PCOS వ్యాధి..గర్భాశయంలో నీటి బుడగలు ఉండడం.. ఆయుర్వేద పరిష్కారాలు..
చాలామంది బరువు పెరుగుతున్నానని ,ప్రతి చిన్న దానికి చికాకు పడుతున్నానని ,చర్మం జడ్డుగా ఉంటుందని బాధపడుతుంటారు. అది టీనేజర్స్ కి కాదు ఆ వయసుకు అటు ఇటు ఉన్న వారిలోనూ ఇలాగే ఉంటుంది. వాళ్లకి పిల్లలు ఉండరు, గర్భం రావడం లేదని బాధపడతారు. వాళ్ళు వెంటనే చూపించుకుంటే తెలుస్తుంది, వాళ్ళు కడుపులో నీటి బుడగల లాంటి కనితులు ఉన్నాయని.. వాటిని pcos అంటారు. ఈమధ్య జరిగిన పరిశోధనలలో 22 నుంచి 33 శాతం వరకు మహిళలు దీనితో బాధపడుతున్నా రని , మరికొంతమంది మహిళలు దీంతో పాటు వచ్చే మరికొన్ని వ్యాధుల వల్ల బాధపడుతున్నారు.
మీకు తెలుసా శిశువు జననంతో స్త్రీకి మాతృత్వం జనిస్తుంది. మహిళ జీవితానికి ఎన్ని అనుకున్నా మాతృత్వం ధ్యేయం. దీనికి ఆరోగ్యవంతమైన జననేంద్రియాల స్థితి ముఖ్య కారణం. హార్మోన్ల స్థితి, వారిలో ఆరోగ్యకరమైన బీజం, వాలం, వాళ్ల మంచి కలయిక, ప్రవేశించే ఆత్మ.. ఇవి గర్భానికి కారణమవుతాయి.
ఈ గర్భధారణ స్థితికి సామర్థ్యానికి గర్భాశయంలోని లేదా అండాశయంలోని నీటి బుడగలు పెద్ద అడ్డంకి. ఈ పిల్లలు కలగలేని స్థితికి గర్భధారణ కాలమైన 12 45 సంవత్సరాల మధ్య ఈ నీటి బుడగలే ప్రధాన అవరోధం చాలామంది ఈ నీటి బుడగలు ఉన్నాయన్న నిజాన్ని గ్రహించక ముందు తమ నెలసరి రుతుస్రావంలో హెచ్చు తగ్గులు ఉన్నాయని అనుకుంటారే కానీ పాము గర్భం ధరించలేక పోవడానికి ఇదే కారణమని ఊహించరు. క్రమంగా నెలసరి సరిగ్గా రాకుండా బరువు పెరుగుతూ ఉంటే తమ గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయేమోనని చూపించుకోవడం అవసరం.
అండాశయాలు స్త్రీ కడుపులో రెండువైపులా ఉంటాయి ఇరువైపులా రెండు ఉంటాయి. ఇవి స్త్రీ గర్భధారణకి అవసరమైన స్త్రీ బీజాన్ని నెలకి ఒకసారి ఒకటి చొప్పున విడుదల చేస్తుంది.దాన్ని ఓవ్యులేషన్ అంటారు. ఇది ఈ నీటి బుడగలు ఉండడం వల్ల జరగదు.అందువల్ల గర్భం ఏర్పడదు. దీనికి కారణాన్ని పరిశోధించిన శాస్త్రజ్ఞులు హార్మోన్ ఇన్సులిన్ నియంత్రణ వల్ల ఈ వ్యాధి కలుగుతుందని నిర్ధారించారు .
పెరుగుతున్న ఇన్సులిన్ స్త్రీ జననేంద్రియ ఉత్పాదక హార్మోన్లను హెచ్చుతగ్గులు చేయడం వల్ల ఈ స్థితి ఏర్పడుతుంది. సాధారణంగా LH to FSH నిష్పత్తి 1:1 లో ఉండాలి. పి సి ఓ ఎస్ లో 2:1 కి మారి ఉపద్రవాలను కలుగజేస్తుంది.
అలాగే ఆ వయస్సులో ఉండకూడని మానసిక అశాంతిని, మెదడుపై ఒత్తిడిని ,తద్వారా శరీరంలోని హార్మోన్ల స్థితిని పాడుచేస్తాయి.
ఈ పీసీఓఎస్ వంశపారంపర్యంగా కూడా ఉండవచ్చు. దీనికి కారణాలు స్థూలంగా.. లావుగా ఉండడం ,ఇన్సులిన్ నియంత్రణ ఎక్కువగా ఉండడం. మరో రకంగా చెప్పాలంటే పెరుగుతున్న ఇన్సులిన్ విలువలు స్త్రీ జనన కారణ గ్రంధులైన పిట్యూటరీ ,ఓవరీ గ్రంధులపై ప్రభావం చూపడం వల్ల ఈ నీటి బుడగలు ఏర్పడి వాటివల్లే స్త్రీ బీజ ఉత్పత్తి కుంటుపడి రుతుక్రమం తప్పి గర్భధారణని రానీయదు.
ఈ నీటి బుడగలు అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో కనబడతాయి నిజానికి ఇవి నీటి బుడగలు కూడా కావు. బయట ఉండిపోయిన పూర్తిగా తయారు కాని స్త్రీ బీజపు బుడగలు. స్కానింగ్ లో ఇవి చిన్న చిన్నవిగా చాలా కనిపించవచ్చు.
ఆయుర్వేద శాస్త్రం దీనిని ఒక యోని వ్యాపత్ గా గుర్తించింది. అంటే అర్థం ఏమిటంటే స్త్రీ జననేంద్రియ వికృతి అని. స్త్రీలో జడత్వం, విశ్రుంకలత్వం, ఋతుకాలంలో జాగ్రత్తగా ఉండకపోవడం, తల్లి నుండి వచ్చిన కొన్ని లక్షణాలు వీటికి కారణాలు.
ఈ వ్యాధిని ఆయుర్వేదంతో ఇలా తగ్గించవచ్చు..
శరీరంలోని మూడు ప్రధాన శక్తులు/ త్రిదోషాలు, రస, రక్త ధాతువులు. రుతు రక్తాన్ని తీసుకెళ్లే శ్రోతస్సులు. శరీరంలో దహించే శక్తి అగ్ని వంటిది వ్యాధిలో చెడి ఈ వంధ్యత్వానికి కారణం అవుతాయి. ముఖ్యంగా రోజురోజుకీ బరువు పెరగడం ,లావుగా ఉండటం, ఒంట్లో ఇన్సులిన్ స్థితి పెరగడం ,చర్మం రంగు మారడం, కోరిక తక్కువగా ఉండడం ,గర్భం ధరించలేకపోవడం, చర్మం జడ్డుగా ఉండడం, తలలో జుట్టుపల్చబడడం వంటి లక్షణాలు ఉంటాయి. దీనివల్ల తర్వాత షుగర్ వ్యాధి, బిపి ,గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్ వంటివి కూడా రావచ్చు . దీనిని చాలా కాలం చూసిన తర్వాత స్కానింగ్ కు వెళ్లడం వల్ల తెలుసుకుంటారు. చికిత్స ఆధునికంగా ఆశాజనకంగా లేకపోవచ్చు
ఆయుర్వేదంలో జీర్ణశక్తిని, ధాతు శక్తిని పెంచి, స్త్రీ జననేంద్రియాలను నియంత్రించే అపాన వాత శక్తి సమపరచడం వల్ల ఈ వ్యాధిని తగ్గించవచ్చు .
పంచకోల చూర్ణం, చిత్రకాది వటి వంటి వాటి వల్ల జీర్ణాశయ అగ్ని పెరుగుతుంది .మెదడును శిరోవిరేచనం ద్వారా అను తైలం ఏడు రోజులు, క్షీర బల తైలం 101 ఆకృతులతో ఏడు రోజులు నస్య కర్మ చేయించాలి. అరి పతికర చూర్ణంతో ఒకరోజు విరేచనం చేయించాలి.
పుష్ప ,ధాన్య, రస వంటి మందుల వల్ల స్త్రీ బీజ ఉత్పత్తి సమస్థితికి చేరుతుంది. వరుణాధికషాయం మరియు సహచరాధికషాయం వంటివి కూడా వ్యాధి నివారణకు ఉపకరిస్తాయి. అశోకారిష్ట ఫలగృతాదులు ,వాంఛకార గుగ్గులు వంటి ఆయుర్వేద మందులు కూడా ఉపకరిస్తాయి... బాలా తైలంతో కానీ ఆయన తైలంతో కానీ ఉత్తరవస్తి చేయించుకోవడం మంచిది.
నువ్వుల పొడి ప్రతిరోజు తీసుకోవడం, రజ ప్రవర్తికా వటి వంటివి వాడటం వల్ల రుతుక్రమం సరిగ్గా ఉండి పరిస్థితి చక్క బడుతుంది. తీపి పదార్థాలు తినకుండా ఉండటం, నూనె, నెయ్యి వంటివి తక్కువగా వాడటం, వేరుశెనగ వాడకుండా ఉండడం చాలా మంచిది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి