5, జనవరి 2016, మంగళవారం

పాలకూర తినకూడని వ్యాధులు / PALAKOORA - THINAKOODANI VYADHULU .

పాలకూరను జీవంతి అంటారు.పేరుకుతగ్గ ఆహారద్రవ్యం ఇది.గొప్ప బలకరమైన ఔషధాల్లో పాలకూర ఒకటి.ఎదిగే పిల్లలకు తప్పనిసరిగా తినిపించాలి.క్యాన్సర్ లాంటి ఉద్రేక స్వభావం ఉన్న వ్యాధుల్లో ఉపశమనం కలిగిస్తుంది.క్యాన్సర్,స్థూలకాయం,బిపి,షుగరు వ్యాధి,గుండె జబ్బులు,అల్సర్లు,జీర్ణకోశ వ్యాధులు ఇలా అనేక వ్యాధులకు పాలకూరలో ఔషధ గుణాలున్నాయి.కె విటమిన్ తో పాటు శరీరానికి కావలసిన పోషక విలువలన్నీ ఉన్నాయి.రక్షనయంత్రాంగం పాలకూరలో పుష్కలంగా ఉంది.ఇది బాగా చలవ చేస్తుంది.సాధారణంగా అన్ని వ్యాధుల్లోనూ తినతగినదిగా ఉంటుంది.కొన్ని ఔషధాలతో ఇది రసాయన చర్యలు జరుపుతుంది.దానివల్ల ఆయా ఔషధాలను బట్టి ,వ్యాధులను బట్టి కొన్ని ప్రభావాలుంటాయి.చక్కెర వ్యాధిలో వాడే మందులతో పాటు పాలకూరను తీసుకుంటే చక్కెర స్థాయి బాగా తగ్గుతుందని పరిశోధనల్లో తెలిసింది.కాబట్టి షుగర్ బార్డర్ లైన్ లో ఉన్న వాళ్ళు పాలకూర తిన్నప్పుడు ఔషధాల మోతాదుని డాక్టర్ సలహా మేరకు మార్పుచేసుకోవాల్సి రావచ్చు.షుగరు సరిగా కంట్రోల్ లో లేని వాళ్ళు పాలకూరను తినటం అలవాటు చేసుకోవాలి.గుండె జబ్బులు,బిపి వ్యాధుల్లో రక్తం గడ్డకట్టే ప్రక్రియను నెమ్మది చేసేందుకు కొన్ని ఔషధాలు వాడతారు.దీని చలువచేసె స్వభావరీత్యా రక్తస్రావాన్ని ఆపే స్వభావం కలిగి ఉంటుంది.దీనిలోని కె వితమిన్ ఇందుకు తోడ్పడుతుంది.ఇది రక్తం గడ్డ కట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుందన్నమాట.రక్తం గడ్డ కట్టే ప్రక్రియను ఆలస్యం చేసే మందులు ,వేగవంతం చేసే ఆహరమూ రెండూ విరుద్ధ స్వభావాలను కలిగినవవుతాయి.అలాంటప్పుడు ఆ రోగులకు మాత్రమే పాలకూరను తగ్గించాలని వైద్యులు చెబుతారు.అలాగే మూత్రపిండాల్లో కాల్షియం ఆగ్జలేట్ రాల్లు ఉన్నవాళ్ళకి పాలకూరను తినవద్దని చెబుతారు.

అధిక రక్తపోటుతో బాధపడే వారికి పొటాషియం ఉన్న పాలకూర బిపి ని తగ్గించడానికి బాగా తోడ్పడుతుంది.బిపి రోగులు పాలకూరను తప్పని సరిగా తినాలి.కానీ మూత్రపిండాలు బాగా చెడిపోయి సోడియం,పొటాషియం సమతుల్యతలో తేడాలేర్పడతాయి.డయాలసిస్ మీద ఉన్న రోగులకు సోడియం నిలవలు తగ్గిపోయే పరిస్థితి వస్తే పాలకూరను వద్దంటారు.ఇలా పాలకూరను  తప్పనిసరిగా మానాల్సిన వ్యాధుల్లో మాత్రమే వైద్య్లు ఆ విధంగా సూచిస్తారు.దాని అర్థం పాలకూరతో కిడ్నీలో రాళ్ళొస్తాయి,కిడ్నీలు చెడిపోతాయని కాదని గుర్తించాలి.

