7, మార్చి 2016, సోమవారం

SHANAGA PINDIKI PRATHYAMNAYAM

ఈ శనగపిండికి బదులుగా వాడుకోదగినదేమైనా
ఉన్నదా?
• శనగపిండి చాలా మృదువుగా ఉంటుంది. కానీ కడుపు
లోకి వెళ్లాక రూక్షంగా (రఫీగా పనిచేస్తుంది. జీర్ణశక్తిని, పేగుల్ని,
శరీర సమతుల్యతనీ దెబ్బ తీస్తుంది. దీనివలన వాతం పెరుగుతుంది. ఎసి
ఇదీ పెరుగుతుంది. జీరం ఆరోగ్యం చెడుతుంది. పోషక విలువలు,
ప్రొటీన్లు వగైరా ఉన్నాయి కదా అనడగవచ్చు. పోషకాలు మనకు
ఎలాంటి ఇబ్బంది కలిగించనివిగా ఉండాలి కదా! వాత, కఫ పైత్యా
లను పెంచే ద్రవ్యాలు ఎంత పోషకాలు అయినా అందరూ దీన్ని తినండి
అని చెప్పడానికి వీలైనవి కావు. శష్కలీ అంటే శనగపిండి. ఇది మలబద్ధ
తను కలిగిస్తుంది. కంటికి చెడు చేస్తుంది.
గోధుమ పిండి,
జొన్న పిండి, రాగి పిండి, సజ్జపిండి లాంటి
డా.జి.వి.
వాటితో వంటకాలు శనగపిండి, మినప్పిండి, పెసరపిండి కన్నా
మెరుగ్గానూ, రుచికరంగా కూడా ఉంటాయి. శనగపిండితో చేసుకునే వంటకాలన్నిం
ఉనీ వీటితో కూడా చేసుకోవచ్చు. రాగి పిండితో పకోడీలు, జొన్నపిండితో జంతికలు,
సజ్జపిండితో అప్పాలు (సజ్జ
ప్పాలు) ఒకప్పుడు మన
పూర్పులు ఇష్టంగా తిన్నవే! ఆ
రోజుల్లో అంటే 40-50 యేళ్ల
క్రితం వరకూ శనగపిండి
వాడకం బాగా తక్కువ. ఆరో
గ్యానికి అంతగా మంచిది
కాడని ఎప్పుడో ఒకసారి సర
దాగా తినేవారు. బూందీ, కార
ప్పూన, చక్రాలు వగైరా వంట
కాలను గోధుమపిండి, జొన్నపిండి కలిపి తయారు చేసుకునే వాళ్లు, గారెలు, బూరెలు,
అరిశలు, గవ్వలు, చెక్కలు, ఇలాంటి వాటిని ఇప్పటికీ మనం శనగపిండి లేకుండానే
వండుకుంటున్నాం కదా! లడ్డు, మిరాయి, లావు కారప్పూనలాంటివి కూడా గోధుమ
పిండితోనే తయారయ్యేవి.
శనగపిండిలోనే రుచి ఉన్నదనుకోవటం ఒక అపోహ. వేటి రుచి వాటిది. సజ్జ
ప్పాలు సజ్జపిండితో చేస్తేనే రుచి గానీ, మైదా పిండితో చేస్తే అసలు రుచి ఎలా తెలు
స్తుంది...? పకోడీకి ఆ రుచిని ఉల్లిపాయ ఇస్తోంది. అనవసరంగా శనగపిండి జోలికి
వెళ్లకుండా ప్రత్యామ్నాయాలను ప్రయత్నించి చూడండి. తప్పదనుకుంటేనే శనగపిండి
వాడండి. శనగలను మరపట్టుకున్న పిండిని నమ్మినట్టు, బజార్లో దొరికే శనగపిండిని
నమ్మలేం కదా! అది గుండ్రటి శనగల (బరాణీ శనగలు, బొంబాయి శనగలు) పిండి
కావచ్చు. గుండ్రటి శనగలు ఆరోగ్యానికి మరింత హానికరం.

4, ఫిబ్రవరి 2016, గురువారం

YELAKULU / YALAKULU/ILACHI/ILAICHI - AYURVEDAM

ఏలకులు - ఎలా
(ELATTERIA CARDOMUM)
ఏలకులు సుగంధ ద్రవ్యాలకు చెందినవి. కేరళ కొంకణ ప్రాంతంలో ఎక్కువగా
పండుతాయి. వీనిని మసాలా దినుసులలో వేసి వంటలలో ఉపయోగిస్తున్నారు.
భోజనానంతరము కూడా, వక్కలతో పాటు నమలడం, తమలపాకులలో వేసుకోవడం
అందరెరిగిందే.
ఏలకుల ఔషధోపయోగాలు:
1. నోటిపూత: ఏలకులను చూర్ణించి, మిగడయందు బాగుగా కలిపి పాకము
చెందిన నోటిలో అంటించాలి.
2.. నోటి దుర్వాసన : ఏలక్కాయ గింజలు, పటిక బెల్లం కలిపినోట్లో వేసుకొని
చప్పరిస్తుండిన, నోటి దుర్వాసన పోతుంది.
3. వాంతులు: ఏలకుల చూర్ణాన్ని చిటికెడు తీసుకొని నిమ్మరసంలో కలిపి
సేవించాలి.
4. మూత్ర వ్యాధులు: 'టీ' డికాక్షనులో ఏలక్కాయల చూర్ణం వేసి సేవించాలి.
5. అర్శమొలలు: ప్రతిరోజు ఉదయమే ఒక అరటి పండులో ఒక ఏలక్కాయనుంచి
21 రోజులు భుజించాలి.
6. పుంస్య శక్తికి: పాలలో ఏలక్కాయల చూర్ణం కలిపి వేడి చేసి చల్లార్చి, తేనెను చేర్చి
త్రాగాలి.
7. తలనొప్పి: ఏలకులను మెత్తగా నూరి పలుచటి బట్టలో కట్టి వాసన చూసిన,
తలనొప్పి, తుమ్ములు తగ్గుతాయి.
8. మూత్ర పిండాలలో రాళ్లు: ఏలకులు, పందిరి దోసగింజలు కలిపి చూర్ణించి
తీసుకున్న, మూత్రాశయములోని రాళ్లు పోతాయి.
ఇ.....
"వాతము, పిత్తము, కఫము అను త్రిదోషాలలోని హెచ్చుతగ్గులే వ్యాధులకు కారణము"

28, జనవరి 2016, గురువారం

ATTU - AYURVEDAM


| రోజువారీ టిఫిన్లకు పెసరట్టు మంచిదా? మినపట్టు
మంచిదా? ఆరోగ్యానికి ఈ రెండింటిలో దేనికి ప్రాధా
అర్థచందు
న్యతనివ్వాలో చెప్పండి!

* అట్టు అనే వంటకం (దోసెలు, రొట్టెలు, అప్పచ్చులు) ఏ పిండితో చేసిందైనా
సరే, మిగిలిన పిండివంటల మాదిరే పండగకో పబ్బానికో తినవలసిందేగానీ, రోజూ
తప్పనిసరిగా తినేవి కావు. ఉదయం పూట సాంప్రదాయ పద్ధతిలో చద్దన్నం (చల్లన్నం
లేదా పెరుగన్నం) తినటం మానేసి, రోజూ అట్లు, పూరీలు, బజ్జీలు, పునుగులూ
తినటం ఉర్ణాశయానికి మేలు చేసే
అలవాటు కాదు. అది పెసరట్టినా,
మినపట్టినా, ఇదే సూత్రం. ఆ
రెండింటికీ గుణాల రీత్యా పెద్ద
వ్యత్యాసం లేదు. ఆరోగ్యవంతులు
కూడా పిండిపదార్థాల వాడకం తగ్గి
స్తేనే మంచిది.
ఏ కారణం చేతనో మనవాళ్ళు
ప్రొద్దున పూట మెతుకు తగలకూడ
దనే అపోహని బలంగా పెంచుకున్నారు. నిజానికి, ఇడ్లీలో గానీ, అట్టులోగానీ అధిక
శాతం బియ్యమే కదా! అయినా అన్నం మెతుకు సెంటిమెంట్ దేనికో అర్ధం కాదు.
నాగరికత పేరుతో మనకు మనమే సృష్టించుకునే ఇలాంటి కొన్ని అవరోధాల్లోంచి
బయటపడితే ఆరోగ్యానికి మేలు.
అట్టు మాత్రమే తినాలనుకుంటే తక్కువ కేలరీలు కలిగిన రాగులు, జొన్నలు,
సజ్జలు, గోధుమలు, ఉలవలు ఇలాంటి వాటిని రుబ్బి అట్లు వేసుకోవచ్చు. పెనరట్టు
గానీ, మినపట్టుగానీ సరదాగా అప్పుడప్పుడూ తినండి. మధ్య మధ్య కమ్మగా తాలింపు
పెట్టిన దధ్యోదనం (దధోజనం) కరైన్ లాంటివి కూడా తింటూ ఉండండి. రాగిపిం
డితోనూ, జొన్నపిండితోనూ, గోధుమపిండితో కూడా బజ్జీలు, పునుగులూ, పకోడీలు
వేసుకోవచ్చు. అన్ని రుచులను ఆస్వాదించడమే మంచిది.

KOBBARI PALU - KOBBARI NEELLU

కొబ్బరిపాలు కొబ్బరినీళ్ళు

కొబ్బరి తినటం మంచిదేనా? ఉపకారాలు, అవకా
రాలు వివరించగలరు

* కూరగాయల్ని ఎలా లేతగా ఉన్నప్పుడే తినాలో అలానే లేత
కొబ్బరినీ తినాలి. లేతగా ఉండే కొబ్బరికాయలు మార్కెట్లో దొరకటం
అపురూపం అవుతోంది. ముదిరిన కొబ్బరి, కొబ్బరినీళ్ళు కూడా వాత
వ్యాధులకు దారితీస్తాయి. దగ్గు, ఉబ్బసం, పైత్యరోగాలు వస్తాయి. లేత
కొబ్బరిని అతిగా తిన్నా ముదురు కొబ్బరిని కొద్దిగా తిన్నా రెండూ అప
ఇతర నూనెలతో పోల్చినప్పుడు కొబ్బరి నూనెలో 87 శాతం కొవ్వు
ఉంది. మంచి కొలెస్ట్రాల్, చెడ్డ కొలెస్ట్రాల్ మిశ్రమంగా ఉండే ఈ నూనె
గుండెకు అవకారం చేసేదని కొందరు, మేలుచేసేదని కొందరు
భావిస్తున్నారు. స్థూలకాయం తగ్గాలంటే కొబ్బరి తినటం మంచి
దంటారు ఇంకొందరు.
కొబ్బరిని ఇష్టంగా తినబోయే
ముందు, దానిలోని కొవ్వుని
దృష్టిలో పెట్టుకోవాలి. లేత కొబ్బరి
కోరును కొద్దిగా కొబ్బరి నీళ్ళుపోసి
పిండితే వచ్చే తెల్లని నీటిని కొబ్బరి
పాలు అంటారు. ముదిరిన కొబ్బరి
కన్నా లేత కొబ్బరిలో కొవ్వు శాతం
తక్కువగా ఉంటుంది. కొబ్బరిపా
లుగా తీసుకున్నప్పుడు మరింత
తక్కువగా ఉంటుంది. దీన్ని ఆహార పదార్థాల్లో వాడుకోవటం మంచిది. కొబ్బరి
నీళ్ళనీ, కొబ్బరిపాలనూ ఆహార పదార్థాలుగా తయారుచేసుకోవటం మంచిది. తగి
నంత పొదాషియం కోసం వీటి వాడకం అవసరం కూడా!
సాధారణంగా తెలుగువారి ఆహారంలో పులుపు, ఉప్పు, కారం ఎక్కువగా
ఉంటాయి. అధిక ఉప్పు తినేవారికి తగినంత పొటాషియం ఉన్న కొబ్బరి పదార్థాలు
తీసుకోవటం అవసరం. అలాగే కూర అరటికాయ, అరటిపళ్లను కూడా తీసుకోవటం
మంచిది. ముఖ్యంగా వేసవి కాలంలో వడకొట్టి శోష కలగకుండా లవణ సమతుల్యత
(ఎలెక్ట్రోలైట్ బ్యాలెన్స్) కోసం ఈ రెండింటినీ వాడుకుంటూ ఉండాలి.

NOONE VIKARAM

ఆ నూనె పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు సైడ్ ఎఫెక్టులు రాకుండా
ఏమైనా ఉపాయాలున్నాయా?
* అతిగా నూనె పదార్థాలు తిన్నప్పుడు దాహంగానూ, కడుపులో తిక్కతిక్కగానూ
ఉంటుంది. ఇది తగ్గడానికి మజ్జిగలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలుపుకొని తాగితే
కొంత సుఖంగా ఉంటుంది.
ధనియాలు, జీలకర్ర, శొంది
మూడింటినీ దంచిన పొడిని మజ్జి
గలో కలుపుకుని తగినంత ఉప్పు,
పంచదార కలుపుకుని తాగితే
నూనె వలన కలిగిన వికారం తగ్గు
తుంది.
తేలికగా అరిగే ఆహార పదా


16, జనవరి 2016, శనివారం

BACKING SODA

'* తినేసోడా ఉప్పుని బేకీంగ్‌ సోడా అనీ, బ్రైడ్‌ సోడా అనీ కుకింగ్‌ సోదా అనీ, లై కార్పొనేట్‌ ఆఫ్‌ సోడా అనీ పిలుస్తారు. రొట్టెలు బాగా పొంగడం కోనం, పాలు విర క్కుండా ఉండటం కోనం దీన్ని వంటింట్లోకి తెచ్చారు మనవాళ్లు. నీళ్లలో వేస్తే దీనిలోని కర్భన వరమాణువులు గ్యాన్‌ రూపాన బుడగలుగా వియటకు వస్తాయి. కాబట్టి, దీన్ని సోడా ఉప్పు అనీ, “సాల్ట్‌ ఎయిరేటన్‌' అనీ పిలుస్తారు. 12 [1003 దీని శాస్త్రీయ నామం. 

ఉప్పు ఏవిధంగా మంచీ చెడూ మిశ్రమ ఫలితాలనిన్తుందో అలాగ తినేసోడా ఉప్పు కూడా ఇన్తుంది. ఉప్పు ఎవరెవరికి నిషేధమో వారందరికీ తినే సోడా ఉప్పు కూడా నిషే ధమే! అలాగే కాల్షియం లాంటి క్షారాలను వాడుతున్న వారు కూడా తినే సోడా ఉప్పు వాడకూడదు. రెండూ క్షూరాలే కాబట్టి శరీరంలో క్షారగుణాలు పెరిగిపోయి కొత్త నమ న్యలొస్తాయి. ఎంత సోడా లైకార్చ్‌ తీనుకున్నారో అంత మేర మామూలు ఉప్పుని తగ్గించి వాడుకుంటే ఉప్పు నమన్య తీరుతుంది. గ్యాన్‌ వగైరా బాధలకు సోడా బైకార్స్‌ వాడవచ్చా అని అడిగారు. కానీ గ్యాన్‌ బాధని తెచ్చి పెట్టే ఆహార విహారాలను మూర్పు చేనుకోవడం ఒక రసాయనం వాడటం కన్నా మంచిది కదా! 

RAGI AMBALI - AYURVEDAM



అన్నం తినబుద్ధి కాకపోవడం / అజీర్ణం ,నోటికి రుచి తెలియకపోవడం జరిగినప్పుడు ఏం చేయాలి? / అల్లం - అజీర్ణం - ఆయుర్వేదం / ALLAM - AJEERNAM - AYURVEDAM


దీనిని అరుచి అంటారు.అజీర్త్ కారణంగానైన, లేదా ఇతర కారణాలవల్లనైన ఇది కలగవచ్చు. కారణం ఏదైనా ముందు జీర్ణ వ్యవస్థ బలకరం కావాలి.

ప్రతి రోజూ అల్లనికి తగినంత ఉప్పు వేసుకుని దంచి అన్నంలో మొదటి ముద్దగా కలుపుకుని నెయ్యి వేసుకుని తినాలి.నాలుక మీద జిగురు తగ్గి ,అన్న హితవు కలుగుతుంది.అన్నంలో మొదటి ముద్దగా అల్లం, ఉప్పు ( వీలైతే సైంధవ లవణం ) మిశ్రమాన్ని తినాలి.అరోగ్యవంతులు కూడా దీనిని పాటిస్తే భుక్తాయాసం కలుగదు.అహారం తేలికగా జీర్ణం అవుతుంది.అన్నం తినాలనే కోరిక కలుగుతుంది.ఉసిరికాయ తొక్కుడు పచ్చది లేద నల్ల పచ్చడిని ఈ అల్లం మిశ్రమానికి కలిపి తింటే మరీ మంచిది.భోజనంలో మొదటి పదార్థంగా దీనిని తీసుకోవాలి.
పచారీ కొట్లలో దొరికే పిప్పళ్ళను దోరగా వేయించి మెత్తగా దంచాలి.ఈ చూర్ణానికి ఆరు రెట్లు పంచదార కలిపి పాకం పట్టి కుంకుడు కాయంత ఉండలు చేసుకొని సీసాలో భద్రపరుచు కోవాలి.జీర్ణవ్యవస్థ బలంగా లేని వాళ్ళు వీటిని ఉదయం , రాత్రి ఒక్కొక్క మాత్ర చొప్పున తీసుకుంటూ వుంటే కడుపులో వాతం తగ్గి జీర్ణాశయం బలపడుతుంది.శరీరానికి నూతనోత్తేజం కలుగుతుంది.

DAMPUDU BIYYAM - SUGER DISEASE - AYURVEDAM

సుగరు రోగులకు దంపుడు బియ్యం పెడితే కలిగే ప్రయోజనం వివ
రించగలరు.

* షుగరు వ్యాధిలో బియ్యం వాడ
కాన్ని సగానికి తగ్గించాలని వైద్యులు సూచి
స్తున్నారు. ఆ మిగిలిన సగానికి సరిపడే
రాగి,
జొన్న, సజ్జ, గోధుమలను వాడుకోవ
లసిందని చెప్తున్నారు. కాబట్టి, దంపుడు
బియ్యం మాత్రమే తినాలని అనుకోనవ
సరం లేదు. షుగరు వ్యాధిలో దంపుడు
బియ్యాన్నో లేక 'పట్టు తక్కువ బియ్యాన్నో
తినటం వలన జీర్ణాశయ వ్యవస్థ మరింత
దెబ్బ తింటుంది. గోధుమలూ, రాగులు, సజ్జల్లాంటివి పూర్తి ధాన్యంగా వండు
కుంటాం. వీటిని మిల్లాడించి పై పొరల్లోంచి చిట్టూ, తవుడూ వగైరా తీసేయటం
ఉండదు. కాబట్టి, షుగర్ రోగులు దంపుడు బియ్యం తినటం కన్నా జొన్నలూ,
రాగులు, సజ్జలూ వగైరా తృణధాన్యానికి ప్రాధాన్యత నివ్వటం మంచిది. దంపుడు
బియ్యం తింటే ఏ పోషకాలు దొరుకుతాయని ఆశిస్తున్నారో అవన్నీ అంతకన్నా ఎక్కు
వగానే ఈ ప్రత్యామ్నాయ ధాన్యంలో దొరుకుతాయి.
అన్నీ సవ్యంగానే ఉన్నప్పుడు దంపుడు బియ్యం మేలు చేసేదే! షుగర్ రోగులకు,
స్థూలకాయులకు, కొవ్వు కారణంగా ఏర్పడే వ్యాధులతో బాధపడేవారికీ రాగి, జొన్న,
సజ్జ, గోధుమలు మంచివి.

VUPMA AND AYURVEDAM


ఉప్మా రోజూ తినదగినదేనా?

తెలుగు, తమిళ, కన్నడ మలయాళ తదితర ద్రావిడ ప్రజలు కొన్ని ఉత్తరాది
రాష్ట్రాల వాళ్లు కూడా వందలాది ఏళ్లుగా వండుకుని తింటున్న ప్రాచీన వంటకం ఇది!
ఉప్మా మనందరిది!
నీళ్లు పోసి గానీ, లేదా నీళ్ల ఆవిరి మీద గానీ ఉడికించిన పిండిని 'ఉప్పిండి'
అంటారు. దీన్నే ఉప్పుడు పిండి, ఉప్పిండి,
ఉప్పిడి, ఉప్పుమావు అని కూడా పిలుస్తారు.
ఇడి అంటే పిండి. ఉప్పడి అంటే ఉడికించిన
పిండి లేదా రవ్వ. మావు అనేది పిండికి
పర్యాయపదం. శరీరాన్ని శుష్కింప చేసుకో
వటం కోసం కేవలం ఉడికించిన ఉప్పిండిని
తిని పడుకోవడాన్ని ఉప్పడి ఉపవాసం
అంటారు. కమ్మని తాలింపుతో చేసిన
'ఉప్పుమావు' ఆంగ్లేయుల ఉచ్ఛారణలో ఉప్మాగా మారిపోయింది.
డురమ్ అనే రవ్వ గోధుమ గింజ లోపలి నడిభాగాన్ని 'సెమోలినా' అంటారు. ఏ
ధాన్యపు గింజలోంచైనా సెమోలీనా తీయవచ్చు. కానీ, ఈ గోధుమ 'సెమోలీనా' రవ్వ
ఉప్మా తయారీకి బాగా అనుకూలంగా ఉంది. బొంబాయి రవ్వని దక్షిణాది ప్రజలు
గొప్పగా సద్వినియోగపరచుకున్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉప్మా, ఉప్పుమావు,
ఉప్పట్టు, ఉపీత్ పేర్లు వినిపిస్తాయి. బొంబాయి రవ్వతోనే కాకుండా గోధుమరవ్వ
ఉప్మా, మొక్కజొన్న రవ్వ ఉప్మా, పెనర రవ్వ ఉప్మా, నవధాన్యాల ఉప్మా, ఉలవల రవ్వ
ఉప్మాలు ప్రసిద్ధి. దేని గుణాలు దానివి. జీర్ణశక్తి ననుసరించి ఏ ధాన్యపు
రవ్వతో ఉప్మా చేసుకోవాలో నిర్ణయించుకోగలగాలి. ఉప్మా ప్రభావం దాని
వంటలో కాకుండా దాని కోసం వాడే రవ్వ మీద ఆధారపడి ఉంది. తక్కువ
కేలరీలు కలిగిన ఉప్మా కావాలంటే రవ్వ గోధుమల రవ్వ, జొన్న రవ్వ,
సజ్జ రవ్వ ఉత్తమం. రాగి పిండితో కూడా ఉప్మా చేసుకోవచ్చు. అన్ని
వ్యాధుల్లోనూ తినదగినదిగా ఉంటుంది. ఇతర ఉప్మాల కన్నా ఇది తేలిగ్గా
ఆరుగుతుంది. స్థూలకాయం తగ్గడానికి ఉలవ రవ్వ, జొన్న రవ్వ ఉప్మాలు
ఉపయోగపడతాయి. అతి ఆకలిని తగ్గించడానికి పెసర రవ్వ తోడ్పడు
తుంది. ఘనమైన జీర్ణశక్తి ఉన్నప్పుడే బొంబాయి రవ్వ ఉప్మా
తినటం మంచిది.

9, జనవరి 2016, శనివారం

VUNDRALLU , AVIRI KUDUMULU - AYURVEDAM

కోటల్ కెళితే ఇడ్లీలు దొరకుతాయి
గానీ ఉండ్రాళ్ళు దొరకవు. గారెలు, వడలు
దొరుకుతాయిగానీ ఆవిరి కుడుములు
దొరకవు.
ఉండ్రాళ్ళు వినాయక చవితినాడు
మాత్రమే తినాలని మన ప్రజలు ఎందుకను
కొంటారో తెలీదు. ఆవిరి కుడుములు
వేస్తారనీ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివనీ
మన వాళ్ళు చాలా మందికి తెలీదు. తెలిసినా
వండరు. అమ్మమ్మల వంటలని ఎగతాళి
చేస్తారని భయం!!
బహుశా, పూటకూళ్ళ సాంప్రదాయాన్ని
మార్చి తమిళులు, కన్నడవారూ తెలుగు నాట
హోటల్ సాంప్రదాయాల్ని ప్రవేశ పెట్టి “ఇడ్లీ
+ వడ దోసె"ల్ని మనమీద రుద్దేశారు.
దాంతో మనం మన సాంప్రదాయకమైన
ఆహారాన్ని మర్చిపోయి ఇడ్లీ సాంబార్లలో
వడి కుడితి తొట్లో ఎలుకలా కొట్టు
కొంటున్నాం... అవునంటారా.... కాదంటారా....
'విదేశీ సంస్కృతి' అంటూ అయిన
దానికి కానిదానికి ఒంటికాలుమీద లేచే మన
పెద్దలు ఇలా మనం స్వంత సంస్కృతిని
మరిచిపోతున్న నంగతిని ఎప్పుడైనా
గుర్తించారా...???
ఇడ్లీలు వాతం చేస్తాయి
ఉండ్రాళ్ళు, ఆవిరి కుడుములు ఎంత
మేలుచేస్తాయో మీకు వివరంగా చెప్పబోయే
ముందు ఇడ్లీ గురించి ఒక మాట...
ఇడ్లీలు ఉప్పుడు రవ్వతో తయారౌతాయి
కాబట్టి తెల్లగా మర పట్టించకుండా
బియ్యంలో సారం అంతా పోకుండా
ఉప్పుకు రవ్వలో నిలవ వుంటుంది కాబట్టి
ఉప్పుడు రవ్వ వలన బలం ఎక్కువగా
వస్తుందనీ, నాడీ ఉత్తేజం (Nerve Stimula-
tion) కల్గుతుందని అర్ధం చేసుకోవాలి.
ఇది బాగానే ఉంది కానీ, ఉప్పుడు
రవ్వవలన, అవి పులిసిన బియ్యం కాబట్టి-
వాతం పెరుగుతుంది. మలబద్ధకం కలుగు
తుంది. అందుకని కడుపులో మంట, గ్యాస్
ట్రబుల్ పేగుమాత, అమీబియాసిన్,
ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి వ్యాధులు
న్నవారు, అన్నిరకాల వాతవ్యాధులున్నవారు
ఇడ్లీలు తినడం మంచిది కాదు.
చలవని కల్గించే చక్కని టిఫిను ఇదిగో...
మీ కోసం...
ఉండ్రాళ్ళు, ఆవిరి కుడుములు కొంచెం
ఆలస్యంగా అరుగుతాయి. అందుకని ఇవి
తేలికగా అరగడం కోసం నెయ్యివేసుకొని
తినాలి. ఇడ్లీలైనా నేతితో తిన్నప్పుడు అంతగా
చెడును కల్గించవు.
ఆరోగ్యవంతుడే కాదు, ఏ వ్యాధితో
బాధపడున్నవారైనా సరే ఉండ్రాళ్ళనూ ఆవిరి
కుడుమునూ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
చలవని కల్గిస్తాయి. తృప్తిని కల్గిస్తాయి. తిన్న
తర్వాత కడుపునిండినట్లు అనిపిస్తుంది. మళ్ళీ
భోజనం వేళకే ఆకలి అవుతుంది. అందుకని
టిఫిన్ గా ఉండ్రాళ్ళను గానీ, ఆవిరి కుడుము
నుగానీ తినడం మంచిది.
ఇడ్లీల వలన తృప్తి కలగదు. అందులోకి
శనగ చెట్నీ, కారప్పొడి, సాంబారు లేనిదే
అవి సహించవు. అవన్నీ కలిపి తినడం వలన
ఇడ్లీలు వేడిచేసే వాటిలో ముందు వరసగా
వచ్చేస్తున్నాయి. ఉండ్రాళ్ళుగానీ, ఆవిరి
కుడుములుగానీ ఇలా వేడిచేయనీయ
కుండానే చక్కగా, నేరుగా తినవచ్చు. ఈ
సున్నితమైన తేడాని గుర్తించండి.
మూత్ర వ్యాధులున్నవారు, మూత్ర
పిండాలలో రాళ్ళతో బాధపడున్నవారు,
మూత్రంలో మంట చీము వున్న వారు
ఉండ్రాళ్ళు తింటే మంచిది. చలవని కల్గి
స్తాయి.
అమీబియాసిస్ వ్యాధిలో ఇడ్లీ
సాంబార్లు తినడం కన్నా వీటిని తినడం
మంచిది.
రాత్రిపూట అన్నం మానేసి చపాతీలు
తినదలచిన వారుకూడా, ఆవిరి కుడుముగానీ,
దిబ్బరొట్టెగానీ తినడం మంచిది. చపాతీలు
సరిపడని వారికీ ఇవి మంచివే. చలవ
నిస్తాయి. పెద్దగా కేలరీలు పెరగవు. గోధుమ
పిండితో వండిన వాటి కన్న మన వాతా
వరణానికి ఇవే మంచివి!
ఆవిరి కుడుముల కన్నా మంచి ఆహారం
ఇంకొకటి లేదు
ఆవిరి కుడుములు తింటే- భోజనం
3
చేయగానే వచ్చే కడుపులో నొప్పి వ్యాధిలో
చాలా మంచిది. కడుపులో పుండువలన ఈ
నొప్పి వస్తూండవచ్చు. ఉండ్రాళ్ళుకూడా ఈ
వ్యాధిలో మేలుచేస్తాయి.
ఆవిరి కుడుముల్ని రాత్రిపూట వేసుకొని
ఉదయం పూట సూర్యోదయానికి ముందే
తింటే వేసవికాలం అమితమైన చలవ
కి నిస్తుంది. తేలికగా వడదెబ్బ తగలకుండా
-దే కాపాడుతుంది.
వాత వ్యాధులు, పక్షవాతం కీలు
గా నొప్పులతో బాదపడున్న వారికి ఈ విధంగా
పెడితే వాతం త్వరగా తగ్గుతోంది. మందులు
చక్కగా పనిచేస్తాయి.
ఇడ్లీలు చల్లారితే బాగోవు. ఆవిరి
కుడుము చల్లారిన తర్వాతే బాగుంటుంది
ఆరోగ్యం కూడా!! ఆవిరి కుడుములో బియ్యం
చాలా స్వల్పంగా వుంటాయి. కేవలం
మినపప్పును, జిగురుకోసం కొద్దిగా బియ్యపు
గింజలు కలిపి నానబెట్టి రుబ్బి ఇడ్లీ ప్లేట్లలో
గానీ, వాసిన కట్టిన గుడ్డమీదగానీ ఇడ్లీ వేసినట్లే
వేసుకొని చల్లారిన తర్వాత తింటారు. ఆవిరి
కుడుముల్లో బియ్యం దాదాపుగా వేడి కాబట్టి
ఇంతకుమించిన ఉత్తమమైన ఆహారం
మధుమేహరోగులకుగానీ,
స్థలకాయులకిగానీ
ఉండదు కదా! ఆ విధంగా, కేవలం మినప
పిండితో వండినవి కాబట్టి ఆవిరి కుడుములు
వాత వ్యాధుల్లో అద్భుతమైన ప్రభావాన్ని
చూపిస్తాయి. గారెలకన్న ఆవిరి కుడుములే
శ్రేష్టం. గారెల్లో నూనె వుంటుంది. ఆవిరి
కుడుముల్లో నూనె అసలే వుండదు కదా!
అన్నం కన్నా ఉండ్రాయి మిన్న
ఇంక ఉండ్రాళ్ళు - బియ్యపు రవ్వతో
తయారుచేస్తారు. వండే విధానంలో ఇడ్లీలను
వండినట్లే వీటిని ఆవిరిమీద ఉడికించడమే
పద్ధతి. ఇందులో మినపప్పు వుండదు. రుచి
కోసం శనగపప్పు కలుపుతారు. కానీ,
మామూలు బియ్యంతో వండిన అన్నంకన్నా
ఉండ్రాళ్ళు తేలికగా అరుగుతాయి. ఎక్కువ
చలవ.
ఇవి తరతరాలుగా మన తెలుగు వారు
తిన్న టిఫిన్లు. ఆరోగ్యానికి మేలు చేసేవి.
తమిళులు, కన్నడీయులు పుణ్యమా అని,
మనం చలవచేసే టిఫిన్లను వదిలేని
వేడిచేసేవి. ఆరోగ్యాన్ని దెబ్బతీసేవి అయిన
ఇడ్లీ, దోసె, ఉప్మా, పూరీలను తిని
బాధపడ్తున్నాం- కాదంటారా...!!
జీలకర్ర ధనియాలను విడివిడిగా నేతిలో
వేయించి, సమానంగా తీసుకొని, మెత్తగా
దంచి, తగినంత ఉప్పు కలిపి ఆ పొడిని
నంజుకుతింటే ఇవి
తేలికగా అరుగు
తాయి. పొదీనా ఆకు
పచ్చడి కూడా వీటికి
విరుగుడుగా పని
చేస్తుంది.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...