17, జనవరి 2016, ఆదివారం

BACKING SODA

'* తినేసోడా ఉప్పుని బేకీంగ్‌ సోడా అనీ, బ్రైడ్‌ సోడా అనీ కుకింగ్‌ సోదా అనీ, లై కార్పొనేట్‌ ఆఫ్‌ సోడా అనీ పిలుస్తారు. రొట్టెలు బాగా పొంగడం కోనం, పాలు విర క్కుండా ఉండటం కోనం దీన్ని వంటింట్లోకి తెచ్చారు మనవాళ్లు. నీళ్లలో వేస్తే దీనిలోని కర్భన వరమాణువులు గ్యాన్‌ రూపాన బుడగలుగా వియటకు వస్తాయి. కాబట్టి, దీన్ని సోడా ఉప్పు అనీ, “సాల్ట్‌ ఎయిరేటన్‌' అనీ పిలుస్తారు. 12 [1003 దీని శాస్త్రీయ నామం. 

ఉప్పు ఏవిధంగా మంచీ చెడూ మిశ్రమ ఫలితాలనిన్తుందో అలాగ తినేసోడా ఉప్పు కూడా ఇన్తుంది. ఉప్పు ఎవరెవరికి నిషేధమో వారందరికీ తినే సోడా ఉప్పు కూడా నిషే ధమే! అలాగే కాల్షియం లాంటి క్షారాలను వాడుతున్న వారు కూడా తినే సోడా ఉప్పు వాడకూడదు. రెండూ క్షూరాలే కాబట్టి శరీరంలో క్షారగుణాలు పెరిగిపోయి కొత్త నమ న్యలొస్తాయి. ఎంత సోడా లైకార్చ్‌ తీనుకున్నారో అంత మేర మామూలు ఉప్పుని తగ్గించి వాడుకుంటే ఉప్పు నమన్య తీరుతుంది. గ్యాన్‌ వగైరా బాధలకు సోడా బైకార్స్‌ వాడవచ్చా అని అడిగారు. కానీ గ్యాన్‌ బాధని తెచ్చి పెట్టే ఆహార విహారాలను మూర్పు చేనుకోవడం ఒక రసాయనం వాడటం కన్నా మంచిది కదా! 

RAGI AMBALI - AYURVEDAM



అన్నం తినబుద్ధి కాకపోవడం / అజీర్ణం ,నోటికి రుచి తెలియకపోవడం జరిగినప్పుడు ఏం చేయాలి? / అల్లం - అజీర్ణం - ఆయుర్వేదం / ALLAM - AJEERNAM - AYURVEDAM


దీనిని అరుచి అంటారు.అజీర్త్ కారణంగానైన, లేదా ఇతర కారణాలవల్లనైన ఇది కలగవచ్చు. కారణం ఏదైనా ముందు జీర్ణ వ్యవస్థ బలకరం కావాలి.

ప్రతి రోజూ అల్లనికి తగినంత ఉప్పు వేసుకుని దంచి అన్నంలో మొదటి ముద్దగా కలుపుకుని నెయ్యి వేసుకుని తినాలి.నాలుక మీద జిగురు తగ్గి ,అన్న హితవు కలుగుతుంది.అన్నంలో మొదటి ముద్దగా అల్లం, ఉప్పు ( వీలైతే సైంధవ లవణం ) మిశ్రమాన్ని తినాలి.అరోగ్యవంతులు కూడా దీనిని పాటిస్తే భుక్తాయాసం కలుగదు.అహారం తేలికగా జీర్ణం అవుతుంది.అన్నం తినాలనే కోరిక కలుగుతుంది.ఉసిరికాయ తొక్కుడు పచ్చది లేద నల్ల పచ్చడిని ఈ అల్లం మిశ్రమానికి కలిపి తింటే మరీ మంచిది.భోజనంలో మొదటి పదార్థంగా దీనిని తీసుకోవాలి.
పచారీ కొట్లలో దొరికే పిప్పళ్ళను దోరగా వేయించి మెత్తగా దంచాలి.ఈ చూర్ణానికి ఆరు రెట్లు పంచదార కలిపి పాకం పట్టి కుంకుడు కాయంత ఉండలు చేసుకొని సీసాలో భద్రపరుచు కోవాలి.జీర్ణవ్యవస్థ బలంగా లేని వాళ్ళు వీటిని ఉదయం , రాత్రి ఒక్కొక్క మాత్ర చొప్పున తీసుకుంటూ వుంటే కడుపులో వాతం తగ్గి జీర్ణాశయం బలపడుతుంది.శరీరానికి నూతనోత్తేజం కలుగుతుంది.

