12, డిసెంబర్ 2015, శనివారం

PACHI PALA PERUGU - AWARENESS

పచ్చిపాల పెరుగు వద్దు

| పచ్చిపాలను తోడు పెట్టిన పెరుగు తింటే పేగుపూత తగ్గుతుందని
చెప్పారు. తినవచ్చునా?

* పాలను కాయకుండా
ఏరకమైన పదార్ధాలూ తయా
రుచేయకూడదు. పచ్చిపా
లలో హానికర సూక్ష్మజీవు
లుంటాయి. బాగా కాగిన
పాలను తోడు పెట్టిన పెరుగు
కూడా పైత్యాన్ని, కడుపులో
మంటని, పేగుపూతని తగ్గి
స్తుంది. అందుకోసం పచ్చి
పాల పెరుగే వాడవలసిన
అవసరం లేదు. పచ్చిపాల పెరుగు కఫాన్ని దగ్గు జలుబు, తుమ్ములూ ఆయా
సాల్నీ పెంచుతుంది. స్థూలకాయాన్ని కలిగిస్తుంది.
దాని జోకి పోకపోవటమే
మంచిది.

LIVER VYADHULU - AHARAM

లివరు వ్యాధులు-ఆహారం...

కామెర్ల వ్యాధి వచ్చింది. లివర్ దెబ్బతింటోందనీ, ఫుడ్ విషయంలో
జాగ్రత్తగా వుండాలన్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా?

* ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో లివరు ముఖ్య పాత్ర వహిస్తుంది.
అందుని కాలేయం పైన వత్తిడి పడకుండా తేలికగా అరిగే ఆహారం తీసుకో
వాలి. మెతుకు తగలకుండా ఆహారం ఇవ్వాలనే రూలేమీ లేదు.
రోగికి ఇచ్చే
ప్రతి మెతుకూ అరిగేదిగా ఉండాలి. పాత బియ్యాన్ని వేయించి, మెత్తగా వండు
కుని తినవచ్చు.
బార్లీ, సగ్గుబియ్యం, రాగి, జావలు మంచివి. బాగా చిలికి వెన్న
తీసిన మజ్జిగ, ఎక్కువగా తాగాలి. బీర, పొట్ల, సొర, గలిజేరు, గుంటగలగర
ఆకు, కొండపిండి ఆకు, పొన్నగంటి కూర, చిర్రికూర, వీటితో పప్పు
గానీ, పొడికూరగానీ వండుకుని తినవచ్చు. మినప్పప్పు, శనగలు, బరా
ణీలు, నూనెలు, చింత
పండు, పులుసుకూ
రలు, ఆవపిండి కలి
సినవి, వేడి చేసేవి
మానాలి. చలవచేసే
వితింటే లివరు వ్యాధులను
అదుపు చేయటం తేలిక.

GASTRITIS - AHARA VAIDYAM


. తరచూ గ్యాస్ట్రయిటిన్ కారణంగా మాటిమాటికీ
ఎక్కువ మందులు వాడవలసి వస్తోంది. ఇలా తిరగటి
ట్టకుండా ఏదైనా సలహా చెస్తారా?

