30, నవంబర్ 2015, సోమవారం

DETOX CHEYADAM ANTE

డిటాక్స్ చేయడం అంటే?

శరీరానికి సంబంధించి డిటాక్సిఫి
కేషన్ అంటే క్యాలరీ లోడ్ను తగ్గించు
కోవడం. ముఖ్యంగా కొవ్వు, ఆల్కాహాల్, ప్రాసెస్ట్ పదా
ర్థాల తాలూకూ భారాన్ని తగ్గించడం.
ఈ డిటాకు ఫేడ్ డై గానో లేక వెయిట్ లాస్
టెక్నిక్ గానో ఏమాత్రం భావించకూడదు.
డిటాక్సిఫికేషన్ వెనుకగల ఆలోచన శరీరంలోకి
టాక్సిన్లు లేదా విషతుల్యాలు ప్రవేశించకుండా అడ్డు
కోవడం. కాబట్టి చెడు ఆహార అలవాట్లకు స్వస్తి చెప్పి,
కొత్త అలవాట్లు సృష్టించుకోవాలి.
ఇందుకోసం ఆయుర్వేద సూత్రాన్ని అనుసరించి
21 రోజులనుంచి 62 రోజులదాకా పట్టవచ్చు.
కాబట్టి వీటిని ఓపిగ్గా అనుసరించాలి. అంటే రెగ్యు
లక్ఆహారాన్ని పూర్తిగా మానేసి రోజు మొత్తం గ్రీన్
జ్యూస్లు తాగుతూ బ్రతికేయాలని అర్థం కాదు. సింపు
గా ఆరోగ్యవంతమైన ఆహారం తింటే చాలు.
రోజుకు మూడు భోజనాలు,ఒక స్నాక్ సరిపోతాయి.
చక్కెర పదార్థాలన్నింటినీ కట్చేసేయాలి. అలాగే ఆల్కా
హాల్, డిజర్టులూనూ, పండ్లు వీలయినంత ఎక్కువగా
తినాలి. దీనివల్ల శరీరానికి ఇతర పోషకాలతోపాటు
మంచి చక్కెరలు కూడా లభిస్తాయి.
మధ్యమధ్యలో రోజుకు కనీసం ఎనిమిదినుంచి
పదిగ్లాసుల నీరు తాగాలి. వేయించిన పదార్థాలు అవి
చిప్స్ అయినా సరేతినవద్దు. ఏది తినాలనిపించినా శరీ
రాన్ని డిటాక్సింగ్ చేస్తున్నామన్న విష
యాన్ని గుర్తుంచుకోవాలి. పప్పు,
మొలకలు, లీన్మట నుంచి ప్రొటీన్లు
అందే మాదిరి చూసుకోవాలి.
స్టీమ్ చేసిన లేదా ఉడికించిన
పదార్థాలు తినాలి. ఇక్కడ ఆహారం
తినడం మానేయమని అర్థం కాదు-
చెడు ఆహారాన్ని పూర్తిగా మానేయా
లన్నది కీలకాంశం.

BHOJANAM THARVATHA - FRUITS

భోంచేశాక ఇవి తినాలి!



భోజనానంతరం కొన్ని పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
వాటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగుపడుతుంది.
ఇంతకీ ఆ పండ్లు ఏంటి... ఆ ప్రయోజనాలేంటో తెలుసా!
ఆపిల్: ఈ పండులో పీచు అధికంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలున్న
వారు భోంచేశాక ఆపిల్ను తినడం అలవాటు చేసు
కోవాలి. ఫలితంగా ఆ
సమస్యలన్నీ దూరమవు
తాయి. భోంచేశాక పదిహేను నిమిషాల తరవాత
దీన్ని తినాలి. సన్నగా ముక్కలు తరిగి తీసు
కుంటే ఇంకా మంచిది.
అరటిపండ్లు: ఆరోగ్యం బాగోలేనప్పుడు భోజనానంతరం
తప్పనిసరిగా అరటి పండు తీసుకోవాలి. దీనివల్ల శక్తి లభిస్తుంది. తిన్న ఆహారం
తేలిగ్గా జీర్ణం అవుతుంది.
బొప్పాయి: కొందర్ని అజీర్తి సమస్య బాగా
ఇబ్బంది పెడుతుంది. అలాంటి వారికి బొప్పాయి
పరిష్కారం సూచిస్తుంది. దీనిలో విటమిన్ సి
పుష్కలంగా లభిస్తుంది. శరీరానికి కావల్సిన శక్తి
అందుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అనా
రోగ్య సమస్యలున్న వారు వైద్యుల సలహా మేరకు
బొప్పాయిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
అనాస: ఉదర సంబంధిత సమస్యలున్న వారు అనాస పండుని ఎక్కువగా
తినాలి. దీన్ని తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా అరుగుతుంది. దీనిలో ఉండే
బ్రొమెలిన్ అనే ఎంజైము జీర్ణాశయ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
అంజీరా: గుప్పెడు అంజీరాలో పదిహేను
గ్రాముల పీచు ఉంటుంది. అది జీర్ణ వ్యవస్థను శుభ్ర
పరిచి.. వ్యర్థాలను బయటకు పంపుతుంది. మిగతా
సమయాల్లోనూ అంజీరాను తీసుకోవచ్చు. వీటిని
తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.


27, నవంబర్ 2015, శుక్రవారం

SHADRASOPETHA PULIHORA - AYURVEDAM

షడ్రసోపేతంగా పులిహోర

పులిహోర తింటే ఆల్బర్లు రావా?

* పులిహోర మన ప్రాచీన ఆహార పదార్థం. ఉగాది పచ్చడిలాగానే, తెలుగు
ప్రజలు పులిహోరను కూడా తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదూరుచుల సమ్మేళనంగా తయారు
చేస్తారు. ఉప్పు, కారం, చింత
పండు రసాలతో పాటు బెల్లం
(లేదా పటిక బెల్లం), ఒక
చెంచా ఆవపిండి, ఒక
చెంచా మెంతి పిండి వీటిని
కూడా కలిపితేనే ఆరు
రుచుల పులిహోర ఆరోగ్య
దాయకంగా ఉంటుంది. పులుపు పరిమితంగా వేస్తే ఉప్పు
ర్ణచందు కారాలూ కూడా తక్కువే పడతాయి. ఎంత పులిస్తే అంత ఘన
మైన పులిహోర కావచ్చు గానీ తిని తట్టుకోగలగాలి!

SWARNAPRASANA / BANGARAM - AYURVEDAM

స్వర్ణప్రాశన

బంగారాన్ని తినవచ్చా ? ఉంటే లాభం ఏముందు

- ఔషధాలు కొన్ని ప్రత్యక్షంగానూ, కొన్ని పరోక్షంగానూ
పనిచేస్తాయి. కానీ, బంగారం ఈ రెండింటికీ భిన్నంగా, వివిధ
మైన కసాయన చర్యలోనూ పాల్గొనకుండా స్పర్శా మాత్రంగానే
ఔషధ ప్రయోజనాలనిస్తుంది. ఆధునిక పరిభాషలో దీన్ని కెటలిస్టు (ఉత్తే
తకం) అంటారు. మేలిమి బంగారానికే ఈ గుణం ఉంటుంది. అది చంటి
పెద్దల నుండి వయోవృద్ధుల దాకా అందరికీ ఇప్పదగిన ఔషధమే!
బంగారం కంచంలో భోజనం చేయటం, బంగారు గిన్నెలో పాయసం
తాగటం, బంగారు నగలు ధరించటం ఇవన్నీ ఆ స్వర్ణ స్పర్శాభాగ్యం
పొందడానికి, మధ్య తరగతి వారు బంగారు పాత్రలు కొనలేక వెండి
కంచంలో బంగారు పువ్వునో, చుక్కనో పెట్టించుకుంటారు.
బంగారు ఉంగరం వేళ్లతో అన్నం తినేదీ, బారసాల సమయం 
లోనూ, అన్నప్రాశన సమయంలోనూ బంగారు ఉంగరంతో
పొలనో, పరమాన్నాన్నో పట్టుకుని బిడ్డకు నాకించేది అందుకే! బంగారం రేకు తయా
రుచేయడానికి స్వచ్ఛమైన బంగారం కావాలి. తోలు అట్టల మధ్య మేలిమి బంగారం
ఉంచి, చెక్క సుత్తితో కొట్టి పల్చని రేకులా సాగదీసి స్వర్ణపత్రాలు తయారుచేస్తారు.
అంగుళం అంత స్వర్ణపత్రాన్ని ఒక ముద్ద వేడి అన్నం మీద ఉంచితే ఆ వేడికి అది కరి
గిపోతుంది. ఆ అన్నాన్ని నెయ్యి వేసుకుని తింటారు. పెద్దవాళ్లు బంగారం అన్నం తినే
తేనె, నెయ్యి వేసి రంగరించి వేలికొచ్చినంత భాగాన్ని చంటి బిడ్డలకు నాలుక మీద
రాసి వాకిస్తారు. ఇదే స్వర్ణప్రాశన ప్రక్రియ. బిడ్డ పుట్టిన నాలుగో రోజే బంగారపు
రేకుని ఇలా తినిపించాలన్నాడు వాగ్భ
టుడు. మూడో నెలలోనో, ఆరో నెలలోనో
చేస్తే మంచిదని మరికొందరి అభిప్రాయం.
పుష్యమీ నక్షత్రం రోజున బంగారంలో వైద్య
గుణాలు వృద్ధిలో ఉంటాయి. కాబట్టి, ఆ
రోజున విరేచనాలు, జ్వరం లేకుండా
చూసి ప్రొద్దున పూట స్వర్ణప్రాశన చేయా
అని ఈ గ్రంథం సూచించింది..
బంగారపు రేకుని కొద్దిగా నెయ్యి, తేనెలతో రంగరించి తినిపిస్తే పిల్లల జ్ఞాపకశక్తి,
వికసంథాగ్రాహ్యత, ఉర్ణశక్తి పెరుగి, శరీరం బలసంపన్నం అవుతుంది. ఆయుష్టు
పెరుగుతుంది. పోలియో లాంటి జబ్బులకు వాక్సినేషన్లో పనిచేస్తుంది. అలాగని
ఎప్పుడు పడితే అప్పుడు అదే పనిగా నాకించ కూడదు. మంచి ఆయుర్వేద వైద్యుని
సలహా మీద ఈ విధంగా చంటిబిడ్డలకు స్వర్ణప్రాశన చేయించవచ్చు. ఆధునిక వైద్య
శాస్త్రం బంగారాన్ని biologically inert metal" అంటుంది. ఆయుర్వేద శాస్త్రం
ఇది స్పర్మామాత్రంగా, దీర్ఘకాలం పాటు శరీరం మీద పనిచేస్తుందని చెప్తోంది. బంగా
కపు రేకుని గానీ, స్వర్ణభస్మాన్ని గానీ తీసుకున్న 24 గంటలలోపు జీర్ణకోశం లోంచి
పూర్తిగా బయటకు విసర్జించబడుతుందని రెండు వైద్య శాస్త్రాలు చెప్తున్నాయి. ఒక
రోజు పాటు అది మన శరీరంలో ఉన్నంత మాత్రానికే అది జీవితానికి సరిపడా శక్తిని
స్తుందన్నమాట.

SHASTHROKTHA / SHADRASOPETHA BHOJANAM - AYURVEDAM

మొదటి ముద్దగా అల్లం

భములో ఏది ముందు ఏం వెనుక తినాలో ఏవైనా నియమాలు
చెప్పారా? రాత్రంగా భజన చేయబారి ఏమంటారు?

