25, సెప్టెంబర్ 2021, శనివారం

ఆనంద ఆహారం ఇదీ..

 మానవ ప్రయాణ  జీవిత అంతిమ లక్ష్యం ఆనందమే. చేసే పనులను బట్టి కాదు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా  ఆనందం లభిస్తుందని పోషకాహార నిపుణుల మాట. డోపమైన్ సమృద్ధంగా ఉన్న ఆహారంలో ఆనంద రసం పరిపూర్ణంగా లభిస్తుందని అధ్యయనాలు నిరూపించాయి.

డోపమైన్ ఒక న్యూరో ట్రాన్స్మిటర్. దీనినే ఆనంద హార్మోన్ అని అంటారు. డోపమైన్ తో కూడిన ఆహారం శరీరపు బరువును తగ్గించడంలోనూ సహాయ పడుతుంది. పాలు పెరుగు యోగర్ట్ లాంటి పాల ఉత్పత్తులు, శరీరానికి మంచి బాక్టీరియాను అందించే ప్రొబయోటిక్స్ .. ఇవి మన మూడ్ ను ఆహ్లాదపరిచే డోపమైనును చైతన్య పరుస్తాయి. గుడ్లు, అరటి పండ్లు కూడా డోపమైన్ గనులే .వీటిలో ప్రోటీన్లు ఎక్కువ, ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్న ఆహారం అంటేనే అమైనో ఆమ్లాల  ఖజానా అని అర్థం. అమైనో ఆమ్లాల నుండే డోపమైన్ ఉత్పత్తి అవుతుంది.

మిఠాయిలు అంటే నోరూరే వాళ్ళు , డార్క్ చాక్లట్స్ తింటే సరి. వాటిలోని ట్రైకోసిన్ అనే అమైనో ఆమ్లం నుండి డోపమైన్ ఉత్పత్తి అవుతుంది.పైగా మూడ్ ను నియంత్రించే సెరటోనిన్ ,ఎండార్ఫిన్ హార్మోన్ లు కూడా డార్క్ చాక్లెట్ లో ఉంటాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్ తో పోలిస్తే , పిండి పదార్థాలను/హోల్ గ్రెయిన్ ఆహారంగా తీసుకునే వారిలో కుంగుబాటు లక్షణాలు తక్కువగా కనిపించాయని అధ్యయనాలు పేర్కొన్నాయి. పొట్టు తీయని గింజలు , కూర గాయలు, పప్పు ధాన్యాలు, తాజా పండ్లు,బీన్స్,మొలకలు ఆహార పళ్ళెంలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఆనందం మన సొంతం అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.



14, జులై 2021, బుధవారం

పుండు మచ్చలకు తేనె

 గాయాలు , డోకుడు పుళ్ళు,కాలిన పుళ్ళు ఇలాంటివి ఉన్నప్పుడు పుండు మాడిన తర్వాత రోజూ ఆ ప్రాంతం మీద తేనె రాయండి.చర్మం మీద పొరలు త్వరగా వచ్చి చర్మం రంగులో మచ్చలు కలిసిపోతాయి.లేకపోతే తెల్ల మచ్చలు మచలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది.

పేగు పూత - చేమంతి పూల మందు.

 గ్యాస్ ట్రబుల్ ,కడుపులో మంట, కడుపులో నొప్పి ఇలా ప్రారంభమై నెమ్మదిగా పేగు పూత వ్యాధిగా పరిణమించే పెప్టిక్ అల్సర్ జబ్బుకు విమోచనం లేదు .ఎందుకంటే మనం ఈ వ్యాధిని అనునిత్యం ఏదో ఒక విధంగా పెంచి పోషిస్తూ నే ఉంటాం కాబట్టి.  కడుపు మండ ని వారు ,కడుపులో మంట లేనివారు ఈ లోకంలో ఎవరు ఉంటారు చెప్పండి.  అల్సర్ వ్యాధి కి ఇదే కదా కారణం - కడుపుమంట!


చేమంతి పూలను ఎండించి చూర్ణం చేసి మంచి తేనెతో తీసుకుంటే  పేగులకు బలం !అన్నం తినగానే కడుపునొ ప్పి వస్తున్న వారు ,నొప్పి వచ్చినప్పుడు ఏదైనా ఆహారం తీసుకుంటే తగ్గిపోతున్న వారు ఇద్దరికీ ఇది మంచి మందు.కడుపులో పాములు కూడా దీంతో చచ్చి పడిపోతాయి.

తలలో పేలు పోవడానికి సీతాఫలం గింజలు

 సీతాఫలం గింజలను సేకరించుకుని శుభ్రంగా  కడిగి ఎండించి మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరుచుకోండిి. వీలైతే వీలైతే సీతాఫలం సీతాఫలం లేత ఆకులను కూడా ఎండించి దంచి ,ఈ రెండింటి మిశ్రమాన్ని ఒక చెంచా మోతాదులో తీసుకుని ,కాసింత నీరు పోసి తడిపి తలకి పట్టించండి.ఒక అరగంట తర్వాత తలంటు పోసుకొండి.తలలో పేలు పోతాయి.తలలో పుళ్ళు తగ్గు తాయి.శరీరం మీద పుళ్లకు కూడా ఈ పొడిని రాయవచ్చు.

శ్రావ్యమైన స్వరం కోసం - మామిడి చిగురు

 మావి చిగురు తినగానే కోయిల కూసేనా అని పాట ఉంది, మామిడి చిగురు తిన్నంత మాత్రాన కోయిల కూస్తుందా? కోయిలే కాదు మామిడి చెట్టు లేత చిగుళ్ళు తింటే మనం కూడా శ్రావ్యంగా పాడగలుగుతాం.గొంతు శుద్ధి అవుతుంది.

ఈ లేత చిగుళ్ళు మెత్తగా దంచి ,నీళ్లలో కలిపి బాగా మరిగించి ,చిక్కటి కషాయం తీసి వడగట్టి పంచదార కలుపుకొని తాగితే మంచిది.

ఈ కషాయాన్ని పంచదార వేయకుండా ,నోట్లో పోసుకుని పుక్కిలిస్తే గొంతు,నోరు వ్యాధులన్నీ తగ్గి ,గొంతు శుద్ధి అవుతుంది.

మానసిక వ్యాధులకు గులాబీల మందు

 గులాబీ పువ్వులు  మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి .ఆ పువ్వులను వాసన చూస్తేనే ఒక విధమైన ప్రశాంతత కలుగుతుంది. అందుకే ప్రశాంతత ,మానసిక శాంతి కావాలనుకునే వారికి గులాబీ పూలను ఔషధంగా సేవించడం మంచి మందు .

గులాబీ పువ్వులు ఎండించి మెత్తగా దంచి పంచదార కలుపుకుని రోజూ ఉదయం సాయంత్రం 1-2 చెంచాలు తినండి.

విరేచనం సాఫీగా అయ్యేలా చేసే గుణం కూడా ఉంది. కాబట్టి ఎంత మోతాదులో తీసుకుంటే ఒక్క విరేచనంంసాఫీ గా అవుతుందో అంత మోతాదులో ఈ గులాబీ రేకుల పొడిని తీసుకోండి.మానసిక వ్యాధులు అలజడులు మనోవికారాలున్నవారికి ఇది క్విక్ రెమెడీ గా పనిచేస్తుంది.బీపీ వ్యాధి ఉన్నవారికి కూడా ఇది అద్భుతమైన మందు.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...