19, మార్చి 2017, ఆదివారం

బీపీ కి ధనియాలతో వైద్యం / BP KI DHANIYALATHO VAIDYAM / CORIANDER SEEDS FOR BP


ధనియాల్లో మసాలా అంశాలే కాకుండా ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.ప్రత్యేకించి రక్తపోటును నియంత్రించే అంశాలు ధనియాల కషాయంలో విరివిగా ఉన్నాయి.ఈ కషాయాన్ని హిమకల్పం అంటారు.

హిమకల్పం తయారీ విధానం -

25 గ్రాముల ధనియాలను నూరి , ఒక వెడల్పాటి పాత్రలో వేసి పావు లీటర్ నీటిని పోసి రాత్రిపూట ఆరుబయట పెట్టాలి.ఆ పాత్రపైన మూతపెట్టకుండా ఏదైనా పలుచని గుడ్డను కట్టాలి.ఉదయం లేవగానే ఆ పాత్రలోని ధనియాలను చేతితో బాగా పిసకాలి.తర్వాత ఒక గ్లాసులో దానిని వడకట్టి కొద్దిగా పంచదార కలుపుకొని రోజూ సేవిస్తే బీపీ అదుపులోకి రావడమే కాకుండా పిత్త సంబంధ రోగాలన్నీ హరించుకు పోతాయి.చాలా కాలంగా వేధించే కడుపు మంట , మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి.

12, మార్చి 2017, ఆదివారం

ఆటిజం - ఆయుర్వేదం

కొంత మంది
పిల్లలు పుట్టినపుడు మిగతా అందరిలా భేషు
గానే ఉంటారు. కానీ, రోజులు గడిచేకొద్దీ పిల్లల్లో కొన్ని తేడాలు
కనపడుతుంటాయి. ఆ తేడా ఐక్యూ పరమైనవే అయితే కొంత
వరకు ఫర్వాలేదు కానీ ఒక అయోమయం, ఒక గందరగోళం
కనిపిస్తుంది. అది తల్లిదండ్రుల్ని బాగా కలవరపెడుతుంది.
కొన్ని లక్షణాలు వారిని తీవ్రమైన మనోవ్యధకు గురిచేస్తాయి.
ఆ తేడాలకు కారణమయ్యే ఒక ప్రధాన సమస్య ఆటిజం,
వారిలో కనిపించే కొన్ని లక్షణాల ఆధారంగా ఆటిజం వ్యాధిని
గుర్తించవచ్చు. కాకపోతే పసిపిల్లలుగా ఉన్నప్పుడు కాదు!
మూడేళ్ల వయసులో గుర్తించవచ్చు.
ఒంటరిగా ఉండాలంటే భయం
పిలిస్తే పలుకకపోవడం, పరిచయస్తుల్ని చూసినా స్పందించక
పోవడం, మిగతా పిల్లలతో కలిసి ఆడుకోకపోవడం, ముఖం
మీద భావోద్వేగాలేవీ కనిపించకపోవడం, అసహజమైన కద
లికలు, కళ్లలో కళ్లు పెట్టి చూడలేకపోవడం, ఏకకాలంలో వివిధ
వస్తువుల మీద దృష్టి పెట్టడంలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే
డాక్టర్‌ను సంప్రదించడం చాలా అవసరం. ఇలాంటి సమ
యాల్లో ముఖ్యంగా పిల్లవాడికి ఆటిజం సమస్య ఏమైనా
ఉందేమో సాధ్యమైనంత త్వరగా నిర్ధారించుకోవాల్సిన అవ
సరం ఉంటుంది. నిజంగా ఈ సమస్య ఉన్నట్టు నిర్ధారణ జరి
గితే తక్షణమే చికిత్స ప్రారంభించాలి.
ఆటిజం అంటే
నిజానికి ఆటిజం వ్యాధి కాదు. ఇది మెదడు పనితనంలో ఏర్ప
డిన ఒకలోపం మాత్రమే. సాధారణంగా ఆటిజం లక్షణాలు
మూడేళ్ల వయసు నిండక ముందే కనిపిస్తాయి. ఆటిజం ఉన్న
పిల్లలు ప్రధానంగా కొన్ని సమయాల్లో బాగా ఇబ్బంది పడు
తుంటారు.
కారణాలు
ఆటిజం సమస్యకు బహుముఖ కారణాలే ఉన్నాయి. వీటిల్లో
జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయి. అంటే మెదడు
ఎదుగుదలకు తోడ్పడే కొన్ని జన్యువులు కూడా ఆటిజానికి
కారణమవుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గర్భావస్థ
సమయంలో తల్లి తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవడం వల్ల
కూడా కొంత మంది పిల్లల్లో ఈ సమస్య రావచ్చు.
లక్షణాలు
ఆటిజం పిల్లలందరిలో ఒకే లక్షణాలేమీ ఉండవు. వ్యాధి
తీవ్రత, వయసు వంటి విషయాలను బట్టి వేర్వేరు లక్షణాలు
ఉంటాయి. అందుకే దీన్ని ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని
కూడా అంటారు. అయితే 18 నెలలు గడిచిన తర్వాత ఆటిజం
పిల్లలను ఈ కింది లక్షణాల ద్వారా గుర్తించవచ్చు.
కళ్లలోకి చూడలేకపోవడం -ఒంటరిగా ఉండడం, ఒంటిరిగా ఆడడం
- మాటలు ఆలస్యంగా రావడం లేదా నత్తిగా మాట్లాడడం
లేదా అసలు మాట్లాడ లేకపోవడం
- ఒకే పనిని పదేపదే చెయ్యడం
ఎప్పుడు ఒకే రంగును ఎంచుకోవడం
అసహజమైన, అసాధారణమైన శరీర కదలికలు
• కుదురుగా కూర్చుని పనిచెయ్యలేకపోవడం లేదా గంటల
తరబడి స్తబ్ధంగా ఉండిపోవడం
.
చికిత్స విధానం
ఆధునిక చికిత్సా పద్ధతిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న
విధానాలతో వ్యాధి నిర్వహణ కొంత పరిణతి వరకే సాధించ
వచ్చు. కానీ ఆయుర్వేదం, పంచకర్మ చికిత్సా పద్ధతులను
జోడించిట్లయితే సాధ్యమైనంత వరకు ఆటిజం పిల్లలను సాధా
రణస్థితికి తీసుకురావచ్చు. ఆయుర్వేద ఔషధాలతో పాటు
అనుభవజ్ఞుడైన పంచకర్మ విశేషగ్నుడి పర్యవేక్షణలో చికిత్స జరి
గినట్లయితే సంపూర్ణలాభం చేకూరుతుంది. పంచకర్మ చికి
త్సలో అభ్యంగనం, శిరోధారా, కర్ణపూరణం, నస్యః, సర్వాం
గధార, వసికర్మ మొదలైన చికిత్సలు అవసరాన్ని బట్టి మూడు
నుంచి ఆరు వారాల వరకు రెండు లేదా మూడు పర్యాయాలు
చేయవల్సి ఉంటుంది.

10, మార్చి 2017, శుక్రవారం

ఆయుష్షు పెంచే ఆహారం / THE FOOD FOR IMPROVING LIFESPAN


30 ఏళ్లకే ఆయాసం, నలభై ఏళ్లు దాటితే
నీరసం, ఇటీవల చాలా మందిలో చూస్తున్న
పరిస్థితి ఇది. ఇక యాభయ్యో పడిలో పడితే
గుప్పెడు మాత్రలు మింగుతూ ఇంటిపట్టున
కృష్ణా,రామా అనుకుంటూ కూర్చోవలసిందే!
మన దగ్గర ఇలా ఉంటే జపాన్ దగ్గరున్న
'ఒకినావా దీవి వాసులు మాత్రం శతాధిక
వృద్ధులుగా ప్రపంచ ప్రఖ్యాతి పొందుతు
న్నారు. అక్కడి జిరోమాన్ కిమురా అనే
శతాధిక వృద్ధుడు ఏకంగా 118 ఏళ్ల దాకా
బతికి ఇటీవల కొత్త రికార్డు సృష్టించాడు.

ఇతనికి ముందు మిసావో ఒకావా అనే
మహిళ 115 ఏళ్లు జీవించిన శతాధికురాలిగా
పేరు తెచ్చుకుంది. జపనీయులు వందేళ్లు
జీవిస్తూ పేరు తెచ్చుకుంటే, ఒకినావా
వాసులు ఏకంగా సెంచరీ కూడా దాటేసి
ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తున్నారు. అయితే
వీళ్ళింత  సుదీర్ఘకాలం జీవించటం వెనకో
ఆరోగ్య రహస్యం ఉంది. అదే. .. ఒకినావా డైట్.

ఒకినావా అనేది జపాన్‌ లోని ఓ దీవి. ఈ
దీవిలోని వాళ్లంతా నిండు నూరేళ్ల పాటు
జీవించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మరి
దీర్ఘాయుషు కోసం వీళ్లంతా ఏం తిన్నారు. ఆ
వివరాలు తెలియాలంటే ఒకినావా ఆహారశైలి
గురించి తెలుసుకోవాలి.
ఒకినావా వాసుల్లా వందేళ్లు నిక్షేపంగా
జీవించాలంటే ఈ ఒకినావా ఫుడ్ లిస్టు కు
దైనందిన ఆహారంలో చోటు కల్పించాలి.

బిట్టర్ మెలన్స్..

పచ్చి పుచ్చకాయలను
ఇతర కూరగాయలతో కలిపి స్టిర్ ఫ్రై చేసి
తినాలి. బిట్టర్ మెలన్లో మధుమేహానికి
వ్యతిరేకంగా పోరాడే గుణాలుంటాయి.

టోపు..

 ఫ్రెంచ్ వాళ్లకు బ్రెడ్,ఐరోపా వాళ్లకు బంగాళా
దుంపల్లా, ఒకినావా వాసులకు టోపు అంత ప్రియమైన ఆహారం. వీళ్ల దైనందిన ఆహారంలో టోపు ఉండాల్సిందే!
అమెరికన్ల కంటే 8 రెట్లు ఎక్కువగా టోపు తింటారు. ఇతర సోయా ఉత్పత్తు ల్లాగే టోపు గుండె ఆరోగ్యాన్నికాపాడుతుంది.
మాంసం బదులుగా సోయా ఉత్పత్తులు
తిన్నవాళ్లలో గుండె జబ్బులకు కారణ
మయ్యే టైగిసరైడ్స్, కొలస్టరాల్స్ తక్కువగా ఉన్నట్లు తేలింది.

ఒకినావా చిలకడ దుంప..

ఒకినావా ద్వీపంలో ఇప్పుడు కనిపించే
శతాధిక వృద్ధులందరూ 1903 - 1914 మధ్య
కాలంలో పుట్టిన వాళ్లే. వీళ్ల జీవితంలో మొదటి
పావు భాగం వరకు. అంటే 1940 వరకూ
ఎక్కువ శాతం, దాదాపు 60% క్యాలరీలను
ఒకే ఒక పదార్థం నుంచే తీసుకున్నారు. అదే
'ఐమో'. ఐమో అనేది ఒకినావా ద్వీపంలోని
చిలకడ దుంప. వంకాయ లేదా పసుపుపచ్చ
రంగులో ఉండే ఈ స్వీట్ పొటాటో 400
ఏళ్లకు పూర్వం అమెరికా నుంచి ఈ దీవికి
తరలి వచ్చింది. దీన్లో అత్యధిక ప్లావనాయిడ్స్,
విటమిన్ సి, కెరోటినాయిడ్స్, ఆలస్యంగా
ఖర్చయ్యే పిండి పదార్థాలున్నాయి.

తక్కువ క్యాలరీలు: 

ఒకినావా వాసులు
జపనీయుల కంటే 20% తక్కువ క్యాలరీ
లున్న ఆహారం తింటారు. ఒక గ్రాము ఆహా
రానికి ఒక గ్రాము క్యాలరీ ఉండేలా చూసు
కుంటారు. వారి (బాడీ మాస్
ఇండెక్స్) సుమారుగా 20. దీన్ని బట్టి క్యాలరీ
లను కంట్రోల్ చేస్తే బరువు  అదుపులో ఉండ
టంతోపాటు ఈ క్రింది ప్రయోజనాలు కూడా
ఉన్నాయి.
ఆరోగ్యం మెరుగవుతుంది.వృద్ధాప్యం ఆలస్యమవుతుంది.
ఒకినావాలు పళ్లు, కూరగాయలను గ్రీన్,
ఆరెంజ్, ఎల్లో (జీ ఓ వై). ఈ మూడు
రంగుల్లో వర్గీకరించుకుటారు. ఈ
రంగుల్లో ఉండే పళ్లు, కూరగాయలు,
దుంపలను మాత్రమే తింటారు. జీఓవై 
ఫుడ్ లో విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా
కెరోటిన్, లుటీన్, గాంధీన్ వంటి
పోషకాలుంటాయి.

తక్కువ చక్కెర, కొవ్వులు..

ఆరోగ్యాన్ని
శుష్కింపజేసేవి చక్కెర, కొవ్వులే. కాబట్టి ఒకినావా డైట్
లో వీటికి స్వల్ప స్థానం ఉంటుంది.వీళ్ల దైనందిన
ఆహారంలో 25%
చక్కెర, కొవ్వులు ఉంటాయి. మిగతా 75% పప్పు,ధాన్యాలతో
నిండి ఉంటుంది. కాబట్టే వీళ్లకు హృద్రోగాలు,
గుండెపోట్లు రావు.

కూరగాయలు, సముద్రాహారం..

ఎక్కువ మంది ఒకినావాలు శాకాహారులే .వారుండే ప్రదేశం దీవి కాబట్టి ,వీరిలో కొందరు సముద్రాహారం కూడా తింటారు. 
అయితే తక్కువ
మొత్తంలో చేపలు, ఎక్కువగా కూరగాయలు తింటారు. ఇక మాంసం, డైరీ ఉత్పత్తులు ,గుడ్లకు సాధ్యమైనంత దూరంగా ఉంటారు..
ఒకినావా డైట్ ఎంతో క్రమశిక్షణతో కూడుకు
న్నది. ఆరోగ్యానికి మేలు చేస్తూ ఆయుష్షును 
కాపాడే పదార్థాలను ఆచితూచి ఎంచుకోబట్టి అక్కడి వారికి అంత దీర్ఘాయుష్షు.

