5, సెప్టెంబర్ 2026, శనివారం

పిల్లల కడుపులో క్రిముల సమస్య, బుడ్డ సమస్య - డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

  1. ) పిల్లలకు కడుపులో క్రిముల సమస్య - ఆయుర్వేద పరిష్కారం 

పిల్లలకు చాక్లెట్లు, బజారు తిండ్లు అలవాటు చేయడం వల్ల, అకాల భోజనం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీని పరిష్కారం కోసం దేవదారు చెక్క, మునగ చెక్క , కరక్కాయ బెరడు, తానికాయ బెరడు, ఉసిరి కాయ బెరడు,పిప్పళ్లు, వాయు విడంగాలు సమాన భాగాలుగా తీసుకుని దంచి పొడి చేసుకుని, అన్నీ కలిపి నిలువ చేసుకోవాలి. రోజూ అరగ్లాసు నీటిలో అరచెంచా పొడి వేసి, పావు గ్లాసు కషాయానికి మరిగించి వడపోసి రెండు పూటలా పూటకు ఒక చెంచా కషాయాన్ని ఆహారానికి  ముందుగా తాగిస్తుంటే కడుపులోని పురుగులన్నీ మలం ద్వారా పూర్తిగా బయటకు పడి పోయి , పిల్లలకు చక్కటి ఆరోగ్యం కలుగుతుంది . 

2.) బుడ్డ దిగిన సమస్య - ఆయుర్వేద పరిష్కారం 

 A .) ఇంతకు ముందు చెప్పినట్లుగా దేశవాళీ ఆవు మూత్రం ఏడు సార్లు వడపోసి రోజూ పరగడుపున ఒక కప్పు మోతాదుగా తీసుకుని అందులో పావు టీ స్పూన్ మాను పసుపు పొడి కలిపి తాగించాలి. 

B.) కరక్కాయ పొడి, శొంఠి పొడి, గసగసాల పొడి , తెగడ పొడి ఒక్కొక్కటి 50 గ్రాములు చొప్పున తీసుకుని కలిపి ఆ మొత్తాన్ని స్వచ్ఛమైన వంటాముదంతో నూరి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. ఈ లేహ్యాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు 5 గ్రాములు మోతాదుగా తినాలి. 

C.) కానుగ గింజల పప్పు, ఆముదపు గింజల పప్పు గచ్చ కాయలలోని పప్పు సమాన భాగాలుగా తీసుకుని వంటాముదంతో నూరి నిలువ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ లేపనాన్ని వాచిన వృషణం పైన పట్టు లాగా వేసి పైన దూది అంటించి అది ఊడిపోకుండా గోచి పెట్టుకుని పడుకోవాలి. 

ఇలా ఆచరిస్తూ, వాతం చేసే పదార్థాలు,మాంసాహారం తినడం మానివేస్తే అతి త్వరగా సమస్య ఆపరేషన్ తో పని లేకుండా పరిష్కారమవుతుంది. 

4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

రక్త స్రావం ఆగకపోవడం, భగంధరం - డా. ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు.

 1.) రక్త స్రావం ఆగని సమస్య - డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారం. 

అడ్డసరం మొక్కను సంపాదించుకోవాలి. దాని కొమ్మ దొరికినా, తెచ్చి నాటితే మొక్కగా బతుకుతుంది. దాని ఆకులు తీసుకుని నీళ్ళు కలపకుండా దంచి ఆ ముద్దను బట్టలో వేసి పిండితే వచ్చే రసాన్ని గిన్నెలో పోసి చిన్న మంట పైన రసం విరిగే వరకు మరిగించాలి. తర్వాత వడపోసి, ఆ విరిగిన అడ్డసరం నీటిని 50 గ్రాముల మోతాదుగా తాగాలి. తాగిన మరుక్షణమే శరీరంలో ఏ భాగం నుండి కారే రక్తమైనా తప్పకుండా ఆగుతుంది. 

2.) భగంధరం సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు.. 

ఆవు నెయ్యి 20 గ్రాములు తీసుకుని ఇనుప కళాయి పాత్రలో వేసి పొయ్యి మీద పెట్టి, అది మరిగేటప్పుడు అతి మెత్తని తెల్ల గుగ్గిలం పొడి 10 గ్రాములు వేసి కలిపి వెంటనే పాత్రను కిందికి దింపి ఆ పదార్థాన్ని ఒక కంచు గిన్నెలో కానీ లేక పళ్ళెంలో కానీ పోయాలి. తర్వాత ఆ పదార్థంలో నీళ్ళు పోసి ఆ మిశ్రమాన్ని కడిగి నీటిని వంచి వేయాలి. మరలా నీళ్ళు పోసి మరలా కడిగి నీటిని తీసివేయాలి. ఇలా ఓపికతో ఆ పదార్థాన్ని వంద సార్లు కడిగితే అద్భుతమైన ఔషధం తయారవుతుంది. 

దాన్ని ఒక గాజు సీసాలో నిలువ చేసుకొని రోజూ రాత్రి పడుకునే ముందు తగినంత పదార్థాన్ని దూదికి రాసి ఒత్తిలాగా తీసుకోవడం చేసి ఆ వత్తిని భగంధర రంధ్రంలో లోపలి దాకా పెట్టి పైన దూది అంటించి కదలకుండా ప్లాస్టర్ అంటించాలి. ఇలా రోజూ ఒక సారి ఒక ఒత్తిని నలభై రోజుల పాటు భగంధరంలో ఎక్కిస్తూ ఉంటే ఆ వ్యాధి సమూలంగా నిర్మూలనము అవుతుంది. 

రేచీకటి, వాత రోగపు నొప్పుల సమస్య - డా. ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 1.) రేచీకటి సమస్య - ఆయుర్వేద పరిష్కారం

తెల్ల మిరియాలు 20 గ్రాములు తెచ్చుకుని వాటిని చింతాకు రసంతో మెత్తగా గుజ్జులా నూరి శనగ గింజంత గోళీలు చేసి నీడకు ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత నిలువ చేసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక మాత్రను సాన రాయిపై కొంచెం నీళ్ళు చల్లి గంధం తీయండి. ఈ గంధాన్ని నిద్రించే ముందు పెసర బద్దంత మోతాదుగా కంటి కొసలలో పెట్టుకుంటూ ఉంటే రేచీకటి హరించిపోయి కళ్ళకు మంచి దృష్టి కలుగుతుంది. 

2.) ఊరంతా వాత రోగపు నొప్పుల సమస్యలు.. ఆయుర్వేద పరిష్కారాలు..

ఒక ఆదివారం నాడు వావిలి చెట్టు కు పూజ చేసి అడుగున తవ్వి ఆ వేళ్ళ మీద ఉండే వేరు బెరడును కొడవలితో గీకి తీసుకోవాలి. గీకిన చోట వేరుకు హాని కలుగకుండా ఆవు పేడ పూసి పూర్తిగా మట్టి కప్పి నీరు పోసి చెట్టుకు నమస్కరించి రావాలి. అలా తెచ్చిన వావిలి వేరును కడిగి ఆరబెట్టి దంచి పొడి చేసుకోవాలి. అలాగే దానితో పాటు శొంఠి, పిప్పళ్లు, మిరియాలు , పిప్పలి కట్టె వీటిని కూడా కొంచెం దోరగా వేయించి దంచి పొడి చేసుకోవాలి. అన్ని పదార్థాలను సమ భాగాలుగా కలిపి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని పూటకు అర చెంచా మోతాదుగా ఒక చెంచా తేనె తో కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు గానీ, గంట తర్వాత కానీ సేవించాలి. దీని వల్ల ఎంతో కాలం నుంచి మంచాన పడ్డ పక్షవాత రోగులు , కీళ్ల వాత రోగులు, అలాగే మిగిలిన దీర్ఘ కాలం వాత వ్యాధులతో బాధ పడే వారంతా పూర్తి స్వస్థతను పొందగలుగుతారు. 

