1. సెగ రోగ / గనేరియా సమస్య - ఆయుర్వేద పరిష్కారం
ముందే సెగ రోగం ఉన్న పురుషునితో స్త్రీలు కలవడం కానీ , అదే రోగం ఉన్న స్త్రీతో పురుషుడు కలవడం వల్ల కానీ ఈ రోగం అంటుకుని వారి శరీరంలో జీర్ణించుకు పోయి వదలకుండా దీర్ఘ కాల వ్యాధి లాగా పట్టి పీడిస్తుంది. దీనిని అశ్రద్ధ చేస్తే ఈ వ్యాధి ఉన్నవారికి పుట్టే బిడ్డలకు కూడా ఈ వ్యాధి సంక్రమించి వారి జీవితాన్ని కూడా నరక ప్రాయం చేస్తుంది.
దీనికి ఈ వర్షా కాలంలో ప్రతి చోట లభ్యమయ్యే దూసరి చెట్టు / సిబ్బి తీగ ఆకులు దివ్యమైన ఔషధంగా పని చేస్తాయి. చెట్టును పూజించి , రోజూ ఉదయం పూట దాని ఆకులు తెచ్చి దంచి తీసిన రసం 20 గ్రాములు మోతాదుగా ఒక చెంచా పటిక బెల్లం పొడి కలిపి పరగడుపున తాగుతుంటే మూడు, నాలుగు వారాల్లో ఎంత దీర్ఘ కాలం నుంచి బాధిస్తున్న సెగ రోగమైనా తగ్గిపోతుంది.
2. ) కడుపులో బల్ల రోగం - ఆయుర్వేద పరిష్కారం
ఉన్న ఊరు కన్న తల్లి అని మన పెద్దలు చెప్పిన మాట ఈ నాడు మనం మరచిపోవడం వల్ల ఇలాంటి సమస్యలు పరిష్కారం కావడం లేదు. కడుపులో బల్ల సమస్యకు దేశవాళీ ఆవు ఉదయం పూట పోసే మూత్రం మొదటి మరియు చివరి మూత్రాన్ని విడిచిపెట్టి మధ్యలో మూత్రాన్ని ఒక గ్లాసులో పట్టుకొని ఏడు సార్లు బట్టలో వడపోసి అందులో చిటికెడు ఉప్పు కలిపి రోజూ ఉదయం పూట పరగడుపున సేవించాలి. ఇలా వరుసగా రెండు లేదా మూడు వారాల పాటు తాగుతుంటే తిరిగి కాలేయ ప్లీహాలు బాగా పని చేసి బల్ల హరించి పోయి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది. సులభంగా జీర్ణం అయ్యే ఆహారం మాత్రమే సేవించాలి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి