Monday 21 November 2016

శాఖాహారం మేలు చేస్తుంది.

పళ్ళు, కూరగాయలే ఎందుకు తినాలి?
మాంసంలో లేని ప్రత్యేకతలు కూరగాయల్లో
ఉన్నాయా?
* మనం పళ్ళు కూరగాయలు ఎందుకు తినా
లంటే వాటిలో సూక్ష్మ పోషకాలు నిలవుంటాయి
కాబట్టి, లవణాలు, ఖనిజాలు అతి కొద్ది మోతా
దులో మనిషికి ఆజన్మాంతం అవసరమౌతాయి.
కోబాల్ట్, క్రోంఇయం, రాగి, అయొడిన్, మ్యాంగ
నీసు, జింక్ లాంటి ఖనిజాలు, ఇంకా ఇతర విట
మిన్లు ఎక్కువగా రోజుకు 100 మి.గ్రా, మోతాదు
వరకూ అవసరం అవుతాయి.
పోషకాలు:
తక్కువ మోతాదులో ఎక్కువ శక్తిదాయకమైన
వీటిని సూక్ష్మ పోషకాలంటారు. ఇవి పళ్ళలోను,
కూరగాయల్లోను అత్యధికంగా ఉంటాయి. పీచు
పదార్థాలు, పిండిపదార్ధాల్లాంటి స్థూల(మక్రోపోష
కాలంటారు. ఇవి ఎక్కువ మోతాదులో శరీరానికి
అవసరం అవుతాయి కాబట్టి వీటికా పేరు వచ్చింది.
ఇవి కాక శరీరం తన పనిని తాను సమర్థవంతంగా
చేసుకునేందుకు కావలసిన పోషకాలను మొక్కలు
మాత్రమే మన శరీరానికి అందిస్తాయి. వీటిని
'పైటోన్యూట్రియంట్స్' అంటారు. ఇవి మొక్కల్లో
ఫంగస్ లాంటి చీడ పట్టకుండా కాపాడే రక్షణ
యంత్రాంగానికి సంబంధించినవి. మొక్కలకు
సంబంధించిన వాటిని ఆహారంగా తీసుకున్నప్పుడు
ఈ రక్షక రసాయనాలు పూర్తిస్థాయిలో మనకు
అందుతాయి.
కేవలం మాంసాహారం మీద ఆధారపడితే ఇవి
చాలినన్ని అందకుండా పోతాయి.
కాషాయం రంగు కూరగాయలు:
పిల్లల్లో కంటి చూపు పెరగడానికి, చర్మం
మృదుత్వం, లావణ్యం పొందడానికి, వ్యాధి నిరో
ధక శక్తి పెరగడానికి ఏ విటమిని అవసరంఅవు
తుంది. కేరట్లు, టమోటాలు, చిలకడదుంపలు,
బొప్పాయి, మామిడి పండు లాంటి ఎరుపు రంగు
కలిగిన పండ్లు, కాయగూరల్లో కెరటోనాయిడ్స్ అనే
పోషకాలు శరీరానికి రక్షణ కలిగించే ద్రవ్యాలను
బాగా అందిస్తాయి.
సివిటమిన్:
టమోటాలాంటి
కూరగాయల్లోనూ,
జామ అరటి లాంటి
పండ్లల్లోనూ ఉండే 'సి
విటమిన్ పూర్తిస్థాయిలో
మనం ఉపయోగించుకో
లేకపోతున్నాం. వాటిని అధిక ఉష్ణోగ్రత దగ్గర
వండటం కారణంగా సి విటమిన్ ఎగిరిపోతోంది.
చారు, సాంబారు, పప్పుచారు, కలగూర పప్పు
లాంటివి వండినప్పుడు పొయ్యి మీంచి దించబోయే
ముందుటమోటా రసం కలపటం మంచిది. సివిట
మిన్ని అతిగా వండితే త్వరగా ఆవిరైపోతుంది.
అందువలన కూర రుచి కూడా దెబ్బతింటుంది. ని
విటమిన్ ఎక్కువగా కలిగిన పండ్లను, కాయగూర
లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వాటిలోని
ఇనుముకు సంబంధించిన ఫోలిక్ యాసిడ్ అనేది
శరీరానికి బాగా వంటబడ్తుంది.
పీచుపదార్ధాలు:
కాయగూరల్లోనూ, ఆకు కూరల్లోనూ అధి
కంగా ఉండే పీచుపదార్థాలు జీర్ణశక్తిని పెంచు
తాయి. పేగులను బలసంపన్నం చేస్తాయి. రోజూ
కాలవిరేచనం అయ్యేలా చేస్తాయి. పేగుల్లో కేన్సర్
లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా కాపాడ
తాయి. పీచుపదార్థాలతో నిండిన ఆహారం తీసుకు
న్నప్పుడు కొవ్వు పదార్థాలు, పంచదార పదార్థాలు
- రక్తంలోకి ఎక్కువగా చేరకుండా అని అడ్డుకుం
దాయి. ఆ విధంగా స్థూలకాయం, షుగరు వ్యాధుల్ని
5 అదుపులో పెట్టడానికి పీచుపదార్థాల అవసరం
ఎంతైనా ఉంది.
కూరల్ని ఇలా వండాలి:
కూరల్ని అతిగా చింతపండు, అల్లం, వెల్లుల్లి
మసాలాలు వేయకుండా వండుకుంటే కూర ఎక్కు
వగానూ, అన్నం తక్కువగానూ తినటం సాధ్యం
అవుతుంది. ఏ కూరగాయనైనా నూనెలో బాగా
వేయిస్తే ఆ కూరగాయ ప్రబావం సగం చచ్చిపో
తుంది. పోషాకాలు మాడి పోతాయి. అతిగా
వేగడం వలన అందులో కేన్సర్ కారకమైన ఆకీల
మైడ్ అనే విషరసాయనం పుడుతుంది. ఈ సంగతు
లను గమనించి కూరగాయలను మందాగ్ని మీద
తేలికగా ఉడికించుకుని కూరలు తయారు చేసుకో
వాలి.
మాంసానికి ప్రత్యామ్నాయం?
మాంసాహారానికి ప్రత్యామ్నయంగా కూరగా
యలను, పప్పుధాన్యాలను, తీసుకోవచ్చు. కానీ
- కూరగాయలకు మాంసాహారం ప్రత్యామ్నాయం
కానే కాదు. కూరగాయల్లోని పోషకాలు తేలికగా
అరిగే స్వభావాన్ని కలిగి ఉంటాయి.
ఇటీవల కాలంలో పనస ముక్కల పలావ్,
దొండకాయ టిక్కాలాంటి వంటకాలు మాంసాహా
రాన్ని వండే పద్ధతిలో కూరగాయల్ని ఎక్కువగా
వండుతున్నారు. ముఖ్యంగా విందు భోజనాల్లో కేట
రర్లు ఇలాంటి వంటకాలను సృష్టిస్తున్నారు. అక్కడ
తిని, ఇంట్లో కూడా అలాంటివే వండుతూ ఆహా
రాన్ని విషతుల్యం చేసుకుంటున్నాం. కొద్దిపాటి వేడి
మీద కొంచెంసేపు ఉమ్మగిలనిస్తే కూర తినడానికి
రుచిగానూ, ఆరోగ్యదాయకం గానూ ఉంటుంది.