Thursday 10 December 2015

PARAGADUPUNA IVI VADDHU


క్షణం తీరికలేని జీవనశై
లిలో భాగంగా చాలా
మంది ఆరోగ్యం, తీసుకునే
ఆహారం పట్ల దృష్టి
పెట్టరు. ఎప్పుడు ఏం తీసు
కుంటున్నారన్నది పట్టిం
చుకోరు. కానీ పరగడు.
పున తీసుకునే ఆహారం,
చేసే పనుల మీద శ్రద్ధ
పెట్టడం మంచిది.
ఆలస్యంగా లేచినప్పుడూ, అలవాటులో భాగం
గానైనా పరగడుపున సోడా, ఇతర శీతల పానీ
యాల్ని తాగకూడదు. వాటి వల్ల జీర్ణాశ
యంలో హాని చేసే ఆమ్లాలు విడుదలవు
తాయి. ఇవి చాలా అనారోగ్య సమస్యలకు
కారణమవుతాయి. వికారం, వాంతుల వంటివీ
బాధిస్తాయి. వీటన్నిటి కంటే మంచినీళ్లు తాగడం
మొదట గ్లాసు నీళ్లు తాగి.. ఓపదినిమిషాల
తరవాత వీటిని తీసుకోవాలి.
పుల్లని పదార్థాల వల్లా ఉదయం పూట జీర్ణ
వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా
టొమాటోలను పరగడుపున తీసుకోకుడదు.
చాలామంది టొమాటో బాత్ లేదా, టొమాటో
రైస్ వంటివి తింటుంటారు. ఇలాంటివి తినే
ముందు కాసిని పాలు తాగడమో. వేరే పదార్థ
మేదైనా తినడమో చేయాలి.
కొందరు నిద్రలేవగానే వాకింగ్ లేదా జాగం
కు వెళ్లిపోతారు. అలాకాకుండా ఓ కప్పు గ్రీన్
టీ తాగి వెళ్లడం మంచిది. యోగా చేయడానికి
ముందూ ఇలానే చేయాలి. పొట్టలో ఏమీ
లేకుండా పరగడుపున వ్యాయామం చేయడం
వల్ల కొవ్వు త్వరగా కరగదు.
పరగడుపున అరటి పండు జోలికి వెళ్లకూ
డదు. అరటి పండులో మెగ్నీషియం
ఉంటుంది. అది పొద్దున్నే శరీరానికి ఎక్కువ
మోతాదులో అందడం మంచిది కాదంటారు.
ఆరోగ్య నిపుణులు.