DAMPUDU BIYYAM - SUGER DISEASE - AYURVEDAM

సుగరు రోగులకు దంపుడు బియ్యం పెడితే కలిగే ప్రయోజనం వివ
రించగలరు.

* షుగరు వ్యాధిలో బియ్యం వాడ
కాన్ని సగానికి తగ్గించాలని వైద్యులు సూచి
స్తున్నారు. ఆ మిగిలిన సగానికి సరిపడే
రాగి,
జొన్న, సజ్జ, గోధుమలను వాడుకోవ
లసిందని చెప్తున్నారు. కాబట్టి, దంపుడు
బియ్యం మాత్రమే తినాలని అనుకోనవ
సరం లేదు. షుగరు వ్యాధిలో దంపుడు
బియ్యాన్నో లేక 'పట్టు తక్కువ బియ్యాన్నో
తినటం వలన జీర్ణాశయ వ్యవస్థ మరింత
దెబ్బ తింటుంది. గోధుమలూ, రాగులు, సజ్జల్లాంటివి పూర్తి ధాన్యంగా వండు
కుంటాం. వీటిని మిల్లాడించి పై పొరల్లోంచి చిట్టూ, తవుడూ వగైరా తీసేయటం
ఉండదు. కాబట్టి, షుగర్ రోగులు దంపుడు బియ్యం తినటం కన్నా జొన్నలూ,
రాగులు, సజ్జలూ వగైరా తృణధాన్యానికి ప్రాధాన్యత నివ్వటం మంచిది. దంపుడు
బియ్యం తింటే ఏ పోషకాలు దొరుకుతాయని ఆశిస్తున్నారో అవన్నీ అంతకన్నా ఎక్కు
వగానే ఈ ప్రత్యామ్నాయ ధాన్యంలో దొరుకుతాయి.
అన్నీ సవ్యంగానే ఉన్నప్పుడు దంపుడు బియ్యం మేలు చేసేదే! షుగర్ రోగులకు,
స్థూలకాయులకు, కొవ్వు కారణంగా ఏర్పడే వ్యాధులతో బాధపడేవారికీ రాగి, జొన్న,
సజ్జ, గోధుమలు మంచివి.

VUPMA AND AYURVEDAM


ఉప్మా రోజూ తినదగినదేనా?

