19, సెప్టెంబర్ 2026, శనివారం

అల్లం, శొంఠి.. అమోఘం..

 ఆయుర్వేదంలో అల్లం వినియోగం ఎక్కువ. కొందరు దాన్ని అలాగే తినడానికి ఇష్ట పడతారు. అల్లాన్ని సున్నపు నీటిలో ఉడికించి ఎండబెడితే శొంఠి గా మారుతుంది. ఆమ్ల గుణం ఉండే శొంఠిలో పీచు పదార్థాలు , ఘాటైన ద్రవ్యాలు వేడిగా మారి శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తాయి. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. 

కొబ్బరి నీటిలో అల్లం రసం కలిపి తీసుకుంటే మూత్ర విసర్జన సమయంలో మంట కలుగదు. భోజనానంతరం చిన్న అల్లం ముక్క తింటే కడుపులో వాయువు పెరగదు. తీసుకున్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది. అరగ్లాసు పాలలో అల్లం, పుదీనా రసం సమ పాళ్ళలో కలిపి తాగితే కడుపులో మంట సమస్య పరిష్కారమవుతుంది. అదే మాంసాహారం అరగక ఇబ్బంది పడుతుంటే పాలకు బదులు కొద్దిగా నిమ్మ రసం చేర్చితే సరిపోతుంది. 

చెంచా అల్లం రసం లో పావు చెంచా జీలకర్ర,తేనె కలిపి తీసుకుంటే తల తిరగడం , పైత్యం , వికారం వల్ల అయ్యే వాంతులు , దురద, కాలేయ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. నెలసరి నొప్పితో బాధపడే వారు పది రోజుల ముందు నుంచి వేడి నీటిలో అల్లం రసం వేసి తీసుకోవాలి. 

గొంతు ఇన్ఫెక్షన్ , నోటి పూత ఉన్నవారు బియ్యం కడిగిన నీటితో అల్లం రసం, తేనె కలిపి తాగాలి. తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్ ఉన్నవారు ఈ రసంలో మెంతి కూర, తులసి రసం, తేనె కలిపి ఇస్తే త్వరిత ఉపశమనం కలుగుతుంది. 

శొంఠితో సమస్యలు దూరం ఇలా..

కఫం,ఎక్కిళ్ళు,గొంతునొప్పి,ఉన్నవారు గోరువెచ్చని నీటితో శొంఠి పొడి వేసి తీసుకోవాలి. గోరు వెచ్చని నీటిలో చిటికెడు శొంఠి పొడి , సైంధవ లవణం వేసి తీసుకుంటే అజీర్ణ సమస్య బాధించదు. 

బరువు తగ్గాలనుకునే వారు దీన్ని పిప్పళ్ల చూర్ణంతో సమానంగా కలిపి రోజూ తేనెతో తీసుకోవాలి. బాలింతలకు పొద్దుటే భోజనంలో శొంఠి పొడి నెయ్యితో కలిపి ఇస్తే ఆకలి పెరిగి పాలు పడతాయి. అజీర్ణం బాధిస్తున్నప్పుడు మొదటి అన్నం ముద్దలో శొంఠి పొడి నెయ్యితో తింటే ఎంతో మార్పు ఉంటుంది. 

నెలసరి సమస్యలు ఉన్నవారికి ఈ పొడిలో చిటికెడు చొప్పున పిప్పళ్లు, ఇంగువ వేసి రెండు మూడు వారాల ముందు నుంచే తినిపించాలి. 

కొబ్బరి నూనెలో ఈ పొడిని కలిపి పూతలా రాస్తే కీళ్ళు, మడమల నొప్పికి పరిష్కారం లభిస్తుంది. 

జాగ్రత్తలు..

రక్త పోటు, కాళ్ళు చేతుల నొప్పులు , నెత్తురు త్వరగా పలచబడే వారు వైద్య నిపుణులను సంప్రదించి తీసుకోవాలి. వేడి వాతావరణం ఉంటే కొబ్బరి నీళ్లు లేదా చందనంతో కలిపి వాడుకోవచ్చు. అల్లాన్ని ఇతర మసాలా దినుసులతో కలిపి వాడితే దాని గుణం మారి కడుపులో మంట, అజీర్ణం , మల బద్ధకం వంటివి బాధిస్తాయి. 

దీనికి మజ్జిగ ,వెన్న ,తేనె విరుగుడుగా పని చేస్తాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...