స్వీట్ పొటాటో..

 మిగతా దుంపల్లా చిల
కడ దుంపలు రక్తంలో చక్కెర స్థాయిని
పెంచదు. వీటి ఆకులతో సూప్ తాగినా
ఫలితం ఉంటుంది. చిలకడ దుంపల్లో
వృద్ధాప్యాన్ని కుంటు పరిచే స్పారామిన్ అనే
యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.

పసుపు..

 ఒకినావాలు పసువు సుగంధ
ద్రవ్యంగా, టీ గా కూడా వాడతారు.
యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,
యాంటీ ఆక్సిడెంట్ అయిన పసుపు లోని యాంటీ ఏజింగ్
గుణాల గురించి అధ్యయనాలు జరుగుతున్నాయి.
దీన్ని విరివిగా వాడబట్టే
ఒకినావా వాసుల్లో అల్జీమర్స్ వ్యాధిగ్రస్థులు
కూడా చాలా తక్కువగా ఉన్నారు. 

సముద్రపు నాచు..

తక్కువ క్యాలరీలు, ఎక్కువ
పోషకాలున్న పదార్థం సీ వీడ్. ఈ
సముద్రపు నాచు ను ఒకినావా వాసులు
సూప్స్ ,స్కూలలో వాడతారు. సీ వీడ్ లో
కెరోటినాయిడ్స్, ఫోలేట్, మెగ్నీషియం,
క్యాల్షియం, ఐరన్, అయోడిన్లు ఉంటాయి.

22, నవంబర్ 2016, మంగళవారం

శాఖాహారం మేలు చేస్తుంది.

పళ్ళు, కూరగాయలే ఎందుకు తినాలి?
మాంసంలో లేని ప్రత్యేకతలు కూరగాయల్లో
ఉన్నాయా?
* మనం పళ్ళు కూరగాయలు ఎందుకు తినా
లంటే వాటిలో సూక్ష్మ పోషకాలు నిలవుంటాయి
కాబట్టి, లవణాలు, ఖనిజాలు అతి కొద్ది మోతా
దులో మనిషికి ఆజన్మాంతం అవసరమౌతాయి.
కోబాల్ట్, క్రోంఇయం, రాగి, అయొడిన్, మ్యాంగ
నీసు, జింక్ లాంటి ఖనిజాలు, ఇంకా ఇతర విట
మిన్లు ఎక్కువగా రోజుకు 100 మి.గ్రా, మోతాదు
వరకూ అవసరం అవుతాయి.
పోషకాలు:
తక్కువ మోతాదులో ఎక్కువ శక్తిదాయకమైన
వీటిని సూక్ష్మ పోషకాలంటారు. ఇవి పళ్ళలోను,
కూరగాయల్లోను అత్యధికంగా ఉంటాయి. పీచు
పదార్థాలు, పిండిపదార్ధాల్లాంటి స్థూల(మక్రోపోష
కాలంటారు. ఇవి ఎక్కువ మోతాదులో శరీరానికి
అవసరం అవుతాయి కాబట్టి వీటికా పేరు వచ్చింది.
ఇవి కాక శరీరం తన పనిని తాను సమర్థవంతంగా
చేసుకునేందుకు కావలసిన పోషకాలను మొక్కలు
మాత్రమే మన శరీరానికి అందిస్తాయి. వీటిని
'పైటోన్యూట్రియంట్స్' అంటారు. ఇవి మొక్కల్లో
ఫంగస్ లాంటి చీడ పట్టకుండా కాపాడే రక్షణ
యంత్రాంగానికి సంబంధించినవి. మొక్కలకు
సంబంధించిన వాటిని ఆహారంగా తీసుకున్నప్పుడు
ఈ రక్షక రసాయనాలు పూర్తిస్థాయిలో మనకు
అందుతాయి.
కేవలం మాంసాహారం మీద ఆధారపడితే ఇవి
చాలినన్ని అందకుండా పోతాయి.
కాషాయం రంగు కూరగాయలు:
పిల్లల్లో కంటి చూపు పెరగడానికి, చర్మం
మృదుత్వం, లావణ్యం పొందడానికి, వ్యాధి నిరో
ధక శక్తి పెరగడానికి ఏ విటమిని అవసరంఅవు
తుంది. కేరట్లు, టమోటాలు, చిలకడదుంపలు,
బొప్పాయి, మామిడి పండు లాంటి ఎరుపు రంగు
కలిగిన పండ్లు, కాయగూరల్లో కెరటోనాయిడ్స్ అనే
పోషకాలు శరీరానికి రక్షణ కలిగించే ద్రవ్యాలను
బాగా అందిస్తాయి.
సివిటమిన్:
టమోటాలాంటి
కూరగాయల్లోనూ,
జామ అరటి లాంటి
పండ్లల్లోనూ ఉండే 'సి
విటమిన్ పూర్తిస్థాయిలో
మనం ఉపయోగించుకో
లేకపోతున్నాం. వాటిని అధిక ఉష్ణోగ్రత దగ్గర
వండటం కారణంగా సి విటమిన్ ఎగిరిపోతోంది.
చారు, సాంబారు, పప్పుచారు, కలగూర పప్పు
లాంటివి వండినప్పుడు పొయ్యి మీంచి దించబోయే
ముందుటమోటా రసం కలపటం మంచిది. సివిట
మిన్ని అతిగా వండితే త్వరగా ఆవిరైపోతుంది.
అందువలన కూర రుచి కూడా దెబ్బతింటుంది. ని
విటమిన్ ఎక్కువగా కలిగిన పండ్లను, కాయగూర
లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వాటిలోని
ఇనుముకు సంబంధించిన ఫోలిక్ యాసిడ్ అనేది
శరీరానికి బాగా వంటబడ్తుంది.
పీచుపదార్ధాలు:
కాయగూరల్లోనూ, ఆకు కూరల్లోనూ అధి
కంగా ఉండే పీచుపదార్థాలు జీర్ణశక్తిని పెంచు
తాయి. పేగులను బలసంపన్నం చేస్తాయి. రోజూ
కాలవిరేచనం అయ్యేలా చేస్తాయి. పేగుల్లో కేన్సర్
లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా కాపాడ
తాయి. పీచుపదార్థాలతో నిండిన ఆహారం తీసుకు
న్నప్పుడు కొవ్వు పదార్థాలు, పంచదార పదార్థాలు
- రక్తంలోకి ఎక్కువగా చేరకుండా అని అడ్డుకుం
దాయి. ఆ విధంగా స్థూలకాయం, షుగరు వ్యాధుల్ని
5 అదుపులో పెట్టడానికి పీచుపదార్థాల అవసరం
ఎంతైనా ఉంది.
కూరల్ని ఇలా వండాలి:
కూరల్ని అతిగా చింతపండు, అల్లం, వెల్లుల్లి
మసాలాలు వేయకుండా వండుకుంటే కూర ఎక్కు
వగానూ, అన్నం తక్కువగానూ తినటం సాధ్యం
అవుతుంది. ఏ కూరగాయనైనా నూనెలో బాగా
వేయిస్తే ఆ కూరగాయ ప్రబావం సగం చచ్చిపో
తుంది. పోషాకాలు మాడి పోతాయి. అతిగా
వేగడం వలన అందులో కేన్సర్ కారకమైన ఆకీల
మైడ్ అనే విషరసాయనం పుడుతుంది. ఈ సంగతు
లను గమనించి కూరగాయలను మందాగ్ని మీద
తేలికగా ఉడికించుకుని కూరలు తయారు చేసుకో
వాలి.
మాంసానికి ప్రత్యామ్నాయం?
మాంసాహారానికి ప్రత్యామ్నయంగా కూరగా
యలను, పప్పుధాన్యాలను, తీసుకోవచ్చు. కానీ
- కూరగాయలకు మాంసాహారం ప్రత్యామ్నాయం
కానే కాదు. కూరగాయల్లోని పోషకాలు తేలికగా
అరిగే స్వభావాన్ని కలిగి ఉంటాయి.
ఇటీవల కాలంలో పనస ముక్కల పలావ్,
దొండకాయ టిక్కాలాంటి వంటకాలు మాంసాహా
రాన్ని వండే పద్ధతిలో కూరగాయల్ని ఎక్కువగా
వండుతున్నారు. ముఖ్యంగా విందు భోజనాల్లో కేట
రర్లు ఇలాంటి వంటకాలను సృష్టిస్తున్నారు. అక్కడ
తిని, ఇంట్లో కూడా అలాంటివే వండుతూ ఆహా
రాన్ని విషతుల్యం చేసుకుంటున్నాం. కొద్దిపాటి వేడి
మీద కొంచెంసేపు ఉమ్మగిలనిస్తే కూర తినడానికి
రుచిగానూ, ఆరోగ్యదాయకం గానూ ఉంటుంది.

5, నవంబర్ 2016, శనివారం

తిప్పతీగ - ఆయుర్వేదం

తిప్పతీగ తో ప్రయోజనాలు.

తిప్పతీగ పేరును బట్టే ఇది లత అని అర్థమవుతుంది.
సన్నటి కాండంతో వేరొక చెట్టు మీదగానీ లేదా దేనినైనా
ఆసరా చేసుకుని, చుట్టుకుని పాకే మొక్క. దీని ఆకులు ఇంచు
మించు తమలపాకుల ఆకారంలో (గుండె ఆకారంలో)
ఉంటాయి. బెరడు నూగు (ధూళి)పూసిన ఆకుపచ్చరంగులో
ఉంటుంది. బెరడు అంతా కంతులు కలిగి ఉంటుంది. వేసవిలో
పువ్వులు, శీతాకాలంలో పండ్లు ఉంటాయి. ఈ పండ్లు చిన్నగా,
ఎర్రగా ఉంటాయి. వృక్షశాస్త్రంలో దీని పేరు 'టైనోస్పోరా కార్డి
ఫోలియా'. దీనికి 'అమృత, గుడూచీ, చక్రాంగీ, మధుపర్డీ'
అనే పర్యాయపదాలుంటాయి. హిందీలో 'గిలోయా'
అంటారు. దీని రుచి చేదు, కారంగా ఉంటుంది.
ఔషధ గుణాలు : ఇది వాత, పిత్త, కఫ వికారాలన్నింటినీ
తగ్గిస్తుంది. అన్ని రకాల జ్వరాలనూ తగ్గిస్తుంది. ఆకలి
పుట్టించి, జీర్ణక్రియను పెంచుతుంది. అమ్మపిత్త (ఎసిడిటీ)
వికారాన్ని పోగొడుతుంది. వాంతులు, దప్పికను తగ్గిస్తుంది.
రక్తశుద్ధి చేసి చర్మరోగాలను దూరం చేస్తుంది. శరీర భాగాల్లోని
మంట, మూత్రంలో మంట, దగ్గు, కీళ్లనొప్పుల వంటి వివిధ
బాధలను తగ్గిస్తుంది. రక్తహీనతను పోగొడుతుంది. హీమోగ్లో
బిన్ ను పెంచుతుంది. నీరసాన్ని పోగొడుతుంది. మూలశం
కను కూడా తగ్గిస్తుంది. మధుమేహ నివారణ, చికిత్సలకు ఉప
యోగపడుతుంది.
భావప్రకాశ : దోషత్రయామ తృట్ దాహమేహకాసాంశ్చ
పాండుతాం: కామలా కుష్ట వాతాస్త్ర జ్వరకృమి
వమీన్ హరేత్ ..... హృద్రోగవాతనుత్"
వాడుకునే విధానం : దీని ఆకులు, పువ్వులు, పండ్లు,
కాండం, దుంప... అన్నీ ఉపయోగకరమే.
స్వరసం ( పసరు) : పైన చెప్పిన భాగాలలో లభ్యమైనవా
టిని పరిశుభ్రంగా నీటితో కడిగి, పచ్చివాటిని దంచి స్వరసం
తీయాలి.  ఒకటి రెండు చెంచాల మోతా
దులో తేనెతో రెండుపూటలా సేవించాలి.
చూర్ణం: లభించిన భాగాలను బాగా
ఎండబెట్టి పొడి చేయాలి. మోతాదు :3
నుంచి 5 గ్రాములు నీటితో లేక తేనెతో
రెండుపూటలా సేవించాలి. చూర్ణాలను
తయారు చేసి ఆరు నెలల లోపు వాడుకో
వాలి.
కషాయం: లభించిన భాగాలను
పచ్చివిగానీ, ఎండువిగానీ లేక చూర్ణాన్ని
గానీ ఉపయోగింయచి కషాయం
తయారు చేసుకోవాలి (పది గ్రాముల
ద్రవ్యానికి సూమారు 120 మిల్లీలీటర్ల
నీటిని కలిపి, నాల్గవ వంతు మిగిలేవరకు
మరిగించి, వడగట్టుకోవాలి. (మోతాదు
ఐదారు చెంచాలు (3మి.లీ.)
రెండు పూటలా ఖాళీ కడుపున
తాగాలి.
సత్వం : దీన్నే సత్తు
అంటారు. ఈ ద్రవ్యానికి
సంబంధించి తిప్పసత్తు. లభిం
చిన భాగాలన్నింటినీ, పచ్చివా
టినీ, పరిశుభ్రంగా కడిగి,
బాగా దంచి, నీటిలో 12
గంటల పాటు నానబెట్టి, ఆ


తర్వాత, పైన తేలిన నీటిని పారబోసి, అడుగున ఉన్న
ముద్దను, నీడలో ఆరబెట్టాలి. అప్పుడు మెత్తగా
నూరితే 'సత్వం' తయారువుతుంది. ఇది ఎంతకా
లమైనా నిల్వ ఉంటుంది. మోతాదు -1-3
గ్రాములు తేనెతోగానీ, నీటితోగాని రెండుపూ
టలా సేవించాలి.
అమృతారిష్ట (ద్రావకం): ఇది ఆయుర్వేద
మందుల షాపులలో లభిస్తుంది. 'ఆసవ, 'ఆరిష్ఠ
రూపంలో మందుల్ని తయారు చేయడం ఇళ్లలో
సాధ్యం కాదు. ఫార్మశీలలో తయారు చేయాలి.
మోతాదు : 3 లేక 4 చెంచాలకు సమానంగా నీళ్లు
కలిపి మూడు పూటలా తాగాలి.
గమనిక : . ఈ లతను ఇళ్లల్లో, పెరళ్లలో లేదా
కుండీలలో పెంచుకోవచ్చు. ఈ వ్యాధులను బట్టి
దీనితో పాటు ఇతర మూలికల్ని కూడా కలుపు
కొని వాడతారు.


ఆస్త్మా - ఆయుర్వేదం

ఆస్తమా అంటే స్వేచ్చలేని శ్వాస. దీని బారిన పడిన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆలర్జీ రియాక్షన్
ద్వారా శ్వాసకోశాలు, ఊపిరితిత్తుల్లో గాలి చేరటాన్ని అడ్డుకుని శ్వాస పీల్చడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ
మహమ్మారి కారణంగా ప్రతి ఏడాది 2.5 లక్షల మంది మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఆస్తమాను ఆయుర్వేద వైద్య విధానంతో నయం చేయొచ్చు.
లక్షణాలు: ఆస్తమా బాధితుల్లో ఉబ్బసం వచ్చినప్పుడు శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసినప్పుడు గురక రావడం,
ఛాతీ బిగుతుగా ఉండి నొప్పిగా ఉండడం, కడుపు ఉబ్బరం, గడ్డం దగ్గులు, గొంతులో దురద, రాత్రివేళ
తరుచుగా దగ్గు రావడం, జలుబు, గుండె శరీరంలో బరువుగా ఉండడం, శ్లేష్మం ఎక్కువగా ఉండడం,
నడిచేటప్పుడు ఆయాసం,
రొప్పడం, నాడి వేగంగా కొట్టుకోవడం, నిద్రలేమి, కళ్ల దిగువన నల్లని చారలు,
చెమట పట్టడం, వినికిడి కష్టంగా ఉండడం, ఆందోళన తదితర లక్షణాలు ఉంటాయి.
కారణాలు: సహజమైన అలర్జీ, దుమ్మూదూళి ద్వారా ఆస్తమా వ్యాపిస్తుంది. బొద్దింకలు, పొగతాగడం, పీల్చడం
వల్ల కూడా సంక్రమిస్తుంది. వంశపారంపర్యంగా కూడా దీని బారిన పడతారు. బాల్యంలో శ్వాసకోశ
వ్యాధులు, వాతావరణ జీవరసాయన ప్రక్రియలు, హార్మోన్లలో మార్పులు మహిళల్లో), ఆహార విధానాలు,
వాతావరణ మార్పులు, జీర్ణకోశవ్యాధులు, ఆస్పిరిన్, నాన్ సైరోయిడల్ డ్రగ్స్ వాడడం, జంతు చర్మాలు, గడ్డి,
పుప్పొడి, దూళిరేణువులు, జీర్ణవాహికలో రుగ్మతలు కూడా ప్రధాన కారణాలు
ఇతర పరిణామాలు
ఆస్తమా బారిన పడిన వారిలో జీవన ప్రమాణం తగ్గడం, 80-90శాతం మందిలో శ్వాసకోశ నాళాలు
స్తంభించిపోవడం, గర్భిణుల్లో రక్తపోటు, మధుమేహం, రక్తస్రావ సమస్యలు, శిశువుల్లో బరువు తగ్గడం,
శ్వాసకోశ ఇబ్బందులు, హృద్రోగాలు, ఊపిరితిత్తుల్లో గాలి బయటకు రావడం, చర్మం పెలుసుగా మారడం,
ఎముకలు గుళ్లబారిపోవడం, చర్మ వ్యాధులు తదితర పరిణామాలు
చోటు చేసుకుంటాయి.
V
నిర్ధారణ పరీక్షలు
బ్రాంకియల్ ప్రొవోకేషన్
పల్మనరీ ఫంక్షన్
సీటీ స్కాన్
బోన్ డెన్సిటీ టెస్ట్
బోన్ స్కాన్
• స్పిరోమెట్రీ నిర్ధారణ

బ్రాంకో స్కోప్

• స్వీట్ టెస్ట్ (సిస్టిక్ ఫైబ్రోసెస్)

-ఎలర్జీ టెస్ట్
చికిత్స
ఆయుర్వేదంలో మూలికా వైద్యం, సహజ ప్రకృతి చికిత్స, ఆహార నియమాల నియంత్రణ ద్వారా ఉబ్బసాన్ని
తగ్గించొచ్చు.
- కొన్ని లవంగ మొగ్గలు అరటిపండు తొక్కలో ఉంచాలి. రాత్రంతా అలాగే ఉంచి పొద్దున్నే పరిగడుపున
తేనెతో తీసుకుంటే ఊపిరితిత్తులు బలోపేతమవుతాయి.
ఫైబ్రిఫ్యూజ్ (నేలములకు, ఎల్లో బెర్రీడ్ నైట్ షేడ్ మొక్క లేదా చోటికెటారీ(సోలనేమ్ సురటెన్స్ బర్న్) మొక్కను
పూర్తిగా కషాయంగా చేసి రోజుకు 7 - 14 మి.లీటర్ల చొప్పున రెండుపూటలా సేవిస్తే జలుబు, దగ్గు,
ఉబ్బసం తగ్గుతుంది.
ట్రైలిస్పెర్మం (ఇజీవాన్), తులసి, మిరియం, అల్లం టీ, కషాయం సేవిస్తే ఉబ్బసంతో ఉపశమనం కలుగుతుంది.
పంచకర్మతో ఉపశమనం కలుగుతుంది.
• శ్వాశారిరసం, అబ్రకభస్మ ప్రవలపిష్టి, త్రికూటచూర, తోస్తాది చూర్ణం(వైద్యుని సలహా మేరకు) తేనెతో 1
గ్రాము తీసుకుంటే ఉబ్బసం నుంచి ఉపశమనం కలుగుతుంది.
లక్ష్మీ విలాసరసం, సంజీవని మాత్రలు కూడా ఉపశమనం కలిగిస్తాయి.
టీ స్పూన్ పరిమాణంలో శ్వాసారి క్వాత్, ములేరిక్వాత్ తీసుకోవాలి. 400మి. లీటర్ల నీటిలో కలిపి 100
గ్రాములు అయ్యేవరకు బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, మధ్యాహ్నం సేవిస్తే ఉపశమనం
కలుగుతుంది.
పసుపు, లవంగం, ఆల్జీజియా రెబ్బక్ మూలిక, బే బెర్రీ పొడి. ఎపిడ్రా, అర్జున బెరడు శీతాది చూర్ణ.
మధురం(లిక్వోరైస్), యష్టిమధు, బొర్సె పొడి, తేనె మిశ్రమం కూడా ఉపయోగపడుతుంది.
• కరక్కాయ చెబులిక్ మైరోబలన్) నమలడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుంది.
-మిరియాలు, తేనె, ఉల్లిరసం, కలిపి తాగితే శ్వాసకోశంలో ఇబ్బంది తగ్గుతుంది.
వాయు, పుష్కర మూలం, ముల్లన్, జనజవైన్, నల్ల మిరియాలు, అవిసెగింజలు, అల్లం, మన్నా మిల్
(లోహబాన్) తదితర మూలికలు ఉపయుక్తంగా ఉంటాయి.
శ్వాసకోశనాళాలు కుచించుకుపోవడాన్ని ఎఫ్రిండ్రా, సినికా ఆరికడతాయి.
ఆహార నియమాలు
ఆహారాన్ని నమిలి మింగాలి. కడుపునిండా భోజనం చేయొద్దు. ఆకుకూరలు, తాజా పండ్లు తీసుకోవాలి. ఉల్లిని
ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మజాతి పండ్లలో విటమిన్-సీ ఉంటుంది. రోగ నిరోధక శక్తిని ఇది
పెంచుతుంది. ఆస్తమా వ్యాధి గ్రస్తులు శాఖాహార భోజనం చేయడం మంచిది. విటమిన్-ఏ ఉండే కూరలు
తినాలి. ఎమినోఏసిడ్స్, ఒమేగా-3 వల్ల శ్వాసకోశ నాళంలోని మంట తగ్గుతుంది. ఉబ్బసాన్ని నివారిస్తుంది.
తులసి చాలా మంచి ఔషధం పసుపు లేని అల్లం, మిరియాలు తరుచుగా తీసుకోవాలి. పిండిపదార్థాలు,
ప్రొటీన్లు, కొవ్వుపదార్ధాలు తక్కువగా తీసుకోవాలి. మాంసం, గుడ్లు, చేపలు, చాక్లెట్లు, ఫుడ్ ప్రెజర్వేటివ్స్
ఆసాని పెంచే కారకాలు రోజూ 10-12 గ్లాసులు నీళ్లు తాగాలి బాడీ లోషన్స్, షాంపోలు, డియోడరెన్స్,
షేవింగ్ లోషన్స్ వాడొద్దు.






Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...