తెలుగు, తమిళ, కన్నడ మలయాళ తదితర ద్రావిడ ప్రజలు కొన్ని ఉత్తరాది
రాష్ట్రాల వాళ్లు కూడా వందలాది ఏళ్లుగా వండుకుని తింటున్న ప్రాచీన వంటకం ఇది!
ఉప్మా మనందరిది!
నీళ్లు పోసి గానీ, లేదా నీళ్ల ఆవిరి మీద గానీ ఉడికించిన పిండిని 'ఉప్పిండి'
అంటారు. దీన్నే ఉప్పుడు పిండి, ఉప్పిండి,
ఉప్పిడి, ఉప్పుమావు అని కూడా పిలుస్తారు.
ఇడి అంటే పిండి. ఉప్పడి అంటే ఉడికించిన
పిండి లేదా రవ్వ. మావు అనేది పిండికి
పర్యాయపదం. శరీరాన్ని శుష్కింప చేసుకో
వటం కోసం కేవలం ఉడికించిన ఉప్పిండిని
తిని పడుకోవడాన్ని ఉప్పడి ఉపవాసం
అంటారు. కమ్మని తాలింపుతో చేసిన
'ఉప్పుమావు' ఆంగ్లేయుల ఉచ్ఛారణలో ఉప్మాగా మారిపోయింది.
డురమ్ అనే రవ్వ గోధుమ గింజ లోపలి నడిభాగాన్ని 'సెమోలినా' అంటారు. ఏ
ధాన్యపు గింజలోంచైనా సెమోలీనా తీయవచ్చు. కానీ, ఈ గోధుమ 'సెమోలీనా' రవ్వ
ఉప్మా తయారీకి బాగా అనుకూలంగా ఉంది. బొంబాయి రవ్వని దక్షిణాది ప్రజలు
గొప్పగా సద్వినియోగపరచుకున్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉప్మా, ఉప్పుమావు,
ఉప్పట్టు, ఉపీత్ పేర్లు వినిపిస్తాయి. బొంబాయి రవ్వతోనే కాకుండా గోధుమరవ్వ
ఉప్మా, మొక్కజొన్న రవ్వ ఉప్మా, పెనర రవ్వ ఉప్మా, నవధాన్యాల ఉప్మా, ఉలవల రవ్వ
ఉప్మాలు ప్రసిద్ధి. దేని గుణాలు దానివి. జీర్ణశక్తి ననుసరించి ఏ ధాన్యపు
రవ్వతో ఉప్మా చేసుకోవాలో నిర్ణయించుకోగలగాలి. ఉప్మా ప్రభావం దాని
వంటలో కాకుండా దాని కోసం వాడే రవ్వ మీద ఆధారపడి ఉంది. తక్కువ
కేలరీలు కలిగిన ఉప్మా కావాలంటే రవ్వ గోధుమల రవ్వ, జొన్న రవ్వ,
సజ్జ రవ్వ ఉత్తమం. రాగి పిండితో కూడా ఉప్మా చేసుకోవచ్చు. అన్ని
వ్యాధుల్లోనూ తినదగినదిగా ఉంటుంది. ఇతర ఉప్మాల కన్నా ఇది తేలిగ్గా
ఆరుగుతుంది. స్థూలకాయం తగ్గడానికి ఉలవ రవ్వ, జొన్న రవ్వ ఉప్మాలు
ఉపయోగపడతాయి. అతి ఆకలిని తగ్గించడానికి పెసర రవ్వ తోడ్పడు
తుంది. ఘనమైన జీర్ణశక్తి ఉన్నప్పుడే బొంబాయి రవ్వ ఉప్మా
తినటం మంచిది.

