12, సెప్టెంబర్ 2026, శనివారం

వేయి లాభాల.. వావిలి..

 నిర్గుండీ పుష్పం తిక్తోష్ణం కృమి వాత కఫాపహం

గుల్మ ప్లీహా రుచిం కుష్టం శోఫమ్ జయేత్కటు.. 


భోజన కుతూహలం పాక శాస్త్ర గ్రంథం వావిలి పూల గురించి పై శ్లోకంలో వివరించింది. వావిలి పూలు కొద్దిగా చేదుగా ఉంటాయి. చలవనిస్తాయి. వాత వ్యాధులు అన్నిటిపైనా పని చేస్తాయి. కఫాన్ని తగ్గిస్తాయి. కడుపులో ఏర్పడే అనేక వ్యాధుల పైన వీటి ప్రయోగం ఉంది. ముఖ్యంగా స్ప్లీన్ లో వచ్చే వ్యాధులన్నింటిపైనా బాగా పని చేస్తాయని భోజన కుతూహలం గ్రంథంలో తెలిపారు. 

నోటికి రుచి తెలియకపోవడం , అన్న హితవు కలగక పోవడం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. వావిలి పూలను సేకరించి, నీడన ఆరనిచ్చి , కొద్దిగా నెయ్యి వేసి వేయించాలి. 

ధనియాలు,జీలకర్ర, శనగ పప్పు,మిరియాలు, మినప్పప్పును కూడా పైపైన వేయించి, మెత్తగా దంచిన కారప్పొడి తినడానికి అనుకూలంగా ఉంటుంది. తెలుగు వారికి బాగా అందుబాటులో ఉండే మొక్క ఇది. రైతులను గానీ, మొక్కల గురించి బాగా తెలిసిన వారిని గానీ అడిగితే ఖచ్చితంగా తెలుస్తుంది. చాలా సార్లు చూసిన మొక్కే ఇది. ఒక్కో కణుపు దగ్గర ఐదు ఆకుల చొప్పున ఉంటాయి. ఈ మొక్కను గుర్తు పట్టడానికి ఇదే కొండ గుర్తు. శనగ గింజంత నీలి రంగు పూలు పూస్తాయి. 

కీళ్ల నొప్పులు, కీళ్ల వాతము,  వాపులు తగ్గించే ఆయుర్వేద ఔషధాలలో వావిలి ని కూడా చేరుస్తారు. దీని ఆకులు చవకగా దొరుకుతాయి. వావిలి ఆకులు, పూలు, పండ్లు , గింజలు, వేళ్ళు.. వీటన్నింటికీ వాతాన్ని తగ్గించే శక్తి ఉంది. వీటితో కీళ్ల వాతము పైన పని చేసే నిర్గుండీ తైలాన్ని తయారు చేస్తారు. 

వావిలి పూలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఎక్కువ. " సింధు వారస్య పుష్పెణ బద్దో ముచ్యేత బంధనాథ్ " అని" పుష్ప చింతామణి"  అనే గ్రంథం పేర్కొంది. 

వావిలి పువ్వులు సమర్పిస్తే అన్ని అడ్డంకులు తొలగి , బంధనాల నుంచి విముక్తి పొందుతారని అర్థం. ఈ పూలు సూర్యుడికి ప్రీతి పాత్రమని , వావిలి వలన పుత్ర లాభం కూడా కలుగుతాయని ఈ గ్రంథం పేర్కొంది. 

భోజన కుతూహలం వావిలి పూల ఆహార యోగ్యతను మాత్రమే సూచించింది కానీ, వీటిని ఎలా వండుకోవచ్చో చెప్పలేదు. ఐతే వేప పూలను ఏ విధంగా ఉపయోగిస్తామో వావిలి పూలను కూడా అలాగే వాడుకోవచ్చు. 

చరకుడు వావిలి పూలను విష దోషాలు హరించేదిగా పేర్కొన్నాడు. ఎలర్జీ కారణంగా వచ్చే చర్మ రోగాలు , దురదలు, ఉబ్బసం, నీరు పట్టి ఉబ్బు ఏర్పడే వ్యాధుల్లో , ఊపిరి తిత్తులు, మూత్ర , స్త్రీల వ్యాధుల్లో వావిలి పని చేస్తుంది. 

పిల్లల మతిమరుపు, అధిక ఋతు రక్త స్రావం సమస్యలు.. ఆయుర్వేద పరిష్కారాలు

 పిల్లల మతిమరుపు సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు.. 

మన బిడ్డలకు తగిన ఆహార ఔషధం, మన ఇంట్లోనే, మన చేతుల్లోనే ఉంది. సోంపు గింజలు, ధనియాల గింజలు కొంచెం దోరగా వేయించి , కొంచెం నలగ గొట్టి, పొట్టు తీసి, విడి విడిగా దంచి చూర్ణాలను తయారు చేసుకోవాలి. వాటితోపాటు చిన్న ఏలకులు పొడిచేసి, ఇంకా సీమ బాదం పప్పులు తెచ్చి ఒక రాత్రి నానబెట్టి పై తోలు తీసి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. అలాగే పటిక బెల్లం కూడా పొడి చేసుకుని , అన్ని చూర్ణాలూ సమ భాగాలుగా కలిపి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని రోజూ ఒక చెంచా మోతాదుగా ఒక కప్పు వేడి పాలతో కలిపి రాత్రి భోజనం తర్వాత మూడు గంటలు ఆగి నిద్రించే ముందు తాగాలి. దీని వల్ల మెదడు బలపడి, శరీరం కూడా పుష్టికరంగా మారి , జ్ఞాపక శక్తి అపారంగా పెరుగుతుంది. 


బహిష్టులో అధిక రక్త స్రావ సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..

అతి మధురం పొడి అరచెంచా మోతాదుగా ఒక కప్పు బియ్యం కడిగిన నీటితో కలిపి రోజూ మూడు పూటలా తాగాలి. అతి త్వరలోనే అధిక ఋతు రక్త స్రావం ఆగిపోతుంది. మొదటి రోజు లోనే చాలా మంచి ఫలితం కనిపిస్తుంది. 

రక్త హీనత, తీవ్ర మలబద్దక సమస్య.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 రక్తం తగ్గిపోయే సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు. 


తెల్ల గలిజేరు చెట్టుకు పూజ చేసి దాని వేళ్ళు తీసుకొచ్చి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టి , ఆ ముక్కలను దారంతో దండలాగ కట్టి ఎల్లప్పుడూ మెడలో వేసి ఉంచుకోవాలి. దీని వల్ల క్రమంగా కాలేయం శక్తివంతమౌతుంది. దీంతో పాటు ఒక చెంచా అల్లం రసం, ఒక చెంచా నిమ్మ రసం , ఒక చెంచా టమాటా రసం, ఒక చెంచా తేనె కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు తాగాలి. దీని వల్ల ఆకలి పెరిగి ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ఆయుర్వేద అంగడిలో బోడ తరం పూలు తీసుకొచ్చి పొడి చేసి సమంగా పటిక బెల్లం పొడి కలిపి పూటకు పావు చెంచా పొడి మంచి నీటితో రెండు పూటలా సేవించాలి. ఇలా చేస్తూ అరగని పదార్థాలు, బంగాళా దుంపలు, గరం మసాలా, మాంసం, చల్లని పదార్థాలు వాడవద్దు. బార్లీ బియ్యం, సగ్గు బియ్యం , పెసర కట్టు, ముల్లంగి దుంపలు , నారింజ, ఆపిల్, బత్తాయి మొదలైనవి వాడాలి. క్రమంగా సహజమైన రక్తోత్పత్తి జరుగుతుంది. 


తీవ్ర మలబద్దక సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు..

పొట్టు తీయకుండా ఆడించిన గోధుమ పిండిలో అర చెంచా నుండి ఒక చెంచా వరకు వంటాముదం, పావు చెంచా జీలకర్ర పొడి , పావు చెంచా మిరియాల పొడి , పావు చెంచా అల్లం రసం, పావు చెంచా సైంధవ లవణం పొడిని కలిపి రొట్టెలాగా చేసి రాత్రి ఆహారంగా తింటుంటే హాయిగా సుఖ విరేచనం అవుతుంది. ఆహారంలో నెయ్యిని బాగా ఉపయోగించాలి. 

ముట్టు నొప్పి, అతి దురద సమస్యలు.. డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 ముట్టు నొప్పికి.. ఆయుర్వేద పరిష్కారాలు 

మన ప్రాంతంలో దొరికే ముదురు చింత బెరడు తీసుకొచ్చి ముక్కలు చేసి ఎండబెట్టి కాల్చి బూడిద చేసి జల్లించి నిలువ చేసుకోవాలి. మరో రెండు రోజుల లో బహిష్టు రాబోతుందనగా కంది గింజంత చింత బూడిదను ఉదయం పూట చెంచా నిమ్మ రసంలో కలిపి , సాయంత్రం పూట చెంచా తేనె తో కలిపి బహిష్టు వచ్చి ఆగిపోయే వరకు తింటూ ఉంటే నొప్పి తగ్గిపోయి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. 


విపరీతంగా దురద బాధిస్తుంటే.. ఆయుర్వేద పరిష్కారాలు.


వేప చిగుళ్ళు,పసుపు సమ భాగాలుగా తీసుకుని కొంచెం నీటితో మెత్తగా నూరి ఆ గుజ్జును దురదల పైన పట్టించి ఒక గంట ఆగి వేడి నీటితో స్నానం చేయండి. అలాగే మంచి పసుపు 50 గ్రాములు, పాత బెల్లం 100 గ్రాములు కలిపి దంచి నిలువ చేసుకోవాలి. పూటకు 5 గ్రాములు మోతాదుగాను చప్పరించి తిని మజ్జిగ తాగాలి. 

ఆహారంలో వంకాయ ,గోంగూర ,ఆవకాయ , మాంసాహారం, చేపలు , గుడ్లు , వేడి చేసే వస్తువులు మాని వేయండి. దురద సమస్య బాధించదు. 

సంసార సమస్య, పిప్పి పన్ను సమస్యలు.. ఆయుర్వేద పరిష్కారాలు

 సంసార సమస్య..ఆయుర్వేద పరిష్కారాలు 

అశ్వగంధ దుంపలు 50 గ్రాములు, నేల గుమ్మడి గడ్డలు 50 గ్రాములు, గొబ్బి గింజలు 50 గ్రాములు, పటిక బెల్లం పొడి 80 గ్రాములు కలిపి చూర్ణించి పొడి చేసుకోవాలి. అన్నిటిని కలిపి నిలువ చేసుకోవాలి. రోజూ రెండు పూటలా ఒకటి, రెండు చెంచాల పొడి, పావు లీటరు వేడి పాలలో కలిపి సేవిస్తుండాలి. క్రమంగా సమస్య పరిష్కారమవుతుంది. ఆ సమయంలో పూర్తి బ్రహ్మ చర్మం పాటించాలి. 


పిప్పి పన్ను సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు 


పిప్పి పన్ను ఎడమ వైపు వస్తే కుడి చెవిలోనూ, కుడి వైపు వస్తే ఎడమ చెవిలోనూ కాకి దొండాకు పసరు ఐదారు చుక్కలు పోసి కొంచెం ఆగి చెవిని పక్కకు వంచి ఆ రసాన్ని బయటకు కార్చి వేయాలి. దీని వల్ల అప్పటికప్పుడే పిప్పి పన్ను సమస్య పరిష్కారమవుతుంది. 

10, సెప్టెంబర్ 2026, గురువారం

కమలా పండ్లు.. గుమ్మడి..

 కమలా పనులను వీలైనంత అధికంగా తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరమే కాకుండా అందం కూడా పెరుగుతుంది. చర్మాన్ని కాంతులు ఈనేలా చేస్తాయి వృద్ధాప్య ఛాయాల్ని తగ్గిస్తాయి. 

కమలా పండును యథాతతంగా తిన్న ప్రసంగా రసాన్ని తాగిన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కండరాలు బలోపేతం అవుతాయి ముడతలు మచ్చలు పూర్తిగా తగ్గుతాయి. 

కమల పండు తొక్కలను ఎండబెట్టుకొని పొడి చేసుకుని సౌందర్య సాధనంగా వివిధ రకాలుగా వాడవచ్చు. 

జిడ్డు చర్మం పోవాలంటే..

ముల్తానీ మట్టి, కమలా పండు తొక్కు, గంధం పొడి సమ భాగాలుగా తీసుకుని , ఒక టీ స్పూన్ టమోటా గుజ్జు కలిపి చర్మానికి మర్దనా చేసుకుని కొద్దిసేపయ్యక కడిగేయాలి. 

ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేయాలి.

కాంబినేషన్ స్కిన్.. 

రెండు చుక్కల ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుని ముఖానికి మర్దనా చేయాలి. 

ముఖాన్ని వేడి నీటిలో ముంచిన మెత్తటి టవల్ తో కంప్రెస్ చేయాలి.

ముడతలు..

టేబుల్ స్పూన్ ప్రోటీనెక్స్ , పెరుగు కలిపి పేస్ట్ తయారు చేసుకుని , ఒక టీ స్పూన్ ఆపిల్ తురుము , రెండు చుక్కలు ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ముఖానికి మాస్క్ వేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తుంటే ముడతలు తగ్గుతాయి. 


గుమ్మడి..

ఏ కాలంలో నైనా వ్యాధులను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది గుమ్మడి. కారణం దీనిలో పుష్కలంగా ఉండే కెరోటినాయిడ్ లే. గుమ్మడి తో చేసిన పదార్థాలను తరచూ తీసుకునే వారిలో వ్యాధి నిరోధక శక్తి అధికం. ముఖ్యంగా బీటా కెరోటిన్ ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ . దీనికి చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే శక్తి అధికం. గుండె నాళాల్లో అడ్డంకులు తొలగించి గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. 

మేని నిగనిగలకు..

వయసుతో సంబంధం లేకుండా మేని నిగారింపు కోరుకునే వారు .. గుమ్మడి చక్కని యాంటీ ఏజింగ్ పదార్థమని తెలుసుకోవాలి . దీనిలోని ఆల్ఫా కెరోటిన్ వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది. కంటి శుక్లాలు రాకుండా చూస్తుంది. 

పీచు పుష్కలం..

గుమ్మడిలో పీచు పుష్కలంగా ఉంటుంది.దాంతో మలబద్ధక సమస్య అదుపులో ఉంటుంది. శరీరానికి మేలు చేసే కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్లు అధికంగా లభిస్తాయి. ఒక కప్పు తరిగిన గుమ్మడి నుంచి కాల్షియం 37 mg లభిస్తే , మెగ్నీషియం 22 mg లభిస్తుంది. 

ఆటలాడే అమ్మాయిలకు ప్రత్యేకం..

పొటాషియం స్థాయిలు పుష్కలంగా ఉండే గుమ్మడిని ఏదో ఒక రూపంలో తీసుకునే వారిలో రక్త పోటు అదుపులో ఉంటుంది. కప్పు గుమ్మడి నుంచి 564 mg పొటాషియం లభిస్తుంది . క్రీడా కారిణులకు ఏర్పడే సమస్య పొటాషియం లోపం. తరచూ వ్యాయామాలు చేయడం వల్ల స్వేదం కారణంగా చెమట రూపంలో పొటాషియం కోల్పోతారు క్రీడా కారిణులు. అటువంటి వారు గుమ్మడి తో చేసిన కూరలను, డెజర్ట్ లను స్వీకరించాలి. పైగా ఇది ఎముక బలానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటితో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచే జింక్ కూ కొదవలేదు. 

విటమిన్లు పుష్కలం..

వండిన గుమ్మడిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, మేని అందానికి తోడ్పడే విటమిన్ ఇ , కంటి చూపునకు సహకరించే విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఒక గిన్నెడు గుమ్మడి నుంచి 3 Mg ల విటమిన్ ఇ లభిస్తే, 12 Mg ల విటమిన్ సి లభిస్తుంది. 

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...