10, ఫిబ్రవరి 2024, శనివారం

దంతాల ఆరోగ్యానికి నోటి దుర్వాసన తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి

 దంతాల శుభ్రత సరిగా లేనప్పుడు నోటి దుర్వాసన వస్తుంది మనం తినే ఆహారం ఆరోగ్య పరిరక్షణకు ఎంత ఉపయోగపడుతుందో దంతాల ఆరోగ్యానికి అంతే ఉపయోగపడుతుంది పిండి పదార్థాలు లేదా తీయటి ఆహారాన్ని తినేటప్పుడు తాగినప్పుడు నోటిలో దంతక్షయం చిగుళ్ళ వ్యాధికి కారణమయ్యే సూక్ష్మ క్రిములకు కూడా ఆహారం ఇస్తున్నట్టు ఇటువంటి ఆహారం తీసుకున్నప్పుడు నోటిలో ఆమ్లాలు ఏర్పడతాయి ఈ ఆమ్లాలు ఆహారం తినడం పూర్తయిన 20 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు దంతాలపై దాడి చేసి దంతాల ఉపరితలంపై ఉండే ఎనామిల్ను విచ్ఛిన్నం చేస్తాయి ఇది దంతా క్షయానికి దారితీస్తుంది పీచు పదార్థం ఎక్కువగా ఉండే కూరగాయలు ఆకుకూరలు పండ్లు మన దంతాలను శుభ్రం చేసేందుకు ఉపయోగపడతాయి పాలు పెరుగు లాంటిది ఎనామిల్ ను నాశనం చేసే ఆమ్లాల తయారీని తగ్గిస్తాయి పాలిపినాల్స్ అధికంగా ఉండే గ్రీన్ టీ కూడా దంత సంరక్షణకు మంచిది. తీపి పదార్థాలు బాగా వేడి బాగా చల్లటి పదార్థాలు తగ్గించడంతోపాటు ఆహారం తిన్న వెంటనే నోరు నీటితో పుక్కిలించడం తరచూ నీళ్లు తాగడం రోజుకు రెండుసార్లు దంత దావనం చేసుకోవడం మొదలైన ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకుంటే దంతాలను సంరక్షించుకోవచ్చు నోటి దుర్వాసనను నియంత్రించవచ్చు



పొంగలి వంటకం లోని పోషకాలు ఏమిటి

 పొంగలి లో వాడే బియ్యం పప్పు విడివిడిగా కంటే ఆ రెండు పదార్థాలను కలిపి తీసుకున్నప్పుడు వాటిలో ఉండే ఎమినో యాసిడ్లు కంప్లీట్ ప్రోటీన్ గా మారి శరీరంలోకి తేలికగా సంగ్రహించబడతాయి పొంగలి రకం ఏదైనా నెయ్యి కూడా అధికంగా వాడతారు కాబట్టి తక్కువ మోతాదులో తీసుకున్న శక్తినిచ్చే క్యాలరీలు మెండుగా అందుతాయి ముఖ్యంగా చక్కెర పొంగలి లో వాడే చక్కెర బెల్లం మొదలైన తీపి పదార్థాల ద్వారా మరిన్ని కేలరీలు చేరుతాయి మిరియాలతో చేసే పొంగలిలో మిరియాల వల్ల అరుగుదల తేలికగా ఉండి అజీర్తి సమస్య ఉండదు. ఇలా అధిక శక్తినిచ్చే పదార్థాలు ఉండడం వల్ల బరువు పెరగాలనుకునే వారికి ఎదుగుతున్న పిల్లలకు రోజులో శారీరక శ్రమ అధికంగా చేసే వారికి పొంగలి మంచి ఆహారం పొంగలిలో కాయగూరలు ఆకుకూరలు మొదలైనవి వాడరు కాబట్టి విటమిన్లు ఖనిజాలు తక్కువే కొంతమంది పొంగలిలో జీడి బాదం పిస్తా అంటే పప్పులు కూడా వాడుతారు అప్పుడు కొంచెం పీచు పదార్థాలు ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లాలు ఖనిజాలు లభించినప్పటికీ వీటి మోతాదు తక్కువగా ఉంటుంది పొంగలి లాంటి క్యాలరీలు అధికంగా ఉండే పదార్థాలను ఏవైనా ప్రత్యేకమైన రోజులకు అది కూడా పరిమితికి మించకుండా తీసుకుంటేనే మేలు



