమ
ము పద్ధతి మార్చుకుంటాయనలేం,
గి
ఇటీవల ముంబయిలోని ఒక సంస్థ చేసిన పరిశోధ
నలో మనదేశం మొత్తం మీద జరుగుతున్న ఆపరేషన్లలో
సగానికి సగం రోగికి అవసరం లేకుండా జరుగుతున్న
ఆపరేషనేనని తేలింది.
తాజాగా అనవసరపు ఆపరేషన్ల జాబితాలో మోకాలి
చిప్ప రీప్లేస్ మెంట్ చేరింది. అమెరికాలో గత సంవత్సరం
లో
చేసిన మోకాలుచిప్ప రీప్లేస్ మెంట్ ఆపరేషన్లలో
మూడవవంతు మందికి అసలు అటువంటి రీప్లేస్మెంట్
అవసరంలేనే లేదు అని తేలింది. మనదేశంలో పరిస్థితి
అంతకన్నా భిన్నంగా ఉండివుంటుందని అనలేం.
" ఒత్తిడిలో పేషెంట్స్
ఆపరేషన్ నగానే పేషెంట్తోపాటు వారి కుటుం
బం మొత్తం ఒత్తిడికి గురవుతుంది.
ఆపరేషన్ సమయంలో మద్దతుగా నిలబడేవారు
మానసికంగా ధైర్యం చెప్పేవారు లేకపోవటం వల్ల రోగులు
కోలుకోటానికి చాలా ఇబ్బందిపడుతున్నారు.
ఇరుకు ఇళ్ళలో ఆపరేషన్ తర్వాత పేషెంట్ ని ఉంచ
గలిగిన పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఇటువంటి
పరిస్థితుల్లో కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి,
కుటుంబసభ్యులు మానసికంగా ఎన్నో ఇబ్బందులకు
గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆపరేషన్
చేయాలి అనగానే కంగారుపడటం మానేసి తగినచర్యలు
మొదలు పెట్టాలి. వైద్యుడి దగ్గర దాపరికం అనవసరం.
అనారోగ్యస్థితి గురించి, ఆపరేషన్ ఎందుకు అవసర
మైందో వివరంగా చర్చించాలి.
తీవ్రంగా ప్రశ్నిస్తే తప్పించి వైద్యుల నుండి సరైన
సమాధానాలు రావు. మరో వైద్యుడి నుండి అభిప్రాయం
తీసుకునే హక్కు రోగికి ఉందనే విషయం మరవకండి.
ఆపరేషన్ చెయ్యాలని సర్జన్ చెప్పాడు కాబట్టి ఆ
విషయం మీద మరో సర్జన్ వెళ్ళి కలవటంకన్నా సర్జరీ
విభాగానికి చెందని వైద్యుడిని కలిసి ప్రస్తుత రోగాని
తొలగిస్తారా!
సమాచారం సేకరించాలి
అలాగే గతంలో ఇటువంటి ఆపరేషన్లు ఎన్ని ఆ
డాక్టర్ చేతి మీదుగా జరిగాయి, వారి పరిస్థితి ఎలా ఉంది
అనే అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి.
అందుకు సంబంధించిన ప్రశ్నలు ఆ సర్జన్ కి సంధించేం
దుకు వెనుకాడాల్సిన అవసరం లేదు. వైద్యులు ఆపరేష
” అంతా సవ్యంగా ఉంటుందని చెప్పకపోవచ్చు.
చాలా ఆసుపత్రుల్లో ఆపరేషన్ చేసే వైద్యులు
అక్కడ పనిచేసేవారు కాదు. నైపుణ్యం కలవారిని ఆప
రేషన్ కోసం పిలిపిస్తారు. తాను ఏ పేషెంట్ ఆపరేషన్
చేస్తున్నది కూడా తెలియకుండా ఆపరేషన్ ముగించి
ఫీజు తీసుకుని వెళ్ళిపోయే సర్జన్స్ ఉన్నారు. అదేవిధంగా
ఆపరేషన్సమయంలో కీలకపాత్ర పోషించేది ఎనస్తీషియా
ఇచ్చేవారు. అతని నైపుణ్యం గురించి కూడా ఆపరేషన్
ముందే తెలుసుకునే హక్కు రోగికి ఉంటుంది.
కాబట్టి ఆపరేషన్ ఎంటేనే ఒక పెద్ద రిస్క్ అయిన
పుడు ఆ రిస్క్ తో కూడిన నిర్ణయం తీసుకునే ముందు
మరెంతో జాగ్రత్తగా ఉండటం అవసరం కదా.

విశ్వాసం తగ్గుతోంది
'ఆపరేషన్
చేయించుకున్నా' కాని నా ఆరోగ్యస్థితిలో
ఏమంత మార్పులేదు' అని కొందరు చెప్పటం మనం
వింటుంటాం. వారు చెపుతున్నదానిలో ఏమాత్రం
అబద్ధం లేదు. కొన్ని రకాల అనారోగ్యాలు ఒక దశ దాటిన
తర్వాత చక్కదిద్దటం కుదరదు.
ఎంతో నైపుణ్యం ఉన్న సీనియర్ సర్జన్ ఆపరేషన్
చేసినా ఆ అనారోగ్యపు ఇబ్బందిలోనుండి బయటపడ
లేరు. అలాంటి స్థాయికి చేరిన దాని గురించి వైద్యులు
ముందుగానే చెప్పరు. ఆపరేషన్ ద్వారా నూటికి నూరు
శాతం తగ్గుతుందా లేక ఆపరేషన్లో పరిష్కారం ఫిఫ్టీ
ఫిథీనా అనేది వైద్యుని అడిగి తెలుసుకోవాలి.
ఆపరేషన్తో సక్సెస్ శాతం బాగుంటుందనుకుంటేనే
బల్ల ఎక్కటం మంచిది. వైద్యుడిని దేవుడితో సమానంగా
భావిస్తారు రోగులు. మరే ఇతర వృత్తిలో ఉన్నవారికి
రెండుచేతులు పెట్టి నమస్కారం చెయ్యరు.
కాని తమకు
చికిత్స అందునా ఆపరేషన్ వంటివాటిని చేసే డాక్టర్కి
రెండు చేతులెత్తి నమస్కారం చేస్తారు.
అంతటి పవిత్రమైన, గురుతర బాధ్యత కల్గిన 
Yeకైకవృత్తి వైద్య వృత్తి. అయితే సమాజంలోని అన్ని
వృత్తులలోకి వచ్చిచేరిన చెడు నేడు వైద్య వృత్తిలోకి
వచ్చి చేరింది. డబ్బుకు తప్ప మరేదానికి స్పందిం
చని కఠినాత్ములుగా మారారు వైద్యులు.
ఎవరికివారు తమవంతుగా రోగిని ఒక 'రౌండ్
వేసి చూసి వెళ్ళేవారే తప్పించి, నిలుచుని మాట్లాడి,
వివరించి వాస్తవాన్ని రోగి ముందుంచే వైద్యులు
బాగా తగ్గిపోయారు. వైద్యులమీద నమ్మకం తగ్గి ఇంట
ర్నెట్ సమాచారంమీద విశ్వాసము పెరుగుతున్న కాలం
ఇది. రోగం పేరు చెప్పగానే ముందుగా వెళ్ళి ఇంట
ర్నెట్లో గూగుల్ సెర్చ్ చేసుకుంటున్నారు రోగులు.
ప్రాథమిక సమాచారమే కాదు, పలు తాజా అంశా
లను గూగుల్ ద్వారా తెలుసుకుని వైద్యుడి దగ్గరకు
వస్తున్నారు.గతంలోలా వైద్యుడు చెప్పిందే ఫైనల్ అను
కోవటం లేదు రోగులు. రెండవ ఒపీనియన్ ముందుగా
ఇంటర్నెట్లో ఆ పైనే మరో వైద్యుడి దగ్గర.
అందుకే ఇప్పుడు రోగులు వేసే ప్రశ్నలు పెరిగాయి.
ఆ ప్రశ్నలు వైద్యులకు చిరాకు తెప్పిస్తున్నాయి. ఇంట
ర్నెట్, గూగుల్ ని తిట్టని వైద్యులు లేరు.
» ప్రశ్నలు సంధించాలి
అయినా సరే వైద్యుడి ముందు ప్రశ్నలు ఉంచక
తప్పదు. ఆపరేషన్ అనగానే కత్తితో ఏదో ఒక భాగం
కోసి తిరిగి కుట్లు వేస్తారనేది చాలామంది రోగులు
అనుకునేది.
కోసి తెరచి, తిరిగి మూసే మధ్యలో జరి
గేదే ప్రాముఖ్యమైన అంశం.
ఇందులో దెబ్బతిన్న అంగాలు తొలగించవచ్చు,
శరీరంలోపల ఏర్పడినలోపాలను చక్కదిద్దవచ్చు, పేరు
కున్న కొవ్వులను తొలగించవచ్చు లేదా అంగమార్పిడి
జరగవచ్చు. ఇలా ఆపరేషన్లు పలురకాలు.
అయితే ఆపరేషన్ చిట్టచివరిగా ఎంపిక చేసుకునేది
కావాలి. ఆ దశకు చేరి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళే
ముందు రోగి లేదా రోగి ఆప్తులెవరైనా వైద్యునికి తప్పని
సరిగా సంధించవలసిన ప్రశ్నలు పది ఉన్నాయి.
• అసలు ఆపరేషన్ ఎందుకనేది తొలి ప్రశ్న అవ్వాలి.
ఈ ఆపరేషన్ కాక ఇతరత్రా మందుల వాడకం లేదా
మరో ప్రత్యామ్నాయంతో రోగం తగ్గించగలరా లేదా
అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి.
• ఒకసారి ఆపరేషన్ తప్పదన్న నిర్ణయానికి వచ్చినతర్వాత మరో వైద్యునిదగ్గర రెండవ అభిప్రాయం
సేకరించుకునే
యత్నం
చేయాలి.
• ఒకరికన్నా ఎక్కువమంది ఆపరేషన్‌ పరిష్కారమని
స్పష్టం చేసిన ఆ ఆపరేషన్ ఎలా చేస్తారు. ఆప
రేషన్లో వచ్చే లాభం ఏమిటి? ఆపరేషన్ వల్ల ఏర్పడే
ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా?
• ఆపరేషన్ సమయంలో ఇచ్చే మత్తుమందు స్థాయి,
ఆపరేషన్ ఎన్ని గంటలు చేస్తారు? ఎన్ని గంటల
తర్వాత స్పృహలోకి వస్తారు అనే ప్రశ్నలు వేసి సరైన
సమాధానం రాబట్టాలి.
• ఆపరేషన్ కి ముందు నిర్వహించే ప్రశ్నలు, వేసు
కోవాల్సిన మందులు, ఆపరేషన్ కి రెడీ అవటం
ఎలా అనేవి వైద్యుని అడిగి తెలుసుకోవాలి.
ఈ ఆపరేషన్ఏ ఆసుపత్రిలో చేస్తారు? అక్కడ అందు
బాటులో ఉన్న సౌకర్యాలు, అక్కడి నియమనిబంధ
నలు వంటివి కూడా అడగాల్సిన ప్రశ్నలే.
• ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన ఆహార, ఇతరత్రా
శారీరక జాగ్రత్తల గురించి ముందుగానే అవగాహన
ఏర్పరచుకోవాలి. వైద్యుని అనుభవం, గతంలో ఇటు
వంటి ఆపరేషన్లు ఎన్ని చేసింది. వాటిలో ఎన్ని విజయ
వంతమైనది తెలుసుకోవాల్సిన అంశం.
మీకున్న ఆరోగ్య బీమా పాలసీ ఆ పాలసీలో మీ ఆప
రేషన్ కవర్ అయిందో లేదో కూడా తెలుసుకుని
ఉండటం అవసరం. చిన్న పామునైనా పెద్దకర్రతో
కొట్టాలన్నది నానుడి. అలాగే ఆపరేషన్ చిన్నదే అయినా
దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్దవే.

తప్పనిసరి అయితేనే
ఆపరేషన్ థియేటర్ వాతావరణం, అక్కడ
ఆపరేషన్ కి ముందు వైద్యుడి మీద నమ్మకం ఉంచి
అనుసరించే పరిశుభ్రత విధానాలు ఆపరేషన్
టంతోపాటు సంపూర్ణ సమాచారం ఇవ్వటం అవసరం. సక్సెస్ లో కీలకం. వైద్యుడి నేర్పుతోపాటుగా
గతంలో తీసుకున్న చికిత్స, వాడిన మందులు, ఇత
ఆయనకు సహాయం అందించే సిబ్బంది పాటించే
రత్రా ఏవైనా ఆపరేషన్లు చేయించుకునివుంటే ఆసమా జాగ్రత్తలు, ఆపరేషన్ కి ముందు, తర్వాత రోగిని
చారం వైద్యునికి ఇవ్వటం ద్వారా శస్త్రచికిత్స సమ
ఉంచే గది వాతావరణం వగైరాలన్నీ పరిగణనలోకి
యంలో వైద్యుడికి ఎంతో సహకరించినవారవుతారు.
తీసుకుని ఆపరేషన్స్ ఎంపిక చేసుకోవాలి.
ఆపరేషన్ తగిన సర్జన్‌తోపాటు మంచి ఆసుపత్రిని ఆపరేషన్ చేస్తుండగా అనుకోని సంఘటనలు
కూడా ఎంచుకోవాలి.
జరగవచ్చు. అటువంటి ఎమర్జన్సీ పరిస్థితులు
చాలా ఆపరేషన్లలో ఇబ్బందులు తలెత్తవు. నిజానికి తలెత్తినపుడు వాటిని ఎదుర్కొనేందుకు ఎంచు
ఆ ఇబ్బందులు ఆపరేషన్ చేసినందువల్ల కాక ఆపరేషన్ కున్న ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాల గురించి వైద్యు
జరిగిన వాతావరణంబట్టి వస్తాయి.
డిని ముందుగానే అడిగి తెలుసుకోవాలి.