* అల్లాన్ని తగినంత సైంధవ
లవణం (దొరక్కపోతే మామూలు
ఉప్పు) కలిపి నూరిన ముద్ద ఒక
చెంచాడు తీసుకుని కొద్దిగా అన్నంలో
కలుపుకుని మొదటి ముద్దగా తినాలట..
భోజనంలో కూరల్లాంటి ఘన పదార్థా
లను ముందుగానూ, మృదువైన పప్పు,
పచ్చడి లాంటివి మధ్యలోనూ, చారూ
పులుసూ లాంటి ద్రవపదార్ధాలను చివరగానూ, ఆఖరున పెరుగు లేదా మజ్జిగతో
ముగించాలి. పాలతో తయారయిన స్వీట్లను భోజనం మధ్యలో పులుసన్నం, పెరుగా
న్నంకన్నా ముందే తినేయాలి. లడ్డూ లాంటి పాలు కలవని స్వీట్లను భోజనం ఆఖరు -
తీసుకోవచ్చు. భోజనం చివర తీపి తినాలని చెప్పారు.
వడ్డించేప్పుడు తీపితో మొదలుపెడతారు. తినేప్పుడు కూర, పప్పు, పచ్చడి
పులుసు, పెరుగు వరుసలో తినటమే మంచిది. ఆయుర్వేద శాస్త్రం సూచించిన ఈ వి.
మైన భోజన విధానాన్ని దేశంలో ఒక్క తెలుగువారు మాత్రమే పాటిస్తున్నారు. తీ-
పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఈ ఆరు రుచులూ తగు పాళ్లలో ఉండేలా సు
తుల్యంగా ఆహారం ఉంటే దాన్ని షడ్రసోపేతమైన భోజనం అంటారు. వగరూ చేయి
పదార్థాలను కూడా రోజూ తినటం అవసరం.


26, నవంబర్ 2015, గురువారం

RUDRA JADA / SABJA GINJALU - AYURVEDAM

చలవ చేసే సజ్జాగింజలు

సజ్జాగింజలు నానబెట్టి షుగరు రోగులు తీసుకోవచ్చా? లాభాలేమిటి? 

? - రుద్రజడ దీని అసలు పేరు. సబ్దా అనేది అరబ్బీ పదం. వేడి ఎక్కువగా ఉన్నవా
రికి ఈ గింజల్ని పది నిమిషాల సేపు నీళ్లలో నానించి ఇస్తే వెంటనే చలవ
చేస్తుంది. షుగరు వ్యాధిలో అరికాళ్ల మంటలు, పోట్లు ఉన్నవారికి ఈ గింజల్ని రోజూ
తాగిస్తే మంటలు ఉపశమిస్తాయి. మూత్రంలో మంట, కడుపులో మంట, అరికాళ్లు
చేతుల్లో మంట, కళ్లు మంటలు, నాలుక మీద మంట, విరేచనంలో మంట ఇలా
మంటగా ఉండటమే వేడి అంటే! సజ్జాగింజలు ఈ వేడిని తగ్గిస్తాయి. మైగ్రేన్ తలనొప్పి
మీద కూడా పనిచేస్తాయి. పంచదార కలపకుండా షుగరు రోగులకూ, స్థూలకాయు
లకూ ఇవ్వొచ్చు. మజ్జిగలో కూడా నానబెట్టుకుని తాగవచ్చు. పాలలో వేసి ఉడికించి
టీలాగా కాచుకుని తాగవచ్చు. కిరాణా కొట్లలో ఇవి తేలికగా దొరికేవే!

PALLEELU / VERUSENAGA PAPPU ALLERGY - AYURVEDAM

పల్లీల ఎలెర్జీ?

2 వేరుశనగ పప్పులు వాడితే మంచిదేనా?

* వేరుశనగ గుళ్ళు, పల్లీలు, వేరు గుళ్ళు పేరుతో మన ప్రాంతాల్లో దొరికే వేరుశనగ
గుళ్ళు మనకి మధ్య యుగాల
మలిదశలో విదేశీయులు దిగు
మతి చేసిన నూనె గింజలే. నూనె
సంగతి అలా ఉంచితే వేరుశన
గలు శనగల్లాగే పైత్యం చేసే
స్వభావం కలిగి ఉంటాయి.
యాసిడ్ని పెంచి ఆకలి చంపు
తాయి.
వేరుశనగ పప్పుల్ని కొద్దిగా
నెయ్యి వేసి దోరగా వేయించుకుని
బెల్లంముక్కతో కలిపి తింటే, అజీర్తిబాధలు, కడుపునొప్పి, గ్యాసురాకుండా ఉంటా
యని మన పెద్దవాళ్ళు వేయించిన శనగగుళ్ళను తీపితో కలిపి పెడతారు. గాంధీగారు
వేరుశనగ పప్పు, బెల్లం ముక్కతోపాటు మేకపాలు కూడా తీసుకునేవారని ప్రతీతి.
ఏమైనా వేరుశనగ గుళ్ళు మనం అనుకున్నంత ఆరోగ్యకరమైనవి కావు. అలాగని
నిషేధించాల్సినవి కూడా కావు. సరదాగా అప్పుడప్పుడు వేయించిగాని, ఉడకబెట్టుకు
నిగాని, తంపట పెట్టుకునిగానీ తీసుకోవచ్చు. కొందరిలో ముఖ్యంగా పిల్లల్లో
ఉబ్బసం వ్యాధికి ఇవి కారణం అవుతాయని ఇటీవల అమెరికన్ పరిశోధకులు
గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఒక ఊపిరితిత్తుల ఆసుపత్రిలో పిల్లల మీద జరి
పిన పరిశోధనలో ఈ హెచ్చరిక చేశారు. వేరుశనగపప్పు తిన్న కొంత
మందిలో ఎలెర్జీని నియంత్రించే ఇమ్యునోగ్లోబులిన్-ఇ అసాధారణంగా
పెరగడాన్ని గమనించారు. ఆ వ్యక్తులకు వేరుశనగ సరిపడదని దాని
అర్ధం. సరిపడనివారు తప్ప తక్కినవారికి వేరుశనగ విరోధం లేదు.
అయినా అవి నూనెగింజలు కాబట్టి స్థూలకాయులకు జాగ్రత్త తప్పదు.


CHILAKADA DUMPA LABHALU - AYURVEDAM

వార్ణచందు చిలకడ దుంపలు

చిలకడ దుంపల వలన లాభాలు? 

 ఆలూ దుంపల్లాగానే చిలకడ దుంపలు కూడా 17వ శతాబ్దిలో అమెరికా
నుంచి విదేశీ వ్యాపారుల ద్వారా మనకు చేరాయి. వాతం చేస్తాయని, షుగరు
పెంచుతాయనీ, మలబద్ధతని తెస్తా
యని చాలామంది వీటిని తినరు.
కానీ, జీర్ణశక్తి బలంగా ఉన్నవారికి
ఇవి మేలే చేస్తాయి. పైగా జీర్ణశక్తిని
పెంచుతాయి కూడా! ఆ విషయంలో
ఆలూ కన్నా ఇవే మెరుగు.
ఎర్రగా ఉండే చిలకడదుంపల్ని
పిల్లలకు తరచూ వండి పెడుతూ
ఉంటే చీటికీ మాటికీ విరేచనాలయ్యే
వ్యాధిని తగ్గిస్తుందని ఒక తాజా పరిశోధన చెప్తోంది. చిలకడదుంపల్లో ఉండే ఎ విట
మిన్ (బీటా కెరొటీన్) పేగుల లోపలి గోడల్ని బలసంపన్నం చేస్తుందని నిర్ధారించారు.
అందువలన పేగుల్లో ఉద్రేకం కలిగించే ఆహార పదార్థాల్నీ, బాక్టీరియా దోషాలున్న
ఆహార పదార్థాన్ని తీసుకున్నప్పుడు పిల్లల్లో విరేచనాలు అవకుండా ఇవి పేగుల్ని కాపా
డతాయని నిర్ధారించారు.
చిలకడదుంపల్ని ఉడికించి, తాలింపు పెట్టి పిల్లలకు సాయంకాలం పూట స్కూలు
నుంచి రాగానే పెట్టడానికి వీలుగా ఉంటాయి. క్యారట్, చిలకడదుంపలు సమానశక్తి
కలిగిన ద్రవ్యాలు, వాటిని ఎ విటమిన్ లోపం ఉన్న పిల్లలకు తగుపాళ్ళలో అందించవ
లసి ఉంది. శనగపిండి స్వీట్లు, హాట్లు పేగుల్ని పాడుచేస్తాయి. చిలకడ దుంప స్వీట్లు
పేగుల్ని బాగుచేస్తాయి.


JUNK FOOD - NOLLALO VELLALU

నోళ్ళలో వెల్లలు

జంక్ ఫుడ్స్ గురించి చెప్పండి!

చిన్నపిల్లల్లో స్థూలకాయం, ఈడు రాకుండానే రజస్వలలు
కావటం, బాల్యంలో షుగరు, బీవీ వ్యాధులు, అనేక మానసిక
ప్రవర్తనా వ్యాధులు కలగడానికి జంక్ ఫుడ్స్ తప్పకుండా కారణం
అవుతున్నాయి.
వెల్ల అంటే తెల్లరంగు. ఏరంగూ లేని తెల్లని స్వీటు కూడా ఈ వెల్ల (తెల్ల
రంగు) కలిపి తయారుచేసిందేనని స్వీట్ షాపువాళ్ళు చెప్తున్నారు. రంగుక
లిసిన ఆహారవిషాలు మాకు వద్దనవలసింది ప్రజలే. స్థూలకాయం వస్తుం
దీని ఇంట్లో పిల్లలకు నెయ్యి, నూనె, జీడిపప్పుల్లాంటివి పెట్టటం మానేసి,
రోడ్డుపక్కన ఆంక్ విషాహారాలు కొనిపెట్టడం ఒక రివాజు అయ్యింది.
సమోసాలు, మైనం లామినేషన్ చేసిన కరకరలు, రంగు
నీళ్ళు, చవకబారు బిస్కట్లు, కోక్ ఎక్కువగా కలిసిన చాక్లెట్లు,
రంగులద్దిన కేకులు, నీలిరంగు బూందీ, ఆకుపచ్చ కారప్పూన
ఇలాంటివి విషాలకిందకు తీసుకురావలసిన అవసరం ఉంది.
ఏవి జంక్ ఫుడో నిర్వచించి, అవి
విషపదార్థాలని ప్రభుత్వం స్పష్టం
చేయాలి. హానికారక జంక్ ఫుడ్స్న
విద్యాలయాల దగ్గర్లో అమ్మకుండా
నిషేధించే ఆలోచన ప్రభుత్వం
చేస్తున్నట్టు 2015 ఆగష్టు నెలాఖ
రులో ఒక ప్రకటన వెలువడింది.
స్కూలు యూనిఫారంలో ఉన్న
పిల్లలకు జంక్ ఫుడ్స్ అమ్మకూ
డదు, పెద్దలకు మాత్రమే అనే
నియమం పెడతారట. ఈ నియమం ఎంత అమలౌతుందో తెలీదు. తల్లిదండ్రులే జంక్
ఫుడ్స్ కొని, పిల్లలకిచ్చి సూళ్ళకు పంపుతున్నారు. తమ పిల్లలు వాటి బారినపడకుండా
నియంత్రించుకోవలసింది కన్నవారే కదా!


VANASPATHI / DALDA

నూనెలో చెడుకొవ్వు?

డాల్డాలాంటి వనస్పతి నూనెలు వాడవచ్చా?

* నూనెని మరింత చిక్కబరచటం కోసం వంటనూనెల్లో హైడ్రోజన్ కణా
లను చేరుస్తారు. దాంతో నూనెలోని కొవ్వు ఘనపదార్ధం (Solid
Saturated Fats) గా
మారుతుంది. కరిగే
స్వభావం ఉన్న ఈ కొవ్వు
రక్తంలో చేరి గుండె జబ్బు
లకు కారణం అవుతోంది.
చాలా ఇబ్బందులు కలిగి
స్తుంది. కరిగే స్వభావం లేని
కొవ్వుని కూడా ఇది చెడుకొవ్వు Bad Cholesterol or LDL గా మారుస్తుంది. చెడుకొ
వ్వుని పెంచే ఈ వనస్పతిని వాడటం హానికరమేనని వేరే చెప్పనవసరం
లేదు. రిఫైండ్ నూనెని కూడా అధిక ఉష్ణోగ్రత దగ్గర కాచి, వేపు
డులు వంటివి వండితే, వాటిలో వనస్పతికన్నా ఎక్కువ చెడుకొవ్వు
పేరుకుని ఉంటుందని కూడా పరిశోధకులు చెప్తున్నారు. కాబట్టి
నూనెల విషయంలో మరింత జాగ్రత్త అవసరం.


VANKAYA VANKALU - AYURVEDAM

వంకాయ వంకలు


 వంకాయ ఎలర్జీ కలిగిస్తుందనేది నిజమేనా?

* వంకాయ నూరు శాతం భారతీయమైనది. తరతరా
లుగా మన పూర్వులు తిని ఆనందించిన ఆరోగ్యదాయకమైన
ఆహార ద్రవ్యమే! దాన్ని ద్వేషించాల్సిన పని లేదు.
సరిపడని ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు కలిగే వ్యాధి లక్ష
జాలను 'ఓరల్ ఎలెర్జీ సిండ్రోమ్' అంటారు. దీనిపైన చేసిన ఒక
సర్వేలో 10% భారతీయులకు వంకాయ సరిపడదనీ, వారిలో
14% మందికి తీవ్ర రియాక్షన్ వస్తోందని తేలింది. మన శరీర
తత్వం వలన, వాటిని వండే విధానం వలన కూడా వంకాయలు సరి
పడట్లేదని గమనించాలి. (మనుషులందరికీ వంకాయ పడద
నటం సరికాదు.) ఏ ద్రవ్యం అయినా మన శరీరానికి సరిపడ డా.జి.వి.పు
కపోవచ్చు. లేత వంకాయ పిందెలు అన్ని వ్యాధుల్లోనూ తిన
దగినవిగా ఉంటాయి. వంకాయ ముదిరితే దాన్ని పారేయండి గానీ, చెల్లబెట్టా
లని చూడకండి. వంకాయతో చింతపండు, శనగపిండి లాంటివి కలిపి
వండటం వలన నూనెలో వేసి బొగ్గుముక్కల్లా మాడ్చటం వలన కూడా అది
అపకారం చేసేదిగా మారు
తుంది. అల్లం, ధనియాలు,
జీలకర్ర, మిరియాల్లాంటి
జీర్ణశక్తిని పెంచే ద్రవ్యాలతో
వంకాయని వండుకుంటే
దాని దోషాలు చాలావరకూ
తగ్గుతాయి.
ఒక్క వంకాయ విషయం
లోనే కాదు సరిపడని ఏ కూర
గాయనైనా ఇలా సంస్కరించి సరిపడేలా చేసుకోగలగాలి. తక్కువ మోతాదుతో
మొదలు పెట్టి, క్రమేణా పెంచుకుంటూ పడని దానిని పడేలా చేసుకోవడాన్ని
డీ-సెన్సిటైజేషన్ (సాత్మీకరణం) అంటారు.
జలుబు, ఉబ్బసం లాంటి ఎలెర్జీ
వ్యాధులున్న వారు పడని వస్తువుల్ని ఇలా సాత్మీకరణం చేసుకోవటం అవసరం.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...