ఎనిమిదో నెలలో ఏం తినాలి

 ఆఖరి 4 వారాల్లో ప్రసవానికి దాదాపు సిద్ధం అయ్యే సమయం కాబట్టి శరీరంలో మరిన్ని మార్పులు వస్తాయి ఈ సమయంలో ఎక్కువ ఆహారం ఒక్కసారి తీసుకోవడం కుదరకపోవచ్చు ఆకలిగా అనిపించకపోయినా ప్రతి రెండు గంటలకు సమయం ప్రకారం ఆహారం తీసుకోవడం అవసరం రోజుకు కనీసం రెండుసార్లు పళ్ళు తీసుకోవాలి రెండు లేదా మూడుసార్లు పాలు లేదా పెరుగు తప్పనిసరి గుడ్లు రోజు రెండు తీసుకోవచ్చు గుడ్లు తినని వారైతే పని సోయా కూడా తీసుకోవచ్చు బాదం పిస్తా ఆక్రోట్ లాంటి గింజలను ఆహారంలో భాగం చేసుకోండి కంది పెసర మినప వంటి రకరకాల పప్పులను రోజూ తీసుకోండి ఆకుకూరలు వారానికి ఆరు రోజులు తీసుకోవాలి కాఫీలు టీలు పూర్తిగా మానేయాలి ఎక్కువ మసాలాలు నూనెలున్న ఆహారం తీసుకుంటే అరుగుదల ఇబ్బంది కాబట్టి వాటిని దూరంగా ఉంచాలి. తగినంత నీరు తాగుతూ ఉండాలి వైద్యుల సలహా మేరకు తగిన శారీరక శ్రమ లేదా నడక కూడా ఉన్నట్లయితే ప్రసవం తేలిక అవుతుంది ప్రసవానంతరం కూడా బిడ్డకు తల్లిపాలు పట్టవలసి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కూడా మీకు శక్తి ఎక్కువగా ఉన్న ఆహారం మరింత అవసరమవుతుంది బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చేవరకు మీరు ఇలాగే ఆహారపు నియమాలు పాటించాలి. ఒకసారి బిడ్డకు తల్లిపాలతో పాటు గణ ఆహారం కూడా ఇవ్వడం మొదలుపెట్టాక మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మార్పులు చేసుకోవచ్చు

9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

ఆరోగ్యకరమైన మెదడు కోసం ఏం చేయాలి

 మెదడుని ఆరోగ్యంగా ఉంచుకుంటే జ్ఞాపకశక్తి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యము పెరుగుతాయి అందుకని ఆరోగ్యకరమైన మెదడు కోసం ఏం చేయాలంటే

మనిషి మెదడు 75% నీరే ఏ కొంచెం డిహైడ్రేషన్ అయినా మెదడు పని తీరు మీద ప్రభావం పడుతుంది కాబట్టి ఆ సమస్య రానీయకూడదు

పీల్చుకునే గాలిలోనూ శరీరంలో ఉన్న రక్తంలోనూ 20% మెదడే తీసుకుంటుంది ఒక్క ఐదు నిమిషాలు ఆక్సిజన్ అందకపోయినా మెదడులో కొన్ని కణాలు చనిపోతాయి

శరీరంలోని కొలెస్ట్రాల్లో నాలుగోవంతు మెదడులోనే ఉంటుంది అక్కడ ప్రతి కణానికి కొవ్వు అవసరం అది లేకపోతే కణాలు చచ్చిపోతాయి ఆహారంలో ఒమేగా త్రీ కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటున్నందున మెదడు కుంచించుకుపోయే ప్రమాదం పెరుగుతుంది లోఫ్యాట్ డైటింగ్ చేసేవాళ్లు వైద్యుల్ని సంప్రదించకుండా ప్రయోగాలు చేయకూడదు

జిపిఎస్ ఉంది కదా అని ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాం కానీ దానివల్ల మెదడుకి దిక్కులని గుర్తించే శక్తి సన్నగిల్లుతోందట మెదడుకి పని తగ్గించడం మొదలు పెడితే కావాలనుకున్నప్పుడు మళ్ళీ పనిచేయడం జరగదు మెదడుకి తగినంత పని ఇవ్వడమే కాదు శారీరక వ్యాయామం వ్యాయామం ద్వారాను మెదడు పనితీరును మెరుగుపరుచుకోవాలి

కూరగాయలు పండ్లతో కూడిన సమతుల ఆహారం మెదడు ఆరోగ్యానికి అవసరం బిపి షుగర్ లాంటి వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి

నిద్రలేమి కొంగుబాటు ఒత్తిడి ఆందోళన మెదడు పనితీరును బాగా దెబ్బతీస్తాయి..

హెల్త్ బిట్స్..9-2-2024

 భోజనం వేళలు ముఖ్యమే..

ఉదయం 8 గంట టిఫిన్ మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం సాయంత్రం  చిరు తిండ్లు, రాత్రి 9:00 కి మళ్ళీ భోజనం దాదాపుగా ఇలానే ఉంటుంది మన భోజన దిన చర్య. అంటే దాదాపు 12 నుంచి 13 గంటల వ్యవధిలో తినాల్సినవన్నీ తినేస్తాం. ఆ పరిధి అంతకంటే తక్కువ ఉండేలా చూసుకోవాలని ఓ అధ్యయనం సూచిస్తుంది ఇలా చేస్తే టైప్ 2 డయాబెటిస్ ను అధిగమించవచ్చని చెబుతున్నారు . ఉదయం 8 గంటలకు టిఫిన్ తో మొదలుపెట్టి రాత్రి భోజనం 9 గంటలకు పూర్తి చేయడం కంటే దానిని ఓ నాలుగు గంటలు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు ఇలా చేయడం వల్ల డయాబెటిస్ రోగుల శరీరాలు రాత్రి సమయంలో ఉపవాస స్థితికి చేరుకుంటాయి దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి ఈ అధ్యయనం మాస్ ట్రిక్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో చేశారు గతంలో జరిగిన ఓ పరిశోధన కూడా ఇలాంటి విషయాన్ని వెల్లడించింది ఊబకాయిల శరీరంలోని కణాలు ఇన్సులిన్ కు స్పందించే గుణం కూడా మెరుగుపడుతుందని ఈ అధ్యాయంలో తేలింది

ఆ గ్రూప్ రక్తంతో పక్షవాతం ముప్పు .. ఇటీవల కాలంలో 60 ఏళ్ల లోపు వారిలోనూ పక్షవాతం కేసులు పెరుగుతున్నాయి

అయితే న్యూరాలజీ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం ఇతరులతో పోలిస్తే ఏ బ్లడ్ గ్రూప్ వారికి పక్షవాతం వచ్చే అవకాశం 16% ఎక్కువ అంట  అదే ఓ బ్లడ్ గ్రూపు వారికైతే ఇది 12 శాతం తక్కువ అట , మొత్తానికి ఏ బ్లడ్ గ్రూప్ వారిలో రక్త కణాలు గుచ్ఛంగా మారే ముప్పు ఎక్కువ అని పరిశోధకులు అనుమానం వ్యక్తం చేశారు మన ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అంశాల చిట్టాలో బ్లడ్ గ్రూప్ అనేది ఒకానొక అంశం మాత్రమేనని ఆ అధ్యయనం వెల్లడించింది ఇతర కారణాలు కూడా తోడైతేనే ఏ వ్యాధి అయినా శరీరంపై దాడి చేసే ఆస్కారం ఉంటుంది ధూమపానం మానివేయడం సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారం మితంగా తీసుకోవడం రక్తపోటును అదుపులో పెట్టుకోవడం తదితర జాగ్రత్తల వల్ల దీర్ఘకాలిక వ్యాధులను అడ్డుకోవచ్చు

ఆటో ఇమ్యూన్ సమస్యలా?

ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగు శాతం మంది కీళ్లవాతానికి సంబంధించిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి వివిధ ఆటో ఇమ్యూన్ రుగ్మతల్లో ఒకటి కంటే ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నారని అంచనా అయితే ఆటో ఇమ్యూన్ రుగ్మతలు మనుషులలో ఒకటి పాయింట్ నాలుగు రెట్లు అధికంగా గుండె రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు దారితీస్తాయని బెల్జియం లోని కేథలిక్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది రెండు ఆటో ఇమ్యూన్ రుగ్మతలు ఉన్నవాళ్లలో ఈ ముప్పు రెండు రెట్లు ఎక్కువ అట కాబట్టి ఆటో ఇమ్యూన్ రుగ్మతలు ఉన్నవారు గుండె రక్తనాళాల సమస్యల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

విటమిన్ బి12 లభ్యమయ్యే శాఖాహార పదార్థాలు ఏమిటి

 మామిడిపండు పిక్కలోని జీడీలు విటమిన్ బి ట్వెల్ లభ్యమవుతుందా పుట్టగొడుగులు తినడం ద్వారా ఈ విటమిన్ లోపాన్ని అధిగమించవచ్చా. ఇవే కాక బి12 లభ్యమయ్యే ఇతర శాకాహార పదార్థాలు ఏమిటి..

మామిడి టెంకలోని పిక్కలు కొన్ని పోషక పదార్థాలు ఉన్నాయని పలు శాస్త్రీయ పరిశోధన పత్రాలు తెలుపుతున్నాయి విటమిన్ సి విటమిన్ ఏ పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఐరన్ మొదలైన పోషకాలు వివిధ అమాయనో యాసీడ్లు పిక్కల్లో ఉంటాయి అయితే విటమిన్ బి ట్వెల్ బి 12 కూడా ఉన్నట్టు కేవలం ఒక పరిశోధన పత్రంలోని ప్రస్తావించబడి ఉంది దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది మిగిలిన పోషకాల కోసం ఐదు పది గ్రాముల మామిడి పిక్కల పొడిని రోజు తీసుకోవచ్చని కూడా పరిశోధనలు తెలుపుతున్నాయి కొన్ని రకాల పుట్టగొడుగుల్లో మాత్రమే బి12 లభిస్తుంది 100 గ్రాముల ఎండిన చిటాకి పుట్టగొడుగుల్లో బీ12 అధికంగా ఉంటుంది కానీ మనకు మార్కెట్లో సాధారణంగా దొరికే వైట్ బటన్ పుట్టగొడుగులు బీ12 ఉండదు. శాఖాహారులకు పాలు పాల పదార్థాలైన పెరుగు పన్నీర్ నుండి కూడా బీ12 లభిస్తుంది. రోజు పావు లీటర్ నుండి అర లీటర్ వరకు పాలు పెరుగు లాంటివి తీసుకోవడం వల్ల బి12 లోపం రాకుండా జాగ్రత్త పడవచ్చు.

పచ్చిమిర్చిలోని పోషక విలువలు ఏమిటి

 కారం ఘాటు తేడాలతో రకరకాల పచ్చిమిర్చి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మిర్చికి ఈ కారాన్ని ఇచ్చే గుణం కెప్సిసింగ్ అనే పదార్థం వల్ల వస్తుంది విటమిన్ సి ఏ కె వి సిక్స్ కాపర్ పొటాషియం పీచు పదార్థం లాంటి పోషకాలు మిర్చిలో ఉంటాయి కానీ మనం తీసుకునే మొత్తం తక్కువగా ఉండడం వల్ల మిర్చి ద్వారా అందే ఈ పోషకాల మోతాదు తక్కువే కప్ శాంతిన్ వయోలా శాంతిన్  లూటీన్ చిన్నమిక్ యాసిడ్ ఫెరోలిక్ యాసిడ్ మొదలైన యాంటీ ఆక్సిడెంట్ కూడా మిర్చిలో ఉంటాయి కేవలం కూరల్లో వాడడం మాత్రమే కాకుండా సలాడ్లలో చట్నీలు రైతాలలో పచ్చిమిర్చి వాడినప్పుడు వాటిలోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు మనకందే అవకాశం ఎక్కువ అవసరానికి మించి అధికంగా కారం ఉండే మిర్చి తీసుకున్నప్పుడు కడుపులో మంట డయేరియా వస్తాయి ముఖ్యంగా ఇరిటేబుల్ బవెల్స్ సిండ్రుమ్ ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువ అవుతుంది రుచిని కారాన్ని కొద్దిపాటి పోషకాలను అందించే మిర్చిని మితంగా వాడుకుంటేనే మంచిది



ఫ్యాట్ బర్నర్స్ వల్ల ఉపయోగం ఏమిటి ?

 కొవ్వు కరిగించేందుకు ఉపయోగపడే ప్రత్యేక పోడులు టాబ్లెట్లు మందుల గురించి ఈమధ్య ఎక్కువ వింటున్నాము ఇవి ఆరోగ్యానికి మంచివేనా వీటిని వాడి ఒంట్లో కొవ్వు తగ్గించుకోవడం బరువు తగ్గడం సాధ్యమవుతుందా?


కొవ్వు జీవక్రియ లేదా శక్తివ్యాయాన్ని పెంచడం కొవ్వు  శోషణ ను తగ్గించడం ద్వారా ఫ్యాట్ బర్నర్ అనే పదార్థాలు బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయని ప్రచారం జరుగుతుంది గ్రీన్ టీ కెఫిన్ ఆల్ఫా లైపోయిక్  ఆసిడ్ జిన్సింగ్ ఆపిల్ సెడార్ వినగార్ మొదలైనది ఫ్యాట్ బర్నర్స్ లేదా కొవ్వు కరిగించే పదార్థాలుగా మార్కెట్లో లభిస్తున్నాయి కొన్ని ఉత్పత్తుల్లో ఒకటి కంటే ఎక్కువ క్యాట్ బర్నర్లు కూడా ఉంటాయని వీటిలో కొన్ని శరీరంలో రక్త పోటు ను పెంచి తద్వారా జీవ క్రియా శక్తి వ్యయాన్ని పెరిగేలా చేస్తాయి.. దీని వల్ల కాల క్రమేణా బరువు తగ్గడానికి దారి తీసే అవకాశం ఉంది. కానీ అధిక మోతాదులో తీసుకుంటే అధిక రక్తపోటు, గుండె పోటు కిడ్నీల సమస్య లు కాలేయ సమస్య లు మొదలైన దుష్పరిణామాలు కలుగ వచ్చును.కొన్ని ఫ్యాట్ బర్నర్ లు మీరు తీసుకునే మందుల ప్రభావాన్ని కూడా మారుస్తాయి.. అధిక బరువు తగ్గించడంలో ఈ పదార్థాలు కేవలం 10 శాతం లోపు మాత్రమే సహాయ పడ గలవు.. మిగతా 90 శాతం కంటే ఎక్కువ తీసుకునే ఆహారం , చేసే శారీరక శ్రమ,నిద్ర ల పైనే ఆధార పడి ఉంటుంది అందుకే బరువు తగ్గాలంటే కేలరీలు పరిమితి మించ కుండా తీసుకోవడం , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్ర పోవడం ముఖ్యం. ఎలాంటి సప్లిమెంట్స్ ఐనా వైద్యులు నిపుణుల సలహా లేకుండా వాడరాదు..

7, ఫిబ్రవరి 2024, బుధవారం

పతంజలి మిలనోగ్రిట్కు అంతర్జాతీయ గుర్తింపు

 పతంజలి ఆయుర్వేద ఔషధం మిలనోగ్రిట్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది స్వచ్ఛమైన వనమూలికలతో చర్మ సౌందర్య రక్షణకు సంబంధించి తయారు చేసిన ఔషధం మిలనోగ్రిట్ పై ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ బయోసైన్స్ రిపోర్ట్ లో కవర్ పేజీ కథనాన్ని ప్రచురించింది చర్మ సౌందర్య రక్షణకు సంబంధించి పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన పరిశోధనల్లో మిలలో గ్రేట్ అద్భుతంగా పనిచేస్తుందని వెళ్లడైనట్లు పతంజలి యోగపీట్ ప్రొఫెసర్ బాలకృష్ణ ఓ ప్రకటనలో వివరించారు ఈ విషయాన్ని బ్రిటన్ కు చెందిన మేగజైన్ బయోసైన్స్ రిపోర్ట్స్ లో శాస్త్రీయంగా నిరూపిస్తూ కథనాన్ని వెలువరించింది అని తెలిపారు మిలినోక్రిపై ప్రచురించిన కథనాన్ని పోర్టల్ అండ్ ప్రెస్ డాట్ కామ్ పబ్లిక్ బయో portalandpress.com/bioscirep లో చూడవచ్చు అన్నారు..

సబ్జా షియా ఏది ఎక్కువ ఆరోగ్యకరం వీటిని ఎలా తీసుకోవాలి

 సబ్జా షియా ఈ రెండు ఒకటేనా ఏది ఎక్కువ ఆరోగ్యకరం వీటిని ఎలా తీసుకోవాలి ఇలా ఈ విత్తనాల గురించిన అనుమానాలు ఉన్నాయా అయితే వీటి గురించి కొంత అవగాహన పెంచుకుందాం. సబ్జా షియా ఈ రెండిట్లో సమాన పోషక విలువలు ఉంటాయి అధిక బరువు తగ్గాలి అనుకునే వాళ్లకు ఇవి రెండు సూపర్ ఫుడ్స్ ఈ రెండింటిని నీళ్లలో నానబెట్టి తీసుకోవచ్చు అయితే చూడడానికి ఒకేలా ఉండడంతో రెండు ఒకటేనని పొరపాటు పడుతూ ఉంటాం. అయినా పర్వాలేదు పోషకాల పరంగా రెండు ఉత్తమమైనవి. అయితే నీళ్లలో నానబెట్టే సమయాలు రెండింటికి భిన్నంగా ఉంటాయి. మధ్య దక్షిణ మెక్సికో నుంచి వచ్చిన షియా విత్తనాలలో పీచు ఒమేగాత్రి ప్రోటీన్లు ఉంటాయి. మన దేశానికి చెందిన తులసి విత్తనాలైన సబ్జాలు జాతిలో మంట శరీరంలోని టాక్సిన్ లను తగ్గించే గుణాలు ఉంటాయి ఇక షియా విత్తనాలు నాన్నడానికి కనీసం అరగంట సమయమైనా పడుతుంది సబ్జా విత్తనాలు నీళ్లలో వేసిన క్షణాలలోపే నాని ఉబ్బిపోతాయి శియా విత్తనాలు నీళ్లలో నాని బరువెక్కి జెల్ లాగా మారి పాత్ర అడుగుకు చేరుకుంటాయి నానిన తర్వాత వాటి అసలు బరువుకు పదింతలు పెరుగుతాయి సబ్జా విత్తనాలు నీళ్లలో క్షణాల్లో నానిపోయి వాటి చుట్టూ పారదర్శక పోరా ఏర్పడుతుంది