10, జనవరి 2016, ఆదివారం

VUNDRALLU , AVIRI KUDUMULU - AYURVEDAM

కోటల్ కెళితే ఇడ్లీలు దొరకుతాయి
గానీ ఉండ్రాళ్ళు దొరకవు. గారెలు, వడలు
దొరుకుతాయిగానీ ఆవిరి కుడుములు
దొరకవు.
ఉండ్రాళ్ళు వినాయక చవితినాడు
మాత్రమే తినాలని మన ప్రజలు ఎందుకను
కొంటారో తెలీదు. ఆవిరి కుడుములు
వేస్తారనీ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివనీ
మన వాళ్ళు చాలా మందికి తెలీదు. తెలిసినా
వండరు. అమ్మమ్మల వంటలని ఎగతాళి
చేస్తారని భయం!!
బహుశా, పూటకూళ్ళ సాంప్రదాయాన్ని
మార్చి తమిళులు, కన్నడవారూ తెలుగు నాట
హోటల్ సాంప్రదాయాల్ని ప్రవేశ పెట్టి “ఇడ్లీ
+ వడ దోసె"ల్ని మనమీద రుద్దేశారు.
దాంతో మనం మన సాంప్రదాయకమైన
ఆహారాన్ని మర్చిపోయి ఇడ్లీ సాంబార్లలో
వడి కుడితి తొట్లో ఎలుకలా కొట్టు
కొంటున్నాం... అవునంటారా.... కాదంటారా....
'విదేశీ సంస్కృతి' అంటూ అయిన
దానికి కానిదానికి ఒంటికాలుమీద లేచే మన
పెద్దలు ఇలా మనం స్వంత సంస్కృతిని
మరిచిపోతున్న నంగతిని ఎప్పుడైనా
గుర్తించారా...???
ఇడ్లీలు వాతం చేస్తాయి
ఉండ్రాళ్ళు, ఆవిరి కుడుములు ఎంత
మేలుచేస్తాయో మీకు వివరంగా చెప్పబోయే
ముందు ఇడ్లీ గురించి ఒక మాట...
ఇడ్లీలు ఉప్పుడు రవ్వతో తయారౌతాయి
కాబట్టి తెల్లగా మర పట్టించకుండా
బియ్యంలో సారం అంతా పోకుండా
ఉప్పుకు రవ్వలో నిలవ వుంటుంది కాబట్టి
ఉప్పుడు రవ్వ వలన బలం ఎక్కువగా
వస్తుందనీ, నాడీ ఉత్తేజం (Nerve Stimula-
tion) కల్గుతుందని అర్ధం చేసుకోవాలి.
ఇది బాగానే ఉంది కానీ, ఉప్పుడు
రవ్వవలన, అవి పులిసిన బియ్యం కాబట్టి-
వాతం పెరుగుతుంది. మలబద్ధకం కలుగు
తుంది. అందుకని కడుపులో మంట, గ్యాస్
ట్రబుల్ పేగుమాత, అమీబియాసిన్,
ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి వ్యాధులు
న్నవారు, అన్నిరకాల వాతవ్యాధులున్నవారు
ఇడ్లీలు తినడం మంచిది కాదు.
చలవని కల్గించే చక్కని టిఫిను ఇదిగో...
మీ కోసం...
ఉండ్రాళ్ళు, ఆవిరి కుడుములు కొంచెం
ఆలస్యంగా అరుగుతాయి. అందుకని ఇవి
తేలికగా అరగడం కోసం నెయ్యివేసుకొని
తినాలి. ఇడ్లీలైనా నేతితో తిన్నప్పుడు అంతగా
చెడును కల్గించవు.
ఆరోగ్యవంతుడే కాదు, ఏ వ్యాధితో
బాధపడున్నవారైనా సరే ఉండ్రాళ్ళనూ ఆవిరి
కుడుమునూ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
చలవని కల్గిస్తాయి. తృప్తిని కల్గిస్తాయి. తిన్న
తర్వాత కడుపునిండినట్లు అనిపిస్తుంది. మళ్ళీ
భోజనం వేళకే ఆకలి అవుతుంది. అందుకని
టిఫిన్ గా ఉండ్రాళ్ళను గానీ, ఆవిరి కుడుము
నుగానీ తినడం మంచిది.
ఇడ్లీల వలన తృప్తి కలగదు. అందులోకి
శనగ చెట్నీ, కారప్పొడి, సాంబారు లేనిదే
అవి సహించవు. అవన్నీ కలిపి తినడం వలన
ఇడ్లీలు వేడిచేసే వాటిలో ముందు వరసగా
వచ్చేస్తున్నాయి. ఉండ్రాళ్ళుగానీ, ఆవిరి
కుడుములుగానీ ఇలా వేడిచేయనీయ
కుండానే చక్కగా, నేరుగా తినవచ్చు. ఈ
సున్నితమైన తేడాని గుర్తించండి.
