18, డిసెంబర్ 2012, మంగళవారం

కలబంద / ALOEVERA - ఆయుర్వేదం / AYURVEDAM


SURGERY TO SPINAL CHORD - YASHODA HOSPITAL


శిరో ధార .. మనశ్శాంతి కి చక్కటి చికిత్స

నేటి యాంత్రిక జీవనంలో అన్ని వయసుల వారు ఏదోరకంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి లోనవుతున్నారు. దానివల్ల జీవితం పై ఒక రకమైన నిర్లిప్తత, జీవనంలో ఒక రకమైన అశాంతి. ఇది ఎక్కువైనప్పుడు విపరీతమైన నిర్ణయాలు. వీటికి తోడు మద్యపానం లాంటి ఏవేవో దురలవాట్లు. ఈ మనసుకి నిద్ర మాత్రలో, మత్తుమందులో కాదు కావాల్సింది.. విశ్రాంతి , నవోన్మేషం కావాలి. అది మన ఆర్య సంస్కృతి చూపించింది. అదే శిరో ధార. మానసిక ప్రశాంతతకు అద్భుత చికిత్స. శిరో అంటే మనస్సుకి కేంద్రమైన తల లేదా మెదడు.' ధార ' అంటే ఆగని ప్రవాహం.
మందులతో కలిసి చేసే ఈ శిరోధారకు శారీరక, మానసిక ప్రశాంతిని,
 సమస్థితిని తీసుకురావడం ..తద్వారా మన ఉద్రేకాలను, నిస్పృహాలను నియంత్రించి ,సమాధాన పరచడం, దానివల్ల మన నిత్య జీవనానికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడం దాని ప్రయోజనం.
ఒక క్రమ పద్ధతిలో, కొన్ని సహజ మూలికలతో చేసిన తైలాలు, నెయ్యి ,మజ్జిగ, పాలు వంటి వాటిని శిరస్సులో ఒక ప్రత్యేక బిందువు పై, సున్నితంగా జారే జలపాతం లాంటి ధారతో చేసే చికిత్స శిరోధార. అదీ ఒక ప్రత్యేక సమయంలో కొంత సేపు మాత్రమే.

చికిత్స విధానం ..

గోరువెచ్చని ఆ తైలం ధారగా పడుతున్నప్పుడు, ఆ ఎముకల లోని చిన్నచిన్న రంధ్రాల ద్వారా లోపలికి వెళ్లి మెదడును శాంత పరుస్తుంది. శిరోధార మన ఉద్రేకాలను, ఒత్తిడిలను తగ్గించి శాంతి ని, కొంత ప్రశాంతి ని ,మరికొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా ఎక్కువ సంపాదించాలని, ఇంకా ఎక్కువ ఆనందాన్ని, సుఖాన్ని పొందాలని ఆత్రుతతో యువత ,నడివయసు వాళ్ళు తొందరగా శారీరక సామర్థ్యాన్ని, మానసిక సంతోషాన్ని, సంతృప్తిని కోల్పోతున్నారు . పూర్వీకుల్లోని శుక్ర బీజ సామర్థ్యం నేటి తరంలో క్రమంగా తగ్గిపోతుందని సూచించబడింది. దానికి కారణం కూడా ఇదే. 
మన మనసు తనకి మించిన ఒత్తిడికి లోనైతే, అది నరాల బలహీనతకు దారి తీసి, శారీరకంగానూ ,మానసికంగానూ నిర్వీరుడు అవుతున్నాడు. దానివల్ల షుగర్ వ్యాధి , థైరాయిడ్, రక్తపోటు ,లావు ఎక్కడము ,నడుము నొప్పి, సంభోగించే సామర్థ్యం తగ్గడం, తొందరగా వాపు రావడం, ముఖ్యంగా స్త్రీలలో అసంతృప్తి తో కూడిన నిర్లిప్తత వంటివి వస్తున్నాయి. ఆధునిక శాస్త్ర ప్రకారం నిద్రమాత్రలు, మత్తునిచ్చే మందులు తప్ప మరో మార్గం లేదు. నాటి ఆయుర్వేదం శారీరక, మానసిక ,ఆత్మజ ఆహ్లాద స్థితికి మనిషిని తేవడానికి చక్కటి మార్గాలను ప్రతిపాదించింది.

