ఘాటైన వాసనలు, కొన్ని పదార్థాలలోని రసాయనాలు ఊపిరి తిత్తులు, గొంతులో ఇబ్బంది కలిగించి అవి దగ్గు రూపంలో బయటకు వస్తాయి. ఒక్కోసారి అలర్జీ, ఇన్ఫెక్షన్ , హృద్రోగాలతోనూ వచ్చే ఆస్కారం ఉంటుంది.
కడుపులో మంట, ఊపిరి తిత్తులు,గొంతులో వాపు గడ్డలున్నా పొడి దగ్గు వస్తుంది.
చల్లటి నీళ్ళు తాగ కూడదు,వాడిన నూనెలు , కాలుష్యం, వేపుళ్లు , ఘాటైన సువాసన ద్రవ్యాలు , మానసిక ఒత్తిడి వంటివి సమస్యను రెట్టింపు చేస్తాయి. అలానే ఒక్కొక్కసారి బాగా పండిన అరటి పండు, పెరుగు లాంటివి కఫాన్ని పెంచి దగ్గుకు కారణమవుతాయి. కాబట్టి వీటిని మిరియాల పొడితో కలిపి తీసుకోవాలి. సమస్య త్వరగా తగ్గుతుంది . దగ్గుతో పాటు కడుపులో మంట కూడా ఉంటే చింతపండునూ పరిమితంగా వాడాలి.
నానబెట్టిన రెండు బాదం గింజలను తేనెతో కలిపి తింటే ఉపశమనం లభిస్తుంది. అలర్జీ కారణం వల్ల దగ్గు వస్తుంటే మాత్రం దంచిన వెల్లుల్లిని గ్లాసు నీటిలో ఉడికించి రాత్రిళ్ళు తాగాలి. పావు కప్పు నీటిలో ఉల్లి రసం, తేనె, చెంచా చొప్పున వేసుకుని భోజనం చేసిన తర్వాత తాగాలి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి