27, అక్టోబర్ 2016, గురువారం

గర్భవతులు ఎక్కువ తినాలా?


 గర్భవతులకు ఎక్కువ అన్నం పెట్టాలా?
మామూలుగా తింటే కడుపులో బిడ్డకు
సరిపోదా?

గర్భం దాల్చిన సమయంలో గర్భవతులకు
అదనపు ఆహారం అవసరమే! ఇద్దరు మనుషుల
తిండి తినాలని దీని భావం కాదు. బిడ్డ ఎదుగుద
లకు కావలసిన పోషకాలు అందేందుకు, పోషక
విలువలు కలిగిన అదనపు ఆహారం అవసరమే!
అట్టడుగు ప్రజలే కాదు, మన సమాజంలో
మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి స్త్రీలక్కూడా
పోషకాహార లోపం ఎక్కువగానే ఉంటోంది. చదువు
కున్నవారు, స్థితిమంతులు కూడా అనాలోచిత
వ్యామోహాలతో పోషక విలువలు లేని జంక్ ఫుడ్స్
మీద యావ వదులుకోలేకపోతున్నారు. పిజ్జాలు,
రోటీ కర్రీలే కాదు, ఇంట్లో తినే బజ్జీలు, పునుగులు
కూడా జంక్ ఫుడ్స్! గర్భం దాల్చిన సమయంలోనూ,
బిడ్డకు పాలిచ్చే సమయంలోనూ ఇలాంటి ఆహా
రాన్ని ఎక్కువగా తింటే స్థితిమంతులక్కూడా పోష
కాహార లోపం కలిగే ఆవకాశం ఉంది.
బిడ్డ తక్కవ బరువుతో అరకొర ఎదుగుదలతో
పుట్టాడంటే తల్లి ఆహార లోపం కూడా ఒక కారణం
కావచ్చునని అర్ధం చేసుకోవాలి. నిండు చూలాలు
గనక 10 కిలోల బరువు పెరిగితే కడుపులో బిడ్డ 3
కిలోల వరకూ బరువు పెరగటం అనేది ఆరోగ్యదా
యకంగా జరగాలి. మొదటి 3నెలల్లో ఒక అర
గ్రాము ప్రోటీను, నాలుగోనెల నుండీ 6వనెల వరకూ
7గ్రాముల ప్రోటీను 6వనెల నుండి ప్రసవించే
వరకూ 23 గ్రాముల ప్రోటీను అవసరం అవుతా
యని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండి
యన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి సూచన.
ఐరన్, కాల్షియం, ఎ విటమిన్, అయోడిన్ ఇతర ఖని
జాలు కూడా తగుపాళ్ళలో గర్భవతులకు అందాలి.
ఇందువలన బిడ్డలకు పుట్టుకతోనే వచ్చే వ్యాధులు,
తక్కువ బరువుతో పుట్టటం, అవయవ లోపాల్లాంటి
సమస్యలన్నీ నివారించవచ్చు.
ఆర్థిక స్తోమత లేకపోవటం, వాంతులు, గ్యాస్,
తినబుద్ధి కాకపోవటం, వండుకునే ఓపిక లేకపోవ
దాల వలన కూడా గర్భ
వతులు పోషకాహారం
తీసుకోలేకపోతున్నారు.
అతిగా మసాలాలు,
కారాలు, అమిత పులుపు
తిన్నప్పుడూ కడుపులో
పెరిగే బిడ్డ ఎక్కువ కదిలి
పడతాడు.
ఇబ్బంది
.
ఇబ్బంది పెడతాడు కూడా!
గర్భవతుల ఆహారం అంటూ ప్రత్యేకంగా ఏది
వ ఉండదు.
రోజు వారి తీసుకునే ఆహారంలోనే కూర
గాయలు, ఆకుకూరలు, పళ్ళు, పాలు తగినంతగా
ఉండేలా చూసుకోవాలి. తేలికగా అరిగే పద్ధతిలో
వండుకుంటే కడుపులో గ్యాసు ఏర్పడదు. అన్నం
-తక్కువ, కూర పప్పు ఎక్కువగా తినేట్లు వండుకో
వాలి. మంచి నెయ్యి వాడకం కూడా మంచిదే! తేలి
త కపాటి మాంసం, గ్రుడ్లు తీసుకోవచ్చు. ఆహార పదా
ర్ధాల ద్వారా సహజంగా వచ్చే పోషకాలు వంటబట్టి
-, నట్టు ఔషధ రూపంలో తీసుకునే విటమిన్లు వగైరా
- వంటబట్టవని గుర్తించాలి. పొట్టు తీయాల్సిన అవ
సరం లేని గోధమ, జొన్న, రాగి, సజ్జ వీటితో
తరుచూ చేతనైన వంటకాలు చేసుకు తినటం వలన
ఎక్కువ విటమిన్లు, పీచు పదార్థాలు, ఖనిజాలు శరీరా
నికి అందుతాయి.
పాలు, పెరుగు, చల్ల ఎక్కువగా తీసుకోవటం
వలన క్యాల్షియం తగినంత అందుతుంది. పొట్టలో

మృదుత్వం ఏర్పడుతుంది. ఉపయోగపడే బా!
రియా పేగులకు తగినంత అందుతుంది. గ్యాసు,
ఎసిడిటీ తగ్గుతాయి. మజ్జిగ లేదా పెరుగు తగినంత
తీసుకున్నప్పుడు మొత్తం ఆహారంలోని పోషకాలు
సమత్వాన్ని పొందుతాయి. మజ్జిగ మీద తేరిన నీటిని
తాగటం మంచిది. గర్భవతులు ఉప్పు తగినంత
తీసుకోవాలి. అకారణ ఉప్పు ద్వేషాన్ని కొందరు పని
గట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఉప్పు నిషేధాన్ని
లోకం మొత్తానికి వర్తింప చేయటం సరికాదు.
తరచూ బీవీ చూపించుకోవటం, బిడ్డ ఎదుగు
దల బాగా ఉందని నిర్ధారించుకోవటం, బరువుచూ
సుకోవటం, ధనుర్వాతం ఇంజెక్షను వగైరా తీసుకో
వటం ఇలా వైద్యుల పర్యవేక్షణలో ఉండటం
మంచిది. శరీరానికి కొంతలో కొంత వ్యాయామం
ఇవ్వటం అవసరం. ఏ ఆసుపత్రిలో ప్రసవం చేయిం
చుకోదలుచుకున్నారో ఆ వైద్యురాలిని మొదట్లో
లిసి ఆమె పర్యవేక్షణలో ఉండటం మంచిది. వైద్యు
లకు తెలియకుండా స్వంతంగానో, వారు వీరు
- చెప్పారనో ఏ మందులు వాడవద్దు. పోషక ఔష
ధాలు కొద్ది తప్ప సాధ్యమైనంతవరకూ ఆహారబలం
మీదే ఆధార పడటం అవసరం.
గర్భవతులకు, బాలింతలకు వాతపు నొప్పులు

సహజంగా వస్తుంటాయి. అజీర్తి చేసి ఆహార పదా
రైలు తిన్నప్పుడు వాతపు నొప్పులు పెరుగుతాయి.
ఒక క్యారట్, ఒక ముల్లంగి, ఒక యాపిల్ ఈ
మూడింటిని సమపాళ్ళలో తీసుకుని ఒక గ్లాసు
- జ్యూసు రోజు తాగితే గర్భవతులకు కావలసిన పోష
కాలు సమున్నతంగా అందుతాయి. ప్రసవించిన,
బిడ్డకు పాలిస్తున్నంత వరకూ రోజూ ఈ జ్యూసు
క తాగటం మంచిది. కాఫీ, టీలు, అడ్డపొగ ఇలాంటికి
- గర్భవతులుకు హాని చేస్తాయి. గుట్కాలు, పాన్ మసా
లాలు కడుపులో బిడ్డ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
-వాటికి గర్భవతులు దూరంగా ఉండాలి.


29, జులై 2016, శుక్రవారం

బిపి ఉందని తెలిశాక...

Kalaరా,ప్లేgu,క్షయ... ఇలా ఎన్నెన్నో రకాల
వ్యాధులు మనుషులను కబళించివేస్తుండేవి.
మానవాళి మనుగడకు ముప్పుగా మారిన ఆ వ్యాధుల
మీద జరిపిన పరిశోధనలు టీకా మందులతో, వియం
త్రణ మార్గాలనో కనుగొనటంతో పలురకాల భయం
కర వ్యాధులను అంతం చెయ్యగలిగాము.
అయితే వాటిని అంతం చేసిన అనందం అట్టే
కాలం విలవటంలేదు. కొత్త వ్యారులు బయటపడు
తున్నాయి. మనుషులకు కలరిస్తూనే వున్నాయి.
మనుషులను వేధించే అంటువ్యాధుల విషయంలో
తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ జాగ్రత్తలతో
- బయటపడగలుగుతున్నారు. కాని మానవుడికి మరో
కరినుండి సోకక తన శరీరంలోనే సమస్యలను తెచ్చి
-పెట్టేకొత్తరకం రోగాలు ఇప్పుడు వెంటాడుతున్నాయి.
- వాటిలో అధిక రక్తపోటు ఒకటి. ఇది వారి వారి శరీరా
వికి సంబంధించిన ఇబ్బందులు.
తాజా గణాంకాల ప్రకారం వయసులో వున్న
వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరికి అధిక రక్తపోటు
సమస్య వుంటు
న్నది. 65 ఏళ్ళ
లోపు మరణిonche

అదుగురిలో ఒకరి మరణానికి కారణం. ఆయన
రక్తపోటు, ఇంటిలో పెద్దలకు అనారోగ్యం కలిగినప్పుడు
మరో రకంగానో ప్రతి ఒక్కరం ఏదో ఒక సమయంలో
అధిక రక్తపోటు గురించి వినటమో లేక మాట్లాడట
చేస్తాము. కాని వాస్తవంలో రక్తపోటు అంటే ఏమిటి
దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటో తెలుసుకునే
గుండె కొట్టుకుంటుంటే మనిషి బతికి వున్నట్టు
వారు చాలా తక్కువగా ఉంటున్నారు.
రక్తపోటు సమస్యలు ఏర్పడిన తర్వాత వైద్యులు
దగ్గరికి పరిగెట్టేసరికే కొంత సమయం పడుతుంది
ఈలోగా జరగాల్సిన నష్టం జరగవచ్చు. దీర్ఘకాలం
మందులు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
ముందుజాగ్రత్త ముఖ్యం
రక్తపోటు గురించి మనిషి ఆరోగ్యంగా వున్న
సమయంలోనే తెలుసుకుని తగిన జాగ్రత్తలు వహిం
చటం మంచిది. రక్తపోటు ప్రతి మనిషిలో వుండే..
లెక్క గుండె గనుక కొట్టుకుంటుంటే రక్తంలో
రంలో ప్రవహిస్తుంటుంది.
శరీరంలోని రక్తనాళాలగుండా ప్రవహించేటప్పుడు
ఆ రక్తనాళాల గోడల మీద రక్తంవల్ల ఏర్పడే ఒత్తిడిని
రక్తపోటు అంటారు. ఆ రక్తపోటు లేకుంటే రక్తం
నాళాలగుండా ప్రవహించదు. కాబట్టి మనిషి బతం
లంటే రక్తపోటు వుండి తీరాల్సిందే.
రక్తపోటు గురించి అర్థంచేసుకునేందుకు గుండె
పనితీరును తెలుసుకోవటం అవసరం. శరీరంలోని
కీలక అంగం గుండె. నిరంతరం పనిచేస్తుంది.
మానవగుండెలో నాలుగు గదులుంటాయి. వీటిలో
పైన వున్నవి కుడి, ఎడమ కర్ణికలు, కింద వున్నవి
కుడి, ఎడమలుగా విభజించబడిన జరరిక.
కర్ణికలు, జఠరికల్లోకి కవాట సహిత రంధ్రాలు
ద్వారా తెరచుకుంటాయి. కుడి కర్ణిక శరీరంలోని
మలిన రక్తాన్ని అందుకుని కుడి జఠరికలోకి పంపు
తుంది. కుడి జఠరికనుండి మలినరక్తం ఊపిరితిత్తు
లలో శుద్ధి చేసేందుకు పంపబడుతుంది.
ఊపిరితిత్తులలో ఆక్సిజన్ గ్రహించి ఎర్రబడిన
రక్తం తిరిగి ఎడమ కర్ణిక, అక్కడినుండి ఎడమ జర్
రికలకు చేరి, అక్కడి నుండి శుద్ధరక్తం శరీర భాగాల
న్నింటికి పంపుతుంది. ఇదంతా గుండె '
లబ్
అని కొట్టుకునేటప్పుడు జరిగే ప్రక్రియ.
గుండె ఒక పంపింగ్ మిషన్వంటిది. గుండె కండ
రాలు, గుండెలోని కవాటాలు అన్నీ సక్రమంగా పని
చేస్తున్నప్పుడే గుండె సంపూర్ణ సమర్థతతో పనిచేస్తుంది. సాధారణ ఆరోగ్యవంతుని గుండె నిమిషా
వికి 60 నుండి 90సార్లు మధ్య కొట్టుకుంటుంది.
60 నుండి 60సార్లు కొట్టుకుంటే 3 నుండి 5
లీటర్ల రికాన్ని నిమిషానికి శరీరానికి సరఫరా చేస్తుంది.
శరీర అవసరాన్ని బట్టి గుండె కొన్ని సందర్భాలలో
మరింత వేగంగా కొట్టుకుంటుంది.
పరిగెట్టినప్పుడు, భయపడినప్పుడు గుండె దడ
అనిపించటం అందరికి అనుభవమే. గుండె నుండి
నేరానికి శుద్ధ రక్తం తీసుకువెళ్ళే రక్తనాళాలను ధమ
నులని, శరీరంలో మలినపడిన రక్తాన్ని తిరిగి గుండెకు
చేర్చే నాళాలను శిరలని అంటారు.
గుండె పంప్ చేసిన రక్తం నాళాలలో తరంగంలా
ప్రవహిస్తుంది. దీనివలన ఆరక్త ఒత్తిడికి నాళం గోడ
పడి లేస్తుంటుంది. అలా రక్తనాళాలకు పెరిగిన ఒత్తిడి
సమయం సెస్టోల్'గా తగ్గిన సమయం 'డయాస్టోల్'గా
పిలుస్తారు. సిస్టోల్' అంటే ఒత్తిడి అధికం, డయా
స్టోల్ అంటే ఒత్తిడి కనిష్ఠం.
రక్తపోటు అంటే...."
సాధారణ సమయంలో సిస్టోలిక్ పోటు 160
మి.మీ. హెచ్.జిగా సిస్టోలిక్ పోటు 90 మి.మీ. హెచ్.
జిగా వుంటుంది. ఎమ్.ఎమ్ హెచ్.జి అని రక్తపోటు
కొలతను చెపుతారు. ఇందులో హెచ్.జి అనేది పాద
రసం రసాయనిక గుర్తు. మి.మీ. కొలత.
రక్తపోటును కొలిచేందుకు వాడే పరికరంలోని
సన్ననినాళంలో పాదరసం ఎంత ఎత్తుకు చేరిందో అది
సూచిస్తుంది. 160/90 కన్నా ఎక్కువవున్నా ఆరో
గ్యంగావున్నవారు లేకపోలేదు. ఐతే 160/90ని సాధా
రణ రక్తపోటుగా పేర్కొంటారు. మానవుని రక్తపోటును
కొలిచే సాధనాన్ని స్పిగ్మోమానో మీటర్' అంటారు.
ఈ రక్తపోటు మనిషిలో స్థిరంగా వుండదు. విశ్రాం
తిగాపడుకున్నా, నిద్రిస్తున్నా రక్తపోటు తక్కువగా
వుంటుంది. నిలబడినప్పుడు, నడిచినప్పుడు, మెట్లు
ఎక్కేటప్పుడు, పరిగెడుతున్నా ఆదుర్దా, ఆనందం,
భయంవేసినా రక్తపోటు పెరుగుతుంది.
పనిచెయ్యటం ఆపినా, ఆ భావోద్వేగాలనుండి
-వెనక్కి వచ్చినా తిరిగి రక్తపోటు సాధారణమవుతుంది.
గుండె, రక్తనాళాలు సాధారణ ఆరోగ్యస్థితిలో వున్న
5ప్పుడు ఇటువంటి రక్తపోటు హెచ్చుతగ్గుల్ని తట్టుకుని
నిలబడగలుగుతాయి.
5 అలాకాక అధిక రక్తపోటు- ఎక్కువసేపు నిలిచి
వుంటే అది ప్రమాదానికి దారితీస్తుంది.
గుర్తించటమెలా! -
అధిక రక్తపోటు వుందని చాలామందికి వెంటనే
తెలియదు. కీలక అంగాలకు దెబ్బ తగిలేవరకు
తాము తీవ్ర రక్తపోటు బాధితులమని తెలుసుకోరు.
రక్తపోటు సమస్యను నైపుణ్యం కలిగిన వైద్యుడు
- మాత్రమే గుర్తించగలడు.
కాబట్టి రక్తపోటు విషయంలో అప్పుడప్పుడు పరీ
క్షలు చేయించుకోవటం అవసరం. కారణాలు
స్పష్టంగా తెలియదు కాని కొన్ని వర్గాలలో మాత్రం
రక్తపోటు సమస్య వుంది.
భారీకాయంగలవారికి, ఆర్థిక సమస్యలతో సత
మతమయ్యేవారికి, 65 సంవత్సరాలు పైబడినవారు,
వంశంలో అధిక రక్తపోటు లక్షణం వున్నవారు రక్త
పోటును మధ్యమధ్యలో చెక్ చేయించుకోవాలి.
అలాగని ఆ వర్గాలకు చెందనివారికి పరీక్షలు
అక్కరలేదని కాదు. శారీరకంగా, ఆరోగ్యపరంగా
కనిపించే కొన్ని లక్షణాలను అధిక రక్తపోటు లక్షణా
లుగా భావించి పరీక్ష చేయించుకోవటం అవసరం.
తరచుగా తలనొప్పి, విడవకుండా ఆ తలనొప్పి
వేధించటం, అర్థంలేని అలసట, తల తిరుగుడు,
ఒత్తిడికి గురికావటం వంటివి కనిపిస్తే రక్తపోటు
పరీక్ష చేయించుకోవాలి. ఏదైనా పనిచేస్తున్నప్పుడు
ఊపిరి అందక ఇబ్బందిపడుతుంటే అది రక్తపోటు
తీవ్రత లక్షణంగా తెలుసుకోండి.
సైలెంట్ కిల్లర్
అధిక రక్తపోటు అనేది ప్రమాదకరమైనది. ఎటు
వంటి హెచ్చరిక లేకుండా చాటుగా దెబ్బతీస్తుంది.
ఒకసారి అధిక రక్తపోటు సమస్య ఏర్పడితే దానిని
2917.2016
నియంత్రించుకుంటూ జీవితకాలమంతా భరించటం
తప్పించిదానిని పూర్తిగా తగ్గించుకునే మార్గం లేదు.
ముందస్తు హెచ్చరికలు చేయకుండా లోపల
కీలక అంగాలైన గుండె, మూత్రపిండం, మెదడు
లను దెబ్బతీస్తుంది. కాబట్టి హైబీపిని సైలెంట్
కిల్లర్ అని అంటారు.
రక్తపోటు పెరిగినపుడు రక్తనాళాలలో రక్త ప్రవాహ
నికి అడ్డంకి ఏర్పడుతుంది. అటువంటి సమయంలో
రక్తాన్ని నాలాలలోకి సరిగా పంప్ చేసేందుకు గుండె
మరింత కష్టపడాల్సి వస్తుంది. సాధారణ స్థాయిని 4.
మించిన ఒత్తిడిలో గుండె పనిచేసినందున గుండె
కండరాలు అలసిపోయి చివరికి పనిచేయటం మాని
వేస్తాయి. అప్పుడు గుండెపోటు వస్తుంది.
రక్తపోటు తీవ్రత ప్రభావాన రక్తనాళాలలో ఒత్తిడి
అధికమై రక్తనాళ గోడలనుండి సూక్ష్మంగా రక్తస్రావం
జరగవచ్చు లేదా రక్తనాళాలు చిట్లవచ్చు.
గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్త
నాళాలు దెబ్బతింటే, గుండెకు అవసరమైన శక్తి
లభించక గుండెపోటు వస్తుంది.
అధిక రక్తపోటు ప్రభావాన మూత్రపిండాల పని
తీరు పాడవుతుంది. అసలు పూర్తిగా దెబ్బతినవచ్చు.
మెదడులో రక్త ప్రసరణ సమస్యవల్ల పక్షవాతం
వస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారికి సాధా
రణ ఆరోగ్యవంతులకన్నా పక్షవాతం, గుండెపోటు
ఇబ్బందులు రెండురెట్లు అధికంగా వుంటాయి.
ఎందుకు వస్తుంది.
అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ అనేది రెండు
రకాలు. వీటిలో ఒకదానిని 'మాలిగ్నెంట్ హైపర్
టెన్షన్' అని ఇక రెండవ దానిని బినైన్ హైపన్షన్
అని అంటారు.
మాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుందో
సరిగా తెలియదు. కాని ఇది యవ్వనంలో వున్న
వారికి వస్తుంది. దీనివలన కంటి చూపు కొంతమేర
2. దెబ్బతింటుంది. మూత్రపిండాల పనితీరు మంద
గించి క్రమంగా పూర్తిగా పనిచెయ్యవు. ఊపిరాడక
ఇబ్బంది పడతారు. హైపన్షన్లో గతంలో పలు
వురు మరణించేవారు. ఇప్పుడు దీనిని నియంత్రించే
మందులు మార్కెట్లోకి వచ్చాయి.
'బినైన్ అనే ఆంగ్ల పదానికి అర్థం అంతగా ప్రమాద
హేతువుకానిదని. కాని వేలాది మంది ప్రాణాలు
బలికొంటున్న దీనిని 'బినైన్ అని ఎలా అనగలం.
అయితే గతంలో ఎందుకో ఆ పేరు పెట్టారు.
ఇప్పటికీ అదే స్థిరపడింది.
'బినైన్ హైపర్టెన్షన్' ఎటువంటి ఇబ్బందులను
ప్రారంభంలో చూపించదు. ఏదీ హరాత్తుగా జర
గదు. క్రమంగా పెరుగుతూ రక్తనాళాలను, గుండెను
దెబ్బతీసి చివరికి గుండెపోటు తెస్తుంది.
'బినైన్ హైపర్ టెన్షన్' వచ్చిన వారిలో 90శాతం
మందిలో ఎటువంటి ఇబ్బందులు కనిపించవు. ఇది
వంశపారంపర్యంగా వస్తుంది. అయితే 30 ఏళ్ళు
దాటేవరకు బయటపడదు. తల్లిదండ్రులు ఇరువురు
హైపర్ టెన్షన్' కలిగిన వారైతే సంతానానికి ఆ
ఇబ్బంది వచ్చే అవకాశం అధికం.
వంశపారంపర్యంగా హైబిపి' వుండి ఉప్పు అధి
కంగా తినే అలవాటు వుంటే హైపర్ష రావటం
ఖాయం. తాగే నీటిలో కాల్షియమ్, మెగ్నీషియమ్
లేకున్నా, కాడ్మియమ్ కలిగివున్నా హైపన్షన్
వస్తుంది. తీవ్ర భావోద్వేగాలకు గురయ్యేవారు. నిరం
తర ఒత్తిడికి గురయ్యేవారికి హైపర్టెన్షన్ వస్తుంది.
రక్తనాళాల గోడలు గట్టిపడినా, సాగేగేణం తగ్గినా
రక్తపోటు వెంటనే పెరుగుతుంది.


తీసుకుని చర్చిస్తాడు.
.
.
- హైపర్టెన్షన్ కి పరీక్ష
హైపర్ టెన్షన్ కి పరీక్ష చేయించుకున్న తర్వాత
- వైద్యుడు మూడు ముఖ్యమైన అంశాలను పరిగణలోకి
• హైపర్ టెన్షన్ స్థాయి ఏ స్థాయిలో వున్నది... దాని
వల్ల ఇప్పటికే జరిగిన నష్టం
హైపన్షనికి గల కారణాలు ఏమిటి
మీరు ఏమిచేయటంవల్ల ఇప్పటికే వున్న
రోగం
ముదురుతున్నది.
వీటికోసం కీలక అంగాలన్నింటిని పరీక్షిస్తారు.
కారణం తెలిస్తే తప్పించి చికిత్సను మొదలు పెట్ట
లేరు. ఎడ్రినల్ గ్రంధిలో కణితి వంటిది కారణమైతే
- శస్త్ర చికిత్స ద్వారా తొలగిస్తే సరిపోతుంది. కిడ్నీలకు
సోకిన ఇన్ఫెక్షన్ కారణమైతే మందులు ఇస్తారు.
కాని 90 శాతం కేసుల్లో హైపన్షన్ వాస్తవ
కారణం స్పష్టంగా తెలియదు కాబట్టి వైద్యుడు ఆ
కారణం వెతికి పట్టే యత్నం చేస్తారు.
భారీకాయం, ఒత్తిడి, డయాబెటిస్, పొగతాగే
అలవాటు, కొలెస్టరాల్ అధికంగా వున్న ఆహారం,
ట్రైగ్లిసరిన్స్... ఇలా ఏవైనా కారణం అయి వుండవచ్చు.
కాబట్టి ముందుగా వాటిని ఒక వైద్యుడిని ఎంచుకున్న
తర్వాత ఆ నిపుణుడు చెప్పిన పద్ధతిలో జీవనవిధానం
మార్చుకోవటం, మందులు వేసుకోవటం చెయ్యాలి.
వైద్యుడి సూచన మేరకు తరచు పరీక్షలు చేయించు
కోవాల్సి ఉంటుంది.
చికిత్స అనేది హై బి.పి.ని అదుపులో వుంచే
యత్నమే గాని తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేది
కాదన్న వాస్తవం గుర్తించి దానికి తగినట్టుగా జీవితం
గడపటం ఎంతైనా అవసరం.
ఉప్పు తక్కువ ఆహారం, ఊరగాయలు లేని
భోజనం వంటివి సూచించినపుడు తు.చ. తప్పక
పాటించాలి. ఆహారం, అలవాట్ల విషయంలో వైద్యుడి
సమయానికి నిద్ర, తగినమేర వ్యాయామం, ఒక
అయితే వైద్యులు చెప్పనది, ఇప్పుడిప్పుడే రుం
నియమ నిబంధనల పాటింపు తప్పనిసరి. సరైన
గురవని జీవన విధానంతోపాటు తరచుగా వైద్య పరీ
వులతో అంగీకరించబడిన కొత్త ఔషదం "నప్పు...
నవ్వు హైటెన్షన్ని అదుపులో వుంచగలిగిన మాన
నవ్వినప్పుడు ప్రారంభ దశలో మనకు బి.పి.
పెరిగినట్టు అనిపించినా అది ఆ తర్వాత సాధారణ
క్షలు చేయించుకోవాలి.
సిక, శారీరక అంశం.
నవ్వితే ముఖం, మెడ,గొంతు, ఛాతి, ఉదర కండ
రాలన్నీ కదలటమే కాదు రిలాక్స్ అవుతాయి.
స్థాయికి తెస్తుంది.
1
ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆదుర్దా కలిగి
నప్పుడు ఎండార్ఫిన్స్ విడుదలై కార్టిసాల్ ప్రభావాన్ని
ఔషధంగా నవ్వుల
నప్పుడు విడుదలయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ రక్ష
నాళాలు కుచించుకుని రక్తపోటు పెరిగేలా చేస్తే నవ్వి
తగ్గించి ప్రశాంతతను తెచ్చి పెడతాయి. దీనితో బి.పి
సాధారణమవుతుంది.
నవ్వినప్పుడు రక్తప్రసరణ మెరుగవుతుంది.
రక్తంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇది కూడా
హైబి.పి. ఇబ్బందినుండి ఉపశమనం కలిగించేదే.
అయితే చిరునవ్వులు చిందించి నవ్వుతో లాభం
కలగలేదనుకోకండి. మనసారా నవ్వగలిగితేనే ఈ
లాభం పొందగలరు. మీరు ఎంత బిగ్గరగా నవ్వగలి
గితే అంత మంచిది.
నవ్వుతో బి.పి.అదుపులో వుంటుందని భారతీయ,
జపాన్ పరిశోధకులు ధృవీకరించిన తర్వాత నేడు
ప్రతి పట్టణంలో లాఫింగ్ క్లబు ఏర్పడుతున్నాయి.
రోజూ ఉదయం లేదా సాయంత్రం తప్పని సరిగా
నవ్వులలో తేలియాడే సాటిబృందం వుంటే మీ హైపర్
టెన్షన్ సమస్యను హాయిగా మరచిపోగలరు. కనీసం
రోజులో 15 నుండి 20 నిమిషాలు మనసారా నవ్వే
వారికి చక్కని మందు దొరికినట్టే.
హై బి.పి. అనగానే భయంతో వణికిపోయి
జీవితం అంతటితో సరి అన్న ఆలోచన రానివ్వవద్దు.
ఒక వైద్యుడి నుండి మరో వైద్యుడి దగ్గరికి మారి
నంత మాత్రాన తక్షణం ఈ రోగం తగ్గుతుందన్న
భ్రమవదలటం మంచిది.
భిన్నమైన అభిప్రాయాలు వైద్యులు చెప్పినందున
గందరగోళం పెరుగుతుందే కాని తగ్గదు. ఇక హైపర్
టెన్షన్ అదుపుకు ఎక్కువ సమయం పడుతుంది.
సహనం చాలా అవసరం.
శరీరంలో సైలెంట్ కిల్లర్' చేరింది కాబట్టి దాని
మీద సహనమనే ఆయుధమే పనిచేస్తుంది. ఆదుర్దా
పడితే ఆ 'కిల్లర్' సులభంగా దెబ్బతీస్తుంది.
హైపర్ టెన్షన్ ని అదుపులో వుంచుకుని హాయిగా
జీవనం సాగించినవారు వేలల్లో వున్నారు. ఆ అవగా
హనాలేమే అసలు ఇబ్బంది.

పగటి నిద్ర ,రాత్రి డ్యూటీలు చేసేవారికి ఆయుర్వేద , ఆరోగ్య వైద్య సలహాలు. / PAGATI NIDRA - RATHRI DUTIES - HEALTH TIPS

పగటి నిద్ర ,రాత్రి డ్యూటీలు చేసేవారికి ఆయుర్వేద , ఆరోగ్య వైద్య సలహాలు.

జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవలి నివేదిక ప్రకారం 5,6 ఏళ్ళ పాటూ రాత్రిళ్ళు మేల్కొని పని చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.ప్రకృతికి ఇలా విరుద్ధంగా జీవించటాన్ని సర్కాడియన్ రిథం డిస్రప్షన్ అంటారు .పాతికేళ్ళకు పైగా నైట్ డ్యూటీలు చేస్తున్నవాళ్ళు ఉన్నారు,వాళ్ళలో చాలామందికి పగటి డ్యూటీ వేస్తే చేయలేనంతగా రాత్రి డ్యూటీకి అలవాటు పడిపోయి ఉంటారు.కొన్ని తరాలపాటూ ఇలా జరిగితే అది జన్యుపరమైన మార్పులకు దారితీయవచ్చు కూడా.వీళ్ళు ఒక సామాజిక అవ్యవస్థకు / సోషల్ జెట్ లాగ్ గురవుతుంటారు.స్త్రీలలో ఈస్ట్రోజన్ లాంటి పునరుత్పాదక హార్మోనుల ప్రభావం తోడవడం వల్ల , నడివయస్సు దాటిన వారిలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.మన అవసరాలు గడవడం కోసం , బాహ్య ప్రకృతిని, పర్యావరణాన్నే కాకుండా , మన శరీర ప్రకృతులను కూడా మనం విధ్వంసం చేస్తున్నాము.అతిగా నిద్ర మేల్కోవడం వల్ల బుర్ర పని చేయడం తగ్గిపోతుంది.పనిలో నాణ్యత పడి పోతుంది.మనిషి పక్షవాతానికి, బీపీ,గుండె జబ్బులు,షుగరు,జీర్ణకోశవ్యాధులకు,కీళ్ళవాతానికి లోనవుతాడు.చీకట్లో మెలకువ, పగలు నిద్ర ప్రకృతి విరుద్ధాలే.తప్పనిసరిగా పనిచేసినపుడు శరీరంలో వాతం,వేడి పెరిగిపోతాయి.కావున ఆహారపదార్థాల ద్వారా వాతాన్ని తగ్గించి,చలువ చేసే వాటిని తీసుకోవాలి.రాత్రి జాగరణవల్ల వాతం వికారం చెందుతుందని ఆయుర్వేదం చెబుతుంది.ఇది పక్షవాతానికి కారణంకూడా కావచ్చని తాజా పరిశోధన తెలుపుతోంది.కాబట్టి చలువ చేసే ఆహారపదార్థాలకు ప్రాధాన్యతనివ్వాలి.పులుపులేని కూరగాయలు,ఆకుకూరలు అన్నీ మేలు చేస్తాయి.కానీ వాటిని అతిగా చింతపండుతోనో ,అల్లం వెల్లుల్లితోనో ,శనగపిండితోనో,నూనెతోనో వండినందువల్ల వేడి , వాతం చేసేవిగా మారిపోతాయి.

ఉదయాన్నే ఒక క్యారెట్, ఒక ముల్లంగి,ఒక ఆపిల్ / లెద పులుపు లేని ఒక పండు  ఈ మూడింటినీ కలిపి మిక్సీలో వేసి జ్యూస్ తీసి తాగాలి.వాతం , వేడి తగ్గుతాయి.శరీర అనుకూలత సాధించుకోవటానికి , వాతహరంగా, వేడిని రూపు మాపేదిగా ఉండే ఆహార పదార్థాల కోసం ప్రణాళిక వేసుకోవాలి. బూడిద గుమ్మడిని సోరకాయా పద్ధతిలో అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు.ఇది శరీరంలో నిద్రలేమి వల్ల కలిగే అలసటను పోగొడుతుంది.మర్నాడు నిద్రచాలక కలిగే ఇబ్బందులు తగ్గుతాయి.బార్లీ జావ , సగ్గు బియ్యం జావ , స్బజా గింజలు, సుగంధిపాల వేళ్ళ కషాయం, పల్లేరు కాయల కషాయం లాంటివి నైట్యూటీలు చేసేవారికి మేలు చేస్తాయి.అలసటను నివారిస్తాయి.
పెరుగు, మజ్జిగ చలవనిస్తాయి.రకరకాల కూరగాయల ముక్కలు వేసి చేసిన పెరుగు పచ్చడి జీర్ణకోశాన్ని బల సంపన్నం చేస్తుంది.ధనియాలు, జిలకర,శొంఠి లను సమానంగా తీసుకొని దంచిన పొడిని మజ్జిగలో కలుపుకొని , కొద్దిగా ఉప్పు వేసుకొని రోజూ ఒకటి రెండుసార్లు తాగాలి.

పొద్దున్నే నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని ఏమీ తినకుండా పడుకొని నిద్రపోవడం మంచిది.రాత్రి 10 గంటల తర్వాత ఎన్ని గంటలు మెలకువగా ఉన్నారో అందులో సగం సమయాన్ని ఇలాగే ఉదయం నిద్రపోతే నిద్రలేమి రాదు అని సుశ్రుతుడు చెప్పడం జరిగింది.పచ్చళ్లు, కారాలు, మసాలాలు మానేయాలి.మద్యం,సిగరెట్లు వాడడం రాత్రి డ్యూటీలు చేసేవారిలో అనారోగ్యాన్ని వేగవంతం చేస్తుందని గ్రహించాలి.

19, జూన్ 2016, ఆదివారం

లడ్డూలు - ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాలుLADDOOLU AYURVEDA AROGYA PRAYOJANALU.


లడ్డూ అంటే తెలుగువారికెంతో భక్తి ,పవిత్రం , శుభం.ఇవి మన సంస్కృతిలో ఒక భాగం.సుఖ సంతోషాలకు లడ్డూ పర్యాయపదం.లడ్డూ చేసుకోవడం అంటే తెలుగు వారికి పండగ చేసుకోవడమే.పెళ్ళిళ్ళలో తొలి వడ్డన లడ్డు.తిరుపతి లడ్డు లాగా బందరు లడ్డు / తొక్కుడు లడ్డు కూడా ఎంతో ప్రసిద్ధికెక్కింది.

లడ్డూలను శనగపిండితోనే చేయాలని నియమం ఏమీ లేదు.సున్ని ఉండలు , కొబ్బరి ఉండలు ,నువ్వుండలు ఇవన్నీ లడ్డూలే.మహారాష్ట్ర , బెంగాళీల ప్రభావంతో స్వాతంత్రోద్యమ కాలంలో శనగ పిండి వంటకాలు మనకు ఎక్కువ అలవాటయ్యాయి.అంతకు పూర్వం మినప,జొన్న,సజ్జ,వరి ,గోధుమ,ధాన్యం వంటి చిరుతిళ్లన్నీ వండుకునే వాళ్లు.ఇటీవలి కాలంలో శనగ పిండి వాడకం వేలం వెర్రి అయింది.లడూకి ఆ రుచినిస్తుంది శనగ పిండి మాత్రమే కాదు అందులో చేర్చిన నెయ్యి , పటిక బెల్లం,పచ్చ కర్పూరం,జీడి పప్పు , కిస్మిస్ , యాలకులూ వగైరా.ఇవి సమృద్ధిగా ఉంటే ఏ పిండితో చేసినా రుచిగానే ఉంటాయి.

" ద " అనే అక్షరంలో ఉండే చిర్రి శనగలు లేదా దేశవాళీ శనగలతో చేసినదైతే శనగ పిండి మంచిదే.శనగ పప్పుని మర పట్టించిన శనగ పిండిని వాడుకోవడం మంచిది.బలకరం,కానీ కష్టంగా అరుగుతుంది.జీర్ణశక్తి బలకరంగా లేనివారికి అపకారం చేస్తుంది.పర్వతాలు ఫలహారం చేయగలవారికి శనగ పిండి మేలు చేస్తుంది.శనగ పిండి తిని తట్టుకోగలగాలి.అంతేకాని శనగ పిండి మంచిది కాదు అని ముద్ర వేయడం సరికాదు.

బొంబాయి రవ్వతో ఆయుర్వేద , ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి ? BOMBAYI RAVVATO AYURVEDA AROGYA PRAYOJANALU EMITI?


బొంబాయి రవ్వను గోధుమల్లోంచే తయారు చేస్తారు.మెత్తగా పిండి చేస్తే అదే మైదా పిండి అవుతుంది.రవ్వగా పట్టిస్తే అది బొంబాయి రవ్వ అవుతుంది.గోధుమ రవ్వను రవ్వ గోధుమల నుండి తీస్తారు.రెండూ వేర్వేరు గోధుమలు.గోధుమ రవ్వలో కేలొరీలు తక్కువ , పోషకాలు ఎక్కువగా ఉంటాయి.బొంబాయి రవ్వకన్నా గోధుమ రవ్వ మేలైనది.చక్కెర వ్యాధిలో కూడా తినదగినదిగా ఉంటుంది.బొంబాయి రవ్వ ఆకలిని , జీర్ణ శక్తిని చంపుతుంది.కడుపులో ఆంలాన్ని పెంచుతుంది.వేడి చేస్తుంది.కాబట్టి పరిమితంగా వాడుకోవాలి.

మనకు గోధుమ పిండి , గోధుమ రవ్వ తెలిసినంతగా బొంబాయి రవ్వ తెలియదు.కొందరు దీనిని ఉప్మా రవ్వ అని కూడా అంటారు.జొన్న రవ్వ , గోధుమ రవ్వ , బియ్యపు రవ్వలతో చేసే వంటకాలన్నీ బొంబాయి రవ్వ వంటకాలుగా మారిపోయాయి.ఉప్పుడు రవ్వ స్థానం లో బొంబాయి రవ్వ ఇడ్లీ వచ్చింది.గోధుమ పిండితో చేసే హల్వా స్థానంలో కేసరి వచ్చింది.బియ్యపు రవ్వ ఉప్మా స్థానే బొంబాయి రవ్వ ఉప్మా ,జొన్న రవ్వ లేదా గోధుమ రవ్వతో చేసే కిచిడీ స్థానే బొంబాయి రవ్వ కిచిడి ఇలా వంటకాలు బొంబాయి రవ్వ పార్టీలోకి వెళ్ళిపోయాయి.సజ్జ అప్పాలను సజ్జ రవ్వతో చేసే వాళ్ళు ఇప్పుడు బొంబాయి రవ్వతో చేస్తున్నారు.బొంబాయి రవ్వ పూర్ణాలు ,బొంబాయి రవ్వ ఉప్మా బోండాలు , రవ్వ దోశెలు ,రవ్వ లడ్డూలు ఇలా ఒకటేమిటి వంట గదిలో బొంబాయి రవ్వ ఉంటే ఇంకేమి అక్కర్లేదన్నంతగా పరిస్థితి మారిపఒయింది.ఉపయోగం తక్కువ , అపకారం ఎక్కువ ఉండేదే బొంబాయి రవ్వ.

అట్టు,చపాతి,పుల్కా,పూరి ,వీటిలో ఏది మంచిది? /ATTU ,CHAPATHI , PULKA ,POORI MANCHIDHA?POORI ,VEETILO EDI MANCHIDHI?

మంచి చెడు అనేవి అట్టులోనో ,పూరీలోనో ఉండవు.ఏ ఆహర పదార్థమైనా దాని తయారీలో కలిపిన ద్రవ్యాలు ,వాటిని వండే తీరును బట్టి ఉంటాయి.చపాతీని గోధుమ పిండితో చేసి ,కుర్మాతో తినాలని,పూరిని ఆలుగడ్డ కూరతోనే తినాలనీ, పుల్కాలను పాలక్ పనీర్ , మిక్ష్ డ్ వెజిటబుల్ కర్రీ లంటి వాతితో తినాలని నియమాలు పెట్టుకున్నది మనమే.ఇడ్లీ ,అట్టు ,పూరీల్లాంటివి విందు భోజనాల్లో వడ్డించేందుకే గాని , ఇలా ఉదయం పూట పెరుగన్నానికి బదులుగాను,రాత్రి పూట ఉపాహరంగాను తినటానికి  ఉద్దేశించినవి కాదు.ఉత్తరాది వారు రోటీలు తింటారు.మనం రోటీలు , అన్నం రెండూ తింటాం,అదీ తేడా.
అట్టు లేదా దోసెలను మినప పప్పు,బియ్యం రుబ్బి తయారు చేస్తారు.రెండూ ఎక్కువ కెలొరీలను పెంచేవే.చపాతీలను ,రాగులు,జొన్న,సజ్జలతో కూడా చేసుకోవచ్చు.ఆరోగ్యానికి మంచివి.నంజుకునేందుకు అన్నంలోకి తయారు చేసుకున్న కూర ,పప్పు లాంటివి మంచివి.
వొంటి పొర మీద వత్తితే పుల్కా, రెండు పొరల మీద వత్తితే దౌపాతి ,మూడు పొరల మీద వత్తితే త్రిపాతి, నాలుగు పొరల మీద వత్తితే చపాతి అంటారని పరిశోధకులు భావిస్తున్నారు.పొరల మధ్య నూనె ఎక్కించి చపాతీలు తయారు చేస్తారు.నూనె లేకుండా నాలుగు మడతలు వేసి వత్తినందువల్ల అది మందపాటి రొట్టె అవుతుంది అంతే.కావున పూరీలు ,చపాతీలు నూనెకు నిలయాలుగా ఉంటాయి.వాటిని సరదాగా అప్పుడప్పుడు మాత్రమే తినటం మంచిది.చక్కగా విశ్లేషిస్తే పుల్కానే మంచిది అని చెప్పవచ్చు.

18, జూన్ 2016, శనివారం

మొలకెత్తిన పెసర్లతో ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాలు. / MOLAKETTHINA PESARLATHO AYURVEDA AAROGYA PRAYOJANAALU.....


పోషకాలు అందించే ముఖ్యమైన ఆహార పదార్థాలలో పెసర్లు ముఖ్యమైనవి.పప్పు ధాన్యాల జాతికి చెందిన పెసర్లలో విటమినులు , ప్రొటీనులు ,ఖనిజ లవణాలు,ఎక్కువగా ఉంటాయి.ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.మొలకెత్తిన పెసర్లతో చాలా ప్రయోజనాలు ఉంటాయి.

1 . వీటిలో ఉండే డైటరీ ఫైబర్ బరువు తగ్గించేందుకు , కొవ్వు కరిగించేందుకు చెడు కొలెస్టరాల్ ను నిర్మూలించేందుకు దోహదపడుతుంది.

2 .వీటిని తక్కువ మోతాదులో తీసుకున్నా ఎక్కువగా తిన్న భావన కలుగుతుంది.అందువల్ల మాటిమాటికి ఆకలి వేయదు.క్రమంగా ఒక మంచి డైట్ విధానం అలవడుతుంది.

3 .పెసర్లను మొలకెత్తిన గింజల రూపంలో తీసుకోవడం వల్ల మలబద్ధకం తొలగిపోతుంది.

4 .విటమిన్ ఏ,బి,సి,డి,ఇ,కె,థయమిన్,రిబోఫ్లావిన్,ఫోలిక్ ఆసిడ్స్,మొలకెత్తిన పెసర్లలో ఎక్కువగా ఉంటాయి.ఇవి శరీర పెరుగుదలకు, కణజాలాల నిర్మాణానికి ఉపయోగపడతాయి.

5 . దృష్టి సంబంధ సమస్యలు కూడా నయమౌతాయి.గుండె జబ్బులు రాకుండా నిరోధించబడతాయి.

6 . రక్తహీనత సమస్య తొలగిపోయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.రక్తంలఒని చక్కెర స్థాయులను తగ్గించే గుణం వీటిలో ఉంటుంది.

7 .యాంటి ఏజింగ్ గుణాలు కూడా వీటిలో ఉన్నాయి.ఇవి వృద్ధాప్యం కారణంగా వచ్చే ముడతలను తగ్గిస్తాయి.

8 . శరీరంలో ఏర్పడే ఇన్ ఫెక్షన్ లను తొలగించే యాంటి ఆక్సిడెంట్ గుణాలు పెసర్లలో ఎక్కువగా ఉంటాయి.ఇవి కణజాల నాశనాన్ని అడ్డుకుంటాయి .

17, జూన్ 2016, శుక్రవారం

అంజూర ఆకులతో గ్రీన్ టీ



అంజూర ఆకులతో గ్రీన్ టీ!

ఆరోగ్యదాయకమైన గ్రీన్ టీని
తయారు చేసుకోవడానికి కుండీల్లో
పెంచుకునే వివిధ మొక్కల ఆకుల
పొడి శ్రేష్టమని నిపుణులు చెబుతు
న్నారు. తులసి, మునగ, స్టీవియా
ఆకుల పొడితో టీ తయారు చేసుకో
వడం తెలిసిందే. అదే జాబితాలో
అంజూర కూడా చేరింది. అంజూర ఆకుల టీ తాగితే మధుమేహం,
రక్తపోటు నియంత్రణలో ఉంటున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.
పెద్ద ఆకులను కోసి నీటితో కడిగి నీడలో ఆరబెట్టాలి. ఎండిన ఆకు
లను నలిపి పొడి చేసి పెట్టుకోవాలి. లీటరు నీటిలో రెండు చెంచాల
పొడిని వేసి 15 నిమిషాలు.. నీరు సగం ఆవిరయ్యే వరకు మరగబెట్టి..
వడకడితే టీ సిద్ధమైనట్లే. ఇలా తయారు చేసుకున్న టీని ఫ్రిజ్ లో నిల్వ
ఉంచుకొని కూడా వాడుకోవచ్చు.

29, మే 2016, ఆదివారం

చిరుధాన్యాలు - ఆరోగ్యానికి రక్ష





 పెను సవాలు విసురుతోంది నీటి
సమస్య దైనందిన జీవితంలో సగటు మానవుడు సుమారు 4వేల లీటర్లకు పైగా
నీటిని పరోక్షంగా వినియోగించుకుంటున్నాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు
మొత్తంగా ఒక కేజీ బియ్యం మన ముందు ప్రత్యక్షమయ్యేందుకు 3వేల లీటర్లు
ఖర్చవడమే అందుకు ఉదాహరణగా సూచిస్తున్నారు. అంతేకాదండోయ్ ప్రపం
చానికి చెమటలు పుట్టిస్తోన్న నీటి సమస్యను చిరుధాన్యాలతో జయించవచ్చని
సూచిస్తున్నారు. వరితో పోల్చితే మూడో వంతుకన్నా తక్కువ నీరు తీసుకొని
దిగుబడినిచ్చే గోదుమ, జొన్న, సజ్జలు, కొర్రలు వంటి పంటలకు జైకొట్టాలని నిపు
ణులు సూచిస్తున్నారు. వీటితో చక్కటి ఆరోగ్యం కూడా సాధ్యమవుతుందని ఉస్మా
నియా విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రారంభమైన పురాతన విత్తన ప్రదర్శన
చాటి చెప్పింది. రైతు స్వరాజ్ వేదిక ఇక్కడి దూరవిద్య కేంద్రంలో ఏర్పాటుచేసిన
మూడు రోజుల ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల రైతులు వారి వారి సేంద్రియ పంట
లను, పురాతన విత్తనాలను ఉంచి నేటి తరాన్ని మేల్కొలుపుతున్నారు.
కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు,
బరిగెలు, సజ్జలు, జొన్నలు, రాగులు,
అందుకొర్రల వంటి అనేక రకాల చిరు
ధాన్యాతో చేసిన వంటలే గతంలో
ప్రధాన ఆహారం సంగటి, అంబలి,
రొట్టెలు తిని నాటి ప్రజలు ఎంతో ఆరో
గ్యంగా, ద్రుఢంగా జీవించారని ఇప్ప
టికీ పెద్దలు చెబుతుంటారు. హరిత
విప్లవంలో భాగంగా వరి పంటకు
ప్రాధాన్యం పెరగడం, దాని పోషణకు
సంబంధించి ప్రభుత్వం ప్రోత్సాహ
కాలు, ఎరువులకు రాయితీలు ఇవ్వ
డంతో చిరుధాన్యాలను పండించే
రైతులు తగ్గిపోతూ వచ్చారు. రాగులు,
జొన్నలు, సజ్జలు తప్ప మిగిలిన ధాన్యాలను నేటి తరానికి చూపించలేని పరిస్థితి
వచ్చింది. ఇక నేడు విపరీతమైన ఆహార అలవాట్ల కారణంగా ఎక్కువ శాతం
ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఫలితంగా మధుమేహం, హృద్రోగం,
అధిక బరువు వంటి రుగ్మతలు పట్టిపీడిస్తున్నాయన్నారు. ఒకప్పుడు ఇంటి భోజ
నంలో రాజుల్లా మెలిగిన చిరుధాన్యాలు లేకపోవడమే దీనికి కారణం. ఏదిఏ
మైనా పిజ్జాలు, బర్గర్లు, ఇతర జంకప్పుడు అలవాటుపడిన నేటి తరం మళ్లీ నాటి
వంటలవైపు మొగ్గుచూపుతోంది. అనేకమంది ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు
వీటిని తీసుకుంటున్నారు. మార్కెట్లోనూ చిరుధాన్యాలకు ప్రాధాన్యం పెరుగుతోం
ది"అని రైతు స్వరాజ్ వేదిక రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఆశాలత చెబుతున్నారు.
ఎంత నీరు అవసరమంటే
• కేజీ బియ్యం ఉత్పత్తికి 3000
లీటర్ల నీరు
• కేజీ గోధుమల ఉత్పత్తికి 1,350
లీటర్ల నీరు
• కేజీ జొన్నలకు 900లీటర్ల నీరు
•కేజీ సజ్జలకు 850లీటర్ల నీరు

