29, మార్చి 2016, మంగళవారం

ECZEMA LO AHARAM

ఎగ్జిమాలో ఆహారం

చాలా సంవత్సరాలుగా నాకు కార్ల మీదా ఎగ్జిమా ఉంది. ఏం తినకూ
డదో చెప్పగలరు.

* సరిపడనిది తగిలినప్పుడు ఎగ్జిమా మచ్చల మీద దురద పెరుగుతుంది. గోకటం
వలన పుండు రేగుతుంది. ఆ స్థితిలో దాన్ని 'వీపింగ్ ఎగ్జిమా' అని పిలుస్తుంటారు.
ఇలా మాటిమాటికీ రని కారటం తిరగబెడుతూ చివరికి ఆ భాగం అంతా నల్లగా
మారిపోతుంది. ఎగ్జిమా మందులు వేసి తగ్గించేయగలిగే వ్యాధి కాదు. శరీరానికి సరి
పడని వాటికి దూరంగా ఉంచడమే అసలు చికిత్స.
సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలు, యాంటీ సెప్టిక్ సొల్యూషన్లు, ఇంటి దుమ్ములో
ఉండే ఫంగస్ తదితర సూక్ష్మ జీవులు, పెంపుడు జంతువులు, చుండ్రు, కొన్ని రకాల
బాక్టీరియా, వైరలు, అమిత వేడి, అతి చల్లని వాతావరణ పరిస్థితులు, పాలు, గుడ్లు,
జీడిపప్పు, బాదాం, సోయా ఉత్పత్తులు, గోధుమలు, హార్మోన్ల స్థాయిలో
మార్పులు ఇవన్నీ ఎగ్జిమాని పెంచేందుకు అవకాశం ఉంది.
చింతపండు, శనగపిండి, మైదా, నూనెలతో వండిన పదార్థాలు కఫ
దోషాల సమస్థితిని దెబ్బతీస్తాయి. వాటిని ఎంత పరిమితంగా వాడితే
ఆరోగ్యం అంత పదిలంగా ఉంటుంది. చేదు, రుచి కలిగిన కాకర, ఆగా
కర, మెంతులు, వేపపూవు తరచూ వాడుకోవటం మంచిది. వేపపూ
లను కొద్దిగా వాము పొడినీ నెయ్యి వేసి దోరగా వేయించి మిక్సీ పట్టు
కుని కారప్పొడిలా రోజూ అన్నంలో తినటం వలన ఈ వ్యాధి తీవ్రత తగ్గు
తుంది. ధనియాలు లేదా జీలకర్ర లేదా దాల్చిన చెక్కలను వేర్వే
ర్ణచందు రుగా మిక్సీ పట్టుకుని సీసాలో భద్రపరచుకోండి. వీటిలో
ఏదైనా ఒకదాని పొడిని గ్లాసు నీళ్లలో అరచెంచా చొప్పున వేసి
మరిగించి వడగట్టుకుని ఈ నీటిని మంచినీటికి బదులుగా రోజూ తాగుతూ ఉంటే శరీ
రంలో విషదోషాలు తగ్గుతాయి.

24, మార్చి 2016, గురువారం

SUMMER HEALTH DRINKS-FALUDHA,SAJJAPALU,BARLI NEELLU&SAGGU BIYYAM PAYASAM




MULLANGI AKULATHO KOORA



ముల్లంగి ఆకులతో కూర

 ముల్లంగి ఆకులు తినదగినవేనా? ముల్లంగిని
ఉబ్బనం, శరీరానికి నీరు పట్టటం లాంటి జబ్బుల్లో
తినకూడదంటారు నిజమేనా?

