Sunday 16 May 2021

చిక్కిపోతున్నవారికి ఆయుర్వేద చికిత్స

 చిక్కిపోవడానికి శరీరంలోపల ఏదైనా వ్యాధు కారణంగా ఉందేమో ముందుగా పరీక్ష చేయించాలి. ఈ కింది ఉపాయాలు పాటించాలి.


1.ఆకలి బాగా పెరిగేందుకు ఆల్లం, శొంఠి లాంటివాతిని వాడుతుండాలి.

2.రాత్రిపూట వేడి అన్నంలో పాలు పోసి ఆ అన్నంతో సహా తోడుపెట్టి ఉదయాన్నే తీసుకొంటూ ఉంటే చిక్కిపొతున్నవారు బలం పుంజుకొంటారు. వేడి తగ్గుతుంది. ఢనియాలు, జిలుకర, శొంఠి ఈ మూడింటినీ సమానంగా తీసుకొని మెత్తగా దంచి ఈ తోడు అన్నంలో నంజుకొంటూ తింటే తేలికగ అరుగుతుంది. ఇంకా బాగ ఉపయోగపడ్తుంది.

3.పిల్లిపీచర వేళ్ళు ఎండించినవి మార్కెట్లో దొరుకుతాయి, వీటిని దంచిన పొడిని చెంచా మోతాదులో తీసుకొని పాలలోవేసి పంచదార కలిపి తాగాలి. 

4.బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, దూలగొండి విత్తులు, జాజికాయ, జాపత్రి, అశ్వగంధ, నేలగుమ్మడి, పిల్లిపీచర వేళ్ళు, శుగంధి పల లోపల పుల్ల తీసేసిన బెరడు వీటిని సమానంగా తీసుకుని శుభ్రంచేసి మెత్తగా దంచి పొడిచేసి , చాలా కొద్దిగా పచ్చకర్పూరం కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. చెంచా పొడిని పాలలో కలిపి తాగిస్తే చిక్కిపోతున్నవారు శక్తిమంతులౌతారు. రోజూ రెండు పూటలా తాగించండి.

5.శిలాజిత్యాదియోగం ఔషధాన్ని రోజూ తీసుకొంటుంటే వివిధ దోషాలు తగ్గి రక్త పుష్టి కలుగుతుంది. రోగి బలసంపన్నుడౌతాడు. 

6. ముఖం ఎండుకుని పోయినట్లు ,పిక్కు పోయినట్లు ఉంటుందా నలుగురు మిమ్మల్ని చూసినప్పుడల్లా ఏంటోయ్ ఇలా ఎండి పోతున్నావ్ అని పలకరిస్తున్నా రా, బాగా ఎండిన దాల్చిన చెక్కని మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరుచు కోండి .గుమ్మపాలు దొరికితే మంచిది లేకపోతే మామూలు పాలు పచ్చివి గాని కాచినది గాని తీసుకొని ,ఒక గ్లాసు పాలలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని కలిపి పంచదార వేసుకొని  రోజు ఉదయం పూట తాగండి, ఉత్సాహం వస్తుంది. ఒంట్లో వాతము ,వేడి తగ్గుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది .జీర్ణశక్తిని పెంచుతుంది .శరీరం కండపట్టి పుష్టిగా ఉంటుంది. అసలైన విషయం, శుక్రా న్ని వృద్ధి చేసి లైంగిక శక్తిని పెంపొందింప చేసే అద్భుతమైన ద్రవ్యాలలో దాల్చిన చెక్క కూడా ఒకటి..

No comments:

Post a Comment