26, నవంబర్ 2015, గురువారం

RAVVA GODHUMALU - AYURVEDAM

రవ్వగోధుమలు

అమ్య గోరుములు మంచివా? ఉంది. గోరుములు
ముందూ? ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది

గోధుమలనీ పిలుస్తారు. బ్రిటికం తురుమ్ అనేది దీని వృక్ష
నామం దురుమ్ అంటే లాటిన్ భాషలో గట్టిగా ఉండటం అని అర్థం.
సింది గోధుముల కన్నా రవ్వగోధుమల్లో గుటెన్ పదార్థం తక్కువగా
ఉంటుంది. ఈ గ్లుటెన్ అనేది గోధుమ పిండిని మెత్తదనాన్నిచ్చే
ప్రొటీన్ పదార్థం. అది చాలా మందికి సరిపడక పోవచ్చు. అలాంటి
వాళ్లకు గోధుమ రవ్వ ఇబ్బంది పెట్టకపోవచ్చు. తిని చూసుకోవాలి.
పిండి గోధుమల్లో కన్నా రవ్వ గోధుమల్లో కేలరీలు
తక్కువ, రవ్వ గోధుమలు ఎండి పట్టించుకుని ఆ పిండితో
రొట్టెలు, చపాతీలు చేసుకోవటం వలన, స్థూలకాయం షుగరు
వ్యాధులున్నవారికి మేలు
అట్లు, జంతికలు, మిఠాయి
తయారీకి రవ్వ గోధుమల
పిండిని లేదా రవ్వను వాడు
కుంటే మంచిది. రవ్వ గోధు
మల పిండితో రాగి పిండి గానీ,
జొన్న పిండి గానీ సమానంగా
కలిపి కాల్చిన చపాతీలు,
పుల్కాలూ రుచిగా ఉంటాయి.
తక్కువ కేలరీలను కలిగి
ఉంటాయి. అన్నం మానేని
పుల్కాలను తిన్నా ఫలితం ఉంటుంది. గోధుమ రవ్వను కొద్దిగా నెయ్యి వేసి దోరగా
వేయించి చిక్కని జావ కాచి ఉప్పూ, మిరియాల పొడి కలిపి తయారుచేసిన పారిజ్
లేదా సూపు సురక్షితమైన ఆహార పదార్థం. గోధుమ రవ్వని అన్నంగానూ, ఉప్మా
గానూ, మినప్పిండి కలిపి ఇడ్లీ, దోసెలుగా కూడా తినవచ్చు. వ్యాధులు వచ్చిన
ప్పుడు పిండి గోధుమల కన్నా రవ్వగోధుమలకే ప్రాధాన్యత ఇవ్వండి. మొలకెత్తిన
రవ్వగోధుమ విత్తనాలు తినేవారు శనగలు, పెసలు, బొబ్బర్ల కన్నా గోధుమ మొల
కలు తినే అలవాటు చేసుకోవటం మంచిది.


14, నవంబర్ 2015, శనివారం

PATIKA PANCHADARA - AYURVEDIC USES

పటికిపంచదార

బెల్లం మంచిదా? పటికబెల్లం మంచిదా?

* తెల్లగా అచ్చులాగా ఉండి లోపల పొరలు పొరలుగా ఉండేది పటిక పంచదార.
మన వైపున దారికేది అంత
తెల్లగా ఉండదు. దీన్ని పటిక
బెల్లం అంటారు. బెల్లం కన్నా
పటిక బెల్లం, పటిక పంచదార
శ్రేష్టంగా ఉంటాయి. వేడి, వాతం
తగ్గిస్తాయి. కడుపులో ఎసిడిటీ
వలన కలిగే ఉద్రేకం తగ్గుతుంది.
వేడి చేసినందువలన వచ్చే పొడి
దగ్గుని తగ్గిస్తుంది. ఉడుకు విరేచనాల్లో సగ్గుబియ్యం జావలో పటికి పంచదార కలిపి
తాగితే విరేచనాలు ఆగుతాయి. తీపిని అతిగా తింటే వాంతులు అవుతాయి. ఆకలి
చచ్చిపోతుంది. మలబద్ధత ఏర్పడుతుంది.


VEYINCHI VANDADAM - AYURVEDIC USES



వేయించి వండితే మేలు

 ధాన్యాన్ని వేయించి వండితే లాభం ఏమిటి?

బియ్యం, రాగులు, పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, ఉల
పలు, అలచందలు... వీటిని కొద్దిగా సెగ చూపించినట్టు వేయిస్తే
వాటిలో దాగి
ఉన్న ఆరోమా
(సుగంధం) బయటకు
వచ్చి అమిత రుచిక
రంగా ఉంటాయి.
తేలికగా వేయించి
నందు వలన గింజ
లోపల ఉండే తేమ
అవిరై పోయి, తేలికగా అరిగే గుణాన్ని పొందుతాయి. కందిపప్పు,
పెసరపప్పులను దోరగా వేయించి పప్పు వండుకుంటే ఉబ్బరం
రాకుండా ఉంటుంది. బియ్యాన్ని కూడా ఇలా వేయించి వండితే చాలా తేలికగా అరు
గుతాయి. రుచికరంగా ఉంటుంది. ఒక చెంచా నెయ్యి వేసి వేయిస్తే మరీ మంచిది.
కందినున్ని పెసరసున్ని, ఉలవనున్ని ఇలాంటివి వేయించిన కారణంగా అరుగుదలను
పొందుతాయి. వేగిన మినపప్పుతో చేసిన సున్ని ఉండలకు ఆ రుచి వేపినందు వలనే
కలుగుతోంది. శరీర శ్రమ బాగా ఉన్నవారికీ, జీర్ణశక్తి బలంగా ఉన్నవారికీ వేయించి
వండి పెడితే మేలు చేస్తాయి. అతి ఆకలి కారణంగా ఎప్పుడూ ఏదో ఒకటి తిననిదే
ఉండలేకపోవటం వీటి వలన తగ్గుతుంది. ప్రయాణాల్లో తినేందుకు వీలుగా
ఉంటాయి.

12, నవంబర్ 2015, గురువారం

RNR 15048 RICE FOR DIABETIC PATIENTS

విజయవంతమైన
కొత్త వరి రకం సాగు
• వర్షాభావ పరిస్థితులను
తట్టుకుని మంచి దిగుబడులు



మధుమేహం వచ్చిన వారు కడుపునిండా అన్నం
తినడానికి ఇకపై ఆలోచించాల్సిన పనిలేదు. వీరి
కోసం తెలంగాణలోని జయశంకర్ వ్యవసాయ
విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఆర్.ఎన్.
ఆర్. 15048 రకం కొత్త వరి వంగడాన్ని గుంటూరు
జిల్లా రైతులు ప్రయోగాత్మకంగా సాగుచేశారు. వర్షా
భావ పరిస్థితుల్లోనూ మంచి దిగుబడులు సాధిం
చారు. కొల్లూరు మండలం అనంతవరం, వేమూరు
మండలం జంపని, బాపట్ల మండలం పూండ్ల
ప్రాంతాల్లో రైతులు ఈ సాగు చేపట్టారు.
ఎందుకు వరమంటే..
ఆహారంలో పిండి పదార్థాల శాతాన్ని శాస్త్రీయ
భాషలో జీఐ గైసిమిక్స్ సూచిక అని పిలుస్తారు.
55 శాతంలోపు పిండి పదార్థాలు ఉన్న ఆహారం
తీసుకుంటే మధుమేహ రోగులకు మేలనేది వైద్యుల
సలహా సాధారణంగా బియ్యంలో ఈజీ55
శాతం పైనే ఉంటుంది. ఎక్కువగా వినియోగించే
బీపీటీ (సాంబమసూరి)లో 56.5 శాతం వరకు జీవి
ఉంటుంది. డీఆర్ఆర్ హెచ్-3, వరాలు, తెల్లహంస,
స్వర(ఎంటీయు-7029).
కాటన్‌ దొర
సన్నాలు(ఎంటీయు-1010) వంటి వరి వంగడాల్లో
జీవిశాతం 77.48 నుంచి 8188 వరకు ఉంటుంది.
కొత్త వంగడం ఆర్.ఎన్.ఆర్. 15048లో మాత్రం
ప్రత్యేకంగా మధుమేహ రోగులకు సరిపడే రీతిలో
కేవలం 51 శాతం మాత్రమే పిండి పదార్థాలు
ఉంటాయి. ఇప్పటి వరకు ఉత్తరాది రాష్ట్రాల్లో
సాగయ్యే లలాట్' అనే వరి వంగడంలోనే జీవి
తక్కువగా ఉంది. వర్షాభావం, తెగుళ్ల దాడి వంటి
ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్.ఎన్.ఆర్.15018
రకం వరి వంగడం తట్టుకుని నిలబడుతుందని
హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇనిస్టిట్యూట్
సీనియర్ సైంటిస్టు బి. సుబ్బారాయుడు చెప్పారు.
కొల్లూరు మండలం అనంతవరంలో మండవ సాంబ
శివరావు అనే రైతు సాగుచేసిన ఈ వరి వంగడం
క్షేత్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు.
ఇవీ ప్రయోజనాలు
ప్రస్తుతం సాగుచేస్తున్న వంగడాల పంట కాల
వ్యవధి 10 రోజులు ఉంటే, ఇది కేవలం 120
నుంచి 15 రోజుల్లోనే అందుబాటులోకి
వస్తుంది.
బీపీటీల కన్నా ఇంకా సన్నగా బియ్యం ఉండ
టంతో తినేవారికి ఇష్టత కూడా పెరుగుతుంది.
మధుమేహం ఉన్నవారు రాత్రి వేళల్లోనూ ఈ
బియ్యంతో బోజనం తినొచ్చు.
ఎకరా బీపీటీ సాగు చేయడానికి రూ.20 వేల
నుంచి రూ. 21 వేల వరకు ఖర్చయితే దీనికి
రూ 18 వేలు మాత్రమే అయింది
మిగిలిన రకాల కంటే పొడవుగా పెరగనున్నం
దున ఎరువుల యాజమాన్యంలో తగిన జాగ్ర
త్తలు తీసుకోవాలి

4, నవంబర్ 2015, బుధవారం

AYURVEDAM AND GENES - CCMB RESEARCH

• సీసీఎంబీ తాజా పరిశోధనలో వెల్లడి

 భారత్ లోని ప్రాచీన వైద్య విధానమైన ఆయు
ర్వేదానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని సెంటర్ ఫర్ సెల్యూలార్
అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) తాజా పరిశోధనలో వెల్లమైంది. ఆయుర్వేదంలో వైద్యం కోసం చేసే వర్గీకరణకు మనిషి జన్యువు
లకు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇన్నాళ్లు ఆయుర్వేద
వైద్యం అనుభవం ఆధారంగా చేస్తూ వస్తున్నారని.. శాస్త్రీయత ఏమిటనే
ప్రశ్నలకు తాజా ఫలితాలతో ఆధారం లభించినట్లయిందని సీసీఎంబీ
సంచాలకుడు మోహన్ రావు తెలిపారు. బుధవారమిక్కడ విలేకర్ల సమా
వేశంలో సీనియర్ శాస్త్రవేత్త తంగరాజ్ తో కలిసి ఆయన ప్రయోగ ఫలి
తాలను వెల్లడించారు. ఆయుర్వేదంలో వాత, పిత్త కఫ దోషాల ఆధా
కంగా వ్యక్తుల శరీర తత్వాన్ని వర్గీకరించి వైద్యులు మందులు సూచి
స్తారు. ఈ మూడింటికీ పంచభూతాలే కారణమన్నది నమ్మకం.
దీనికి శాస్త్రీయ ఆధారాలు ఏమైనా ఉన్నాయా
అని మనుషుల జన్యువులపై ఆరే
ళ్లుగా శాస్త్రవేత్త తంగరాజ్
పరిశోధన
చేశారు.
దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 3400 మందిని ఎంపిక చేసి.. వీరు ఆయుర్వేదంలో
ఏతత్వానికి చెందిన వారు అనేది గుర్తించారు. ఇందుకోసం చాలామంది అనుభవం
కల్గిన ఆయుర్వేద వైద్యులను సంప్రదించారు. వీరు చెప్పిన విషయాలే కాకుండా
ఆయుష్ రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగా కొందరిని ప్రశ్నించి ఏ తత్వం కలిగిన
వ్యక్తులో గుర్తించారు. కచ్చితత్వం కోసం ఈ రెండింటి ఫలితాల్లో సారూప్యత కలిగిన
262 మందిలో వాత,
పిత్త కఫ దోషాల తత్వం వర్గీకరణ చేశారు. తర్వాత ఆ వ్యక్తుల
రక్తనమూనాలు సేకరించి డీఎన్ఏ సిద్ధంచేశారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న
మైక్రో చిప్లో విశ్లేషించారు. ఊహించని విధంగా వీటిలో వచ్చిన మూడు గ్రూపులు..
ఆయుర్వేద వైద్యులు వర్గీకరించిన గ్రూపులతో సరిపోలాయి. ఒకప్పుడు ఏ పరికరాలు
లేకుండా గుర్తించిన మనిషి శరీర తత్వాన్ని, ఇప్పుడు జన్యువుల ఆధారంగా తెలుసుకునే
అవకాశం ఉందని నిరూపితమైంది. ఈ రంగంలో భవిష్యత్తు పరిశోధనలకు ఇది ఒక
భరోసా ఇచ్చింది. అంతేకాదు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒకే విధంగా ఉండే
జన్యువులపై చేసిన పరిశోధన భవిష్యత్తులో ఎప్పటికప్పుడు మారే ప్రొటీన్స్ప ప్రయో
గాలకు ఉపయోగపడుతుంది" అని మోహన్‌రావు వివరించారు. ఆరేళ్ల పరిశోధనకు
వేర్వేరు సంస్థల నుంచి రూ.12 కోట్ల నిధులు అందాయని చెప్పారు.




25, అక్టోబర్ 2015, ఆదివారం

PALA VIRUGUDU / VIRIGINA PALU - LABHA NASHTALU

పాలవిరుగుడు తినవచ్చా?

విరిగిన పాలు ఆరోగ్యానికి మంచివేనా? పాలవిరుగుడుతో చేసిన
స్వీట్లు తినవచ్చా?

* పాలు విరగడం అంటే పాలలో
పాలకు సంబంధించిన పదార్థాలను,
నీటినీ విడగొట్టటం అని అర్థం.
పాలలో ఉండే ప్రొటీన్లు, కాల్షియం,
ఫాస్పరస్, కొవ్వు ఇవి గట్టిపడి,
ముద్దగా అయి, నీళ్లు వేరవుతాయి.
పాలలో విషదోషాల వలనగానీ,
పాలకు వ్యతిరేకమైన ఉప్పు, కారం, పులుపు వంటివి తగలటం వలన గానీ, పాలు
కుళ్లటం వలన గానీ విరిగితే అవి మంచివి కానట్టే లెక్క! పాలను ఫ్రిజులో భద్రపరచ
కుండానూ, కాయకుండానూ ఉంచేసినందు వలన విరిగే పాలు పులిసిపోయి విరిగి
నట్టు లెక్క. అవి చేదుగానూ, వాసనగానూ ఉన్నప్పుడు అవి నిస్సందేహంగా పారబో
యాల్సినవే! విరిగిన పాలంటే మన పెద్దలకు సదభిప్రాయం లేదు. పాల విరుగుడుతో
వంటకాలు మనకు లేవు. రసగుల్లాలు, రసమలై లాంటి పాల విరుగుడు స్వీట్లను విదేశీ
పద్ధతిలో ఆమ్లాలను కలిపి విరగొట్టి తయారు చేస్తారు. పాలను పద్ధతి ప్రకారం విరగ
కొడితే, అందులో కొవ్వు ఎక్కువ, ప్రొటీన్ తక్కువగా ఉంటుంది. అదే, జున్నుపాలే
కొవ్వు తక్కువ, ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ జున్నుని వైద్య పరిభాషలో 'కొలో
సమ్' అంటారు. విరిగే పాలని 'సోర్ మిల్క్' అంటారు.

GASA GASALU - LABHA NASHTALU

గసగసాలు విషాలే

మసాలా ద్రవ్యాల్లో గసగసాల వలన లాభనష్టాలు చెప్తారా?

మసాలాలకు అలవాటుపడి
పోయి అవి లేకపోతే జీవించలేని పరి
స్థితిని గసగసాలు తెస్తాయన్నమాట.
ఎన్ని సుగుణాలున్నా మనల్ని బాని
సగా మార్చేది విషపదార్ధమే. గసాలు
రుచిగా ఉంటాయి. చలవ చేస్తాయి.
కానీ కఠినంగా అరుగుతాయి. విరేచ
నాన్ని బంధిస్తాయి. అందుకని నీళ్ళవిరేచనాలు అవుతున్నప్పుడు గసాలను నూరి రసం తాగిస్తారు. కానీ, రోజూ
తినేవాళ్ళలో మలబద్ధత కలిగిస్తాయి, కఫ రోగాలు, జలుబు, కళ్ళెపడటంలాంటి
వ్యాధుల్లో కఫాన్ని అదుపుచేస్తాయి. ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయి. సుఖ
నిద్ర పట్టిస్తాయి. ఎందుకంటే గసాలలో నల్లమందు ఉంటుంది కాబట్టి,
గసాలనేవి పోస్తుకాయల లోపలి గింజలు. ఈ మొక్క కాండం,
ఆకులు, కాయల్లోంచి పాలుస్రవిస్తాయి. ఆ పాలను ఆరపెడితే అదే నల్ల
మందు. గసాలలో కూడా కొద్దిశాతం నల్లమందు (ఓపియం) ఉంటుంది.
మార్ఫిన్, హిరాయిన్ కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలను ఇందులోంచే
తీస్తారు. గసాలను ఎవరుపడితే వాళ్ళు పండించటంపై
కార్ణచందు నిషేధం పెట్టిన ప్రభుత్వం వాటి వాడకం మీద దృష్టి పెట్ట
లేకపోయింది. ప్రజలే చైతన్యవంతులు కావాలి.

AMAEBIOSIS KI MANDHU - AYURVEDIC SOLUTION


అమీబియాసిస్క మందు

అమీబియని తగ్గదా? దానికి నివారణ లేదా?

- అమీబియాసిస్ వ్యాధిని చిరంజీవిని చేస్తున్నది ఆ వ్యాధి
వచ్చినవారే! కొద్దికాలం పాటు పేగులు బలం పుంజుకునే వరకూ
శుద్ధ ఆహారం తీసుకోగలిగితే వ్యాధి తలెత్తకుండా cheyavachu.
కుడిచేతి గోళ్లు పెరిగి, వాటి లోపల నల్లని మట్టి పేరుకొని ఉన్న వ్యక్తి
తప్పనిసరిగా అమీబియాసిస్ రోగి అయి ఉంటాడు. రోడ్డు పక్కన జంగ్
డీలు, బజ్జీలు, పునుగుల బళ్ల దగ్గర, చైనా నూడుల్స్ బళ్ల దగ్గర తారట్లాడే
వాళ్లలోనూ హాస్టళ్లలో, మెస్సుల్లో తింటూ చదువుకునే పిల్లల్లోనూ అమీబి
యాసిస్ బాధితులు చాలామంది ఉంటారు. నాణ్యమైన మంచినీటి సర
పరా లేని ఊర్లలోనూ, చెరువు నీళ్లు, కాలువ నీళ్లను తాగే ఊళ్లలోనూ అమీ
బియాసిస్ పీడితులు ఎక్కువగా ఉంటారు. ఆహారం తయారీలో గానీ వద్ద 
నలో గానీ నిర్లక్ష్యం ఈ వ్యాధికి పెట్టుబడి పెట్తోంది. హోటళ్లకు, విందు
భోజనాలకు వెళ్లినప్పుడు కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవడం అనేది అరుదుగా కని
ఎంచే దృశ్యం అయిపోయింది. చేతుల్లో నీళ్లు పోసుకొని మంత్రజలం చిలకరించినట్టు
విస్తట్లో చల్లి, విస్తరినీ చేతుల్నీ ఒకే
సారి కడిగి అందులో అన్నం తినే
విచిత్ర అలవాటు అమీబియాసిన్ని
చిరంజీవిని చేస్తోంది.
భోజనం చేయగానే విరేచనా
నికి వెళ్లవలసి రావటం, జిగురు
(బంక), రక్తంతో కూడిన విరేచ
నాలు, కడుపులో అసౌకర్యంగా
ఉండటం, నీరసం, అరుగుదల లేక
పోవటం, గ్యాసు, పొట్ట ఉబ్బరం
రాంటి బాధలు తరచూ కలుగుతుంటే అమీబియాసిస్ హెచ్చరికలు ఇచ్చినట్టేననుకో
వాలి. చల్లకవ్వంతో బాగా చిలికిన మజ్జిగ ఈ వ్యాధిలో అసలైన మందు. మజ్జిగలో ఉప
యోగకారక సూక్ష్మజీవులుంటాయి. అవి కడుపులో అపకార కారక సూక్ష్మజీవులను
కట్టడి చేస్తాయి. అందుకని పులిసినవీ, ఫ్రీజులో ఉంచినవీ కాకుండా తియ్యని మజ్జిగని
తాగుతూ ఉంటే అమీబియాసిస్ వ్యాధి అదుపులో ఉంటుంది. టిఫిన్లకు బదులుగా
ప్రొద్దున్న పూట తోడు అన్నం గానీ, పెరుగన్నం గానీ, మజ్జిగ అన్నం గానీ తినటం
వలన అమీబియాసిస్ వ్యాధి అదుపు సులువవుతుంది. మజ్జిగ మీద తేరుకున్న నీటిని
మంచినీళ్లకు బదులుగా తాగటం వలన శక్తివంతమైన మందులు వాడాల్సిన అగత్యం
తప్పుతుంది.

23, అక్టోబర్ 2015, శుక్రవారం

RAKTHA SHUDDHI THO CHARMAVYADHI NIVARANA - AYURVEDAM

రక్తశుద్ధిలేక చర్మవ్యాధులొస్తున్న - సమస్య

  నా వయస్సు 48 సం.లు. నాకు
తరచుగా శరీరం మీద దురదలు, పుండ్లు, గడ్డలు వస్తున్నయ్. చర్మం అక్కడక్కడ
నల్లబారుతుంది. డాక్టర్లకు చూపిస్తే రక్తశుద్ధి లేదని మందులు వ్రాసించ్చారు. అవి
వాడటం ఇష్టంలేక మీ సలహా కోసం వ్రాస్తున్నాను. దయతో మార్గం చెప్పండి.

:- పరిశుభ్రంగా ఉన్న కుంకుడుకాయలు తీసు
కొచ్చి పగలగొట్టి విత్తనాలు తీసివేయండి. పై బెరడును చిన్న ముక్కలుగా కత్తిరించి
ఎండబెట్టి దంచి జల్లించండి. ఆ పొడితో సమంగా సుగంధపాలవేళ్ళపొడి కలిపి ఆ
మొత్తం చూర్ణంలో కొద్దిగా తేనె వేసి నూరి బఠాణిగింజంత గోలీలు కట్టి విలవజేసు
కోండి. రోజూ ఉదయంపూట ఒక గోలీని సగం చిలికిన అరకప్పు పెరుగుతోను,
రాత్రి
ఒక గోలీని మంచినీటితోను సేవిస్తుంటే క్రమంగా రక్తశుద్ధి జరిగి చర్మసమస్యలు తగ్గిపోతయ్. వంకాయ, గోంగూర,
ఆవకాయ, మాంసం, చేపలు, గుడ్లు, శనగపిండివంటి పడని పదార్థాలు నిషేధించండి. శుభం.

యవ్వనంలో వచ్చిన ముసలితనపు సమస్య - ఆయుర్వేద పరిష్కారం / యవ్వనవార్ధక్యం /YAVVANA VARDHAKYAM - AYURVEDIC SOLUTION

యవ్వనంలో వచ్చిన ముసలితనపు సమస్యకు ఆయుర్వేద పరిష్కారం

ఉసిరిక పండు పై బెరడు రసం లేదా చూర్ణం - 10 గ్రాములు
దేశవాళీ ఆవు నెయ్యి - 10 గ్రాములు,
చక్కెర - 10 గ్రాములు,
తేనె - 20 గ్రాములు,

పై అన్నింటినీ తీసుకుని బాగా కలిపి ,ఉదయం పర గడుపున తిని అనుపానంగా 1 కప్పు గోరు వెచ్చని పాలలో 1 చెంచా పటిక బెల్లం పొడి కలిపి తాగుతూ ఉండాలి.

ఉదయం స్నానానికి గంట ముందు 6 గంటల వేళ శరీరానికి గోరు వెచ్చగా నువ్వుల నూనె మర్దన చేసి అర గంట పాటు సూర్య నమస్కారాలు,పావు గంట ప్రాణాయామం,పావు గంట ధ్యానం చేయాలి.


ఆకు కూరలు,పాత బియ్యం,కాయ గూరలు,ఇంట్లో వండిన తీపి పదార్థాలు తింటుండాలి.

మధ్య వయసులో వచ్చిన ముసలితనం పోయి తిరిగి యవ్వనం ప్రాప్తిస్తుంది.

18, అక్టోబర్ 2015, ఆదివారం

నరాల బలహీనత సమస్య - ఆయుర్వేద పరిష్కారం $ ఆహార పరిష్కారం / NARALA BALAHEENATHA SAMASYA - AYURVEDIC $ FOOD SOLUTIONS

1  .  శరీరంలో నరాలన్నీ చచ్చుబడినట్లుగా ఉండి,ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేకుండా ఉండడం,వంటి బాధలు తొలగాలంటే 

అతిబల వేళ్ళు -250 గ్రాములు,
అశ్వగంధ దుంపలు - 250 గ్రాములు,
నేలతాడి దుంపలు - 250 గ్రాములు,
అతిమధురం వేళ్ళు - 250 గ్రాములు,

పై అన్నింటినీ ముక్కలుగా చేసి శుభ్రమైన మట్టిపాత్రలో అవి మునిగే వరకు దేశవాళీ ఆవుపాలు పోసి చిన్న మంటపైన పాలు ఇగిరే వరకు మరిగించి ఆ ముక్కలను ఎండలో ఆరబోసి రోజంతా ఎండించాలి.మరలా మరుసటి రోజు పాలు పోసి మరిగించి ఎండించాలి.ఈ విధంగా మూడు సార్లు కాని ,ఏడుసార్లుకాని చేసి చివరగా బాగా ఎండించి దంచి జల్లించి దానితో సమానంగా పటిక బెల్లం పొడిని కలిపి నిలువచేసుకోవాలి.

