Sunday 29 May 2016

చిరుధాన్యాలు - ఆరోగ్యానికి రక్ష





 పెను సవాలు విసురుతోంది నీటి
సమస్య దైనందిన జీవితంలో సగటు మానవుడు సుమారు 4వేల లీటర్లకు పైగా
నీటిని పరోక్షంగా వినియోగించుకుంటున్నాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు
మొత్తంగా ఒక కేజీ బియ్యం మన ముందు ప్రత్యక్షమయ్యేందుకు 3వేల లీటర్లు
ఖర్చవడమే అందుకు ఉదాహరణగా సూచిస్తున్నారు. అంతేకాదండోయ్ ప్రపం
చానికి చెమటలు పుట్టిస్తోన్న నీటి సమస్యను చిరుధాన్యాలతో జయించవచ్చని
సూచిస్తున్నారు. వరితో పోల్చితే మూడో వంతుకన్నా తక్కువ నీరు తీసుకొని
దిగుబడినిచ్చే గోదుమ, జొన్న, సజ్జలు, కొర్రలు వంటి పంటలకు జైకొట్టాలని నిపు
ణులు సూచిస్తున్నారు. వీటితో చక్కటి ఆరోగ్యం కూడా సాధ్యమవుతుందని ఉస్మా
నియా విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రారంభమైన పురాతన విత్తన ప్రదర్శన
చాటి చెప్పింది. రైతు స్వరాజ్ వేదిక ఇక్కడి దూరవిద్య కేంద్రంలో ఏర్పాటుచేసిన
మూడు రోజుల ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల రైతులు వారి వారి సేంద్రియ పంట
లను, పురాతన విత్తనాలను ఉంచి నేటి తరాన్ని మేల్కొలుపుతున్నారు.
కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు,
బరిగెలు, సజ్జలు, జొన్నలు, రాగులు,
అందుకొర్రల వంటి అనేక రకాల చిరు
ధాన్యాతో చేసిన వంటలే గతంలో
ప్రధాన ఆహారం సంగటి, అంబలి,
రొట్టెలు తిని నాటి ప్రజలు ఎంతో ఆరో
గ్యంగా, ద్రుఢంగా జీవించారని ఇప్ప
టికీ పెద్దలు చెబుతుంటారు. హరిత
విప్లవంలో భాగంగా వరి పంటకు
ప్రాధాన్యం పెరగడం, దాని పోషణకు
సంబంధించి ప్రభుత్వం ప్రోత్సాహ
కాలు, ఎరువులకు రాయితీలు ఇవ్వ
డంతో చిరుధాన్యాలను పండించే
రైతులు తగ్గిపోతూ వచ్చారు. రాగులు,
జొన్నలు, సజ్జలు తప్ప మిగిలిన ధాన్యాలను నేటి తరానికి చూపించలేని పరిస్థితి
వచ్చింది. ఇక నేడు విపరీతమైన ఆహార అలవాట్ల కారణంగా ఎక్కువ శాతం
ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఫలితంగా మధుమేహం, హృద్రోగం,
అధిక బరువు వంటి రుగ్మతలు పట్టిపీడిస్తున్నాయన్నారు. ఒకప్పుడు ఇంటి భోజ
నంలో రాజుల్లా మెలిగిన చిరుధాన్యాలు లేకపోవడమే దీనికి కారణం. ఏదిఏ
మైనా పిజ్జాలు, బర్గర్లు, ఇతర జంకప్పుడు అలవాటుపడిన నేటి తరం మళ్లీ నాటి
వంటలవైపు మొగ్గుచూపుతోంది. అనేకమంది ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు
వీటిని తీసుకుంటున్నారు. మార్కెట్లోనూ చిరుధాన్యాలకు ప్రాధాన్యం పెరుగుతోం
ది"అని రైతు స్వరాజ్ వేదిక రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఆశాలత చెబుతున్నారు.
ఎంత నీరు అవసరమంటే
• కేజీ బియ్యం ఉత్పత్తికి 3000
లీటర్ల నీరు
• కేజీ గోధుమల ఉత్పత్తికి 1,350
లీటర్ల నీరు
• కేజీ జొన్నలకు 900లీటర్ల నీరు
•కేజీ సజ్జలకు 850లీటర్ల నీరు