SHANAGA PINDI MANCHI CHEDU - AYURVEDAM

శనగపిండి మంచి - చెడూ

శనగపిండి మంచి ప్రొటీన్లతో కూడిన ఆహారం కదా! వైద్యులు దాన్ని
తినవద్దని ఎందుకు చెప్తారు?
* శనగపిండి తినకూడని చెడ్డ ఆహార పదార్ధం కాదు. ఆ మాటకొస్తే ఏ ఆహారద్రవ్యాన్ని తినకూడనిదిగా ముద్ర వేయటము మంచిది కాదు. మీరన్నట్టు
శనగపిండి మంచి పోషక విలువలు కలిగిన ఆహార ద్రవ్యమే!
సహజంగా శనగపిండితో చేసిన వంటకాలు కష్టంగా అరిగే స్వభావం
ఆకలి కలిగిన వారికి దీన్ని నిరభ్యంతరంగా పెట్టవచ్చు. తిన్న తరువాత
కలిగి ఉంటాయి. అయినప్పటికీ, ఉర్ణశక్తి బలంగా ఉన్నవారికీ, అతి
ఎలాంటి ఇబ్బంది కలిగించనప్పుడు దాన్ని మానాలని చెప్పాల్సిన అవ
సరం లేదు. జఠరాగ్ని బలహీనంగా ఉన్న వారికి మాత్రమే దీని జాగ్రత్తలు
వర్తిస్తాయి.
పోషక విలువలు ఉన్నవన్నీ అరిగించుకోగల స్థితిలో వ్యక్తి
ఉన్నప్పుడే
..వంటబడతాయి. కాబట్టి, అరిగించుకోగల
వారికి వర్తించే విషయాలు అగ్నిబలం తక్కువగా ఉన్నవారికి
వర్తించవని అర్ధం చేసుకోవాలి. అలాంటి వాళ్లకు శనగలు, శనగపప్పు, శనగపిండి
అపకారం చేసేవిగానే ఉంటాయి. జీర్ణశక్తి ననుసరించి, శనగపిండి తినడమో మాన
డమో ఎవరికివారు నిర్ణయించుకో
అని చెప్పవచ్చు. 
శనగపిండి వేడి శరీర తత్వం ఉన్న
వారికి కడుపులో ఆమ్లాన్ని పెంచు
తుంది. వాత శరీరతత్వం ఉన్నవారికి
కీళ్ళవాతం ఇతర వాత బాధలను
పెంచుతుంది. కఫతత్వం ఉన్నవారిలో
మందగుణం, ఉత్సాహం, చలాకీ
తనం లేకుండా చేస్తుంది. షుగరు,
బీపీ, అర్ధరయిటీస్, ఎలర్జీలు, పేగుపూత, స్థూలకాయం వగైరా వ్యాధులున్నవారికి
అపకారం చేస్తుంది. చిక్కిపోతున్నవారికి, శుష్కించిపోతున్న వారికి జీర్ణశక్తిని పెంపొం
దేలా చికిత్స చేస్తూ శనగపిండితో వంటకాలు చేసి పెట్టవచ్చు.
శరీర శ్రమ ఎక్కువగా ఉండేవాళ్ళు, ఏది తిన్నా అరిగించుకోగలవాళ్ళకు శనగ
పిండి మేలే చేస్తుంది. ఆయుర్వేదశాస్త్రంలో చెప్పిన చికిత్సా సూత్రం ప్రకారం,
ప్రయత్న పూర్వకంగా రోగి జఠరాగ్ని బలాన్ని కాపాడవలసి ఉంది. అగ్ని బలం పెరి
గితే, రోగి బలం పెరిగి, రోగ బలం తగ్గుతుంది. అప్పుడు వ్యాధిని తగ్గించటం తేలికవు
శనగపిండి ప్రస్తావన దీర్ఘ వ్యాధుల విషయంలో వచ్చినప్పుడు జీర్ణశక్తిని బట్టి తినా
తుంది.అప్పటికప్పుడు ముంచుకొచ్చిన వ్యాధుల్లో అగ్నిబలం ముఖ్యం
కాబట్టి శనగపిండిని ఆపాలని చెప్పవచ్చు.. ఏ వ్యాధులూ లేనివాళ్లకు, మంచి జీర్ణశక్తిఉన్నవాళ్లకు శనగపిండిని నిరభ్యంతరంగా వాడుకోవాలని చెప్పవచ్చు.

2, జనవరి 2016, శనివారం

THYROID JABBU - AHARA NIYAMALU - AYURVEDAM



* అయోడిన్‌ తగినంత సరీమాణంలో అహారం ద్వారా అందనష్పుడు 
గ్రంథి వాచిపోయి అనేక రుగ్యతలకు దారి తీస్తుంది. శరీరంలోని జీవనక్రియే లన్నింటికీ ఈ థైరాయిడ్‌ గ్రంథి అధార భూతంగా ఉంటుంది. దాని పని తీరు తగ్గిపోతే మెదడు, నరాలు, చర్మం, వెంట్రుకలు కడుపులోని అనేక అవయ వాల మీద దాని ప్రభావం చెడుగా ఉంటుంది. మీకు డాక్టరుగారు రాసి చ్చిన మాత్రలు అయోడిన్‌ మాత్రలు కావు, అవి థైరాక్సిన్‌ అనే హార్మోను మాత్రలు థైరాయిడ్‌ గ్రంథి నరిగా పనిచేయకపోవటం వలన ఈ హార్మోను ఉత్పత్తి తగ్గిపోతోంది. అది ఎంత మేర అవనరమో అంతకు తగ్గ మోతాదులో ఆ బిళ్లలు వాడుకోవాలి. ఎక్కువైనా ప్రమాదమే... తక్కు వైనా ప్రమాదమే! 
" ఆమోడిన్‌ కలిసిన ఉప్పు వాడటం వలన ,  తైరా 

క్సిన్‌ హార్మోన్ల ఉత్పత్తి లోపం కలగదని ఆ విధంగా అయోడిన్‌ ష్పుని వాడేస్తున్నారు. కానీ థైరాయిడ్‌ దెబ్బతినటొనికి అయోడిన్‌ లోపం ఒక్కటీ కారణం కాదు. మన జీవన విధానం, మన ఆహార విహారపు అలవాట్లు, బజార్లో 
మనం కొనుక్కుంటున్న ఆహార ద్రవ్యాలు అన్నీ అంతో ఇంతో కారణం అవుతు న్నాయి. విషరసాయనాల కల్తీలు, రంగులు కలిసిన ఆహార పదార్థాలు, వాతావరణ 
కాలుష్యం లాంటివి కూడా కారణాలవుతున్నాయి. గత 80 యేళ్లుగా అయోడిన్‌ కలి సిన ఉప్పే వాడుతున్నప్పటికీ, 
రోజురోజుకీ థైరాయిడ్‌ గ్రంథి % చెడిపోతున్నరోగుల సంఖ్య పెరు 
గుతోందే గానీ తగ్గటం లేదు, గొ అందుకే, అయోడిన్‌ ఉప్పుకీ ష్‌ థైరాయిడ్‌ కోసం వాడే మందు ౯ లకూ సంబంధం లేదు. దేని దారి 
దానిదే. 

థైరాయిడ్‌ వ్యాధిలో ప్రthyekamaina ఆహారం అంటూ ఏమీ లేదు. సా ధ్యమైనంత వరకూ కాయగూరలకు, అకుకూరలకూ ప్రాధాన్యత ఇచ్చేలా bhoja నం తీరుని మార్పు చేసుకోవాలి. ఫైబర్‌ ఎక్కుvaga ఉండే ఆకుకూరలు, కాషగూ రలూ, వళ తినండి. రాగి, జొన్న నజ్జ ధాన్యాలు ఈ వ్యాధిలో కొంత మేలు చేస్తాయి 

6 రుచులూ కలిసిన ఆహారాన్ని ఆయుర్వేదంలో సమతుల్య ఆహారం (బ్యాలెన్స్‌ ల అంటారు. వగరూ, చేదు రుచులు కలిగిన పదార్థాలు కూడా తగినంతగా భోజ ర తో ఉందేలా చూసుకోండి. బాగా చిలికిన, పలచని మజ్జిగ వగరు రులి కలిగి వ్రయోజనకరంగా ఉంటుంది. అయోడిన్‌ ఉప్పుని ఆపకండి. జీర్ణశన్ని baలంగా ఉండేలా చూసుకుంటే థైరాయిడ్‌ బాగా అదుపులో ఉంట్రుంdi. 

AVAKAYA / VOORAGAYA PACHADI - AYURVEDAM



* మనకే కాదు, క్లియోపాత్రకి దోసావకాయ అంటే మహాప్రీతి
అని చరిత్రకారులు చెప్తారు. ఊరుగాయలు ప్రపంచ ప్రాచీన ఆహార
పదార్ధం. పళ్ళూ, కాయలూ, మాంసం దొరకని అన్ సీజన్లో కూడా
వాటిని కమ్మగా తినేందుకు ఊరుగాయ ప్రక్రియని మన పూర్వులు ఉప
యోగించుకున్నారు.
కూరగాయ మొక్కలు తరిగి ఉప్పు పట్టించి నిలవబెట్టడాన్ని ఊరపె ర్ధదం అంటారు. ఉప్పు తగలగానే కూరగాయ ముక్కల్లోంచి నీరు ఆస్మాసిన్‌ వద్ధతిలో బయటకు వచ్చేన్తుంది. నీటిని పిండేసి ఆవసెండి, మంతిపిండిలొంటి సుగంధ ద్రవ్యాలను కలిపితే అది ఊరు 
గాయ (వికిల్‌. పికిల్‌ అంటే ఉప్పులో ఊరపెట్టటం అని అర్ధం. మూగాయని ఊరుగాయగా మొదలుపెట్టి మామిడి ముక్కలోని నీరంతా తీసేనీ 
టి చివరికి ఆ ఒరుగుల్ని మళ్ళీ ఆ పుల్లటి నీళ్ళలోనే వేసి తాలింపు పెడుతు 
న్నారు. అంటే ఊరుగాయని
పుల్లగాయగా మారుస్తున్నారు.
ఊరబెట్టినదాంట్లో మెంతిపిండి
వగైరా కలిపి తాలింపు పెట్టు
కుంటే ఆ మాగాయిలో పులుపు
సమానంగా ఉంటుంది. రుచిగా
ఉంటుంది. ఉప్పు, కారాలు
తక్కువ పడతాయి. ఆరోగ్యానికి
హాని చెయ్యదు.

 ఊరుగాయల్లో ఉత్తమమైంది. ఉసిరికాయతో పెట్టిన ఊరుగాయ. ఉసిరికాయ
లోపలి గింజలు తీనేని ఉప్పు కలిపి ఊరబెట్టి, తొక్కి నిలవబెడతారు. అందుకని
తొక్కుడు పచ్చడి, నల్లపచ్చడి అని కూడా పిలుస్తారు. ఊరుగాయని జాడీలో వాసెనా
కట్టి ఆరునెలలు మాగేలా చేస్తారు. ఎప్పటికప్పుడు కొద్దిగా ఇవతలకు తీసి, కొత్తిమీర వగైరా కలివి తాలింపుపెట్టి తాజాదనాన్ని కాపాడుకుంటూ ఉంటారు. పాతబడి. ఉనీరి తొక్కు, చింతకాయ తొక్కు, చూమిడి తొక్కు, ఇంకా కంద, వెలగ, టమోటా వంకాయ, దోనే, నిమ్మ, కాకర ఇలా రకరకాల కాయగూరలతో లేదా పళ్ళతో ఊర గొయలు పెడుతుంటారు. 
ఆవకాయకన్నా, తొక్కు పచ్చడి లేదా నల్లపచ్చడి ఆరోగ్యదాయకం. గోంగూరని
ఉప్పుతో ఊరబెట్టి చింతపండు రసం పోసి నిలవ పచ్చడి పెడితే అది తప్పకుండా అప
కారం చేస్తుంది. పులుపుని తగ్గించడానికి ప్రయత్నిస్తే ఊరుగాయలు మేలు చేస్తాయి.
పులుపు పెరిగే కొద్దీ ఉప్పూకారం నూనెల మోతాదు పెరుగుతుంది. వాటివలన
మరింత చేటు కలుగుతుంది. కానీ, కూరగాయల్లో చేసిన ఊరుగాయలు పేగులకు
బలం ఇచ్చి విరేచనం అయ్యేలా చేస్తాయి. జీర్ణశక్తిని కాపాడతాయి. సౌర, బీర, ద్రాక్ష
బొప్పాయి, అరటి, బూడిద గుమ్మడి లాంటి కూరగాయలన్నింటితోనూ మేలు చేసే
విధంగా ఊరుగాయలు పెట్టుకోవచ్చు.

23, డిసెంబర్ 2015, బుధవారం

GORU VECHANI NEERU / WARM WATER - HEALTH BENEFITS


గోరువెచ్చని నీళ్లు
తాగితే మేలే!


రోజులో
ఎన్ని
గ్లాసుల నీళ్లు
తాగితే అంత
మంచిది.
అయితే ఓ
గ్లాసు వేణ్నీళ్లు
కూడా ప్రతి
రోజూ తీసుకుంటే మరింత మంచిదంటు
న్నారు వైద్య నిపుణులు. రోజూ ఇలా చేయడం
వల్ల ఆరోగ్యానికెంతో మేలు జరుగుతుంది.
ఉదయం లేవగానే చాలామంది గోరువెచ్చని
నీళ్లు తాగుతారు. నిజానికి భోంచేశాక తాగడం
వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అరుగుదలలో
ఇబ్బందులుండవు. శరీరంలో రక్తప్రసరణ బాగుం
టుంది. మలబద్దకం సమస్య దూరమవుతుంది.
చిన్నారులకు కూడా వేణ్నీళ్లు తాగే అలవాటు
చేయడం మంచిది. చురుగ్గా ఉంటారు.
ఆ శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు
రకరకాల సమస్యలు బాధిస్తాయి. గోరువెచ్చని
నీళ్లు తాగడంతో ఈ వ్యర్థాలను దూరం చేసుకో
వచ్చు. చర్మ సంబంధిత
సమస్యలు తగ్గు
ముఖం పడతాయి. రోజూ మనం తీసుకునే ఈ
గ్లాసు వేణ్నీళ్లలో నాలుగైదు చుక్కల నిమ్మరసం
కలపడం వల్ల చర్మానికి కొత్త కళ వస్తుంది.
శ్వాస, గొంతు సంబంధిత సమస్యలు బాధ
పెడుతున్నప్పుడు వేణ్నీళ్లు తాగాలి. దానితో హాని
చేసే ఇన్ ఫెక్షన్లు నశిస్తాయి. తెమడ కూడా
త్వరగా బయటికొచ్చి ఉపశమనం లభిస్తుంది.
నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుం నొప్పి
బాధిస్తున్నప్పుడు గోరువెచ్చని నీళ్లు తాగితే
సమస్య తగ్గుముఖం పడుతుంది. ఉదయం పూట
తాగడం వల్ల జీవక్రియల రేటు వృద్ధి చెందు
తుంది. రాత్రి పడుకునే ముందు తాగితే హాయిగా
నిద్రపడుతుంది.

22, డిసెంబర్ 2015, మంగళవారం

TOMATO VANTA - AYURVEDAM



? టమాటాలను వందకూడదంటారు. నిజమేనా?
* టమాటాల్నే కాదు, సి.విటమిన్ పుష్కలంగా ఉన్న ఏ ఆహార ద్రవ్యాన్ని అధిక ఉష్ణో
గ్రత దగ్గర వండకూడదు. 50
నుండి 70 డిగ్రీల సెంటీగ్రేడ్ట
మధ్య వందితే వాటిలో ఉండేని
విటమిన్ మనకు దక్కుతుంది.
ఎక్కువ ఎండలో ఎక్కువసేపు
ఎండ పెట్టినా సి విటమిన్ మనకు
దక్కకుండా పోతుంది. అలాగని
గడ్డ
కట్టేంత చల్లదనంలో అంటే
డీప్ ఫ్రిజ్ఞులో పెట్టినా కూడా
విటమిన్ దక్కదని పరిశోధకులు చెప్తున్నారు.
చారు, పప్పు, కూరలాంటివి వండుకునేప్పుడు టమాటా ముక్కల్ని కుక్కరులో
ఉంచి ఉడికించటం వలన అందులోని విటమిన్ ఎగిరిపోతుంది. సి విటమిన్లకపోతే
టమోటాలో రుచి కూడా చచ్చిపోతుంది. చారు గానీ, పప్పు గానీ కూరగానీ వండుకో
వటమే అయ్యాక చివరికి దింపేప్పుడు టమాటా కలిపి కొద్దిసేపు ఉంచి దింపేస్తే
టమాటా తిన్నందువలన అసలు ప్రయోజనాలు దక్కుతాయి. అసలైన రుచి కూడా
దక్కుతుంది.
టమాటాని ఎక్కువ నీళ్లలో ఉడికించకండి. సన్న సెగన నిదానంగా
వండండి. ఓవెన్లో అధిక ఉష్ణోగ్రత దగ్గర టమోటాను వండకండి. వండిన
పదార్థాన్ని తిరిగి వేడి చేయటం (రీ హీటింగ్ గానీ తిరిగి వండటం (ఈ
కుకింగ్ గానీ చేయకండి. టమాటాలను ఎక్కువగా కొని ఫ్రిజ్రుల్లో
పెట్టుకోవడం మంచిది కాదు. తాజాగా కొనుక్కోవటమే మంచిది. ని
విటమిన్న మనం ఎంత దక్కించుకోగలమనే దాని మీద దృష్టి పెట్టి
టమాటాలను వండుకోవాలి.

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...