18, మే 2021, మంగళవారం

సహజ వైరస్ సంహారకాలు... / NATURAL VIRUS KILLERS.

 సహజ వైరస్ సంహారకాలు...


1.) తులసి - 

ఇది అద్భుతమైన వైరస్ సంహారిణి. రోజూ ఉదయాన్నే 10,15 తులసి ఆకుల్ని నమిలి తినేయాలి. 


2.) పుట్టగొడుగులు - 

వైరస్ ను సమర్థంగా నిరోధించే గుణం పుట్టగొడుగులకు ఉంటుంది . వీటితో రుచికరమైన సూప్ తయారుచేసుకొని తాగొచ్చు. దీంట్లో మిరియాలు, కొత్తిమీర, ధనియాలు వేసుకుంటే ఆరోగ్యం , రుచి రెండూ సొంతన్ చేసుకొవచ్చు. సూప్ తాగలేము అనుకుంటే హాయిగా కూర వండుకొని తినొచ్చు. 


3.) గ్రీన్ టీ ,బ్లాక్ టీ - 

ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఈ పాలీఫినాల్స్ , వైరస్ లు వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయి. బ్లాక్ టీ లో అల్లం లేదా దాల్చిన చెక్క వేసుకుని తాగితే మరింత ఫలితం ఉంటుంది.


4.) పెరుగు - 

తాజా పెరుగు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. అలాగని పులిసింది వాడకూడదు.


5.) బ్రకోలీ - 

దీనికి ఫ్లూ ను తగ్గించే గుణం ఉంది. ఇందులో విటమిన్ సి, ఇ ,పుష్కలంగా ఉంటాయి. 


6.) శొంఠి - 


అల్లాన్ని సున్నపు నీటిలో ఉడికించి ఎండబెట్టి శొంఠి తయారు చేస్తారు. టీ లో వేసుకుని లేద కషాయంగా చేసుకుని తాగొచ్చు. ఆల్లం కంటే శొంఠి తీసుకోవడం మంచిది. ఇది జ్వరాన్ని తగ్గిస్తుంది. దగ్గుని నియంత్రిస్తుంది. దగ్గినప్పుడు కఫం బయటకు వెళ్లేలా లేదా ఆరిపోయేలా చేస్తుంది. శొంఠి, పిప్పళ్లు, మిరియాలను త్రికటుకాలు అంటారు. ఈ మూడింటినీ కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, కఫం తగ్గుతాయి. 


7.) దాల్చిన చెక్క .- 


శరీరంలో వైరస్ వృద్ధిని నియంత్రిస్తుంది. విరేచనాలు అవ్వకుండా చూస్తుంది. టీలో చేసుకుని తాగితే మంచిది జ్వరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


8.) పసుపు - 


వేడిపాలల్లో పసుపు వేసుకుని రాత్రి పడుకునేముందు తాగితే తెల్లారేసరికి ఫలితం కనిపిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 

16, మే 2021, ఆదివారం

వాము వాసన పీలిస్తే ముక్కు దిబ్బడ ( NASAL CONGESTION )వదిలేస్తుంది.

 వాముని కొద్దిగా తీసుకుని మెత్తగా దంచి పలుచటి గుడ్డలో ఒంటి పొర మీద మూటగట్టి గట్టిగా వాసన పీల్చండి. పదే పదే ఇలా పీలుస్తుంటే తుమ్ములు, ముక్కు దిబ్బడ వేయడం, జలుబు భారం తగ్గుతాయి. తలనొప్పి నెమ్మదిస్తుంది. ఇన్ హేలర్ల వాడకం మంచిది కాదు, అతిగా వాడితే నెత్తురు కారడం ముక్కు లోపలి పొరల్లో ఇరిటేషన్ రావడం జరుగుతోంది. 

హారతికర్పూరాన్ని కూడా ఇదే విధంగా వాసన చూడవచ్చు, కానీ ఇదికూడా వాములాగా సౌమ్యంగా పనిచేయదు, అతిగా పీలిస్తే ఇరిటేషన్ కలిగిస్తుంది. వాము పొడితో వాసన పీల్చడం సున్నితంగా ఉంటుంది. 

చిక్కిపోతున్నవారికి ఆయుర్వేద చికిత్స

 చిక్కిపోవడానికి శరీరంలోపల ఏదైనా వ్యాధు కారణంగా ఉందేమో ముందుగా పరీక్ష చేయించాలి. ఈ కింది ఉపాయాలు పాటించాలి.


1.ఆకలి బాగా పెరిగేందుకు ఆల్లం, శొంఠి లాంటివాతిని వాడుతుండాలి.

2.రాత్రిపూట వేడి అన్నంలో పాలు పోసి ఆ అన్నంతో సహా తోడుపెట్టి ఉదయాన్నే తీసుకొంటూ ఉంటే చిక్కిపొతున్నవారు బలం పుంజుకొంటారు. వేడి తగ్గుతుంది. ఢనియాలు, జిలుకర, శొంఠి ఈ మూడింటినీ సమానంగా తీసుకొని మెత్తగా దంచి ఈ తోడు అన్నంలో నంజుకొంటూ తింటే తేలికగ అరుగుతుంది. ఇంకా బాగ ఉపయోగపడ్తుంది.

3.పిల్లిపీచర వేళ్ళు ఎండించినవి మార్కెట్లో దొరుకుతాయి, వీటిని దంచిన పొడిని చెంచా మోతాదులో తీసుకొని పాలలోవేసి పంచదార కలిపి తాగాలి. 

4.బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, దూలగొండి విత్తులు, జాజికాయ, జాపత్రి, అశ్వగంధ, నేలగుమ్మడి, పిల్లిపీచర వేళ్ళు, శుగంధి పల లోపల పుల్ల తీసేసిన బెరడు వీటిని సమానంగా తీసుకుని శుభ్రంచేసి మెత్తగా దంచి పొడిచేసి , చాలా కొద్దిగా పచ్చకర్పూరం కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. చెంచా పొడిని పాలలో కలిపి తాగిస్తే చిక్కిపోతున్నవారు శక్తిమంతులౌతారు. రోజూ రెండు పూటలా తాగించండి.

5.శిలాజిత్యాదియోగం ఔషధాన్ని రోజూ తీసుకొంటుంటే వివిధ దోషాలు తగ్గి రక్త పుష్టి కలుగుతుంది. రోగి బలసంపన్నుడౌతాడు. 

6. ముఖం ఎండుకుని పోయినట్లు ,పిక్కు పోయినట్లు ఉంటుందా నలుగురు మిమ్మల్ని చూసినప్పుడల్లా ఏంటోయ్ ఇలా ఎండి పోతున్నావ్ అని పలకరిస్తున్నా రా, బాగా ఎండిన దాల్చిన చెక్కని మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరుచు కోండి .గుమ్మపాలు దొరికితే మంచిది లేకపోతే మామూలు పాలు పచ్చివి గాని కాచినది గాని తీసుకొని ,ఒక గ్లాసు పాలలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని కలిపి పంచదార వేసుకొని  రోజు ఉదయం పూట తాగండి, ఉత్సాహం వస్తుంది. ఒంట్లో వాతము ,వేడి తగ్గుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది .జీర్ణశక్తిని పెంచుతుంది .శరీరం కండపట్టి పుష్టిగా ఉంటుంది. అసలైన విషయం, శుక్రా న్ని వృద్ధి చేసి లైంగిక శక్తిని పెంపొందింప చేసే అద్భుతమైన ద్రవ్యాలలో దాల్చిన చెక్క కూడా ఒకటి..

15, మే 2021, శనివారం

ఊపిరితిత్తుల్లో శ్లేష్మం తొలగించుట (SPUTUM EXPECTORATION ) - ఆయుర్వేద చికిత్స

 ఊపిరితిత్తుల్లో శ్లేష్మం - ఆయుర్వేద చికిత్స


1.ఆవాలు,ఆవ నూనె, వాము, ఇంగువ, లేత శనగలు, ఉత్తరేణి, శొంఠి, ఉలవలు, ఖర్జూరాలు, వేప జిగురు, కరివేపాకు, కలబంద, రావి చిగుర్లు, ముల్లంగి, మెంతులు, కుక్కపొగాకు, మారేడు ఆకులు, బూడిద గుమ్మడి కాయ, జాజి కాయ, జాపత్రి, జిలకర, తుంగముస్తలు, చేమంతి పూలు, తులసి, తెల్ల ంఅద్ది చెట్టు బెరడు,పుదీనా, పసుపు ఇవన్నీ ఊపిరి తిత్తుల్ని బలసంపన్నం చేసుకునేందుకు ఎవరికి వారు కఫ వ్యాధుల్లో వాడుకోదగిన మూలికలు. ఆఅయుర్వేద వైద్యుని సంప్రదించి వాడుకుంటే మంచిది.


2.కఫాన్ని బయటకు వెళ్ళగొట్టడంలో అపామార్గ క్షారం అనే మందు అద్భుతంగా పని చేస్తుంది. అతితక్కువ మోతాదులో 500మిగ్రా వరకు తేనెతో కలిపి రెండుపూటలా తీసుకోవాలి. ఇది దగ్గు, జలుబు, వాపులు, జలోదరం, కఫం ఇతర శ్లేష్మ వ్యాధుల్లో బాగా పని చేస్తుంది. శ్లేష్మాన్ని బయటకు వెళ్ళగొట్టడమే దీని ముఖ్యమైన విధి. 

3.తాళిసాది చూర్ణం పొడిని తేనెతో కలిపి పావు చెంచా మోతాదులో తీసుకుంటే కఫం త్వరగా తగ్గుతుంది. ఖళ్ళె తెగకపోవడం వలన వచ్చే ఎడతెగని దగ్గు ఆగుతుంది. నొప్పిలో ఉపశమనం కంపిస్తుంది.


4.శ్వాసానంద వంటి మాత్రలు పూటకు 1 చొప్పున రెండు లేక మూడు సార్లు తాళిసాది చూర్ణం తో గాని, వాసారిష్టతో గాని తీసుకొంటూ ఉంటే ఊపిరితిత్తుల్లో వ్యాధులు త్వరగా తగ్గుతాయి.


5.శృంగ భస్మ, ప్రవాళ భస్మ, తాళక భస్మ, తామ్ర భస్మ, రస భస్మ ఇవన్నీ తగిన మోతాదులో కలిపి అనుపానంగా తాళిసాది చూర్ణం తీసుకుంటూ ఉంటర్ త్వరగ న్యుమోనియా కూడా తగ్గుతుంది, కఫం ఆగుతుంది. 

6.వాసా కంటకారి లేహ్యం 1 చెంచా మోతాదులో తీసుకొంటూ వాసారిష్ట గాని, కనకావసం గానెర్ నాలుగైదు చెంచాల ఔషధాన్ని నీళ్ళతో కలిపి తాగుతే ఈ వ్యాధు లక్షణాల్లో మంచి ఫలితం కంపిస్తుంది. 


7.విజయ భైరవి, రసేంద్రవటి అనే రెండు ఔషధాలు ఈ కఫ వ్యాధులు , క్షయ, న్యుమోనియా లలో అద్భుతమైన ఫలితాలిస్తున్నాయి. ఈ రెండు ఔషధాలతో ఊపిరితిత్తుల్లో కలిగే చాలా వ్యాధుల్ని , దీర్ఘ వ్యాధుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. 

14, డిసెంబర్ 2020, సోమవారం

గర్భ ధారణ లో సౌందర్య సమస్యలు GARBHA DHARANA LO SOUNDARYA SAMASYALU.

 గర్భధారణలో కనిపించే సౌందర్య సమస్యలు

• మెలస్మా (ప్రెగ్నెన్సీ మాస్క్)

* స్ట్రెచ్ మార్క్స్ (ఉదరం, తొడలు,

చేతులమీద చారికలు)

* మొటిమలు, వేవిళ్లు

* అధిక రక్తపోటు

* వేరికోస్ వీన్స్ (కాళ్లలో సిరలు

తేలటం. మెలికలు తిరిగి

వానపాముల్లాగా ప్రముఖంగా

కనిపించటం)

• కేశాలు జిడ్డుగా తయారై అట్టలు కట్టడం

* నిపుల్స్ చిట్లడం

మెలస్మా మచ్చలు

ఆయుర్వేద ఔషధం 1

• కీరదోసకాయ రసం టేబుల్ స్పూన్

పాల మీగడ టీస్పూన్

• పసుపు టీస్పూన్

శనగపిండి టేబుల్ స్పూన్

• ముల్తాని మట్టి టేబుల్ స్పూన్

వాడాల్సిన పద్ధతి

ఒక పాత్ర తీసుకోండి.

* వీటిని అన్నిటినీ వరుసగా తీసుకోండి

* అన్నిటినీ కలిపి పేస్టులాగా చేయండి -

మంగు మచ్చలమీద పూయండి.

ఆరిన తరువాత దూదితో

తుడిచేసుకోండి.

తరువాత వేడినీళ్లతో కడిగేసుకోండి.

స్ట్రెచ్ మార్క్స్ నివారణ

ఆయుర్వేద ఔషధం 2

బాదం నూనె అరటీస్పూన్

* తేనె పావు టీస్పూన్

అరటి పండు గుజ్జు టీస్పూన్

ఆలివ్ నూనె టీస్పూన్܀


• యాపిల్ జ్యూస్ టీస్పూన్

* పాలు టీస్పూ

వాడాల్సిన పద్ధతి

ఒక పాత్రలో వీటిని వరుస

తీసుకోండి

* అన్నిటినీ బాగా కలపండి

• దీనిని స్ట్రెచ్ మార్క్స్ తయారయ్యే

భాగాల మీద (ఉదరం, పిరుదులు

రొమ్ముల మీద) ప్రయోగించండి

స్నాన చూర్ణంతో స్నానం చేయండి

స్నానం తరువాత వెంటనే బా

నూనెను రాసుకోండి

* రాత్రి పడుకునే ముందు ఆలివ్

ఆయిల్ రాసుకోండి

ఇలా ప్రతి రోజూ చర్మాన్ని లూబ్రికే

చేస్తుంటే ప్రసవం తరువాత స్ట్రెచ్ట్

మా తయారు కాకుండా ఉంటా

గర్భధారణలో మొటిమ

ఆయుర్వేద ఔషధం 

సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు

• తేనె టీస్పూ

చందనం పొడి టీస్పూన్ 

వాడాల్సిన పద్ధతి

ఒక పాత్రలో ఈ రెండు పదార్థాల

తీసుకోండి

* రెంటినీ కలపండి

• పేస్టులాగా చేయండి

* దీనిని మొటిమల మీద పై పూతగా

వాడండి

* ఆరిపోయిన తరువాత నీళ్ల

కడిగేసుకోండి

దీంతో ర్యాష్ మొటిమలు తగ్గుతా


గర్భధారణలో జాగ్రత్తలు

వేపుడు కూరలు, స్వీట్లు, కొవ్వు

పదార్థాలు తగ్గించండి.

క్యాల్షియం కోసం రోజూ గ్లాసు పాలు

తాగండి.

తాజా గాలి తగిలేట్లు చూసుకోండి.

త్వరగా నిద్రపోండి.

రాత్రి పూట కండరాలు పట్టేయకుండా

ఉండటం కోసం స్నానం తరువాత

కొద్దిగా మసాజ్ చేసుకోండి,

కాళ్లలో సిరలు తేలకుండా, వేరికోస్

వీన్స్ తయారవకుండా పాదాలను

ముడిచి చాచే వ్యాయామాలు

చేయండి.

పడుకునేముందు ఒక పక్కకు తిరిగి,

ఒక కాలు ముడిచి, ఒక చెయ్యిని

దిండు కింద పెట్టుకొని పడుకోండి.

