26, నవంబర్ 2015, గురువారం

RUDRA JADA / SABJA GINJALU - AYURVEDAM

చలవ చేసే సజ్జాగింజలు

సజ్జాగింజలు నానబెట్టి షుగరు రోగులు తీసుకోవచ్చా? లాభాలేమిటి? 

? - రుద్రజడ దీని అసలు పేరు. సబ్దా అనేది అరబ్బీ పదం. వేడి ఎక్కువగా ఉన్నవా
రికి ఈ గింజల్ని పది నిమిషాల సేపు నీళ్లలో నానించి ఇస్తే వెంటనే చలవ
చేస్తుంది. షుగరు వ్యాధిలో అరికాళ్ల మంటలు, పోట్లు ఉన్నవారికి ఈ గింజల్ని రోజూ
తాగిస్తే మంటలు ఉపశమిస్తాయి. మూత్రంలో మంట, కడుపులో మంట, అరికాళ్లు
చేతుల్లో మంట, కళ్లు మంటలు, నాలుక మీద మంట, విరేచనంలో మంట ఇలా
మంటగా ఉండటమే వేడి అంటే! సజ్జాగింజలు ఈ వేడిని తగ్గిస్తాయి. మైగ్రేన్ తలనొప్పి
మీద కూడా పనిచేస్తాయి. పంచదార కలపకుండా షుగరు రోగులకూ, స్థూలకాయు
లకూ ఇవ్వొచ్చు. మజ్జిగలో కూడా నానబెట్టుకుని తాగవచ్చు. పాలలో వేసి ఉడికించి
టీలాగా కాచుకుని తాగవచ్చు. కిరాణా కొట్లలో ఇవి తేలికగా దొరికేవే!

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...