మూత్రపిండాలలో రాళ్ల సమస్య ఆయుర్వేద పరిష్కారాలు..
ఉలవలు..8 గ్రా, సైంధవ లవణం 3 గ్రాములు, వెంపలి వేళ్ళు 2 గ్రాములు తీసుకుని వీటన్నింటినీ కచ్చా పచ్చగా దంచి ముప్పావు లీటర్ మంచినీటిలో కలిపి పొయ్యి మీద పెట్టాలి . చిన్న మంట పైన సగం కషాయం మిగిలే టట్లు మరిగించి దించి వడపోయాలి. ఈ కషాయాన్ని 3 భాగాలుగా చేసి, మూడు పూటలా కొంచెం కొంచెం తాగుతుంటే నాలుగైదు రోజుల లోనే మూత్ర పిండాలలోని , మూత్ర నాళంలోని రాళ్ళు కరిగి పడిపోతాయి.
సంతాన ప్రాప్తి సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..
రావి చెట్టు పండ్లు సేకరించి కడిగి ముక్కలు చేసి నీడలో బాగా ఆరబెట్టి నిలువ చేసుకోవాలి. ఆ ముక్కలను దంచి మెత్తగా చూర్ణం చేసి పలుచని బట్ట లో వస్త్ర ఘాలితము పట్టి , దానికి సమానంగా పటిక బెల్లం పొడి కలిపి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. రోజూ రెండు పూటలా భార్యాభర్తలు ఇద్దరూ ఒక చెంచా మోతాదుగా చప్పరించి తిని, ఒక గ్లాసు గోరు వెచ్చని పాలలో పటిక బెల్లం పొడి కలిపి 40 రోజుల పాటు సేవిస్తూ పూర్తి బ్రహ్మ చర్యం పాటించాలి. తర్వాత దాంపత్య వేదంలో సూచించినట్లుగా సంసారం చేస్తుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి