Sunday 18 October 2015

నరాల బలహీనత సమస్య - ఆయుర్వేద పరిష్కారం $ ఆహార పరిష్కారం / NARALA BALAHEENATHA SAMASYA - AYURVEDIC $ FOOD SOLUTIONS

1  .  శరీరంలో నరాలన్నీ చచ్చుబడినట్లుగా ఉండి,ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేకుండా ఉండడం,వంటి బాధలు తొలగాలంటే 

అతిబల వేళ్ళు -250 గ్రాములు,
అశ్వగంధ దుంపలు - 250 గ్రాములు,
నేలతాడి దుంపలు - 250 గ్రాములు,
అతిమధురం వేళ్ళు - 250 గ్రాములు,

పై అన్నింటినీ ముక్కలుగా చేసి శుభ్రమైన మట్టిపాత్రలో అవి మునిగే వరకు దేశవాళీ ఆవుపాలు పోసి చిన్న మంటపైన పాలు ఇగిరే వరకు మరిగించి ఆ ముక్కలను ఎండలో ఆరబోసి రోజంతా ఎండించాలి.మరలా మరుసటి రోజు పాలు పోసి మరిగించి ఎండించాలి.ఈ విధంగా మూడు సార్లు కాని ,ఏడుసార్లుకాని చేసి చివరగా బాగా ఎండించి దంచి జల్లించి దానితో సమానంగా పటిక బెల్లం పొడిని కలిపి నిలువచేసుకోవాలి.

ఈ చూర్ణాన్ని రెండు పూటలా 10 గ్రాముల మొతాదుగా అరగ్లాసు గోరువెచ్చటి ఆవుపాలల్లో వేసి అందులో ఒక చెంచా ఆవు నెయ్యి,రెండు చెంచాల తేనె కలిపి రోజూ సేవిస్తుండాలి.

కసివింద / చెన్నంగి ఆకుల రసం తీసి దానికి సమంగా వెన్న కలిపి ఆ మిశ్రమాన్ని శరీరమంతా మర్దన చేసి గంటాగి స్నానం చేయాలి.కసివింద లభించకపోతే తెల్ల ఆవాల నూనె గోరువెచ్చగా చేసి మర్దన చేయాలి.

తాంబూలంలో 2 గ్రాముల జాపత్రి పెట్టి సేవిస్తుండాలి.

నరాల బలహీనత సమస్య పరిష్కారమౌతుంది.

2  .నరాల బలహీనత కు ఆహార పరిష్కారం.

వరి ప్రధాన ఆహరంగా తీసుకునే వాళ్లు చిట్టూ ,తవుడు కోల్పోతున్నారు .ఐతే దీనికి ప్రత్యామ్నాయం ఉంది.

.చిట్టూ ,తవుడు లేకపోవడం వలన మనం ప్రధానంగా బి1 విటమిన్ / థయమిన్ లోపానికి గురవుతున్నాము.దీని వలన నరాల బలహీనత / బెరి బెరి జబ్బు ఏర్పడుతుంది.కాయగూరలు,మాంసం బాగా తీసుకోగలిగితే వరి అన్నం మీద ఆధారపడకుండానే శరీరానికి కావాల్సిన థయమిన్ పొందవచ్చు.100 గ్రాముల దంపుడు బియ్యంలో  300 మి.గ్రా.థయమిన్ ఉంటుంది.కానీ 100 గ్రాముల గోధుమల్లో 500 మి.గ్రా. థయమిన్ ఉంటుంది.అంటే ఒక పూట వరి అన్నం ,ఒక పూట గోధుమతో రోటీ లాంటి ఏదైనా వంటకం తినటం మంచిదన్నమాట.ఎండిన బఠాణీ ( 800 ),బంగాళా దుంపలు ( 150 ) కూడా ఆ లోటుని భర్తీ చేస్తాయి.నువ్వులు,వేరు శనగ గుళ్ళు ,పొద్దు తిరుగుడు గింజలు,వీటిలోంచి నూనెను తీసేయగా మిగిలిన పిప్పిలో బి విటమిన్ ఉంటుంది.దీనిని తెలక పిండి అంటారు.అప్పుడప్పుడు కూరగా చేసుకుని తినవచ్చు.గోధుమ,రాగి,జొన్న,సజ్జలు,వీటిలోంచి చిట్టు,తవుడు తీయకుండానే పూర్తి ధాన్యాన్ని మరాడించి వాడుకుంటున్నము కదా .దంపుడు బియ్యానికన్నా అనేక విధాలుగా ఈ ధాన్యాల్లో విటమినులు ఎక్కువగా ఉంటున్నాయి.కాబట్టి థయమిన్ లోపం ఉన్నవాళ్లు దంపుడు బియ్యానికన్నా గోధుమ ,రాగి,జొన్న,సజ్జల మీద ఆధారపడటమే మంచిది.మొలకెత్తిన రాగులు,సజ్జలు,పెసలు,శనగలతో పిండి వంటలు చేసుకుంటే రెట్టింపు థయమిన్ దొరుకుతుంది.అతిగా వేడి మీద వండితే థయమిన్ ఆవిరైపోతుంది.అందుకని బి1 కావాలంటే తేలికగా ఉడికించి వండుకుంటేనే ఫలితం ఉంటుంది.టాబ్లెట్లు మింగటం కన్నా ఆహారం ద్వారా దీనిని పొందటమే మంచిది.

No comments:

Post a Comment