* రాత్రి పూట నిద్రపట్టకపోతే ఒక

గ్లాసు గోరువెచ్చని పాలు తాగండి.

అలాగే రాత్రిపూట గోరువెచ్చని నీళ్లతో

స్నానం చేయండి.

చుండ్రు,చిట్లిన జుట్టుకు /CHUNDRU SAMASYA,CHITLINA JUTTU -AYURVEDIC SOLUTIONS

 నాకు ఇరవై ఎనిమిదేళ్లు. కొంతకాలంగా చు

తెల్లటి పొట్టు రాలుతోంది. ఎంత తలస్నానం

చిన్న కురుపులు కూడా వస్తున్నాయి. ప్రతి

పరిష్కారం చెప్పండి.

ఫంగల్ ఇన్ ఫెక్షన్, తల్లోని నూనె ,chundru samasyaku

 పలురకాల కారణాలుంtayi.

గ్రంధులు స్రవించడం తగ్గిపోవడం, వాతావరణంలో

మార్పులు, నురగ ఎక్కువగా వచ్చే షాంపూలు తరచూ

వాడటం, కాలుష్యం... వంటివన్నీ ఈ సమస్యకు కార

డాలు, దానికి తోడు తీసుకునే ఆహారం కూడా ఈ

సమస్యను మరింత పెంచుతుంది. చుండ్రు సమస్య

పెరిగిన కొద్దీ.. మొటిమల వంటి సమస్యలూ ఎదు

రవుతాయి. అందుకే.. ఆహారంలో మార్పులతోపాటు,

మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆహారంలో పులుపు, కారం వంటివి తగ్గించి.. కొవ్వు

- శాతం తక్కువగా ఉన్న పదార్థాలను ఎంచుకోవాలి.

మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. అందుకోసం

పీచుశాతం ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను ఎంచు

కోవాలి.

కొబ్బరి లేదా ఆలివ్ నూనెలో కలబంద గుజ్జు కలిపి,

మాడుకు మృదువుగా మర్దన చేస్తుండాలి. దీనివల్ల రక్త

ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. చుండ్రు సమస్య -

కూడా అదుపులో ఉంటుంది. చెంచా పారిజాతం

గింజల పొడి, రెండు చెంచాలు గుజ్జుగా చేసిన మందా

రాకుల ముద్ద కలిపి తలకు పూతలా వేయాలి. రెండు

గంటలయ్యాక కుంకుడు రసంతో తలస్నానం చేస్తే

సమస్య త్వరగా తగ్గిపోతుంది.

అరకప్పు మెంతిపొడి, అరచెంచా గసగసాలు, కొద్దిగా

వేపపొడి తీసుకొని కాసిని నీళ్లతో ముద్దగా చేసి తలకు

పట్టించి రెండు గంటలయ్యాక కడిగేసుకో

వాలి. వంద గ్రాముల కొబ్బరి నూనెకు

రెట్టింపు నీళ్లు కలిపి అందులో గుప్పెడు

ఉమ్మెత్త ఆకుల్ని వేసి బాగా మరిగించాలి.

కాసేటికి ఇది సగం అవుతుంది. ఈ

తైలాన్ని రాత్రిళ్లు రాసుకొని మర్నాడు తల

స్నానం చేయాలి. నూనె రాసిన వెంటనే

చేతులు కడుక్కోవాలి. కంటికి తగలకుండా

చూసుకోవాలి.


చిట్లిన జుట్టుకు

చిట్కాలు


జుట్టు చివర్లు చీలిపోతే వాటిఎదుగుదల సరిగా ఉండదు. తెగినశిరోజాలతో తలకట్టు కూడా సరిగాకుదరదు. మరి పట్టుకుచ్చులా ఉండేకురులు సొంతం చేసుకోవాలంటే ఏంచేయాలి? కొబ్బరి, ఆలివ్ నూనె సమపార్లలో తీసుకొని వేడి చేయాలి.

గోరువెచ్చగా అయ్యాక కుదుళ్ల నుంచిచివర్ల వరకూ తలకు రాయాలి.

దాంతోపాటు మాడుకూ చక్కగామర్దన చేసి మర్నాడు షాంపూతోతలస్నానం చేయాలి. అలాగే రెండు నెలలకోసారి చిట్టిన చివర్లను కత్తిరించేస్తుండాలి.

బాగా పండిన బొప్పాయిని తీసుకొని గింజలు తొలగించాలి. వాటిని మెత్తగాచేసి అందులో తగినంత పెరుగు కలిపి తలకు బాగా పట్టించాలి. అరగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేయాలి. దీనివల్ల కురులు చిట్లే సమస్యనియంత్రణలో ఉంటుంది. జుట్టు రాలడం సమస్య కూడా నెమ్మదిగా అదుపులోకివస్తుంది.

నెలకోసారి కొబ్బరి పాలతో శిరోజాలను తడిపి గంటయ్యాక షాంపూతో తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది. ఆముదం, ఆవనూనె సమపాళ్లలో తీసుకొనిజుట్టు చివర్లకు రాయాలి. పొడి తువాలును చుట్టి అరగంటయ్యాక స్నానం చేస్తేసరిపోతుంది. కురులు ఒత్తుగా ఏర్పడతాయి.మెత్తగా దంచాలి. ఈ ముద్దకు వందగ్రాముల కొబ్బరినూనె, దానికి మూడు రెట్లు నీళ్లు కలిపిమరిగించాలి. వంద గ్రాముల తైలం మిగిలాకదించేయాలి. ఈ తైలం తరచూ తలకురాసుకోవాలి.

ఆలివ్ లేదా నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి తలకు మర్దన చేయాలి.మర్నాడు పెరుగు, మెంతులు, నిమ్మరసంకలిపి తలకు రాసి.. గంటయ్యాక తలస్నానం చేయాలి. వెనిగర్, నీళ్లను సమపాశలో తీసుకొని తలకు రాసి.. మర్నాడుబేబీషాంపూతో స్నానం చేసినా కూడామార్పు ఉంటుంది. అలానే సీకాకాయ,పెసరపిండి తీసుకొని అందులో కాసిని


9, డిసెంబర్ 2020, బుధవారం

శొంఠి / SHONTI -AYURVEDIC USES

 

శుద్ధమయిన అల్లాన్ని పాలతో ఉడికించి ఎండబెట్టినట్లయితే శొంఠి తయారవుతుంది.

ఎండిన పిమ్మట అల్లంలోని గుణాలు విచిత్రంగా మారిపోతాయి.

అల్లానికి, శొంఠికి గల తేడా, వేడి చేయుటములో ఉన్నది. శొంఠి రుచి కరమయినది.

అజీర్తి దోషాలను నిర్మూలిస్తుంది. ఆహారాన్ని శరీరానికి వంటబట్టేటట్లు చేస్తుంది. కఫాన్ని

నిలుపుదల చేస్తుంది. కంఠాన్ని శుద్ధి చేసి శ్రావ్య పరుస్తుంది. వాంతులను అరికడుతుంది.

ఆయాసం, ఉబ్బసం వ్యాధులలో అల్లం కన్నా శొంఠి శ్రేష్టమయినది. కడుపునొప్పి,

దగ్గు, ఆయాసం, గుండె జబ్బుకు శొంఠి పథ్యం.

బోదకాలు, మొలలు, కడుపుబ్బరం, పైత్యం, లివరు సంబంధిత వ్యాధులు, వాత

రోగముల కన్నింటికి శాంఠిని వాడవచ్చు.

నీళ్ళ విరేచనాలవుతున్నప్పుడు శొంఠి పొడిని తీసుకుంటే విరేచనంలో నీటి శాతాన్ని

తగ్గిస్తుంది. అందువలన శోష రాకుండా నివారించవచ్చు. కడుపులో మంటను ప్రజ్వనిల్వ

జేసి, విరేచనాలకు కారణమయిన దోషాలను ఎదుర్కుంటుంది.

ప్రేగుల లోపలి పొరను మ్యూకస్ పొర అని పిలుస్తారు. జిగట విరేచనాలలో ఈ

మ్యూకన్ పొర బయటకు వచ్చేస్తుంది. దాన్నే జిగురు పడటం అంటారు. అమీబియాసిన్

అనే జిగట విరేచనాలు తరచుగా అయ్యేటప్పుడు శొంఠిని క్రమం తప్పక ఉపయోగిస్తుంటే

అది మ్యూకస్ పొరను సంరక్షించి, ప్రేగును శిధిలం గాకుండా కాపాడుతుంది.

వాము, కరక్కాయ, శొంఠి ఈ మూడింటిని కలిపి బెల్లంతో నూరి తీసుకుంటే కీళ్ళవాతం

తగ్గుతుంది. విరేచనం సాఫీగా జరుగుతుంది. అదే విధంగా ఆముదం పప్పు, శొంఠి,

పంచదార వీటిని సమపాళ్ళలో కలిపి తీసుకున్నా, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.

వస 5 భాగాలు, శొంఠి, నల్ల జీలకర్ర, రెండేసి భాగాలు కలిపి బాగా నూరి మెత్తగా

పొడి చేసి, తేనెలో కలిపి కుంకుడు గింజ పరిమాణంలో తీసుకుంటే పక్షవాతరోగులకు

కూడా ఉపశమనం కలుగుతుంది.

25, జనవరి 2019, శుక్రవారం

ప్రాణాంతక వ్యాధులు - ఆయుర్వేద చికిత్స


టి.బి.,ఎయిడ్స్,కండరాలను శుష్కింప జేసే వ్యాధుల్లోనూ రోగి రోజురోజుకు క్షీణించి పోవడం జరుగుతుంది.దీనిని నివారించి ,వ్యాధి నిరోధక శక్తిని పెంచే చికిత్సలు ఆయుర్వేదంలో కొన్ని ఉన్నాయి.

1.గోధుమలు,ఉలవలు,నెయ్యిలో వేయించిన శొంఠి,దానిమ్మ, గింజలు తీసిన ఉసిరి కాయలు,పిప్పళ్ళు ఈ ఆరింటిని కలిపి మేక మాంసం ఈ మిశ్రమానికి రెట్టింపు తీసుకుని ,మొత్తానికి 8 రెట్లు నీళ్ళు కలిపి పొయ్యి మీద ఉడికించాలి.దీనిలో నాలుగవ భాగం నీళ్ళు మిగిలేలా మరిగించాలి.పొయ్యి మీద నుంచి దించి చల్లార్చిన తర్వాత్ ఒక పలుచని గుడ్డలో దీన్ని పోసి బాగా పిండాలి.ఈ రసంలో శొంఠి పొడిని ,దానిమ్మ రసాన్ని ,ఉసిరిక పొడిని కొంచెం కలుపుకుని ,సైంధవ లవణాన్ని కొంచెం కలిపి రోజూ ఒకసారి తాగుతుంటే క్షీణిస్తున్న మనిషి కోలుకోవడం జరుగుతుంది.దీనివల్ల దగ్గు,ఆయాసం,గుండెల్లో నొప్పి,గొంతు మంట కూడా నివారిస్తాయి.

2 .  మేక పాలు,మేక మాంసం,  ఎక్కువగా తింటున్నచో రోగి బలాన్ని పుంజుకుంటాడు.



* కొంచెం పెరుగులో బెల్లం కలుపుకుని తింటే వేసవిలో కలిగే అతిదాహం తీరుతుంది.వాతాన్ని కూడా తగ్గిస్తుంది *

22, జనవరి 2019, మంగళవారం

బోదకాలు / ఫైలేరియా తగ్గడానికి అయుర్వేద చికిత్స

కొన్ని రకముల దోమకాటు వలన ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంది.ప్రారంభ దశలో జ్వరం వస్తుంది.తర్వాత కాలి యొక్క వాపు పెరుగుతుంది.ప్రారంభదశలోనే వ్యాధి తెలుసుకోవాలి.

1. మహా సుదర్శన చూర్ణం,నిత్యానంద రసం,శీతాన్శురసం,శ్లీపదారి లోహం ,పునర్నవ మండూరము,లోహాసవము
 వంటి మందులు బోదవ్యాధిని అరికడతాయి.

2. జిల్లేడు మొక్క వేళ్ళు కాని ,పత్తి చెట్టు వేళ్ళను కానీ శుభ్రం చేసి ,గంజితో కలిపి మెత్తంగా నూరి బోద వచ్చిన చోట లేపనం చేస్తుంటే వాపు తగ్గిపోతుంది.

3. బొప్పాయి ఆకులను నూరి ,రసాన్ని పల్చగా బోద వచ్చిన చోట పులిమి ,అరగంట తర్వాత కడిగేసుకుంటే వాపు తగ్గుతుంది.

4. మునగ చెట్టు బెరడు ,ఆవాలు ,శొంఠి సమపాళ్ళలో నూరి వాపు మీద రాస్తుంటే తగ్గుముఖం పడుతుంది.

5 .కాలి వాపునకు ప్రతి రోజూ వేడినీటి కాపడం పెడుతూ ,ప్రతిపూటా అల్లపు రసం తాగుతుండాలి.

6. వసకొమ్మును సారాయితో గంధం లాగా అరగ దీసి పైన పట్టు వేస్తుంటే బోద వాపులు హరించి పోతాయి.

7.బోదకాలు - సమస్య

! నా వయస్సు 25 సం||, నాకు బోదకాలు సమస్య
ఉంది. దీనివల్ల మా స్నేహితులంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు. దయచేసి ఈ సమస్య నుండి
బయటపడే మంచి మార్గం చెప్పండి.

1) ఈ వ్యాధిసోకిన సంవత్సరంలో పే యుద్ధ
| ప్రాతిపదిక పైన చర్య తీసుకోవాలి. ఏడాది దాటితే సమస్య పరిష్కారమవటం జఠిల
మౌతుంది. రోజూ ఉదయం పరగడపున దేశవాళి గోమూత్రం అరకప్పు మోతాదుగా
తీసుకొని ఏడుసార్లు బట్టలో వడపోసి అందులో పావుచెంచా ఇంట్లో కొట్టుకున్న
| పసుపు, పాతబెల్లం 20 గ్రా. పావుకప్పు మంచినీళ్ళు, కలిపి ప్రతిరోజు వ్యాధి
తగ్గేవరకు సేవిస్తూండాలి. 2) రాత్రి నిద్రించే ముందు వేపాకు, గోంగూర సమంగా
| కలిపి కచ్చాపచ్చాగా నలగొట్టి బట్టలో వేసి కాలికి కట్టుకొని పడుకొని ఉదయం
తీసివేస్తుండాలి. ఇలా చేస్తుంటే క్రమంగా సమస్య పరిష్కారమౌతుంది. శుభం.

వేపాకు, తేనె నూరి పూస్తుంటే
ప్రణాలు మాడిపోతయ్



10, జనవరి 2019, గురువారం

కంటి చూపు తగ్గుట - ఆయుర్వేద పరిష్కారాలు


కొన్ని కంటి వ్యాధుల వలన కంటిచూపు సన్నగిల్లుట జరుగుతుంది.

* ఉల్లి రసమును కంటిలో అతిస్వల్పముగా రోజుకోసారి వేస్తుండాలి.

* ముల్లంగి వెన్నను ,నిమ్మ రసమును నిత్యము వాడుతుండాలి.

* భృంగామలక తైలమును రోజుకోసారి తలకు మర్దన చేయాలి.బాలారిష్టమును గాని ,శిలాజిత్తుగాని ఏదో ఒకటి వాడాలి.

 * శయనం వల్ల పిత్త రోగము నశించును.మర్ధనం వల్ల వాతరోగం తగ్గును.వాంతుల వల్ల కఫదోషం శమించును.లంఖన్మ్ వల్ల జ్వరం తగ్గును.*

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...