మూత్ర వ్యాధులున్నవారు, మూత్ర
పిండాలలో రాళ్ళతో బాధపడున్నవారు,
మూత్రంలో మంట చీము వున్న వారు
ఉండ్రాళ్ళు తింటే మంచిది. చలవని కల్గి
స్తాయి.
అమీబియాసిస్ వ్యాధిలో ఇడ్లీ
సాంబార్లు తినడం కన్నా వీటిని తినడం
మంచిది.
రాత్రిపూట అన్నం మానేసి చపాతీలు
తినదలచిన వారుకూడా, ఆవిరి కుడుముగానీ,
దిబ్బరొట్టెగానీ తినడం మంచిది. చపాతీలు
సరిపడని వారికీ ఇవి మంచివే. చలవ
నిస్తాయి. పెద్దగా కేలరీలు పెరగవు. గోధుమ
పిండితో వండిన వాటి కన్న మన వాతా
వరణానికి ఇవే మంచివి!
ఆవిరి కుడుముల కన్నా మంచి ఆహారం
ఇంకొకటి లేదు
ఆవిరి కుడుములు తింటే- భోజనం
3
చేయగానే వచ్చే కడుపులో నొప్పి వ్యాధిలో
చాలా మంచిది. కడుపులో పుండువలన ఈ
నొప్పి వస్తూండవచ్చు. ఉండ్రాళ్ళుకూడా ఈ
వ్యాధిలో మేలుచేస్తాయి.
ఆవిరి కుడుముల్ని రాత్రిపూట వేసుకొని
ఉదయం పూట సూర్యోదయానికి ముందే
తింటే వేసవికాలం అమితమైన చలవ
కి నిస్తుంది. తేలికగా వడదెబ్బ తగలకుండా
-దే కాపాడుతుంది.
వాత వ్యాధులు, పక్షవాతం కీలు
గా నొప్పులతో బాదపడున్న వారికి ఈ విధంగా
పెడితే వాతం త్వరగా తగ్గుతోంది. మందులు
చక్కగా పనిచేస్తాయి.
ఇడ్లీలు చల్లారితే బాగోవు. ఆవిరి
కుడుము చల్లారిన తర్వాతే బాగుంటుంది
ఆరోగ్యం కూడా!! ఆవిరి కుడుములో బియ్యం
చాలా స్వల్పంగా వుంటాయి. కేవలం
మినపప్పును, జిగురుకోసం కొద్దిగా బియ్యపు
గింజలు కలిపి నానబెట్టి రుబ్బి ఇడ్లీ ప్లేట్లలో
గానీ, వాసిన కట్టిన గుడ్డమీదగానీ ఇడ్లీ వేసినట్లే
వేసుకొని చల్లారిన తర్వాత తింటారు. ఆవిరి
కుడుముల్లో బియ్యం దాదాపుగా వేడి కాబట్టి
ఇంతకుమించిన ఉత్తమమైన ఆహారం
మధుమేహరోగులకుగానీ,
స్థలకాయులకిగానీ
ఉండదు కదా! ఆ విధంగా, కేవలం మినప
పిండితో వండినవి కాబట్టి ఆవిరి కుడుములు
వాత వ్యాధుల్లో అద్భుతమైన ప్రభావాన్ని
చూపిస్తాయి. గారెలకన్న ఆవిరి కుడుములే
శ్రేష్టం. గారెల్లో నూనె వుంటుంది. ఆవిరి
కుడుముల్లో నూనె అసలే వుండదు కదా!
అన్నం కన్నా ఉండ్రాయి మిన్న
ఇంక ఉండ్రాళ్ళు - బియ్యపు రవ్వతో
తయారుచేస్తారు. వండే విధానంలో ఇడ్లీలను
వండినట్లే వీటిని ఆవిరిమీద ఉడికించడమే
పద్ధతి. ఇందులో మినపప్పు వుండదు. రుచి
కోసం శనగపప్పు కలుపుతారు. కానీ,
మామూలు బియ్యంతో వండిన అన్నంకన్నా
ఉండ్రాళ్ళు తేలికగా అరుగుతాయి. ఎక్కువ
చలవ.
ఇవి తరతరాలుగా మన తెలుగు వారు
తిన్న టిఫిన్లు. ఆరోగ్యానికి మేలు చేసేవి.
తమిళులు, కన్నడీయులు పుణ్యమా అని,
మనం చలవచేసే టిఫిన్లను వదిలేని
వేడిచేసేవి. ఆరోగ్యాన్ని దెబ్బతీసేవి అయిన
ఇడ్లీ, దోసె, ఉప్మా, పూరీలను తిని
బాధపడ్తున్నాం- కాదంటారా...!!
జీలకర్ర ధనియాలను విడివిడిగా నేతిలో
వేయించి, సమానంగా తీసుకొని, మెత్తగా
దంచి, తగినంత ఉప్పు కలిపి ఆ పొడిని
నంజుకుతింటే ఇవి
తేలికగా అరుగు
తాయి. పొదీనా ఆకు
పచ్చడి కూడా వీటికి
విరుగుడుగా పని
చేస్తుంది.

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...