ఈ చూర్ణాన్ని రెండు పూటలా 10 గ్రాముల మొతాదుగా అరగ్లాసు గోరువెచ్చటి ఆవుపాలల్లో వేసి అందులో ఒక చెంచా ఆవు నెయ్యి,రెండు చెంచాల తేనె కలిపి రోజూ సేవిస్తుండాలి.

కసివింద / చెన్నంగి ఆకుల రసం తీసి దానికి సమంగా వెన్న కలిపి ఆ మిశ్రమాన్ని శరీరమంతా మర్దన చేసి గంటాగి స్నానం చేయాలి.కసివింద లభించకపోతే తెల్ల ఆవాల నూనె గోరువెచ్చగా చేసి మర్దన చేయాలి.

తాంబూలంలో 2 గ్రాముల జాపత్రి పెట్టి సేవిస్తుండాలి.

నరాల బలహీనత సమస్య పరిష్కారమౌతుంది.

2  .నరాల బలహీనత కు ఆహార పరిష్కారం.

వరి ప్రధాన ఆహరంగా తీసుకునే వాళ్లు చిట్టూ ,తవుడు కోల్పోతున్నారు .ఐతే దీనికి ప్రత్యామ్నాయం ఉంది.

.చిట్టూ ,తవుడు లేకపోవడం వలన మనం ప్రధానంగా బి1 విటమిన్ / థయమిన్ లోపానికి గురవుతున్నాము.దీని వలన నరాల బలహీనత / బెరి బెరి జబ్బు ఏర్పడుతుంది.కాయగూరలు,మాంసం బాగా తీసుకోగలిగితే వరి అన్నం మీద ఆధారపడకుండానే శరీరానికి కావాల్సిన థయమిన్ పొందవచ్చు.100 గ్రాముల దంపుడు బియ్యంలో  300 మి.గ్రా.థయమిన్ ఉంటుంది.కానీ 100 గ్రాముల గోధుమల్లో 500 మి.గ్రా. థయమిన్ ఉంటుంది.అంటే ఒక పూట వరి అన్నం ,ఒక పూట గోధుమతో రోటీ లాంటి ఏదైనా వంటకం తినటం మంచిదన్నమాట.ఎండిన బఠాణీ ( 800 ),బంగాళా దుంపలు ( 150 ) కూడా ఆ లోటుని భర్తీ చేస్తాయి.నువ్వులు,వేరు శనగ గుళ్ళు ,పొద్దు తిరుగుడు గింజలు,వీటిలోంచి నూనెను తీసేయగా మిగిలిన పిప్పిలో బి విటమిన్ ఉంటుంది.దీనిని తెలక పిండి అంటారు.అప్పుడప్పుడు కూరగా చేసుకుని తినవచ్చు.గోధుమ,రాగి,జొన్న,సజ్జలు,వీటిలోంచి చిట్టు,తవుడు తీయకుండానే పూర్తి ధాన్యాన్ని మరాడించి వాడుకుంటున్నము కదా .దంపుడు బియ్యానికన్నా అనేక విధాలుగా ఈ ధాన్యాల్లో విటమినులు ఎక్కువగా ఉంటున్నాయి.కాబట్టి థయమిన్ లోపం ఉన్నవాళ్లు దంపుడు బియ్యానికన్నా గోధుమ ,రాగి,జొన్న,సజ్జల మీద ఆధారపడటమే మంచిది.మొలకెత్తిన రాగులు,సజ్జలు,పెసలు,శనగలతో పిండి వంటలు చేసుకుంటే రెట్టింపు థయమిన్ దొరుకుతుంది.అతిగా వేడి మీద వండితే థయమిన్ ఆవిరైపోతుంది.అందుకని బి1 కావాలంటే తేలికగా ఉడికించి వండుకుంటేనే ఫలితం ఉంటుంది.టాబ్లెట్లు మింగటం కన్నా ఆహారం ద్వారా దీనిని పొందటమే మంచిది.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...