Friday 25 January 2019

ప్రాణాంతక వ్యాధులు - ఆయుర్వేద చికిత్స


టి.బి.,ఎయిడ్స్,కండరాలను శుష్కింప జేసే వ్యాధుల్లోనూ రోగి రోజురోజుకు క్షీణించి పోవడం జరుగుతుంది.దీనిని నివారించి ,వ్యాధి నిరోధక శక్తిని పెంచే చికిత్సలు ఆయుర్వేదంలో కొన్ని ఉన్నాయి.

1.గోధుమలు,ఉలవలు,నెయ్యిలో వేయించిన శొంఠి,దానిమ్మ, గింజలు తీసిన ఉసిరి కాయలు,పిప్పళ్ళు ఈ ఆరింటిని కలిపి మేక మాంసం ఈ మిశ్రమానికి రెట్టింపు తీసుకుని ,మొత్తానికి 8 రెట్లు నీళ్ళు కలిపి పొయ్యి మీద ఉడికించాలి.దీనిలో నాలుగవ భాగం నీళ్ళు మిగిలేలా మరిగించాలి.పొయ్యి మీద నుంచి దించి చల్లార్చిన తర్వాత్ ఒక పలుచని గుడ్డలో దీన్ని పోసి బాగా పిండాలి.ఈ రసంలో శొంఠి పొడిని ,దానిమ్మ రసాన్ని ,ఉసిరిక పొడిని కొంచెం కలుపుకుని ,సైంధవ లవణాన్ని కొంచెం కలిపి రోజూ ఒకసారి తాగుతుంటే క్షీణిస్తున్న మనిషి కోలుకోవడం జరుగుతుంది.దీనివల్ల దగ్గు,ఆయాసం,గుండెల్లో నొప్పి,గొంతు మంట కూడా నివారిస్తాయి.

2 .  మేక పాలు,మేక మాంసం,  ఎక్కువగా తింటున్నచో రోగి బలాన్ని పుంజుకుంటాడు.



* కొంచెం పెరుగులో బెల్లం కలుపుకుని తింటే వేసవిలో కలిగే అతిదాహం తీరుతుంది.వాతాన్ని కూడా తగ్గిస్తుంది *

No comments:

Post a Comment