* గ్యాస్ట్రయిటిస్ వ్యాధి కేవలం నోటి ద్వారా మాత్రమే కదు
పులోకి ప్రవేశిస్తోంది. దొంగ ఏదారిన వస్తున్నాదో ఆ దారిని ముందు
మూసేయాలి కదా! కాబట్టి ఆహార పానీయాల విషయంలో తగిన
జాగ్రత్తలు తీసుకోండి. హోటళ్ళలోనూ అలాగే, రోడ్డు పక్కన బళ్ళ
మీదవి తినటం పూర్తిగా మానేయండి. ఇంట్లో శుచిగా వండినవి
మాత్రమే తినండి. త్రాగు నీరుస్వచ్ఛంగా ఉండాలి. వ్యక్తిగత పరిశు
భ్రత అవసరం.
పుల్లనివి, పులిసినవి, ఊరబెట్టినవి గ్యాస్ట్రయిటిస్ వ్యాధిని తీర
గబెడతాయి. కష్టంగా అరిగే పదార్థాలన్నీ ఈ వ్యాధిని పెంచు
తాయి. తేలికగా అరికేవి
తినాలి. పాలకు బదులు మజ్జిగ
ఎక్కువగా
తీసుకోండి. పెరుగు
కన్నా చిలికిన మజ్జిగ మంచిది.
ఫ్రిజు చల్లదనం తగ్గాకే మజ్జిగ
తాగండి. ఇడ్లీ, అట్టు, పూరీ,
ఉప్మాలకు బదులు, రాత్రి
వండిన అన్నంలో పాలుపోసి
తోడు పెట్టి ఉదయాన్నే పులవక
ముందే తినటం ఉత్తమం. మజ్జి
గలో నానబెట్టి కూడా తినవచ్చు. తాలింపు పెట్టి రుచిగా చేసుకోవచ్చు. రోజూ
బార్లీ జావగానీ, సగ్గుబియ్యం జావగానీ, మరమరాలు లేదా బొరుగులతో జావ
గానీ కాచుకుని పెరుగు వేసి చిలికిన చిక్కని మజ్జిగ తాగండి. చలవ చేసే వన్నీ
ఈ వ్యాధిని తగ్గిస్తాయి. వేడి చేసేవి పెంచుతాయి. కందికట్టు లేదా పెసరకట్టు
(చింతపండు వేయని పప్పుచారు) అన్నంలో తినండి. అన్ని కూరలు తినదగినవే
పులుపు లేనివి, పులుపు కలపకుండా వండినవీ ఈ వ్యాధిని తగ్గిస్తాయి. పులుపు
కోసం దానిమ్మగింజలు, వెలగపండు, ఉసిరికాయ నల్లపచ్చడి పరిమితంగా
తీసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి మసాలాలు అతిగా తినటం వలన, వేపుడు కూరల
వలన, ఊరగాయల వలన ఈ వ్యాది తిరగబెడ్తోంది.

11, డిసెంబర్ 2015, శుక్రవారం

PARAGADUPUNA IVI VADDHU


క్షణం తీరికలేని జీవనశై
లిలో భాగంగా చాలా
మంది ఆరోగ్యం, తీసుకునే
ఆహారం పట్ల దృష్టి
పెట్టరు. ఎప్పుడు ఏం తీసు
కుంటున్నారన్నది పట్టిం
చుకోరు. కానీ పరగడు.
పున తీసుకునే ఆహారం,
చేసే పనుల మీద శ్రద్ధ
పెట్టడం మంచిది.
ఆలస్యంగా లేచినప్పుడూ, అలవాటులో భాగం
గానైనా పరగడుపున సోడా, ఇతర శీతల పానీ
యాల్ని తాగకూడదు. వాటి వల్ల జీర్ణాశ
యంలో హాని చేసే ఆమ్లాలు విడుదలవు
తాయి. ఇవి చాలా అనారోగ్య సమస్యలకు
కారణమవుతాయి. వికారం, వాంతుల వంటివీ
బాధిస్తాయి. వీటన్నిటి కంటే మంచినీళ్లు తాగడం
మొదట గ్లాసు నీళ్లు తాగి.. ఓపదినిమిషాల
తరవాత వీటిని తీసుకోవాలి.
పుల్లని పదార్థాల వల్లా ఉదయం పూట జీర్ణ
వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా
టొమాటోలను పరగడుపున తీసుకోకుడదు.
చాలామంది టొమాటో బాత్ లేదా, టొమాటో
రైస్ వంటివి తింటుంటారు. ఇలాంటివి తినే
ముందు కాసిని పాలు తాగడమో. వేరే పదార్థ
మేదైనా తినడమో చేయాలి.
కొందరు నిద్రలేవగానే వాకింగ్ లేదా జాగం
కు వెళ్లిపోతారు. అలాకాకుండా ఓ కప్పు గ్రీన్
టీ తాగి వెళ్లడం మంచిది. యోగా చేయడానికి
ముందూ ఇలానే చేయాలి. పొట్టలో ఏమీ
లేకుండా పరగడుపున వ్యాయామం చేయడం
వల్ల కొవ్వు త్వరగా కరగదు.
పరగడుపున అరటి పండు జోలికి వెళ్లకూ
డదు. అరటి పండులో మెగ్నీషియం
ఉంటుంది. అది పొద్దున్నే శరీరానికి ఎక్కువ
మోతాదులో అందడం మంచిది కాదంటారు.
ఆరోగ్య నిపుణులు.

4, డిసెంబర్ 2015, శుక్రవారం

SUGAR VYADHI - NALLA PACHADI - AYURVEDIC USE

 

shuగరు వ్యాధి ఉన్న వారికి నల్లపచ్చడి పెట్టవచ్చా?"

* షుగరు వ్యాధి ఉన్నవారికి ఉసిరి అమోఘమైన ఔషధం. ఆమలకి అని పిలిచే
ఉసిరికాయని తొక్కి గింజ తీసి
ఉప్పు కలిపి తాలింపు పెట్టిన
నిల్వ పచ్చడి కొద్దిగా నల్లగా
ఉంటుంది. కాబట్టి దాన్ని నల్లవు
చ్చడి అన్నారు. ఉసిరితొక్కు
పచ్చడి అని కూడా అంటారు.
రోజూ కనీసం ఒక చెంచా పచ్చ
దినైనా తినటం అవసరం. నిల్వ
పచ్చడి అయినా సాధారణంగా
కడుపులో మంటను తీసుకు
రాదు. ఊరగాయ మాదిరి తయారు చేసింది ఇబ్బంది పెడుతుంది. ఈ తేడాని
మొదట గమనించాలి. ఉసిరికాయ శరీరంలో విషదోషాలను హరించే యాంటీ
ఆక్సిడెంట్ ఔషధంగా అందరికీ తెలిసిందే! కానీ ఆయుర్వేద శాస్త్రం ఈ ఉసిరికాయ
పొదిలో ఎత్తుకు ఎత్తు మంచి పసుపును కలిపి షుగరు వ్యాధిలో శక్తి ఉత్పత్తికి,
తోడ్పడే ఒక గొప్ప ఔషధం తయారుచేసింది. దాన్ని నిశామలకి చూర్ణం అన్నారు.
రోజూ ఒక చెంచా మోతాదులో ఈ పొడిని ఏదో ఒక విధంగా కడుపులోకి తీసు
కుంటే మంచి సహాయకారి. ఉసిరి నల్లపచ్చడిలో కూడా పసుపు కలిపి కొత్తిమీర
వేసి తాలింపు పెట్టుకుని తింటే షుగరు వ్యాధికి మంచి ఔషధం వాడుతున్నట్టేనని
గమనించాలి.

FUNGUS INFECTION - AYURVEDIC SOLUTIONS



ఫంగస్ ఇన్ఫెక్షన్
తగాలంటే
* చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు
అది తగ్గడానికి గోరింటాకును మెత్తగా
నూరి ఇన్ఫెక్షన్ ఉన్న చోట రోజు రెండు
పూటలా రాయాలి. ఇలా నాలుగైదు
రోజులు చేస్తే ఇన్ఫెక్షన్ తొలగుతుంది.
+ వేపాకులను మెత్తగా నూరి ఇన్ ఫెక్షన్ ఉన్న
చోట రాత్రి పూట రాసి అలాగే దాన్ని
ఉండనివ్వాలి. మర్నాడు ఉదయం
కడిగేయాలి. ఇలా నాలుగైదు రోజులు
చేస్తే ఇన్ ఫెక్షన్ పోతుంది.
* చల్లని పదార్థాలు, పుల్లని ఆహారం.
పెరుగు వాడరాదు. ఇన్ ఫెక్షన్ ఉన్న చోట
వెచ్చని నీటితో కడిగి శుభ్రంగా తడి
లేకుండా తుడిచి వేయాలి.

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...