పిల్లల మతిమరుపు సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..
మన బిడ్డలకు తగిన ఆహార ఔషధం, మన ఇంట్లోనే, మన చేతుల్లోనే ఉంది. సోంపు గింజలు, ధనియాల గింజలు కొంచెం దోరగా వేయించి , కొంచెం నలగ గొట్టి, పొట్టు తీసి, విడి విడిగా దంచి చూర్ణాలను తయారు చేసుకోవాలి. వాటితోపాటు చిన్న ఏలకులు పొడిచేసి, ఇంకా సీమ బాదం పప్పులు తెచ్చి ఒక రాత్రి నానబెట్టి పై తోలు తీసి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. అలాగే పటిక బెల్లం కూడా పొడి చేసుకుని , అన్ని చూర్ణాలూ సమ భాగాలుగా కలిపి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని రోజూ ఒక చెంచా మోతాదుగా ఒక కప్పు వేడి పాలతో కలిపి రాత్రి భోజనం తర్వాత మూడు గంటలు ఆగి నిద్రించే ముందు తాగాలి. దీని వల్ల మెదడు బలపడి, శరీరం కూడా పుష్టికరంగా మారి , జ్ఞాపక శక్తి అపారంగా పెరుగుతుంది.
బహిష్టులో అధిక రక్త స్రావ సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..
అతి మధురం పొడి అరచెంచా మోతాదుగా ఒక కప్పు బియ్యం కడిగిన నీటితో కలిపి రోజూ మూడు పూటలా తాగాలి. అతి త్వరలోనే అధిక ఋతు రక్త స్రావం ఆగిపోతుంది. మొదటి రోజు లోనే చాలా మంచి ఫలితం కనిపిస్తుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి