26, డిసెంబర్ 2018, బుధవారం

సైనసైటిస్ కి నస్య ఔషధం - లవణ ద్రావణ చికిత్స


ఇది సైనసైటిస్,ఎలర్జీలు,ముక్కు కారటం,జలుబు,ఫ్లూ సమస్యలు ఉన్నవారికి అనువైనది.చెవుల సమస్యలు కలిగినవారికి మంచిది కాదు.

సైనస్ లు విడుదల చేసే స్రావాలు ముక్కులోపలకు స్రవించడానికి అడ్డు ఏర్పడడంతో బ్యాక్టీరియా దాడి చేసి సైనసైటిస్ ఇంఫెక్షన్ ను కలిగిస్తాయి.ఇలా సైనస్ లు మూసుకుపోతాయి.
దీనికి లవణ ద్రావణ చికిత్స బాగా ఉపయోగపడుతుంది.ద్రావణం సాంద్రత ఎక్కువ కనుక మ్యూకస్ పొరల్లోని అదనపు ద్రవాంశాన్ని వెలుపలకు లాగేస్తుంది.దీనితోపాటు లోపల స్నిగ్ధత్వం పెరగటమే కాకుండా,శోధ వంటివి తగ్గుతాయి.

లవణ ద్రావణ తయారీ విధానం-

1-2 కప్పుల గోరు వెచ్చటి నీళ్లు తీసుకొని 1/4 నుండి 1/2 టీ స్పూన్ ఉప్పు పలుకులను ( అయోడిన్ కలపని సముద్రపు ఉప్పు ),చిటికెడు వంటసోడా లను కలపాలి.

వాష్బేసిన్ వద్దకు వెళ్లి 45 డిగ్రీల కోణంలో వంగి నిలబడాలి.తలను ఒక పక్కకు వంచాలి.లవణ ద్రావణాన్ని నాసిక లోపలకు పోయలి.
నాజిల్ ను ముక్కు రంధ్రం లోపలకు ఒక అంగులం లోపలకు మాత్రమే చొప్పించాలి.ఈ సమయంలో నోటితో గాలి పీలుస్తుండాలి.ఉప్పునీళ్లు ముక్కు అంతర్భాగం నుండి ,నోటి నుంచి ధారగా కారతాయి.ఈ నీళ్లను మింగకపోవడం మంచిది. రెండవ నాసికతో కూడా ఇదే విధంగా రిపేట్ చేయాలి.ముక్కును శుభ్రం చేసుకొని రెండవ నాసికతో ఇదే క్రమాన్ని తిరిగి చేయాలి.తరువాత మిగిలిన ద్రవాన్ని పారబోసి,సామాగ్రిని ఆరబెట్టి జాగ్రత్త చేసుకోవాలి.

మండుతున్నా,నొప్పిగా అంపిస్తున్నా ఉప్పు మోతాదును తగ్గించండి,తలను వెనక్కి వంచవద్దు.నోరు తెరచి ఉంచి కేవలం నోటితో మాత్రమే శ్వాస తీసుకోండి.
ఒకటి రెండు సార్లు చేసిన వెంటనే మీకు ఫలితాలు కనిపిస్తాయి.చికిత్సను కొనసాగిస్తున్న కొద్దీ ఫలితాలు మరింత సమర్థవంతంగా ఉంటాయి.
ఈ చికిత్సను రోజుకు ఒకసారి చొప్పున తీసుకుంటే సరిపోతుంది.లక్షణాలన్నీ పూర్తిగా సమసిపోయిన తర్వాత వారానికి మూడుసార్ల చొప్పున తీసుకుంటూ ఉంటే లక్షణాలు తిరగబెట్టకుండా ఉంటాయి.

పండంటి ఆరోగ్యానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 5 సూత్రాలు.

పంచ ప్రాణాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన 5 సూత్రాలు.

పండంటి ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యం ఖచ్చితంగా సూత్రాలు పాటించాలని తాజాగా పిలుపిచ్చింది.ఏ వయసు వారైనా ,ఆహారపరంగా ఈ సూత్రాలను పాటిస్తే జబ్బుల బారిన పడకుండా జీవించటానికి అవకాశం ఉంటుందని తెలిపింది.

1. రక రకాల ఆహార పదార్థాలను తినడం.

2. ఉప్పు తగ్గించడం.

3. కొవ్వులు,నూనెలు తగ్గించడం.

4. తీపి కూడా తగ్గించడం.

5. మద్యం మానుకోవడం / మద్యానికి సురక్షిత స్థాయి లేదు .

22, డిసెంబర్ 2018, శనివారం

పెంపుడు జంతువులతో వచ్చే జబ్బులు - ఆయుర్వేద చికిత్స


ఈ రోజులలో ప్రతి ఇంట్లోనూ పెంపుడు జంతువులు ఉండడం సర్వసాధారణం అయిపోయింది.ఐతే వీటితో ఎక్కువగా గడపడం వల్ల కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.వీటి వల్ల నోరు,కడుపు,పేగులు మండుట వంటివి వచ్చే అవకాశన్మ్ కలదు.అలాంటప్పుడు ఈ కింది చికిత్సలు ఎంతో ఉపయోగపడతాయి.

1. ఒక కప్పు నీటిలో రెండు చెంచాల తేనెను కలిపి తాగుతుండాలి.

2. 10 చుక్కల వెల్లుల్లి రసమును నీటిలో కలిపి తాగుతూఉండాలి.రోజుకు 2 సార్లు వ్యాధి తగ్గేవరకు తాగాలి.

3. శీతాంశురసము,పైత్యాంతక రసములను కలిపి వాడాలి.

ఎముకలు మెత్తబడుట - ఆయుర్వేద చికిత్స


మనం తినే ఆహారంలో ఫాస్ఫరస్,సున్నము,డి విటమిన్ లోపించినపుడు ఎముకలు మెత్తబడడం జరుగుతుంది.స్త్రీలలో డెలివరీ అయిన తర్వాత ఈ వ్యాధి ఎక్కువగా రావచ్చు.కింది చికిత్సలు రోగాన్ని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడగలవు.

1. క్షీర బలా తైలము,సువర్ణము,అమ్ర్తప్రాశ ఘృతము కలిపిన చ్యవన ప్రాశ వాడవచ్చు.

2. ఆక్రోట్ చెట్టు ఆకుల కషాయమును ఉదయం , సాయంత్రం ఒక కప్పు చొప్పున తీసుకోవాలి.

3. రోజూ పాలను తాగాలి.

4. ప్రతి రోజూ తాంబూలం వేసుకోవాలి.

కండరముల క్షీణత - ఆయుర్వేద చికిత్స



కొన్ని వ్యాధులు బాగా ముదిరినప్పుడు ,ముదిరి తగ్గినపుడూ కండరములు క్షీణించి ,శరీరం ఎండిపోవడం జరుగుతుంది.దీని వల్ల ఎక్కువగా నీరసమూ,మూత్రం స్వాధీనం తప్పుట,శరీరం తూలిపోవుట,జరుగుతుంది.అలాంటప్పుడు ఈ కింది చికిత్సలు బాగా ఉపకరిస్తాయి.

1. చ్యవనప్రాశ,మకరధ్వజము,అశ్వగంధ లేహ్యము,వసంత కుసుమాకరము బాగా పని చేస్తాయి.

2. ఒక కప్పు నీటిలో 3 స్పూన్ ల తేనె ను,ఒక నిమ్మ కాయ రసమును కలుపుకొని ప్రతి రోజూ తాగుతుండాలి.కొంత కాలానికి వ్యాధి తగ్గగలదు.

3. రత్న పురుష ఆకులు,అల్లపు రసము,ఎండు ద్రాక్షలను వాడుతూ ఉండాలి.

19, డిసెంబర్ 2018, బుధవారం

పచ్చి మిరపకాయలు రోజూ తింటే కలిగే లాభాలు.

పచ్చి మిరప కాయలను మనం అనేక రకాలుగా ఆహరంలో వాడుకుంటుంటము.ఎండు కారం కు బదులుగా చాలా మంది కూరల్లో వేస్తారు.చక్కని రుచి వస్తుంది.కొందరు వీటిని అలాగే తినేస్తారు.కొందరు మజ్జొగలో కలుపుకుని తింటారు.రోజువారీ ఆహారంలో వీటిని తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి.

1. విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.విటమిన్ బి6,ఏ,ఐరన్,కాపర్,పొటాషియం,నియాసిన్,ఫైబర్,ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

2. వీటిని విత్తనాలతో సహా తింటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది.ఆహారం సరిగా జీర్ణం అవుతుంది.ఉమ్మి ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగవుతుంది.

3. విత్తనాల్లో ఫైటోస్టెరాల్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది.ఇది రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది.పేగుల నుండి కొలెస్టరాల్ రక్తంలోకి కలవకుండా చూస్తుంది.రక్తంలోని చెడు కొలెస్టరాల్ ను కరిగిస్తుంది.దీనితో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

4. వీటిలో ఉండే క్యాప్సిసిన్ శరీర జీవ క్రియలను వేగవంతం చేస్తుంది.దీనితో క్యాలొరీలు అధికంగా ఖర్చవుతాయి.ఫలితంగా అధిక కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.అలాగే గుండె కొట్టుకునే వేగం సక్రమంగా ఉంటుంది.

5. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ సమస్యలను పోగొడతాయి.

6. దగ్గు , జలుబు , ఫ్లూ జ్వరం ఉన్నవారు పచ్చి మిరపను బాగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.ముక్కు దిబ్బడ ఉంటే ముక్కు ద్వారాలు క్లియర్ అవుతాయి గాలి బాగా పీల్చుకోవచ్చు.

విటమిన్ ఈ లభించే పదార్థాలు - పరిష్కరించే సమస్యలు.


1. ఇది ప్రధానంగా బాదం,అవిశ గింజలు,పాలకూర,చిలగడ దుంప,పొద్దు తిరుగుడు గింజలు,ఆలివ్ నూనె వంటి వాటి నుంచి అధిక మోతాదులో లభిస్తుంది.నేరుగా దీనిని ఉపయోఇంచాలనుకుంటే మార్కెట్ లో ఈ నూనె దొరుకుతుంది,దానిని వాడుకోవచ్చు.

2. కాలం ఏదైనా కొందరి చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది.విటమిన్ ఈ అందే పదార్థాలను రోజువారె ఆహారంలో తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు.రోజూ ఉదయాన్నే కాస్త విటమిన్ ఈ నూనెను తీసుకుని ముఖం,చేతులు,కాళ్ళకు రాసుకుంటే మంచిది.దీనివల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరిగి చర్మం నిగారింపుతో కనిపిస్తుంది.స్నానం చేసే ముందు కూడా దీనిని రాసుకోవచ్చు.ఐతే కొబ్బరి నూనె,లేదా ఆలివ్ నూనెతో కలిపి వాడుకోవచ్చు.ముఖ్యంగా కళ్ళ కింద నలుపుదనం,ముడతలు తగ్గుతాయి.ఇలా కనీసం వారానికి రెండు ,మూడు సార్లు రాసుకున్నా చాలు.

3. విటమిన్ ఈ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.అతినీల లోహిత కిరణాలవల్ల దెబ్బ తిన్న చర్మానికి ఉపశమనం అందిస్తాయి.జుట్టు రాలడాన్ని అదుపులో ఉంచుతాయి.బలంగా,ఆరోగ్యంగానూ కనిపించేలా చేస్తాయి.శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

18, డిసెంబర్ 2018, మంగళవారం

ఇన్ ఫెక్షన్లతో పోరాడే సహజసిద్ధ ఆహార యాంటీ బయోటిక్స్/ INFECTION LA TO PORADE SAHAJA SIDDHA AHARA ANTI BIOTICS

మనకు ఎన్నో రకాల అనారోగ్యాలు బ్యక్టీరియా,వైరస్ ఇన్ ఫెక్షన్ ల వల్ల కలుగుతాయి.వీటితో శరీరంలోరోగనిరోధక శక్తి తగ్గిపోయి పలు రకాల సమస్యలు ఎదుర్కొంటుంటాము.మనకు అందుబాటులోనే ఉండే పదార్థాలతో ఈ ఇన్ ఫెక్షన్ లను సమర్థంగా ఎదుర్కొనవచ్చు.

1. క్రాన్ బెర్రీ జ్యూస్ ఇన్ ఫెక్షన్ లను సమర్థంగా తగ్గిస్తుంది.మూత్రాశయ , వెజైనల్ ఇన్ ఫెక్షన్ లు తగ్గుతాయి.తాజా జ్యూస్ తయారు చేసుకొని తీసుకోవాలి.రోజుకి రెండు , మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఇది హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతుంది.ఇన్ ఫెక్షన్స్ తో బాధపడే గర్భిణీ స్త్రీలు కూడా తాగవచ్చు.

2. టీ ట్రీ ఆయిల్ లో యాంటీ వైరల్ ,యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి.ఇవి బ్యాక్టీరియా,వైరస్లను సమర్థంగా నిర్మూలిస్తాయి.టీ ట్రీ ఆయిలో కలబంద గుజ్జును బాగా కలిపి చర్మం మీద రాస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి.

3. కలబందలో యాంటీ ఇంఫమ్మేటరీ ,యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి.ఇన్ ఫెక్షన్ లను తగ్గించి,చర్మం పాడవకుండా చూసి,వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

4. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్,యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉండడం వల్ల ఇన్ ఫెక్షన్ లనుండి సమర్థంగా రక్షిస్తుంది.రోజూ ఏదో విధంగా 4 నుండి 6 వెల్లుల్లి రెబ్బలను తింటుంటే మంచి ఫలితం కనబడుతుంది.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

5. తేనెలో కూడా యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్ గుణాలు అధికంగానే ఉన్నాయి.ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక స్పూన్ తేనెను కలిపి రోజూ తీసుకుంటే ఇన్ ఫెక్షన్ లను దూరం చేసుకోవచ్చు.తేనెను నేరుగా చర్మం పై రాసినా చర్మ సమస్యల నుండి రక్షణ పొందవచ్చు.తేనెవల్ల చెడు బ్యాక్టీరియా,చెడు వైరస్ లు శరీరంలోకి చేరకుండా ఉంటాయి.

6. జీర్ణాశయం,శ్వాస సంబంధ ఇన్ ఫెక్షన్ లను అల్లం మెరుగ్గా తగ్గిస్తుంది.ఆయా సమస్యలు ఉన్నపుడు కొద్దిగా అల్లం రసం తాగితే ఫలితం ఉంటుంది.శరీరంలోని వేడిని ఇట్టే తగ్గిస్తుంది.రక్త సరఫరా మెరుగు పరుస్తుంది.శరీరంలోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది.

7. బేకింగ్ సోడాలో యాంటీ బ్యాక్తీరియల్ గుణాలు బాగా కలవు.జీర్ణాశయం,పేగులు,శ్వాస సంబంధ ఇన్ ఫెక్షన్ లను బేకింగ్ సోడా తగ్గిస్తుంది.ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది.

8. సహజ్ సిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్ గుణాలకు నిమ్మ రసం పెట్టింది పేరు.శ్వాస కోశ ఇన్ ఫెక్షన్ లను మెరుగ్గా నయం చేస్తుంది.చెడు వైరస్,బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది.విటమిన్ సి ఉండడం వల్ల ఇవి నశిస్తాయి.ఉబ్బసం / ఆస్త్మా వంటి వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది.కాలేయం శుభ్రపడుతుంది.

9. రోజూ మనం వంటలో వాడే పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.యాంటీ వైరల్,యాంటీ ఫంగల్,యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఇంఫ్లమ్మేటరీ,యాంటీ ఆక్సిడెంట్ గుణాలకు పసుపు పెట్టింది పేరు.గాయాలపై పసుపు రాస్తే వెంటనే తగ్గిపోతాయి.యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండడం వల్ల గాయం త్వరగా మానుతుంది.శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు పసుపును పాలలో కలిపి తీసుకోవాలి.జీర్ణాశయ సమస్యలు ఉంటే గోరువెచ్చని నీటితో కలిపి దీనిని తీసుకోవాలి.ఆయా సమస్యల నుండి సత్వరమే ఉపశమనం లభిస్తుంది.

10. యాపిల్ సిడార్ వెనిగర్ లో యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఇన్ ఫెక్టివ్ గుణాలు అధికంగా ఉన్నాయి.శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా ,వైరస్ లను ఇది నిర్మూలిస్తుంది.చర్మాన్ని రక్షిస్తుంది.జీర్త్ణాశయ ఇన్ ఫెక్షన్ లను పోగొడుతుంది.

17, డిసెంబర్ 2018, సోమవారం

మలబద్ధకం - అహార ,ఆయుర్వేద పరిష్కారాలు./ MALA BADDHAKAM - AHARA ,AYURVEDA PARISHKARALU.


ప్రస్తుత రోజుల్లో మలబద్ధకం చాలా మందికి ఒక సమస్యగా మారింది.దీనిని వెంటనే పరిష్కరించుకోకపోతే ఇది ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది .ఐతే ఆహారంలో కొన్ని మార్పులు ,ఇంకా కొన్ని సులభమైన పద్ధతులు పాటిస్తే ఈ సమస్యను సులభంగా అధిగమించి చక్కటి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.

1. ప్రతి రోజూ క్రమం తప్పకుండా 12 నుంచి 15 గ్లాసుల నీరు తాగాలి.పేగు వ్యవస్థలో కదలిక వస్తుంది.శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.

2. రెండు ఖర్జూర పండ్లు గ్లాసుడు వేడి నీటిలో నానబెట్టి రాత్రి పడుకునే ముందు తినాలి.ఆ నీటిని చల్లార్చిన తర్వాత తాగొచ్చు.

3. రాత్రి పడుకునే ముందు 5 నల్లని ఎండు ద్రాక్షలను 5-6 గంటలు నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తినాలి.దీనిఒతో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

4. రెండు బొప్పాయి ముక్కలను గ్లాసుడు వేడి నీటిలో నానబెట్టి రాత్రి పడుకునే ముందు తినాలి.

5. రెండు అంజీర పండ్లను గ్లాసుడు వేడి నీటిలో నానబెట్టి రాత్రి పడుకునే ముందు తినాలి.,

6. 30 మి.లీ. అలోవెరా జ్యూస్ ను గ్లాసుడు నీటిలో కలుపుకుని రాత్రి పడుకునే ముందు తాగాలి.

7. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు,కూరగాయల జ్యూస్ లు వీటితో పాటు తీసుకోవాలి.

8. ఈ సమస్య ఉన్నవారు చిప్స్,ఫాస్ట్ ఫుడ్ ,మాంసానికి దూరంగా ఉండాలి.

9. ఖచ్చితంగా ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.బయటి ఆహారానికి దూరంగా ఉండాలి.సమయానికి భోజనం చేయాలి.

16, డిసెంబర్ 2018, ఆదివారం

చలికాలంలో చర్మం పొడిబారకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చలి నుంచి కాచుకోవడానికి స్వెట్టర్లు ధరించడమే కాకుండా చర్మం పొడి బారకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.

1.గులాబి నీరు,తేనె సమానంగా తీసుకుని బాగా కలిపి ముఖం ,మెడకు రాసుకోవాలి.పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగివేయాలి.తేనె చర్మానికి తేమనందిస్తుంది.పొడి చర్మతత్వం ఉన్నవారు ఈ చిట్కాను రోజూ ప్రయత్నిస్తే చర్మం తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.

2.పెదవులు పొడిబారి పగిలినట్లు అవూంటే తేనెలో కాస్త గ్లిజరిన్ కలిపి రాసుకోవాలి.ఇలా రోజులో రెండు ,మూడు సార్లు చేస్తుంటే పగుళ్ల సమస్య తగ్గి పెదవులు తాజాగా కనిపిస్తాయి.

3.చర్మం పొడిబారినప్పుడు పాదాలు కూడా పగలడం కొందరిలో కనిపిస్తుంది.ఇలాంటివారు టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెకు అరచెంచా నిమ్మ రసాన్ని కలిపి రాత్రుళ్లు పాదాలకు రాసుకుని సాక్సులు వేసుకోవాలి.ఇలా రోజూ చేస్తుంటే ఆ సమస్యలు తగ్గి కోమలంగా కనిపిస్తాయి.

4.పెద్ద చెంచా వంతున నిమ్మ రసం,తేనె కలిపి ముఖానికీ,చేతులకూ రాసుకోవాలి.కాసేపయ్యాక కడిగెయ్యాలి.దీనివల్ల చర్మం బిగుతుగా మారడమే కాకుండా దురద,ఎలర్జీలాంటి సమస్యలు రావు.

5.స్నానాకి ముందు కొబ్బరి లేదా ఆలివ్ నూనెను ఒంటికి పట్టించి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం పొడి బారదు.అలాగే చెంచా శనగ పిండికి చిటికెడు పసుపు,అరచెంచా పాలు లేదా పెరుగు కలిపి ముఖం ,మెడకు రాసుకుని బాగా మర్దన చేయాలి.ఆ తర్వాత స్నానం చేస్తే ముఖానికి తేమ అందుతుంది.

ఉల్లి కాడలతో ఆయుర్వేద ,ఆరోగ్య ప్రయోజనాలు./ ULLIKADALATO AYURVEDA,AROGYA PRAYOJANALU.

1 . ఉల్లి కాడల్లోని అల్లిసిన్ చర్మం ముదతలు పడకుండా కాపాడుతుంది.

2. వీటిలోని కెరోటినాయిడ్ లుకంటి చూపును మెరుగు పరుస్తాయి.అలాగే ఎముకలు ధృఢత్వాన్ని సంతరించుకుంటాయి.

3. వీటిలో యాంటి ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ ,బి,సి,కె ,యాంటి బాక్టీరియల్,యాంటి ఫంగల్ సుగుణాలు,సల్ఫర్,రాగి,మెగ్నీషియం,పొటాషియం,క్రోమియం,మాంగనీస్ లాంటివి చాలా ఉన్నాయి.

4.చక్కెర వ్యాధిగ్రస్తులు రోజువారీ ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది.

5. వీటితో దగ్గు,జలుబు,అజీర్తి నయమౌతాయి.

6.కెలొరీలు,కొవ్వు,తక్కువగా ,పీచు పదార్థం ఎకువగా ఉండడంతో అధిక బరువు తగ్గిస్తాయి.

7.గర్భిణీలు తొలి మూడు నెలల్లో తరచుగా తింటే కడుపులోని బిడ్డకు ఫోలిక్ యాసిడ్ అందుతుంది.శిశువుకు వెన్నెముక సమస్యలు రాకుండా ఉంటాయి.

8. ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్త నాళాలకు చాలా మంచిది.కొలెస్టరాల్ ఆక్సీకరణను తగ్గించి ,గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

9.వీటిలోని సల్ఫర్ కాంపౌండ్ బిపి స్థాయులను నియంత్రించడానికి సహాయపడుతుంది.కొలెస్టరాల్ స్థాయిలు తగ్గిస్తాయి.

10.వీటిలోని క్రోమియం కంటెంట్ మధుమేహాన్ని తగ్గిస్తుంది.ఘ్లూకోజ్ శక్తిని అందిస్తాయి.

11. జలుబు , జ్వరానికి వ్యతిరేకంగా పోరాడుతుంది.

12. అజీర్ణం నుండి ఉపశమనం కలిగిస్తాయి.

13.వీటిలోని పెక్టిన్ పెద్దపేగును క్యాన్సర్కు గురికాకుండా చేస్తుంది.

14.కీళ్ళ నొప్పులు ,ఉబ్బసం తగ్గిస్తాయి.కాళ్ల సమస్యలు కూడా తగ్గుతాయి.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...