సహజమైన మూలికలే కాదు మనం చూసే నువ్వుల నూనె లాంటి వాటిలో కూడా మనసు ను క్లేద పరిచే ఓషద గుణాలు ఉన్నాయి .మనుషుల జీవ గడియారాల కీలు తిప్పడమే కాదు,
 జీవాన్ని నిలిపే ఓషధ సంపదను కూడా ప్రకృతిలో నిక్షిప్తం చేశాడు ఆయన.

రాత్రి పరుండే ముందు పటిక బెల్లం కలిపిన పాలు తాగి, అరికాళ్ళకు నువ్వుల నూనెతో మర్దన చేసుకుని పడుకుంటే మనసు తేలికపడి చక్కగా నిద్ర పడుతుంది .తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఆయుర్వేదం అందించిన మరో చక్కటి వైద్య ప్రక్రియ శిరో ధార.ఈ శిరోధార మనో ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధులు అన్నింటికి చక్కటి చికిత్స.
అందుకే పక్ష వాతం,ఎప్పటికీ తగ్గని రక్తపోటు, ముఖ పక్ష వాతం, కంటి నొప్పి, చూపు తగ్గడం, నిద్ర లేకపోవడం, శిరో వాతం, తరచూ వచ్చే తలనొప్పి, వీటి అన్నింటికి శిరో ధార చికిత్స సూచించ బడింది. అలాగే అతి నీరసంగా ఉన్న వాళ్ళకి , బీపీ తక్కువ ఉన్నవారికి , గర్భిణీ కాలంలోనూ, మెడ వ్యాధులలోనూ ,తలలో గడ్డలు/ బ్రెయిన్ ట్యూమర్, తాగుడు అలవాటు బాగా ఎక్కువగా ఉన్నవారు ఈ శిరో ధార చేయించుకోకూడదు.
శిరో ధార చేయించుకోవడం మనో ఒత్తిడి ఉన్న సామాన్యులు నెలకు ఒక సారి , దాని వల్ల వచ్చే వ్యాధులున్నవారు మిగతా చికిత్సలతో పాటు 9,11,21 రోజులు శిరో ధార చేయించుకోవాలి అదీ శాస్త్ర బద్ధంగా.

శిరో ధార పూర్వ కర్మ.. అంటే వ్యక్తిని ఈ చికిత్స కోసం తయారు చేయడం. ప్రధాన కర్మ అంటే ఒక వేగంతో, ఒకే ధార తో తగిన మందులతో కలిపిన తైలమో , మజ్జిగో నియమితమైన నుదుటికి , శిరస్సుకి మధ్య బిందువులో చికిత్స చేయడం.
పాశ్చాత్ కర్మ అంటే శిరో ధార తర్వాత వ్యక్తి సామాన్య స్థితికి వచ్చేటట్లు చేయడం తో కలిపి మూడు భాగాలుగా ఉంటుంది. దీనికి పథ్యం, అపథ్యం కూడా ఉంటాయి. అంటే ఆ కాలంలో ఫాస్ట్ ఫుడ్ వంటివి తిన కూడదు. చల్లటి మంచులోనూ, ఎర్రటి ఎండ లోనూ తిరగ కూడదు. ఆ చికిత్స జరిగిన రోజులో సంభోగం చేయ కూడదు.ఇలాంటివి ఆచరించాలి.. మరి దీని ప్రయోజనాలు ఏమిటి అంటే..

క్రమ పద్ధతిలో చేసుకునే శిరో ధార వల్ల రక్త ప్రసరణ చక్కగా జరిగి మేధో శక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. జుట్టు ఊడటం తగ్గి చక్కగా పెరుగుతుంది. మంచి నిద్ర పట్టి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శిరో ధార మానసిక ఒత్తిడిని తగ్గించి ,మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది.

తలకి, కళ్ళకి,చెవులకి,ముక్కుకి, మెడకి సంబంధించిన అన్ని రుగ్మతలకు చక్కటి సమాధానం ఇస్తుంది ఈ శిరో ధార. చాలా కాలం నుంచి ఉన్న ఈ నిద్రలేమికి , వణుకుడు వ్యాధికి , ఫిట్స్ వచ్చే వాళ్లకు ఇది చక్కగా ఉపకరిస్తుంది. చక్కటి స్వరం, మంచి వాక్కు కావాలనుకునే వారికి చక్కగా ఉపకరిస్తుంది.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...