1, జనవరి 2013, మంగళవారం

కర్పూరం.. ఆయుర్వేద ఉపయోగాలు..

తెల్లటి కర్పూరానికి హిందూ సంప్రదాయంలో గొప్ప విశిష్టత ఉంది. కర్పూర హారతిని అందుకుని, భగవంతుడిని స్మరించుకోవడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. పవిత్రతకు చిహ్నం.. అంతే కాదు కర్పూరం.. ఔషధ గుణాల పెన్నిధి. మనం ఏ ఆలయంలోకి వెళ్ళినా కర్పూర హారతి ఇవ్వడం మనకు కనిపిస్తుంది .ఇళ్లల్లో చేసుకునే పూజలు, వివాహాలు, పండుగల సందర్భంగా కర్పూరం వెలిగించి హారతులు అందుకోవడం మనకు తెలుసు .ఇంత పవిత్రంగా పరిగణించే కర్పూరానికి గొప్ప వైద్య చికిత్స విలువలు ఉన్నాయని అంశం అంత విస్తృతంగా తెలియదు. అంతేకాదు కర్పూరం పదం మూలం, అది పరివ్యాప్తమైన విధానం ఎంతో ఆసక్తిదాయకం. ఇంగ్లీషులో కర్పూరాన్ని క్యాంఫర్ అంటారు. ఈ పదం ఫ్రెంచ్ పదం క్యాంఫ్రీ నుండి స్వీకరించబడింది. అలాగే క్యాంపర్ నామం స్పెయిన్ భాష స్పానిష్ నుండి గ్రహించినట్లుగా చరిత్రలో ఉన్న అవగాహన. అంతేకాదు స్పానిష్ లోకి కూడా అరబ్ పదం ఆల్ కఫర్ నుండి వచ్చినట్లుగా చరిత్ర కారులు రూడీగా నిర్ధారించారు .తెల్లటి స్పటికం లా ఉండే కర్పూర పరిమళం అమోఘం ,అద్భుతం. తూర్పు ఆసియా, ఉత్తర ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో నిరంతరం పచ్చగా ఆరోగ్యంగా ఉండే క్యాంఫర్ లారెల్ చెట్టు నుండి కర్పూరాన్ని తయారు చేయడం జరుగుతుంది .

శ్వాస కోశ సమస్యలకు..

 ప్రపంచవ్యాప్తంగా మానవాళి కర్పూరంతో ఎంతో ప్రయోజనం పొందుతోంది .బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. క్రిమి కీటకాలను ధ్వంసం చేసే గుణం ఉంది. దోమల సంహారిని కూడా. వేలాది సంవత్సరాలుగా కర్పూరం ఈ సుగుణాలతో మనకు ఎంతో మేలు కలుగజేస్తోంది. బ్యాక్టీరియాను నాశనం చేసేదిగా కర్పూరమును ఆయుర్వేద నిపుణులు గత 5000 సంవత్సరాలుగా పరిగణించి వినియోగిస్తున్నారు. ఆఫ్రికాలో కర్పూరం చెట్టు బెరడును జ్వరం, మలేరియాలను నయం చేసేందుకు వినియోగిస్తారు. ఆంటీ సెప్టిక్ వస్తువుగా కూడా ఉపయోగిస్తున్నారు .18వ శతాబ్దంలో అమెరికా ,ఐరోపా ఖండాలలో కర్పూరాన్ని ప్రజలు విరివిగా వినియోగించినట్లు వినికిడి .
 శ్వాసకోశ సంబంధ సమస్యల పరిష్కారానికి, అలాగే ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే వ్యాధులు నయం కావడానికి, కర్పూరపు బిల్లను అక్కడి ప్రజలు మెడ చుట్టూ ధరించేవారు .అక్కడ ఇప్పటికీ జలుబు నయం కావడానికి ప్రజలు కర్పూరాన్ని వినియోగిస్తున్నారు అన్నది వాస్తవం.

 కర్పూర తైలం సమర్థమైన ఉత్తేజ పూరిత ద్రవ్యం. రక్తప్రసరణ, మెటబాలిజం, జీర్ణశక్తి రసాల స్రావం, శరీర వ్యర్థాలను బయటికి పంపడం లాంటి విషయంలో కర్పూర తైలం బాగా పనిచేస్తుంది. రక్తప్రసరణ సమస్యలు ,జీర్ణశక్తి, జీవక్రియ సమస్యలు ఉన్నప్పుడు కర్పూరాన్ని నిపుణులు వినియోగిస్తారు .

యాంటీ సెప్టిక్ వస్తువుగా..

 కర్పూర తైలం యాంటీసెప్టిక్ గా, ఇన్ఫెక్షన్ల పైన ,క్రిమి కీటక సంహారిణిగా, సూక్ష్మజీవుల నాశకారిగా, సహజ రక్షణ కారిగా పనిచేస్తుంది. మనం తాగే నీటిలోనూ కర్పూరాన్ని ప్రత్యేకించి వేసవి, వర్షాకాలంలో కలిపి తీసుకుంటారు. ఎందుకంటే ఈ కాలాల్లో నీటిలో సూక్ష్మజీవులు చేరి ఇన్ఫెక్షన్లు కలగజేసే అవకాశం ఉంది. వాటిని నివారించడం కోసం కర్పూరం కలుపుతారు. ఒక సీసాలో లేదా ఏదైనా పాత్రలో కర్పూరం తైలం పోసి మూత పెట్టకుండా ఉంచినా లేదా కొంచెం గుడ్లను తైలంలో కాసేపు నానబెట్టి దాన్ని బయటకు తీసి అలా ఉంచినా క్రిమి కీటకాలు పారిపోతాయి .అలాగే సూక్ష్మజీవులు కూడా చచ్చిపోతాయి. ఒకటి రెండు చుక్కలు ఎక్కువ మొత్తం ధాన్యంలో వేసినట్లయితే పురుగులు చనిపోయి ధాన్యం సురక్షితంగా ఉంటుంది. అనేక రకాల ఔషధాల తయారీలోనూ కర్పూరాన్ని వాడుతారు. 
చర్మవ్యాధులకు.. చర్మం పైన బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు నివారణకు అవసరమైన మందులు తయారీలో కర్పూరం వాడుతారు. ఇక స్నానం చేసే నీటిలో కర్పూర తైలం లేదా కర్పూరం కలిపినట్లయితే శరీరం అంతటినీ ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. అలాగే పేలను కర్పూరం చంపుతుంది. తెల్ల కర్పూరం నుండి విషతుల్యమైన రసాయనాలు తొలగించిన తర్వాత దగ్గు కోసం ఉపయోగించే సిరప్ లు, చాక్లెట్లు, తీపి పదార్థాలలోనూ వాడుతారు. దగ్గు ని నియంత్రించడంలో తెల్ల కర్పూరం చక్కగా పనిచేస్తుంది. శ్వాసనాలం పై భాగంలో కర్పూరం లో ఉండే పదార్థాలు పూతగా ఏర్పడి దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. హాయిని కలిగిస్తాయి. బ్రాంకైల్ / సూక్ష్మ శ్వాస నాళం , లారింక్స్/ స్వర పేటికలో గల నాళం ..ఫారింక్స్/ స్వర పేటికలో కళ్ళెకు సంబంధించిన పొర వాపు.  నాసిక నాళాలు, ఊపిరితిత్తుల్లో గల ఆటంకాలను తొలగించడంలో కర్పూర తైలం నుండి వెలువడే ప్రగాఢమైన సువాసనలు బాగా దోహదం చేస్తాయి. అందువల్ల శ్వాసకోశ నాలాల్లో ఆటంకాలను తొలగించడానికి ఉపయోగించే బామ్ లు/
 నొప్పినుండి ఉపశమనం కల్పించే లేపనాలు, జలుబు తగ్గ డానికి ఉపయోగించే రబ్ ల/ లేపనాలు లో కూడా కర్పూర తైలం ఉపయోగిస్తారు. అస్తమా చికిత్సలో కూడా కర్పూర తైలం వాడతారు. ఇక ఆయుర్వేదంలో రోగాలకు ప్రధాన కారణంగా నిర్వచించే వాత, పిత్త, కఫ దోషాలను సరిచేసి రోగాలను నయం చేయడానికి కర్పూర తైలం సిఫారస్ చేస్తారు. 
కింద పడడం వల్ల మనికట్టు, చీలమండ లాంటివి వాపులు వస్తే వాటి ఉపశమనానికి ,కండరాల నొప్పులు తగ్గడానికి, కీళ్ల నొప్పులకు, కర్పూర తైలం మర్దన చేయడం  పరిపాటి. ఈ ప్రక్రియలకు కర్పూర  తైలం  మంచి ఔషధం అని ఆధునిక మూలికా వైద్యులు అంగీకరిస్తున్నారు .

మత్తు మందుగా..

అనస్తీషియా గా ప్రత్యేకించి లోకల్ అనస్తీసియా కోసం కర్పూర తైలం సమర్థంగా పనిచేస్తుంది. ప్రత్యక్ష ప్రేరణ గల నరాలను ఇది సుషుప్తావస్థ లో ఉంచుతుంది. అలాగే నరాల వ్యవస్థ అపసవ్యతను సరి చేస్తుంది. వణుకు, మూర్ఛ కలిగినప్పుడు నరాల బలహీనత మొదలగు వాటిలో కర్పూర తైలం వాడుతారు.

 ఆంటీ స్పెస్మాడిక్ అంటే కండరాలు సడలడానికి సమర్థంగా పనిచేస్తుంది. తక్షణం కండరాలు సడలుతాయి .తిమ్మిర్లు తగ్గుతాయి . స్పాస్మాడిక్ కలరాను నయం చేయడంలోనూ బాగా పనిచేస్తుంది .అలాగే మంటలు  తగ్గడానికి, మత్తు కలిగించడానికి ఉపయోగ పడుతుంది. శరీర బాహ్య, లోపలి మంటలు తగ్గడానికి ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. శరీరం, మనసు విశ్రాంతి పొంది, ప్రశాంతతను తాజాదనాన్ని ,హాయిని కలిగిస్తుంది. కర్పూర తైలం మింగడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ కాలం దీన్ని మింగ రాదు. నిపుణుల సలహా పైనే వాడాల్సి ఉంది.

30, డిసెంబర్ 2012, ఆదివారం

ORU ROOBAYI ORU UYAR ( ONE RUPEE FOR A LIFE ) - KHAJA MOHIYUDDIN - COIMBATORE


పనస పండు.. ఆయుర్వేద ఉపయోగాలు..

పనస పండు.. రక్త పోటును నియంత్రిస్తుంది, ఆస్తమా ను అదుపు చేస్తుంది, చర్మ వ్యాధులను నివారిస్తుంది,మలబద్ధకాన్ని పోగొడుతుంది.

పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసు. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర తృణధాన్యాలను ఆహారంగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి అని ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానం అని ప్రకృతి వైద్యులు ప్రచారం చేస్తున్నారు.పండ్లు, కూరగాయలు లో ఉండే పోషక విలువలు శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయని శాస్త్ర పరిశోధనలు కూడా ధృవీకరిస్తున్నాయి.

పండ్లలో పనస పండు లో మనకు గరిష్ట స్థాయిలో ఆరోగ్యం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. పనస పండు ను బంగ్లాదేశ్ జాతీయ ఫలంగా ప్రకటించింది. అక్కడి ప్రజలు ఈ ఫలాన్ని ఇష్టంగా ఆరగిస్తారు. ఇది వేలాది సంవత్సరాలుగా అలరారుతూ మానవాళికి ఉపయోగ పడుతోంది. పనస ప్రపంచంలో అత్యంత భారీ ఫలం. పనస చెట్టును సరిగా పోషిస్తే అది దాదాపు వంద సంవత్సరాల పాటు మధుర ఫలాలను ఇస్తుంది. బంగ్లాదేశ్ లో పనస చెట్లు పెరగడానికి అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నందున అక్కడ ఎక్కువగా ఈ తోటలు పెంచుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా అటవీ ప్రాంతంలో కూడా పనస చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి.ఇప్పుడు విరివిగా పనస పండ్లు లభిస్తున్నాయి.పనసలో ఎన్నో పోషక విలువలు ఉండడమే కాదు.దీని పెంపకానికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు.అందువల్ల పంట పొలాల్లో ఒక మూల ఈ చెట్లను పెంచడం అక్కడక్కడా మనకు కనిపిస్తుంది.
పనసలో ఏదీ వృథాగా పారవేసేది ఉండదు. పనస తొనలు, లోపలుండే గింజలు , దళసరిగా ఉండే పై తొక్క ఇలా అన్నీ మనం తిని ఆనందించగలిగినవే.పనసలో ఎక్కువగా శ్యాచరేటెడ్ ఫ్యాట్,కొలెస్ట్రాల్ పదార్థాలు ఉంటాయి.అదే సమయంలో విటమిన్ ఎ, సీ, థయామిన్, రిబోఫ్లావిన్, కాల్షియం,పొటాషియం, ఐరన్, సోడియం,జింక్ , నియాసిన్ తదితర అనేక విటమిన్లు, పోషకాలు ఉండి ఆరోగ్యాన్ని కలుగ చేస్తాయి. అలాగే తక్కువ కేలరీలు ఉన్నందున ఇది ఎంతో ప్రయోజనం కలుగచేస్తుంది. వంద గ్రాముల పనసలో కేవలం 94 కేలరీలు మాత్రమే ఉంటాయి.అందువల్ల శరీర బరువు పెరగకుండా ఉంటుంది. కొందరు వీటి వాసన పడదని భావించే వారు సైతం ఇందులో గల విలువైన పోషకాలను తెలుసుకుని ఇష్టం పెంచుకుంటారు. 

ఇక పనస తొనల్లో ఉండే గింజలు ఎంతో ఉపయోగ కరమైనవి. గింజల్లో విటమిన్ బి 1,బి2 ఎక్కువగా ఉంటాయి. గింజల్లో స్టార్చ్ ఎక్కువగా, ఐరన్, కాల్షియం తక్కువగా ఉంటాయి. పనస పండు లో దాదాపు వంద నుండి 500 వరకు పనస తొనలుంటాయి. సాధారణంగా ఇవి కొంచెం బంకగా ఉంటాయి. కొంతమంది గింజలను ఎండించి దాచుకుని వాడుకుంటారు. వీటిని నూనెలు, సిరప్ లలో కూడా కలపడం జరుగుతుంది.

తొక్క.. 

పనస పండు పైన దళసరిగా ఉండే తొక్క కాస్త ముళ్ళు ముళ్ళుగా కనిపిస్తుంది. పళ్ళు కోసేవారు ముందుగా చేతులకు ,కత్తికి వేరుశనగ నూనె రాసుకుని కోసి పనస పండ్లను బయటకు తీయడం
 మనకు కనిపిస్తుంది .ఫిలిప్పీన్స్ లో చెక్కలపై చిత్రాలు , నగిషీలు చెక్కే వారిలో సృజనాత్మకతకు, ఊహలకు పనస మంచి వనరుగా ప్రసిద్ధి. అక్కడ పనసపండు బొమ్మను చూసి బౌల్స్ తయారు చేస్తారు. బౌల్స్ ను మరింత అందంగా తయారు చేయడానికి పండ్ల పైన ముళ్లగా ఉండే తొక్కపొడిని ఉపయోగిస్తారు.

కండ.. 

పనస పండు లో బాగా రుచికరమైనది. సువాసన వెదజల్లేది. ఇష్టంగా తినేది కండ. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ గా ఉంటుంది. మల బద్ధకం తో బాధ పడే వారికి ఇది చాలా మేలు చేస్తుంది.గింజలు.. పనస గింజలు సైతం ఎక్కువ ఫైబర్ ను అందిస్తాయి. వీటిని వేయించి తింటే చాలా రుచిగా ఉంటాయి. లేదా ఉడికించి కూడా తినవచ్చు. ఐతే గింజలను పొడి చేసి తిన్నట్లయితే ఫైబర్ శాతం పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియ చేస్తున్నాయి.

పొటాషియం సమృద్ధిగా లభించడం వల్ల అధిక రక్త పోటును తగ్గిస్తుంది. పనస చెట్టు వేరు జ్వరం,డయేరియా రుగ్మతలకు పని చేస్తుందని విశ్వసిస్తారు. దీనిలో ఉండే ఫైటో న్యూట్రియెంట్స్ క్యాన్సర్ నుండి హైపర్ టెన్షన్ లను తగ్గించడంలో ఉపకరిస్తాయి. అలాగే ఉబ్బసం తో బాధ పడే వారికి పనస వేరు ప్రయోజనం కలిగిస్తుంది. వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో ఉంటుంది. అలాగే పనస వేరు, చర్మ వ్యాధులలో కూడా చక్కగా పనిచేస్తుంది.ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ అల్సర్ గుణాలున్నాయి. పనసలో సి విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. మన శరీరంలో సహజంగా సీ విటమిన్ తయారు కాదు. అందువల్ల మనం తప్పని సరిగా సీ విటమిన్ లభించే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడడంలో యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది.

 కణజాలాన్ని కలిపి ఉంచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ,దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు బాగా పనిచేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కలిగించగల కణాలు త్వరగా నశించకుండా పనస కాపాడుతుంది. అలాగే ఇందులో వయసు మళ్ళే లక్షణాలను  తగ్గించే గుణాలున్నాయి. ఇన్ని విశేష గుణాలు ఉన్న పనస పండు ను మనం విశేషంగా ఆదరించి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..

22, డిసెంబర్ 2012, శనివారం

ORTHOPAEDIC PROBLEMS IN WOMEN - AWARENESS


బాదం చెట్టు.. ఆయుర్వేద ఉపయోగాలు..

పల్లెలో బాదం కాయలు కొట్టుకు తినడం ఒక ఆనందం. ఇక్కడే కాదు ప్రపంచమంతా అందరూ తిని ఆనందించేది బాదం పప్పు. ఆధునిక ఆహారంలో సలాడ్ రూపంలో , ఉత్తర భారతంలో బాదం హల్వా రూపంలోనూ ఎడారి దేశాలలో బాదం బిస్కెట్ల రూపంలోనూ , సమ శీతల ప్రాంతాలలో బాదం బ్రెడ్ రూపంలోనూ ధన వంతులు శక్తి సాధనంగా రాత్రి తినే బాదం పలుకుల రూపంలోనూ సర్వదా వాడే చక్కటి శక్తి సాధనం బాదం. ఇంత ప్రాచుర్యం ఎందుకంటే బాదంలో అంతగా పోషక విలువలు ఉన్నాయి కనుక. చూడడానికి చిన్నదైనా,విలువైనది. సంపూర్ణ పోషక విలువలు కలిగిన ఈ బాదం వేడి ప్రాంతాలైన పశ్చిమ ఆసియా లోని పల్లె ప్రాంతాలలో , తూర్పు ఆఫ్రికాలోనూ విరివిగా పండుతుంది.ఇది ప్రునియా అనే వృక్ష జాతికి చెందినది. ఈ బాదం తెల్లటి పుష్పాలతో కూడి తీయని బాదం కాయను కలిగి ఉండేవి ఒక రకమైతే , ఎర్రని పువ్వులతో కొంచెం చేదుని కలిగిన బాదం కాయలను కలిగి ఉండేవి మరో రకం.

పోషక విలువలు.. మొదటి రకం కొంచెం కోలగా ఉండి నూనె పదార్థాన్ని కలిగి ఉంటుంది. చేదు రకం కాయ పెద్దదిగా విశాలంగా ఉండి 50%నూనె కలిగి ఉంటుంది. ఇందులో కొంచెం నీరు, కరిగే గ్లూకోజు ,amygdalin,cyanid, వంటి పదార్థాలను కలిగి ఉంటాయి. తీపి కలిగిన బాదం పలుకులు పై పెచ్చులు ఒలిచి తీస్తారు. ఆ పై పెచ్చు సంప్రదాయం వైద్యంలో చర్మం పై మసాజ్ చేయడానికి వాడతారు. ఈ తీపి బాదం కాయలలో అసలు పిండి పదార్థాలు ఉండవు. కనుక దీన్ని పొడి చేసి కేకులాగానో, బిస్కెట్ లాగానో తయారు చేస్తారు. ఇవి షుగర్ ఉన్నవారికి చాలా ఉపయోగం. వాళ్ళు తినవచ్చు. అలాగే పిండి పదార్థాలు తక్కువ అవసరమున్న వారు కూడా వాడవచ్చు.


మన దేశంలో తరతరాలుగా బాదం చెట్లు మన జీవితాలలో పెనవేసుకొని ఉన్నాయి. బాదం పప్పులను రకరకాలుగా..తినుబండారాలుగా,పై లేపనాలు గా ఉపయోగించుకుని అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ బాదం చెట్లలో తియ్యగా ఉండే తీపి బాదం చెట్లు,, చేదుగా ఉండే చేదు బాదం చెట్లు ఇంకా సీమ బాదం చెట్లు మొదలైన అనేక రకాలైన బాదం చెట్లు వాడుకలో ఉన్నాయి. ప్రస్తుతం మనం తీపి బాదం చెట్టు గురించి చెప్పుకుంటున్నాము. ఈ బాదం ప్రయోగాలను బాగా అర్థం చేసుకుని,ఆచరించి ఇతరులకు కూడా నేర్పవలసిందిగా మనవి.
బాదం చెట్టు పేర్లు.. సంస్కృతంలో బాదామా , నేత్రోపమ అని , హిందీ లో బాదాం అని,తెలుగులో బాదం చెట్టు అని , లాటిన్ లో amygdalus communis & prunus ,emygdalus, ఇంగ్లీషులో almonds sweet అంటారు.


బాదం చెట్టు రూప గుణ ధర్మాలు.. బాదం పప్పు సమ శీతోష్ణ స్వభావంతో ముందుగా వేడి చేసి తర్వాత చలువ చేస్తుంది. శరీర పుష్టిని, వీర్యానికి బలాన్ని కలుగ చేస్తుంది. మేహ, వాత రోగాలను అణచి వేస్తుంది.మూత్రసంచిలో పుట్టే పుండ్లను మాన్పి వేస్తుంది.
అన్ని అవయవాలకు బలమిస్తుంది.

తీపి కలిగిన బాదం పప్పు చక్కటి పోషక విలువలు కలిగి ఉన్నా పైనున్న గోధుమ రంగు పల్చని పొర ఎక్కువగా తినడం వల్ల జీర్ణాశయంలో ఉత్తేజాన్ని కలుగ చేస్తుంది. ఆహారంలో తీసుకునేటప్పుడు మంచి నీటిలో నానబెట్టి పై పొర తీసివేసి తినడం మంచిది. దాని వల్ల లోపలి పోషక విలువలు తగ్గకుండా చూసుకోవాలి. ఈ బాదం పప్పులు బాగున్నాయని, బలమని ఎక్కువగా తినకూడదు. హితమైనా మితంగా తినాలి. ఎక్కువగా తింటే కడుపుబ్బరం కలుగ చేస్తుంది.
కొంత మందికి జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది కానీ జ్వరం కాదు. అందుకే బాదం పలుకులు తీయగా, హితమైన వైనా మితంగా అది మందులా , బలం గా పని చేస్తుంది. ఇందులో 20 శాతం మాంస కృత్తులు ఉంటాయి. ఇందులో స్టార్చ్ ఉండదు కనుక పొడిచేసి బిస్కెట్ల రూపంగానో, కేకుల రూపంగానో చేసుకుని షుగర్ వారు వాడుకోవచ్చు. దీనివల్ల కాస్త బరువు కూడా పెరుగుతారు. దీనిలో ఉన్న సున్నితమైన నూనె పదార్థం గట్టిగా ఉన్న పదార్థాన్ని పలుచన చేస్తుంది.
Almonds provide double barelled protection against diabetes and cardiovascular disease.

 చలువ చేస్తుంది..

ముఖ్యంగా బిగ బట్టిన ఊపిరితిత్తుల వ్యాధులలో .. ఒక గ్లాసు నీటిలో తొమ్మిది బాదం పలుకులు కాగ పెడితే అవి కరిగి అందులో ఉండే నూనె పదార్థం నీళ్లలో కలిసి పాలుగా మారుతుంది. దీనిని బాదం పాలు అంటారు. ఇది చలువ చేస్తుంది.  హృదయాన్ని ఆహ్లాద పరుస్తుంది. బాగా నీరస పడ్డ వాళ్లకి వెంటనే శక్తి రావడానికి దీనిని ప్రతిపాదిస్తారు వైద్యులు. ఇది చిగుళ్ళ వ్యాధులలో హితకరం .బాదం పలుకులు ఒకటి రెండు నెయ్యిలో నూరి చిగుళ్లపై రాసుకుంటే చిగుళ్ల వాపు తగ్గి ప్రకాశవంతంగా తయారవుతాయి .బాదం పలుకులు కిడ్నీలో రాళ్ళను కరిగించడంలో చాలా ఉపయోగపడతాయి. గుండె మంట ను ఆర్పే మంచి సాధనం బాదంపాలు . బాదం పాలు దొరకకపోతే నాలుగైదు బాదం పలుకులు తింటే చాలు గుండె మంట, గుండె దడ తగ్గుతుంది. ఒక్కొక్క బాదం పలుకులో ప్రోటీన్ విలువలు చాలా ఉంటాయి. ఒక ఔన్స్ బాదం పొడి లో ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. చాలా చక్కగా జీర్ణం అవుతుంది.
 ఇందులో ఆహారానికి అవసరం అయ్యే పీచు పదార్థం కూడా ఉంటుంది. అది కూడా కరిగిపోయే గుణం కలిగిన పీచు పదార్థము.
 ఇది మన శరీరంలో అధిక కొవ్వు పదార్థాలను తగ్గించడంలో సహాయపడుతుంది. బాదంపప్పు కొలెస్ట్రాల్ లేని శక్తి సాధకాలు. అందువల్ల లావుగా ఉండే వాళ్లు కూడా మితంగా తినవచ్చు.
బాదం పప్పులు అత్యవసరమైన సూక్ష్మ పోషకత్వాలను కలిగి ఉంటాయి. బి 6 ,మెగ్నీషియం వంటివి దీని లో నిక్షిప్తమై ఉన్నాయి .విటమిన్ ఇ కూడా దీనిలో ఉంది. అందువల్ల గుండెను కాపాడుతుంది. ఈ మధ్య జరిగిన వివిధ పరిశోధనలలో క్రమం తప్పకుండా రెండు బాదం పలుకులు తింటే LDL కొలెస్ట్రాల్ తగ్గుతుందని తేలింది.

శక్తి ని పెంచుతుంది.. రోజు కనీసం రెండు బాదం పప్పులు తింటే షుగర్ వ్యాధిగ్రస్తులు జీవనస్థితి మారి ఉత్సాహంగా ఉంటారని పరిశోధనలలో తేలింది. బాదం క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది .దీనిలో ఉండే వ్యాధి నిరోధక శక్తి మనలో క్యాన్సర్ లక్షణాలను పెరగకుండా కాపాడుతుంది. 

బాదం లో ఉండే ముఖ్యమైన ప్రోటీన్ ను" ఆనందిన్"  అంటారు. ఇది శరీరంలో ఎలర్జీ ని కలుగ చేయదు,
 సరి కదా శక్తిని పెంచుతుంది . 

చక్కటి టానిక్..

ఒక కప్పు బాదం కాయలు, మూడు కప్పుల నీరు ,ఒక కప్పు తేనె కలిపి నూరి నీళ్లను వడ గట్టండి .అది చక్కటి టానిక్ లా పనిచేస్తుంది. 

బాదం లో కొవ్వు పదార్థం లేదు, క్యాలరీలు 59% , ప్రోటీన్ నాలుగు గ్రాములు ,క్యాల్షియం 46 గ్రాములు, మెగ్నీషియం 50 మిల్లీగ్రాములు, పొటాషియం 120 మిల్లీగ్రాములు ఉంటాయి .వేసవిలో ఎండలో మధ్యాహ్నం బాదం పాలు, సాయంత్రం బాదం పలుకులు తినడం హితకరం

ముఖ కాంతికి బాదం..

బాదం పప్పు పొడి 10 గ్రాములు , పన్నీర్ 40 గ్రాములు కలిపి మెత్తగా నూరి ముఖానికి లేపనం చేసుకుని ఆరిన తర్వాత కడుగుతూ ఉంటే ముఖంపై ఉండే మొటిమలు ,మచ్చలు హరించి పోయి చర్మం మృదువుగా మారుతుంది.

కంటి దృష్టిని పెంచేందుకు బాదం పప్పు..

బాదం పప్పు ఆకారం చూస్తే అచ్చం కన్ను లాగే ఉంటుంది. సృష్టి కర్త ప్రజల కంటిచూపు కోసం కంటి ఆకారంతో దీనిని సృష్టించాడు. బాదం పప్పు లు పావు కేజీ ఒక రాత్రి వేడి నీటిలో నానబెట్టి ఉదయం పై తోలు తీసి నలగ గొట్టి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. అలాగే సోంపు గింజలు పావు కేజీ తెచ్చి దోరగా వేయించి దంచి పొడి చేసుకోవాలి. అదే విధంగా పటిక బెల్లం పొడి పావు కేజీ తీసుకుని, ఈ మూడింటినీ కలిపి నిలువ చేసుకోవాలి. 

పిల్లలకు ఒక చెంచా మోతాదుగా, పెద్దలకు రెండు చెంచాల మోతాదుగా వేడి పాలలో కలిపి ఇస్తూ ఉంటే నేత్ర దృష్టి అనూహ్యంగా పెరుగుతుంది. ఆరు నెలలు వాడితే కళ్లద్దాలతో ఇక పని లేదని చెప్పవచ్చు.
అంతేగాక మెదడుకు అపారమైన శక్తిని ఇచ్చి , జ్ఞాపక శక్తిని రెట్టింపు చేస్తుంది. కృశించిన సర్వాంగాలను పుష్టికరంగా మారుస్తుంది.
దంత ఆరోగ్యానికి.. బాదం పళ్ళ పొడి..

బాదం కాయల పై పెచ్చులు ఎండించి కాల్చి బూడిద చేసి రోజూ పండ్లు తోముతుంటే కదిలే పండ్లు గట్టి పడతాయి. పండ్ల నుండి కారే చీము, నెత్తురు తగ్గి పోతుంది.. పళ్ళు ముత్యాల వలే మెరుస్తాయి.

చర్మ వ్యాధులు తగ్గడానికి..

బాదం పప్పు ను మంచి నీటిలో నానబెట్టి మెత్తగా నూరి పైన లేపనం చేస్తుంటే చర్మం పై పొడలు,మచ్చలు, దురదలు తగ్గి పోతాయి.

మల బద్ధకం తగ్గడానికి..

బాదం పప్పు, అంజీరుతో కలిపి తింటూ ఉంటే సుఖ విరేచనం జరిగి మలబద్ధకం తగ్గి పోతుంది.

అన్ని రకాల రక్త స్రావాలు తగ్గడానికి..

బాదం ఆకులను నీడలో ఎండించి దంచి పొడి చేసుకోవాలి ఈ పొడిని పావు టీ స్పూన్ మోతాదుగా మంచి నీటిలో కలుపుకొని రెండు పూటలా సేవిస్తుంటే ఏ భాగం నుండి రక్తం కారుతున్నా ఆగి పోతుంది.

నెత్తురు బంక విరేచనాలు తగ్గడానికి..

బాదం పప్పు ను నానబెట్టి పై తోలు తీసి మంచి నీటితో మెత్తగా నూరి వడ కట్టిన బాదం పాలను తగు మోతాదుగా రెండు పూటలా సేవిస్తుంటే జిగట విరేచనాలు, నెత్తుటి తో పడే బంక విరేచనాలు , కడుపు నొప్పి తగ్గి పోతాయి.

మూత్ర రోగాలకు.. బాదం పప్పు..

పైన తెలిపినట్లు బాదం పాలు తీసి రెండు లేక మూడు పూటలా అరకప్పు మోతాదుగా సేవిస్తుంటే సెగ రోగం తగ్గి పోయి మూత్ర కోశం లోనూ, మూత్ర నాళం లోనూ ఏర్పడిన పుండు మాడి పోతుంది. అలాగే, అతి మూత్రం కూడా తగ్గిపోతుంది. వీర్య వృద్ధి, రక్త వృద్ధి కూడా కలుగుతాయి.

కుక్క కాటు కు.. బాదం పప్పు..

కుక్క కరవగానే బాదం పప్పు ను మెత్తగా నూరి కాటు పైన వేసి కట్టు కట్టాలి. అలాగే బాదం పప్పు, అంజీరు పండు కలిపి లోపలికి తీసుకోవాలి. ఇలా చేస్తుంటే విషం విరిగి పోతుంది.

మంచి బాదం నూనెకు..పరీక్షలు..

వేడిగా ఉన్న రొట్టె పైన కొద్దిగా బాదం నూనె వేసి చిన్న ముక్క తింటే వెంటనే బాదం రుచి మనకు తెలియాలి. అలాగే కొద్దిగా బాదం నూనె ను అర చేతిలో వేసుకుని బాగా రుద్ది వాసన చూస్తే బాదం వాసన రావాలి. ఇదే పరీక్ష.
కేశ సౌందర్యానికి.. బాదం నూనె..

బాదం పప్పు నుండి తీసిన నూనెను కొద్ది కొద్దిగా వెంట్రుకలకు రాసుకుంటుంటే అది కుదుళ్లలోకి దిగి బల పరచి మెదడుకు చలువ చేసి వెంట్రుకలు రాలనివ్వదు. కళ్ళకు కూడా మేలు చేస్తుంది.

బాదం పొడితో.. బంగారు కాంతి..

బాదం పప్పు పొడి 200 గ్రాములు, మంజిష్ట పొడి 15 గ్రాములు, కస్తూరి పసుపు 15 గ్రాములు , జటా మాంసి 15 గ్రాములు కలిపి నిలువ చేసుకోవాలి. స్నానం చేసే గంట ముందు తగినంత పొడిని పాలలో గానీ, నీటిలో గానీ కలిపి మెత్తగా నూరి శరీరమంతా రుద్దుకొని ఒక గంట ఆగి తర్వాత స్నానం చేస్తుంటే క్రమంగా శరీరం పైన వచ్చే మచ్చలు, గుల్లలు, పుండ్లు,మొటిమలు, ముడతలు, గుంటలు, దుర్వాసన మొదలైన వన్నీ హరించిపోయి శరీరం కాంతి వంతంగా మారుతుంది.
వెంట్రుకలు.. పట్టులా మారాలంటే..

బాదం నూనె ఒక చెంచా, నిమ్మ నూనె పావు చెంచా నిమ్మ ఆకు రసం 4 చెంచాలు కలిపి వెంట్రుకలకు పూస్తూ ఉంటే వెంట్రుకలు పట్టు లాగా మృదువుగా మారతాయి.

వేడి దగ్గులకు.. బాదం పప్పు..

8 బాదం పప్పులు, పటిక బెల్లం 20 గ్రాములు, ఆవు వెన్న 20 గ్రాములు కలిపి తింటూ ఉంటే అతి వేడి వల్ల కలిగిన దగ్గులు తగ్గి పోతాయి.






Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...