ఇలా వాడుకోవాలి చియా విత్తనాలను నానబెట్టి లేదా నానబెట్టకుండా నేరుగా కూడా తినవచ్చు కానీ సబ్జా విత్తనాలను కచ్చితంగా నానబెట్టిన తర్వాతే తీసుకోవాలి స్మూతీలు మిల్క్ షేక్స్లో షియా సబ్జా రెండింటినీ కలుపుకొని తాగవచ్చు సబ్జా విత్తనాలు లెమనెడ్స్ సలాడ్స్ లో కూడా బాగుంటాయి

బరువు తగ్గాలంటే షియా లేదా సబ్జా ఈ రెండిట్లో దేనినైనా మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనానికి అరగంట ముందు నీళ్లలో నానబెట్టి తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల కడుపు నిండుగా మారి అతిగా తినే కోరిక తగ్గిపోతుంది





5, ఫిబ్రవరి 2024, సోమవారం

దేశ దేశాల్లో ఆయుర్వేదం .. ప్రపంచ ఆరోగ్య సంస్థ సంకల్పం

 

విశ్వవ్యాప్తంగా ఎన్నో సంప్రదాయ వైద్య విధానాలు వేల ఏళ్లుగా ప్రజలకు స్వస్థత చేకూరుస్తున్నాయి భారతను ఆయుర్వేదానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది దీనికి ప్రాచుర్యం కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది

ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు 80% ఏదో ఒకరకంగా సంప్రదాయ వైద్య విధానాలను పాటిస్తున్నారు ఇలాంటి వాటిని ప్రధాన చికిత్స పద్ధతుల్లో భాగం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది ముఖ్యంగా డబ్ల్యూహెచ్ఓ పరిధిలోని ఆరు ప్రాంతీయ కార్యాలయాలు శాస్త్రీయంగా జరిపిన అధ్యయనం ప్రకారం ఆయుర్వేదం రెండో అత్యంత ఆమోదయోగ్యమైన వైద్య విధానంగా ఉంది ఈ క్రమంలో అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ జాబితాలో ఆయుర్వేద వైద్య పారిభాషిక పతజాలాన్ని డబ్ల్యూహెచ్వో చేర్చింది దీనికి సంబంధించిన ప్రతిని ఇటీవల ఢిల్లీలో ఆవిష్కరించింది డబ్ల్యూహెచ్వో 2019 22 మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను సంప్రదించి భారత ప్రభుత్వం భాగస్వామ్యంతో దీన్ని తయారు చేసింది ఆయుర్వేదంలో దీన్ని కీలకమైలు రాయిగా అభిమానించవచ్చు ఐసిడి జాబితా రూపకల్పనలో భాగంగా డబ్ల్యూహెచ్వో ఆధ్వర్యంలోని ఆయా విభాగాలు 2019లో తొలిసారిగా ఇండియా వ్యాప్తంగా పేరెన్నికదన్న విద్యాసంస్థలు ఆస్పత్రులు ఇతర సంస్థల్లో నిపుణులను సంప్రదించాయి వారి భాగస్వామ్యంతో పలు ఆయుర్వేద గ్రంధాలు వెబ్ పోర్టల్లను విశ్లేషించి ఆయుర్వేద వైద్యంలో సాధారణంగా వాడే పారిభాషిక పదాల జాబితా తయారు చేశారు తొలి ప్రతిలో 5879 ఆయుర్వేద పదబంధాలను కోండికరించారు వీటన్నింటినీ తేలిక గుర్తించేలా క్రమసంఖ్యలను కేటాయించారు గుజరాత్లో 2019 డిసెంబర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆశ్రయ బంగ్లాదేశ్ కెనడా డెన్మార్క్ భారత్ జపాన్ మలేషియా నేపాల్ న్యూజిలాండ్ శ్రీలంక లకు చెందిన వైద్య భాషా నిపుణులు ఈ పద సముదాయాన్ని నిశితంగా పరిశీలించి విశ్లేషించి ఆమోదించారు అనంతరం దీన్ని అంతర్జాతీయంగా మరింత పేరెన్నిక గన్న వైద్య నిపుణుల బృందానికి పంపించారు అర్జెంటీనా ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ జర్మనీ భారత్ మలేషియా తదితర 18 దేశాల బృందం 26 వర్చువల్ సమావేశాలు నిర్వహించి ఈ పద సముదాయాన్ని పరిశీలించిన కొన్నింటిని తొలగించి మరికొన్నింటిని మెరుగుపరిచి నది.2021 అక్టోబర్లో 35 దేశాల నిపుణుల బృందం మరోసారి దీన్ని సుశీకంగా పరిశీలించి 3876 పారిభాషిక పదాలను ఆమోదించింది సమానార్థం కలిగిన పర్యాయపదాలతో కలిపి ఈ సంఖ్య 4012 కు చేరింది. ఆయుర్వేదంలో చెప్పిన అనేక మూల సూత్రాలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు వ్యాధికి సంబంధించిన ద్రవ్యాలు ఔషధాలు ఆహార తయారీ విధానాలు చికిత్సలు వ్యాధి నివారణ పద్ధతులు తదితరాలను సమగ్రంగా పరిశీలించి ఈ పారిభాషిక పదజాలని రూపొందించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ఆయుష్ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఢిల్లీలో ఇటీవల ఐసిడి రెండో ప్రతిగా ప్రజలకు వైద్యులకు దీన్ని అందుబాటులోకి తెచ్చారు ఈ పదకోశం ఆంగ్ల మాధ్యమంలో స్పష్టంగా ఎలాంటి సందేహతలకు తావు లేకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు

మన ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తం కావడానికి ఈ పారిభాషిక పధ కోసం ఎంతగానో తోడ్పడుతుంది ప్రపంచ సంప్రదాయ వైద్య విధానాలతో ఆయుర్వేదం అనుసంధానం కావడానికి మేలిమి అడుగుక దీన్ని భావించవచ్చు ఆయుర్వేదాన్ని విశ్వవ్యాప్తంగా వినియోగించడానికి దానిపై పరిశోధనలు చేయడానికి దీనివల్ల మార్గం సుఖమం అవుతుంది రాబోయే రోజుల్లో మన ఆయుర్వేద ఉత్పత్తులకు దేశ విదేశాల్లో గిరాకీ ఏర్పడటానికి ఈ పారిభాషిక పదజాలం ఉపయోగపడుతుంది ఆయుర్వేద సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులు నేర్చుకోవడానికి వైద్యమెలకువలు పంచుకోవడానికి ఆస్కారం దక్కుతుంది వైద్య పర్యాటకానికి దీనివల్ల మేలు కలుగుతుంది అనేక ఆయుర్వేద చికిత్సలను ప్రజలకు తక్కువ ధరకు అందుబాటులోకి తేవడానికి ఇది దోహదపడుతుంది భారతి లోని ఆయుర్వేద విద్యాలయాలకు ఔషధ తయారీ రంగానికి సాంకేతిక నిపుణులకు తరిఫీది ఇచ్చే సంస్థలకు ఈ పారిభాషిక పదజాలం ఎంతగానో తోడ్పడుతుంది పంచకర్మ చికిత్సలకు సంబంధించిన పరికరాల తయారీ పరిశోధనల రంగానికి ప్రయోజనం జరుగుతుంది భారతలోని ఆయుర్వేద విద్యార్థులు అధ్యాపకులు చికిత్స నిపుణులు ఔషధ తయారీదారులు ఆయుర్వేద అభిమానులు ఈ పారిభాషిక పదకోశాన్ని రోజువారి వైద్య విధానంలో విరివిగా వినియోగించాలి దీనివల్ల ఆరోగ్య రక్షణతో పాటు మన ఆయుర్వేదానికి మరింత ప్రాచుర్యం లభిస్తుంది. తద్వారా మన సాంప్రదాయ వైద్యం విశ్వవ్యాప్తమై దేశానికి ఆర్థికంగా మేలు కలుగుతుంది ప్రపంచానికి ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగం జరుగుతుంది.



Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...