* ముల్లంగి రెండు రకాలుగా దొరుకుతుంది. మనకు దొరికేది
చిన్న రకం తెల్ల ముల్లంగి, ఏనుగుదంతంలాగా బాగా తెల్లగా పెద్దదిగా
ఉండేది మనకు తక్కువ. జపాన్ వాళ్లు దీన్ని దాయికాన్ అంటారు. ఈ
పెద్ద ముల్లంగి దుంపలు (బడీ మూలీ) మన చిన్న ముల్లంగిలా చలవ
చేయవు. వేడి చేస్తాయి. కష్టంగా అరుగుతాయి. అన్ని దోషాలను
పెంచుతాయని భావప్రకాశ వైద్య గ్రంథంలో ఉంది. దాదాపు 20 అంగు
కాల వైశాల్యం కలిగి 45 కిలోల బరువు ఉండే సకురాజిమా
అనే పెద్ద ముల్లంగి జపాన్లో బాగా పెరుగుతుంది. మనకు 14
అంగుళాల వరకూ ఉండే చిన్న ముల్లంగి దుంపలే దొరుకు
తాయి.


చిన్న ముల్లంగిని మూలీ అంటారు. దీనికి కొద్దిగా కారపు రుచి ఉంటుంది. శరీ
రంలో వేడిని పుట్టిస్తూనే చలవని
స్తుంది. తేలికగా అరుగుతుంది.
దీనితో పాటుగా తిన్న ఇతర ఆహార
పదార్థాలు కూడా తేలికగా అరిగేలా
చేస్తుంది. వ్యాధులన్నిటిలోనూ తినద
గినదిగా ఉంటుంది. గొంతును
శ్రావ్యంగా చేస్తుంది. జ్వరం వదల
కుండా వస్తున్నప్పుడు ముల్లంగితో
ఏదైనా ఆహార ద్రవ్యం చేసి ఇస్తే ఔష
ధంలా పనిచేస్తుంది.
ముల్లంగి, క్యారెట్ లేదా బీట్
రూట్ ఒక్కొక్క దుంప, ఒక యాపిల్
లేదా జామపండు ఈ మూడింటి జ్యూసు తీసుకుని కొద్దిగా జీలకర్ర/వాము లేదా
మిరియాల పొడి వేసి ఒక గ్లాసు మోతాదులో తాగితే జ్వరం, దగ్గు, జలుబు,
ఆయాసం తగ్గుతాయి. రోజూ తాగితే రక్తహీనత తగ్గుతుంది. శరీరంలో విష
దోషాలు పోతాయి. క్షీణింప చేసే వ్యాధుల్లో ఇది మేలు చేసే మంచి ఫార్ములా!
మూత్రం ఎక్కువ అయ్యేలా చేస్తుంది. అందువలన నీరు పట్టిన వ్యాధుల్లో (ఎడీమా)
ఇది మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం, కాల్షియం లాంటివి ఎక్కువగా
ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన వ్యాధులు మాత్రమే ముల్లంగిని వద్దం
బారు మనుషులందరూ ముల్లంగిని తినాలి.

ముల్లంగి ఆకుల్ని రాడిష్ గ్రీన్ అంటారు. వీటితో తోటకూర మాదిరిగా పొడి
కూర వగైరాలన్నీ చేసుకోవచ్చు. ఫ్రెంచి వాళ్లు ఉదయం ఉపాహారంగా తింటారు.
అమెరికన్లు ముల్లంగి దుంపల్ని, ఆకుల్ని కూడా చిన్న ముక్కలుగా తరిగి వేపుడు
కూరగా వండుకుంటారు. పెట్రో, సూపుల్లాంటి వంటకాలను కూడా చేస్తారు. వీటికి
కొద్దిగా చేదు రుచి ఉంటుంది. అందుకని ఇతర ద్రవ్యాలతో కొద్దిగా కలిపి వండుకో
వాలి. లేత ఆకుల్ని మాత్రమే ఎంచుకోవాలి. ముల్లంగి దుంపలను సాధారణంగా
ఆకులతో సహా అమ్ముతారు కాబట్టి వాటిని కూడా సద్వినియోగపరచుకోవచ్చనీ,
ముల్లంగితో సమానంగా మేలు చేస్తాయనీ దీని భావం. భావప్రకాశ వైద్య గ్రంథంలో
ముల్లంగి ఆకులు జీర్ణశక్తిని పెంచుతాయనీ, తేలికగా అరుగుతాయనీ, రుచిగా
ఉంటాయనీ, కొద్దిగా నెయ్యి లేదా మంచినూనె వేసి వేయించితే అన్ని దోషాలనూ
పోగొడతాయనీ ఉంది. అలా వేయించకుండా తినటం వలన పైత్యం చేస్తుందనీ,
కఫాన్ని పెంచుతుందనీ ఆ గ్రంథం చెప్తోంది.

CHIMMILI THINAVACHA?

చిమ్మిలి తినవచ్చా...!?

చిమ్మిలి తింటే బీపీ పెరుగుతుందనీ, బ్లీడింగ్ అవు
తుందనీ, కడుపు యాసిడ్ పెరుగుతుందని అంటున్నారు
నిజమా? అపోహా?

* పొట్టు తీసిన తెల్లనువ్వులు (నువ్వుపప్పు), తగినంత బెల్లం కలిపి
దంచిన 'ముద్ద' లేదా 'ఉండని చిమ్మిలి అంటారు. దీనికి తెల్ల
ర్ణచందు నువ్వులకున్న గుణాలన్నీ ఉంటాయి. ఇది విరేచనం ఫ్రీగా
అయ్యేలా చేస్తుంది. బాగా వేడిచేసే స్వభావం కలిగింది కాబట్టి,
వాతాన్ని, నొప్పుల్ని, వాపుల్ని తగ్గిస్తుంది. కానీ, కఫ దోషాన్నీ, పైత్యాన్ని పెంచు
తుంది. ఎసిడిటీ, పేగుపూత ఉన్న వాళ్లకు ఇది మంచిది కాదు. ఇందులో కొవ్వు ఎక్కు
వగా ఉంటుంది. స్థూలకాయులకు ఇబ్బందే కలిగిస్తుంది. దంతాలకు మేలు చేస్తుంది.
విరేచనాన్ని బంధిస్తుంది. ఎముకలు విరిగినప్పుడు త్వరగా అతుక్కునేలా చేస్తుంది.


రక్తస్రావాన్ని ఆపుతుంది.
కానీ, ఋతురక్తం పెరిగేలా
చేస్తుంది. అందుకని గర్భా
శయం మీద మాత్రం రక్త
స్రావం అయ్యేలా చేసే
గుణం దీనికుంది. వేడి శరీర
తత్వం ఉన్న వాళ్లకు
మాత్రమే అధికంగా బ్లీడింగ్
అయ్యేలా చేస్తుంది. బాలింత
లకు మంచిది. తల్లిపాలు
పెరిగేలా చేస్తుంది. చర్మవ్యాధుల్లో మేలు చేస్తుంది. మెదడు వ్యాధుల్లో నరాల బలానికి
ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబు, ఉబ్బసం వ్యాధుల్లో సరిపడుతుందో లేదో
చూసుకుని తినాలి. ఋతుస్రావం సరిగా కాని వాళ్లకు, నెలసరి సక్రమంగా రాని
వాళ్లకూ చిమ్మిలి మేలు చేస్తుంది. అతిగా మూత్రం అవుతున్న మూత్ర వ్యాధుల్లో
చిమ్మిలి మూత్రాన్ని బంధించి బాగా తక్కువగా అయ్యేలా చేస్తుంది. అందుకని
కొందరు రాత్రి పూట పక్క తడిపే పిల్లలకు చిమ్మిలి పెట్టడం మంచిదని చెప్తారు. పిల్ల
లకు బలకరం కూడా! కానీ, శరీర తత్వాలను బట్టి కొద్ది మోతాదుల్లోనే దీన్ని
ఇవ్వాలి. జాగ్రత్తగా తీసుకుంటే చిమ్మిలి మంచిదే!

8, మార్చి 2016, మంగళవారం

GOOD MORNING FOOD

గుడ్ మార్నింగ్' ఫుడ్

ప్రొద్దున పూట ఏది ఎలా తింటే ఆరోగ్యదాయకమో చెబుతారా?

ప్రొద్దునపూట రెండు మూడు జీడిపప్పులు లేదా బాదంపప్పులు, కూరగాయ
ముక్కలు, తరిగిన ఆకుకూర, కొద్దిగా జొన్న రాగి/సజ్జ వీటిలో ఏదైనా ఒకదాని పిండి
వీటిని కలిపి గట్టి ముద్దలా చేసి పెనం మీద రొట్టిగానీ, చపాతీ/పుల్కా గానీ తయారు
చేసుకుని ఉదయంపూట తింటే ఆరోగ్యవంతులకైనా అనారోగ్యవంతులకైనా గొప్ప
ఉపవాస ఉపసంహారం (బ్రేకింగ్ ద ఫాస్ట్) అవుతుంది. రెండు లేక మూడు రొట్టెలు
అని, ఒక క్యారెట్, ఒక ముల్లంగి, ఒక యాపిల్ జామ పండు వీటి జ్యూస్
తాగితే సమగ్రమైన ఆహారం అవుతుంది. The Academy of
Nutrition and Dietetics అంతర్జాతీయ సంస్థ ప్రమాణాలకు తగ్గ
ట్టుగా భారతీయులు తీసుకోదగిన మంచి breakfast ఇది. మరీ
చిక్కగా లేని కాఫీ/టీ రోజుకు ఒకటి లేక రెండుసార్లు అరకప్పు మోతా
దులో తాగవచ్చు.
ఉపొడి, మిరియాల పొడి, యాలకుల పొడి, అల్లం, తులసాకులు,
పుదీనా ఆకులు మూడు లేదా నాలుగు చొప్పున వేసి పాలు పోయకుండా
కాచిన టీ ఆరోగ్యానికి మేలు చేసేదిగా ఉంటుంది. కావాలను
వార్ణచందు కుంటే కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇలా కాచిన దీని
అన్నం తిన్న వెంటనే కూడా తాగవచ్చు. భుక్తాయాసం కలగ
కుండా చూస్తుంది. స్థూలకాయం, షుగర్ వ్యాధి లాంటివి ఉన్న వారు ఆఫీసు నుంచి
లంచి కోసం ఇంటికి రావటం కన్నా క్యారియర్ తీసుకు వెళ్లటం వలన రెండు లాభా
లున్నాయి. మొదటిది పరిమితంగా ఆహారం తీసుకోగలుగుతారు. రెండు భోజనం
చేయగానే పడుకుని నిద్ర
పోయే అలవాటు మానగలు
గుతారు. ప్రొద్దున పూట,
రాత్రిపూట టిఫిన్లను సాధ్యమై
సంతవరకూ మీరేవండుకోవ
డానికి ప్రయత్నించండి.
బయటవి తినటం వలన
ఆహార నియంత్రణ లేకుండా
పోతుంది.
కూరగాయలను, ఆకు
కూరలను ఎక్కువగానూ, వరి అన్నం తక్కువగానూ తినే విధంగా ఆహార పదార్థాల
తయారీ ఉండేలా కొత్త ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కనీసం ప్రొద్దునపూట
ఆహారంలోనైనా కూరగాయలకు, పండ్లకు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. ఇప్పుడు
మనం తింటున్న ఆహారపదార్థాల్లో ఈ కాలపు జీవన విధానానికి మేలు చేసేవి తక్కు
వగా ఉన్నాయి. సాంప్రదాయకమైన కూర, పప్పు, పచ్చడి, పులుసు వగైరా వంటకా
లలో అతిగా చింతపండు, అంతకంటే అతిగా అల్లం, వెల్లుల్లి. అమితంగా నూనెలు
చేరటం వలన మన సాంప్రదాయ వంటకాలు శక్తిహీనంగా మారాయి. ఆధునికమైన
పిజ్జాలు, బట్టర్ నాన్లూ, మిక్స్ వెజిటబుల్ కర్రీలు మరీ హానికరమైనవిగా ఉన్నాయి.
మార్చవలసింది హోటల్ని కాదు. మారాల్సింది మనం.



SHANAGA PINDIKI PRATHYAMNAYAM

ఈ శనగపిండికి బదులుగా వాడుకోదగినదేమైనా
ఉన్నదా?
• శనగపిండి చాలా మృదువుగా ఉంటుంది. కానీ కడుపు
లోకి వెళ్లాక రూక్షంగా (రఫీగా పనిచేస్తుంది. జీర్ణశక్తిని, పేగుల్ని,
శరీర సమతుల్యతనీ దెబ్బ తీస్తుంది. దీనివలన వాతం పెరుగుతుంది. ఎసి
ఇదీ పెరుగుతుంది. జీరం ఆరోగ్యం చెడుతుంది. పోషక విలువలు,
ప్రొటీన్లు వగైరా ఉన్నాయి కదా అనడగవచ్చు. పోషకాలు మనకు
ఎలాంటి ఇబ్బంది కలిగించనివిగా ఉండాలి కదా! వాత, కఫ పైత్యా
లను పెంచే ద్రవ్యాలు ఎంత పోషకాలు అయినా అందరూ దీన్ని తినండి
అని చెప్పడానికి వీలైనవి కావు. శష్కలీ అంటే శనగపిండి. ఇది మలబద్ధ
తను కలిగిస్తుంది. కంటికి చెడు చేస్తుంది.
గోధుమ పిండి,
జొన్న పిండి, రాగి పిండి, సజ్జపిండి లాంటి
డా.జి.వి.
వాటితో వంటకాలు శనగపిండి, మినప్పిండి, పెసరపిండి కన్నా
మెరుగ్గానూ, రుచికరంగా కూడా ఉంటాయి. శనగపిండితో చేసుకునే వంటకాలన్నిం
ఉనీ వీటితో కూడా చేసుకోవచ్చు. రాగి పిండితో పకోడీలు, జొన్నపిండితో జంతికలు,
సజ్జపిండితో అప్పాలు (సజ్జ
ప్పాలు) ఒకప్పుడు మన
పూర్పులు ఇష్టంగా తిన్నవే! ఆ
రోజుల్లో అంటే 40-50 యేళ్ల
క్రితం వరకూ శనగపిండి
వాడకం బాగా తక్కువ. ఆరో
గ్యానికి అంతగా మంచిది
కాడని ఎప్పుడో ఒకసారి సర
దాగా తినేవారు. బూందీ, కార
ప్పూన, చక్రాలు వగైరా వంట
కాలను గోధుమపిండి, జొన్నపిండి కలిపి తయారు చేసుకునే వాళ్లు, గారెలు, బూరెలు,
అరిశలు, గవ్వలు, చెక్కలు, ఇలాంటి వాటిని ఇప్పటికీ మనం శనగపిండి లేకుండానే
వండుకుంటున్నాం కదా! లడ్డు, మిరాయి, లావు కారప్పూనలాంటివి కూడా గోధుమ
పిండితోనే తయారయ్యేవి.
శనగపిండిలోనే రుచి ఉన్నదనుకోవటం ఒక అపోహ. వేటి రుచి వాటిది. సజ్జ
ప్పాలు సజ్జపిండితో చేస్తేనే రుచి గానీ, మైదా పిండితో చేస్తే అసలు రుచి ఎలా తెలు
స్తుంది...? పకోడీకి ఆ రుచిని ఉల్లిపాయ ఇస్తోంది. అనవసరంగా శనగపిండి జోలికి
వెళ్లకుండా ప్రత్యామ్నాయాలను ప్రయత్నించి చూడండి. తప్పదనుకుంటేనే శనగపిండి
వాడండి. శనగలను మరపట్టుకున్న పిండిని నమ్మినట్టు, బజార్లో దొరికే శనగపిండిని
నమ్మలేం కదా! అది గుండ్రటి శనగల (బరాణీ శనగలు, బొంబాయి శనగలు) పిండి
కావచ్చు. గుండ్రటి శనగలు ఆరోగ్యానికి మరింత హానికరం.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...