5, సెప్టెంబర్ 2026, శనివారం

పేల సమస్య - ఆయుర్వేద పరిష్కారం

 పేల సమస్య.. ఆయుర్వేద పరిష్కారం 

తల శుభ్రంగా..

సమయం చిక్కినప్పుడు కాకుండా వారంలో  కనీసం మూడు సార్లు తల స్నానం చేయాలి. శిరోజాలు పూర్తిగా ఆరాకే జడ వేసుకోవాలి. చిన్నారుల జుట్టు సాధ్యమైనంత వరకు చిన్నగా ఉంటేనే మంచిది. జుట్టును మరీ బిగుతుగా కట్టడం వల్ల దురద అధికం అవుతుంది. ఇక సమస్య మరీ ఎక్కువగా ఉంటే కొబ్బరి నూనెలో తగినంత వెనిగర్ కలిపి ,షాంపుతో తల రుద్దుకున్నాక ఈ నూనెను పట్టించాలి. అరగంట అయ్యాక మళ్ళీ ఘాటైన షాంపుతో స్నానం చేయాలి. వెనిగర్ ప్రభావానికి పేలు పోతాయి.

మర్దన తో మేలు..

నోటి దుర్వాసనను దూరం చేసే మౌత్ వాష్ అందుబాటులో ఉంటే దాన్ని తలకు రాసి కాసేపయ్యాక కడిగేయాలి. దీని వల్ల పేలు పోతాయి. ఎంతో మార్పు ఉంటుంది. రాత్రి పూట గోరు వెచ్చని నూనెతో తలంతా మర్దన చేసి మర్నాడు తాజా నిమ్మ రసం మాడుకు పట్టించాలి. గంట తర్వాత తల దువ్వితే పేలు ఇవతలకు వచ్చేస్తాయి. ఐతే తలలో ఇన్ఫెక్షన్లు ,దద్దుర్లు బాధిస్తుంటే నిమ్మ రసానికి దూరంగా ఉండాలి.

వాడే వస్తువులు జాగ్రత్తగా..

పేలు ఉన్నవారు వాడే దువ్వెనలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. తల స్నానం చేసిన ప్రతి సారీ దువ్వెనలు, హెయిర్ బ్యాండ్ లు, క్లిప్పుల వంటివి డిటర్జెంట్ కలిపిన వేడి నీటిలో అరగంట పాటు ఉంచి శుభ్ర పరచుకొని ఆ తర్వాతే వాడుకోవాలి. పేల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు , ఇతర సమస్యలు దూరమవుతాయి. ఔషధ గుణాలు ఉన్న షాంపూ వాడకం వల్ల సమస్య తగ్గుతుంది. దాన్ని నీటిలో కలపకుండా జుట్టుకి రుద్ది , అర గంట తర్వాత కడిగేసుకోండి. ఇక ఇలాంటి వారు వాడే దిండ్లు,దుప్పట్లను ఎప్పటికప్పుడు శుభ్ర పరుస్తూ ఉండాలి.

ఉల్లితో ఉపశమనం..

ఉల్లి పాయలను సన్నగా తరిగి మిక్సీలో వేసి మెత్తని గుజ్జు చేసి దాన్నుంచి రసం తీయాలి. ఆ రసాన్ని తల స్నానం చేసిన మర్నాడు జుట్టుకు పట్టించాలి. నాలుగు గంటలు అయ్యాక శుభ్ర పరచుకుంటే దురద సమస్య బాధించదు. రెండు వారాలకోసారి ఇలా చేస్తే పేలూ తగ్గు ముఖం పడతాయి. సీతా ఫలం గింజలను ఎండ బెట్టి పొడి చేసి తగినన్ని నీళ్లు కలిపి తలకు పూతలా వేయాలి. రాత్రి తలకు వస్త్రాన్ని చుట్టి పడుకుని మర్నాడు షాంపూ తో కడిగేసుకుంటే సరి పోతుంది. దీంతో చుండ్రు సమస్య కూడా నియంత్రణలో ఉంటుంది.

వెల్లుల్లి తో సమస్య దూరం..

సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు .. వెల్లుల్లిని మెత్తగా చేసుకుని ఆ గుజ్జులో పావు కప్పు నిమ్మ రసం కలిపి తలకు రాయాలి. ఆ ఘాటు వాసన కు పేలు పోతాయి..అలాగే ఆపిల్ ను సన్నగా తరిగి మిక్సీలో వేసి గుజ్జుగా చేసి దాన్ని తలకు రాసి గంటయ్యాక తల స్నానం చేస్తే ఫలితం ఉంటుంది. ఆలివ్ నూనె ను మరగ కాచి రాత్రి పూట తలంతా మర్దన చేసి ఏదైనా వస్త్రాన్ని చుట్టాలి. ఇలా మూడు రోజులకోసారి చేస్తుంటే చుండ్రు, దురద వంటి సమస్యలు తగ్గిపోతాయి.

తులసి చేసే మేలు..

పది బాదం పలుకులను నానబెట్టి మర్నాడు మెత్తగా చేసి పావు కప్పు నిమ్మ రసం కలిపి తలకు పూతలా వేసుకుని, గంటయ్యాక చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది. గుప్పెడు చొప్పున తులసి, వేప ఆకులు తీసుకుని మెత్తని ముద్ద చేసి మాడుకు రాసి రెండు గంటలయ్యాక తల స్నానం చేయాలి. ఇలా పది రోజులకోసారి చేస్తుంటే క్రమంగా సమస్య పరిష్కారమవుతుంది.

ముఖం పై నల్లని చారలు - ఆయుర్వేద పరిష్కారాలు

 అద్దం మన ముఖమునే కాదు ,దానిపై వస్తున్న నల్లని చారలు, కంటి కింద నల్లని మెరుపు, బుగ్గపై చిన్న చిన్న పొక్కులు...  రంగు బారిన చెక్కిళ్ళు.. వీటన్నింటినీ చూపిస్తుంది .ఇవి మీరు అనుకుంటున్నట్లు చర్మవ్యాధులే కానక్కరలేదు,  కౌమార దశలో ఉన్న పిల్లలలో హార్మోన్ల హెచ్చుతగ్గులను, నడి వయస్సులో, మధ్యలో మానసిక అశాంతిని ,కొంతమందిలో రక్త దోషాన్ని సూచిస్తుంది. 

ప్రకాశవంతమైన ముఖ చర్మం ఆనందానికి దర్పణం వంటిది. ఇది మనం ఎక్కువగా పట్టించుకోము కానీ పట్టణాలలో, నగరాలలో నాడు, నేడు ఇలాంటి మచ్చలు రంగు మారడం, నలుపు చాయ రావడం లాంటివి రాకుండాను ,వచ్చినవి పోయి ముఖ చర్మం అందంగా , ఆకర్షణీయంగా ఉండాలని ఉంచుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. 

నైలునది నాగరికతలోనూ, పురాణకాల సంస్కృతిలోనూ, ఇతిహాస కాలంలో కూడా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రత్యేక చికిత్సలు, చికిత్స చేసే సుందరిమణులు ఆ కాలంలో ఉండేవారు. ఈనాటి రసాయనాలు ఉపయోగించే బ్యూటీ పార్లర్ల కన్నా సహజ సౌందర్య సాధనాలతో చేసే నిలయాలు అప్పుడు కూడా ఉండేది.

ఆధునీకులు తెల్లని చారికలు ఏర్పడటం, చర్మపు రంగు మారి మచ్చలు ఏర్పడటాన్ని బ్లిమిషెస్ అంటారు. ఈ బ్లిమిషెస్ లో పైన చెప్పినవే కాకుండా తెల్లని గట్టి మొటిమల లాంటివి, నల్లని, లేత ఎరుపు తో కూడిన పొక్కులు లాంటివి ఏర్పడటమూ ఉంటుంది. 

క్రీములు కొనేటప్పుడు..

ఇందులో కొన్ని తెల్లని చారికలు లాంటివి ఏర్పడడం. దీనికి పుట్టుకతో వచ్చిన దోషం కారణం కావచ్చు .మరికొందరిలో మొటిమలు ,ఉబ్బిన చిన్న చిన్న పొక్కులు ఏర్పడతాయి. వీటికి కారణం కొంత హార్మోన్ల హెచ్చుతగ్గులు అయితే ఎక్కువ భాగం వారు వాడే రకరకాల క్రీములు, పౌడర్లు నూనెలు వంటివి. చర్మానికి ఇవి పడకపోతే ఇలాంటివి వస్తాయి .రాత్రులు చర్మానికి రాసుకునే క్రీములు ఇలాంటివి కలుగ చేస్తుంటాయి. 

ఇలా చర్మానికి బిమిషస్ కలగజేసే క్రీములను ' comedo genics ' అంటారు. అందుచేత మీరు క్రీములను కొనేటప్పుడు వాటిపై 'non comedo genics' అని ఉందో లేదో చూసి కొనండి. వాతావరణంలో మార్పులు, ముఖ్యంగా కలుషితమైన గాలి, నీటిలో తేమ మీ చర్మ కాంతిని సౌకుమార్యాన్ని పాడు చేస్తాయి. ముఖంపై కురుపులు, చారికలు వంటివి, చర్మాన్ని ఉద్రేకపరిచే వెంట్రుకల రాపిడి, వాడే బట్టల రాపిడి ఎక్కువ చేస్తాయి. 

మానసిక ఒత్తిడి, హార్మోన్లలో హెచ్చుతగ్గులు వీటికి ముఖ్య కారణాలుగా గుర్తించబడింది. ముఖ్యంగా ఆండ్రోజన్ అనే హార్మోను దీనికి ముఖ్య కారణంగ భావించ బడుతుంది. ఎలాగంటే ఈ హార్మోన్ల చర్మాన్ని రాపిడి సెబమ్ అనే సహజ స్నిగ్ధ పదార్థాన్ని పెంచుతుంది. ఈ నూనె పదార్థం ఒకచోట ఎక్కువగా చేరడం వల్ల సూక్ష్మ జీవులు చేరి చర్మాన్ని పాడు చేసి ఈ చిన్న చిన్న కురుపుల లాంటి వాటిని తీసుకొస్తాయి. ముఖ్యంగా స్త్రీలు, ఎదుగుతున్న పదహారేళ్ళ వయసు వారి నుండి నడి వయసు ఉన్న 30 ఏళ్ల వయసు వారి వరకు ఈ హార్మోన్ల హెచ్చుతగ్గులకు ఆలవాలం అవుతున్నారు. 

అలాగే ఋతుచక్రం ఆగిపోతున్న వయస్సులో అంటే 45 ఏళ్ల వయసులో ఈ హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల చర్మ సౌందర్యం పాడవుతుంది. గర్భిణీ కాలంలోనూ, నెలసరి వచ్చే సమయంలోనూ ఎక్కువ అవుతాయి. యాంటీ ఆండ్రోజన్స్ వంటి మందులు , కార్టికో స్టిరాయిడ్స్ వంటి మందులు వాడినా వాటి ఫలితం తో పాటు కొంత అసౌకర్యం కూడా ఉంటుంది. అందుకే సహజమైన చిన్న చిన్న వాటితో ఈ స్థితిని మనం దూరం చేసుకోవచ్చు. 

ముఖానికి వెలుగునిచ్చేవి ఏమంటే..

 బెల్లం ,నువ్వులు కలిపిన నువ్వుల ఉండలు ఆడపిల్లలు తినడం మంచిది. అన్నం మొదటి ముద్దలో నువ్వుల పొడి రెండు చెంచాలు కలుపుకొని తినడం, తలంటు పోసుకునేటప్పుడు ముఖానికి పసుపు, పెసర పిండితో నలుగు పెట్టుకోవడం, నువ్వుల నూనెతో వారానికి ఒసారైనా ఒంటికి గట్టిగా రాసుకుని నలుగు పెట్టుకుని వేడి నీటితో తలస్నానం చేయడం హితకరం. ఇవి స్త్రీ పురుషులు ఇద్దరికీ ఉపకరిస్తాయి. 

మీరు ఒలుచుకొని పడేసే అరటిపండు తొక్క లోపలి భాగంలో అద్భుతమైన సౌందర్య సాధనము ఉంచాడు ఆ భగవంతుడు. దానితో కానీ బొప్పాయి పై తొక్కతో కానీ ముఖాన్ని రుద్దుకుంటే ఇలాంటి చారికలు తగ్గిపోతాయి. 

బంగాళాదుంపలు పై  పొరతో కూడిన దాన్ని ఒక గుడ్డలో ఉంచి నలగగొట్టి రసం తీయండి. ఆ రసంలో తొమ్మిది నిమ్మరసం చుక్కలు వేయండి. ఒక చెంచా తేనె వేసి కలియబెట్టండి. దాన్ని మీ ముఖం పైన రాయండి లేదా నల్లని చారికలు ఉన్నచోట కానీ ,మచ్చలు, మొటిమలు ఉన్నచోట కానీ రాయండి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. దీనిలో ఉన్న బ్లీచింగ్ ఏజెంట్స్ ముఖాన్ని చక్కగా చేస్తాయి. ముఖమంతా రాసుకుంటే మొటిమలు రావు. 

మీరు ఇంట్లో ఎప్పుడైనా నారింజ రసం కానీ, నిమ్మ రసం కానీ ,బత్తాయి రసం గానీ చేసుకుంటే పుల్లకు దూది చుట్టి ఆ రసంతో కొంచెం ముఖానికి రుద్దుకొని కాసేపయ్యాక గోరు వెచ్చని నీటితో కడిగేసుకోండి. మీ ముఖం ప్రకాశ వంతంగా అందంగా మెరిసి పోతుంది. 

మన ఇంట్లో ఉండే నిమ్మ కాయలు ముఖం మీద, చర్మం పై ఉండే ముడతలను, చారికలను తొలగించే అద్భుతమైన మందు. దాన్ని అలాగే రాసుకోవచ్చు. లేదా పసుపు, గంధపు పొడి కలిపి రాసుకోవచ్చు. 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం ప్రకాశ వంతంగా మెరిసి పోతుంది. 

పాత నిమ్మకాయ పచ్చడి తినడం,టొమోటో, పాల మీద మీగడ, పెరుగు పై తరకలు అందాన్ని అందించే అపురూప వరాలు. నాలుగు చెంచాల టమోటా రసం, 4 చెంచాల నిమ్మ రసం కలిపి దూదితో రోజూ ముఖం పైన రుద్దుకుని అరగంట తర్వాత కడుక్కోండి. దీన్ని ఎక్కువగా చేసుకుని ఫ్రిజ్ లో భద్ర పరిచి రోజూ రాసుకోవచ్చు. ఇది సహజ సౌందర్య సాధనం. 

నిమ్మ కాయ రసం తీసిన తొక్కలపై కొంచెం పంచదార అద్ది ముఖానికి ప్రతి రోజూ రుద్దుకుని 10 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. ముఖం పై మొటిమలు తగ్గిపోతాయి. మంచి గంధం పొడి, రోజ్ వాటర్ తో కలిపి ముద్దగా చేసి దాన్ని ముఖానికి రాసుకోండి. ఇలా చేస్తే కళ్ళ కింద నల్లని చారలు పోయి చక్కగా ఉంటారు. 

బాదం పలుకులు ఒక రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తేనె, నిమ్మ రసం కలిపి ముద్దగా చేసి చర్మం పై రాయండి. పావు గంట తర్వాత కడిగేసుకోండి. మీ ముఖం మృదువుగా , కాంతి వంతంగా ఉంటుంది. 

గనేరియా ,కడుపులో బల్ల సమస్యలు - డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 1. సెగ రోగ / గనేరియా సమస్య - ఆయుర్వేద పరిష్కారం 

ముందే సెగ రోగం ఉన్న పురుషునితో స్త్రీలు కలవడం కానీ , అదే రోగం ఉన్న స్త్రీతో పురుషుడు కలవడం వల్ల కానీ ఈ రోగం అంటుకుని వారి శరీరంలో జీర్ణించుకు పోయి వదలకుండా దీర్ఘ కాల వ్యాధి లాగా పట్టి పీడిస్తుంది. దీనిని అశ్రద్ధ చేస్తే ఈ వ్యాధి ఉన్నవారికి పుట్టే బిడ్డలకు కూడా ఈ వ్యాధి సంక్రమించి వారి జీవితాన్ని కూడా నరక ప్రాయం చేస్తుంది. 

దీనికి ఈ వర్షా కాలంలో ప్రతి చోట లభ్యమయ్యే దూసరి చెట్టు / సిబ్బి తీగ ఆకులు దివ్యమైన ఔషధంగా పని చేస్తాయి. చెట్టును పూజించి , రోజూ ఉదయం పూట దాని ఆకులు తెచ్చి దంచి తీసిన రసం 20 గ్రాములు మోతాదుగా ఒక చెంచా పటిక బెల్లం పొడి కలిపి పరగడుపున తాగుతుంటే మూడు, నాలుగు వారాల్లో ఎంత దీర్ఘ కాలం నుంచి బాధిస్తున్న సెగ రోగమైనా తగ్గిపోతుంది. 


2. ) కడుపులో బల్ల రోగం - ఆయుర్వేద పరిష్కారం 

ఉన్న ఊరు కన్న తల్లి అని మన పెద్దలు చెప్పిన మాట ఈ నాడు మనం మరచిపోవడం వల్ల ఇలాంటి సమస్యలు పరిష్కారం కావడం లేదు. కడుపులో బల్ల సమస్యకు దేశవాళీ ఆవు ఉదయం పూట పోసే మూత్రం మొదటి మరియు చివరి మూత్రాన్ని విడిచిపెట్టి మధ్యలో మూత్రాన్ని ఒక గ్లాసులో పట్టుకొని ఏడు సార్లు బట్టలో వడపోసి అందులో చిటికెడు ఉప్పు కలిపి రోజూ ఉదయం పూట పరగడుపున సేవించాలి. ఇలా వరుసగా రెండు లేదా మూడు వారాల పాటు తాగుతుంటే తిరిగి కాలేయ ప్లీహాలు బాగా పని చేసి బల్ల హరించి పోయి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది. సులభంగా జీర్ణం అయ్యే ఆహారం మాత్రమే సేవించాలి. 

పిల్లల కడుపులో క్రిముల సమస్య, బుడ్డ సమస్య - డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

  1. ) పిల్లలకు కడుపులో క్రిముల సమస్య - ఆయుర్వేద పరిష్కారం 

పిల్లలకు చాక్లెట్లు, బజారు తిండ్లు అలవాటు చేయడం వల్ల, అకాల భోజనం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీని పరిష్కారం కోసం దేవదారు చెక్క, మునగ చెక్క , కరక్కాయ బెరడు, తానికాయ బెరడు, ఉసిరి కాయ బెరడు,పిప్పళ్లు, వాయు విడంగాలు సమాన భాగాలుగా తీసుకుని దంచి పొడి చేసుకుని, అన్నీ కలిపి నిలువ చేసుకోవాలి. రోజూ అరగ్లాసు నీటిలో అరచెంచా పొడి వేసి, పావు గ్లాసు కషాయానికి మరిగించి వడపోసి రెండు పూటలా పూటకు ఒక చెంచా కషాయాన్ని ఆహారానికి  ముందుగా తాగిస్తుంటే కడుపులోని పురుగులన్నీ మలం ద్వారా పూర్తిగా బయటకు పడి పోయి , పిల్లలకు చక్కటి ఆరోగ్యం కలుగుతుంది . 

2.) బుడ్డ దిగిన సమస్య - ఆయుర్వేద పరిష్కారం 

 A .) ఇంతకు ముందు చెప్పినట్లుగా దేశవాళీ ఆవు మూత్రం ఏడు సార్లు వడపోసి రోజూ పరగడుపున ఒక కప్పు మోతాదుగా తీసుకుని అందులో పావు టీ స్పూన్ మాను పసుపు పొడి కలిపి తాగించాలి. 

B.) కరక్కాయ పొడి, శొంఠి పొడి, గసగసాల పొడి , తెగడ పొడి ఒక్కొక్కటి 50 గ్రాములు చొప్పున తీసుకుని కలిపి ఆ మొత్తాన్ని స్వచ్ఛమైన వంటాముదంతో నూరి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. ఈ లేహ్యాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు 5 గ్రాములు మోతాదుగా తినాలి. 

C.) కానుగ గింజల పప్పు, ఆముదపు గింజల పప్పు గచ్చ కాయలలోని పప్పు సమాన భాగాలుగా తీసుకుని వంటాముదంతో నూరి నిలువ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ లేపనాన్ని వాచిన వృషణం పైన పట్టు లాగా వేసి పైన దూది అంటించి అది ఊడిపోకుండా గోచి పెట్టుకుని పడుకోవాలి. 

ఇలా ఆచరిస్తూ, వాతం చేసే పదార్థాలు,మాంసాహారం తినడం మానివేస్తే అతి త్వరగా సమస్య ఆపరేషన్ తో పని లేకుండా పరిష్కారమవుతుంది. 

4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

రక్త స్రావం ఆగకపోవడం, భగంధరం - డా. ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు.

 1.) రక్త స్రావం ఆగని సమస్య - డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారం. 

అడ్డసరం మొక్కను సంపాదించుకోవాలి. దాని కొమ్మ దొరికినా, తెచ్చి నాటితే మొక్కగా బతుకుతుంది. దాని ఆకులు తీసుకుని నీళ్ళు కలపకుండా దంచి ఆ ముద్దను బట్టలో వేసి పిండితే వచ్చే రసాన్ని గిన్నెలో పోసి చిన్న మంట పైన రసం విరిగే వరకు మరిగించాలి. తర్వాత వడపోసి, ఆ విరిగిన అడ్డసరం నీటిని 50 గ్రాముల మోతాదుగా తాగాలి. తాగిన మరుక్షణమే శరీరంలో ఏ భాగం నుండి కారే రక్తమైనా తప్పకుండా ఆగుతుంది. 

2.) భగంధరం సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు.. 

ఆవు నెయ్యి 20 గ్రాములు తీసుకుని ఇనుప కళాయి పాత్రలో వేసి పొయ్యి మీద పెట్టి, అది మరిగేటప్పుడు అతి మెత్తని తెల్ల గుగ్గిలం పొడి 10 గ్రాములు వేసి కలిపి వెంటనే పాత్రను కిందికి దింపి ఆ పదార్థాన్ని ఒక కంచు గిన్నెలో కానీ లేక పళ్ళెంలో కానీ పోయాలి. తర్వాత ఆ పదార్థంలో నీళ్ళు పోసి ఆ మిశ్రమాన్ని కడిగి నీటిని వంచి వేయాలి. మరలా నీళ్ళు పోసి మరలా కడిగి నీటిని తీసివేయాలి. ఇలా ఓపికతో ఆ పదార్థాన్ని వంద సార్లు కడిగితే అద్భుతమైన ఔషధం తయారవుతుంది. 

దాన్ని ఒక గాజు సీసాలో నిలువ చేసుకొని రోజూ రాత్రి పడుకునే ముందు తగినంత పదార్థాన్ని దూదికి రాసి ఒత్తిలాగా తీసుకోవడం చేసి ఆ వత్తిని భగంధర రంధ్రంలో లోపలి దాకా పెట్టి పైన దూది అంటించి కదలకుండా ప్లాస్టర్ అంటించాలి. ఇలా రోజూ ఒక సారి ఒక ఒత్తిని నలభై రోజుల పాటు భగంధరంలో ఎక్కిస్తూ ఉంటే ఆ వ్యాధి సమూలంగా నిర్మూలనము అవుతుంది. 

రేచీకటి, వాత రోగపు నొప్పుల సమస్య - డా. ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 1.) రేచీకటి సమస్య - ఆయుర్వేద పరిష్కారం

తెల్ల మిరియాలు 20 గ్రాములు తెచ్చుకుని వాటిని చింతాకు రసంతో మెత్తగా గుజ్జులా నూరి శనగ గింజంత గోళీలు చేసి నీడకు ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత నిలువ చేసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక మాత్రను సాన రాయిపై కొంచెం నీళ్ళు చల్లి గంధం తీయండి. ఈ గంధాన్ని నిద్రించే ముందు పెసర బద్దంత మోతాదుగా కంటి కొసలలో పెట్టుకుంటూ ఉంటే రేచీకటి హరించిపోయి కళ్ళకు మంచి దృష్టి కలుగుతుంది. 

2.) ఊరంతా వాత రోగపు నొప్పుల సమస్యలు.. ఆయుర్వేద పరిష్కారాలు..

ఒక ఆదివారం నాడు వావిలి చెట్టు కు పూజ చేసి అడుగున తవ్వి ఆ వేళ్ళ మీద ఉండే వేరు బెరడును కొడవలితో గీకి తీసుకోవాలి. గీకిన చోట వేరుకు హాని కలుగకుండా ఆవు పేడ పూసి పూర్తిగా మట్టి కప్పి నీరు పోసి చెట్టుకు నమస్కరించి రావాలి. అలా తెచ్చిన వావిలి వేరును కడిగి ఆరబెట్టి దంచి పొడి చేసుకోవాలి. అలాగే దానితో పాటు శొంఠి, పిప్పళ్లు, మిరియాలు , పిప్పలి కట్టె వీటిని కూడా కొంచెం దోరగా వేయించి దంచి పొడి చేసుకోవాలి. అన్ని పదార్థాలను సమ భాగాలుగా కలిపి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని పూటకు అర చెంచా మోతాదుగా ఒక చెంచా తేనె తో కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు గానీ, గంట తర్వాత కానీ సేవించాలి. దీని వల్ల ఎంతో కాలం నుంచి మంచాన పడ్డ పక్షవాత రోగులు , కీళ్ల వాత రోగులు, అలాగే మిగిలిన దీర్ఘ కాలం వాత వ్యాధులతో బాధ పడే వారంతా పూర్తి స్వస్థతను పొందగలుగుతారు. 

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...