గుండె సమస్యలు - ఆయుర్వేదం


గుండెకు సంబంధించిన సమస్యలకు స్టెంట్స్ వేయడం, గుండె రక్త
నాశాలకు సంబంధించిన పెద్దాపరేషన్లు చేస్తుంటారు కదా. మరి
ఆయుర్వేదంలో ఆ సమస్యలకు నివారణ మార్గాలు, చికిత్స,
ఔషధాలు ఉన్నాయా? దయచేసి తెలియజేయండి.
- వి. పట్టాభిరామ్, విజయనగరం
గుండె ఒక రకమైన ప్రత్యేక కండరం. జీవితాంతం లయ
బద్ధంగా స్పందించే ప్రకృతి నిర్మిత యంత్రం. దీని సామర్థ్యం జీవి
తాంతం సాగిపోవాలంటే ఐదు అంశాలు అత్యంత ప్రధానమైనవి.
1.దీని నిర్మాణంలో పుట్టుకతో వచ్చే లోపాలు ఉండకూడదు. 2.
దీనికి లభించే ప్రత్యేకమైన విద్యుత్ సరఫరాలో తేడాలు రాకూ
డదు. 3. ఈ కండరానికి 'కొరనరీ ధమనుల ద్వారా రక్తప్రసరణ
జరుగుతుంది. ఈ రక్తప్రసరణలో అవరోధాలు ఏర్పడకూడదు. 4.
కొన్ని సూక్ష్మక్రిములు గుండె పారలను, కవాటాలను పాడు
చేస్తాయి. సాధారణ వైద్య పరిభాషలో వాటిని ఇన్ఫెక్షన్లు అంటారు.
అవి సంభవించకుండా జాగ్రత్త తీసుకోవాలి. 5. మానసిక ఒత్తిడి
లేకుండా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి.
హార్ట్ ఎటాక్ లో గుండెకు జరిగే రక్తప్రసరణలో
అంతరాయం
కలుగుతుంది. క్రమబద్ధంగా గుండె స్పందనలు ప్రకృతిపరంగా
నిరంతరం సాగే నిరంతర ప్రక్రియ. గుండె సంకోచించినప్పుడు
ఆయా ధమనుల ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకూ రక్తం
సరఫరా అవుతుంది. అలాగే గుండెకు కూడా కొరనరీ ధమనుల
ద్వారా రక్తం అందుతుంది. తనలోనే ఉన్న రక్తాన్ని శోషణక్రియ
ద్వారా గుండె పీల్చుకోలేదు. గుండెలాంటి క్రమశిక్షణే మనిషి
కూడా పాటిస్తూ, తన ఆహార విహారాల మీద నియంత్రణ కొనసా
గిస్తే హార్ట్ ఎటాక్లు నివారితమవుతాయి.
నివారణ: ఇది చిన్న వయసునుంచీ సాధన చేయాల్సిన
అంశం.
ఆలా కాకపోయినా ఏ వయసునుంచి అయినా ప్రారంభించవచ్చు.
ఆహారం: తాజా పండ్లు, శాకాహారం, అవసరమైన ప్రమాణం
లోనే పాలు, పెరుగు, నెయ్యి, నూనెలు తీసుకోవడం, పీచుపదాఆర్థాలు
తీసుకోడానికి, తగినంత నీరు తాగ 
డానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఆహారంలో 
అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్త 
తీసుకోవడం, చక్కెర పదార్థాలు, కొవ్వులు
ఎక్కువగా ఉండే ఆహారాన్ని, జంక్
పుడు, శీతలపానీయాలను తీసుకోకపోవడం వంటి జాగ్రత్తలు
పాటించాలి.
విహారం: వయసును, వృత్తిని బట్టి ప్రతిరోజూ వ్యాయామం చేసి
తీరాలి. (ఉదాహరణకు నడక, ఆటలు, యోగాసనాలు, ఇంట్లోనే
అన్ని కీళ్లకూ కదలికలు కల్పించడం మొదలైనవి). ఖాళీ కడుపుతో
రోజుకు రెండుపూటలా ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి.
పొగతాగడం, మద్యం, గుట్కా వంటి వ్యసనాల జోలికిపోకూడదు
ఔషధాలు: అల్లం5 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు 5. పసుపు ఐదు
చిటికెలు, దాల్చిన చెక్క చూర్ణం 5 గ్రాములు కలిపి కషాయం
కాచుకుని రోజూ 30మి.గ్రా (ఆరు చెంచాలు) తాగాలి. పరగడు
పున గానీ లేదా ఎప్పుడు తాగినా మంచిదే. ఎంతకాలం తాగినా
పర్వాలేదు. దీనివల్ల అన్ని అవయవాలకూ రక్తప్రసరణ బాగా జరు
గుతుంది. రక్తంలో కొవ్వులు ఎక్కువ కావు. మధుమేహానికీ,
హైబీపీకి కూడా ఇది నివారణగా పనిచేస్తుంది. ఆహారం జీర్ణం
కావడం కూడా బాగా జరుగుతుంది.
మద్ది (అర్జున) చెట్టు 'తెలుపు, నలుపు' అని రెండు రకాలు.
తెల్లమద్ది చెక్క చూర్ణం, గోధుమల చూర్ణం రెండేసి గ్రాములు
కలిపి ఆవు నెయ్యి, బెల్లం కలిపి రెండుపూటలా సేవిస్తే గుండెకు
మంచిది. ఆవు నెయ్యికి బదులు మేకపాలు కూడా వాడుకోవచ్చు
ఉనల్లమద్ది చెక్క కషాయాన్ని 5 చెంచాలు రోజుకొకసారి మూడు
రోజులు తాగితే గుండెనొప్పి తగ్గుతుంది.
బజారులో లభించే మందులు: • ప్రభాకరవటి లేదా నాగార్జునాష్ట్ర
రస మాత్రలు ఉదయం 1,
రాత్రి 1 వాడాలి - త్రిఫలా చూర్ణం 5
గ్రాములు రోజూ రాత్రి పడుకోబోయేప్పుడు నీళ్లతో సేవించాలి.

28, మే 2016, శనివారం

ఇడ్లీలు తినడం మంచిదేనా?

ఇడ్లీలు తినటం మంచిదేనా?
* ఇడ్లీల్ని మన పూర్వులు ఇద్దెనలు' అని పిలిచేవారు.
వాటిని తీపి వంటకంగా కూడా చేసుకునే వాళ్లు, పంచదార
పాకంలో నానబెట్టుకుని తినేవాళ్లు కూడా! అల్లప్పచ్చడి, శనగ
చట్నీ సాంబారులతో మాత్రమే తినాలనే విధానం తెలుగువారిది
కాదు. ఉడిపి కాఫీ హోటళ్ల పుణ్యమా అని, మొత్తం దక్షిణ భారతదే
శంలోనే ఇడ్లీ ఒక ప్రాథమిక వంటకం అయ్యింది. ప్రొద్దునపూట
చలిది అన్నం వదిలేసి, ఐదులుగా టిఫిన్ చేయటం అలవాటయ్యింది.
అట్టు, బజ్జీ, పునుగు, పూరీల్లా నూనె పదార్థం కాదు కదా... ఇడ్లీ 'సేఫ్
పుది అనడానిక్కూడా వీల్లేదు. కొబ్బరి శనగ చట్నీ, నెయ్యీకారప్పొడి,
సాంబారు, అల్లం పచ్చడి వీటి వలన కడుపులో ఆమ్లసముద్రా
లేర్పడి, అల్సర్లు పెరుగుతాయి. వీటితో ఇడ్లీ తిని వెంటనే కాఫీ
తాగితే కడుపులో పాలు విషపదార్థాలుగా మారిపోతాయి.
ఇద్దెనల కన్నా ఆవిరి కుడుములే కొంతలో కొంత మేలు. మినప్పప్పులో
కొద్దిగా బియ్యం, కాసిన్ని మెంతులు
వేసి రుబ్బి పూటే ఇద్దెను వేసుకుంటే
దాన్నే ఆవిరికుదుములంటారు. బడికి
వెళ్లే పిల్లలకు, వయోవృద్ధులకు ఇవి
ఎక్కువ శక్తిదాయకంగా ఉంటాయి.
వాతాన్నీ, వేడిని తగ్గిస్తాయి. అన్ని
వ్యాధుల్లోనూ పెట్టదగినవిగా
ఉంటాయి. బలహీనంగా ఉన్న
వారికీ, చిక్కి శల్యమై పోతున్న వారికీ మేలు చేస్తాయి. స్థూలకాయం, షుగరు
వ్యాధి ఉన్న వారిక్కూడా పెట్టవచ్చు. ఇందులో అల్లం, మిరియాలు, కొత్తిమీర
లాంటివి కూడా తగుపాళ్లలో కలుపుకుని వండుకుంటే తేలికగా అరుగుతాయి.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...