సంతాన సమస్య, పాముల సమస్య - డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 సంతాన లేమి సమస్య - ఆయుర్వేద పరిష్కారం.


గతంలో జరిగిన పొరపాట్ల గురించి ఎంత చింతించినా లాభం ఉండదు. ప్రస్తుతం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. మనం నివసించే ప్రాంతంలో ఉన్న నల్ల తుమ్మ చెట్టు ను పూజించి సమస్యను మనసులోనే తెలిపి , దాని నుండి తుమ్మ చిగుర్లు సేకరించి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి. అలాగే అప్పుడప్పుడే గింజ పడుతున్న పచ్చి తుమ్మ కాయలను గ్రహించి చిన్న ముక్కలుగా చేసి కొద్దిగా నలగ గొట్టి నీడలో బాగా గాలి తగిలే చోట ఆరబెట్టి ఎండిన తర్వాత నిలువ చేసుకోవాలి. అలాగే తుమ్మ చెట్టు నుండి సహజంగా దొరికే తుమ్మ బంక దొరికినంత తెచ్చుకొని చిన్న ముక్కలుగా నలగ గొట్టి కొంచెం నేతితో దోరగా వేయించి నిలువ చేసుకోవాలి. ఈ మూడు పదార్థాలను రెండు మూడు నెలలకు ఒకసారి కావలసి నంత మోతాదుగా తీసుకుని విడి విడిగా దంచి జల్లించి అన్నింటిని కలపాలి. ఆ మిశ్రమ చూర్ణం ఎంత ఉంటే అంత మోతాదుగా పటిక బెల్లం పొడి కలిపి నిలువ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ముందుగా పావు చెంచా నుండి అర చెంచా వరకు అరచేతిలో వేసుకొని కొద్ది కొద్దిగా నాలుకతో అద్దుకొని తిని అనుపానంగా గోరు వెచ్చని పాలు తాగుతుండాలి. ఇలా రెండు పూటలా ఆహారానికి రెండు గంటల ముందు సేవిస్తుంటే క్రమంగా కోల్పోయిన వీర్య శక్తి, అంగ దృఢత్వం , శారీరక పునరుజ్జీవనం అన్నీ ప్రాప్తిస్తాయి. దీని వల్ల వీర్యంలో జీవ కణాల సంఖ్య కూడా సమృద్ధిగా ఉత్పన్నమై సంతానం కలుగుతుంది. 

పాముల సమస్య - ఆయుర్వేద పరిష్కారం.

దూసరి ( సిబ్బి తీగ) చెట్లను పూజించి తవ్వి ఆ వేరును తీసుకొచ్చి కడిగి పసుపు కుంకుమ పూసి దేవుని వద్ద పెట్టి పూజించండి. ఆ తర్వాత వాటిని ఇంటి ప్రధాన గుమ్మాలకు వేలాడ దియాలి. దీనినే పాతాళ గరుడి అంటారు. దీని ప్రభావానికి ఎంతో దూరం నుండే పాములు వెనక్కి తిరిగి పోతాయి. దాని పరిసర ప్రాంతాలలోకి రాలేవు. దాంతో పాటు ఆవాలు, నవసాగరం సమ భాగాలుగా కలిపి దంచి ఆ మిశ్రమాన్ని పాములు సంచరించే చోట చల్లాలి. వాటి వాసన పడక ఆ ప్రాంతంలో ఉండే పాములు దూరంగా పారిపోతాయి. అంతే కాక మట్టి మూకుడులో పిడకలు అంటించి , ఆ నిప్పుల మీద వస కొమ్ముల పొడి చల్లి పాములున్న ప్రాంతంలో ఆ పొగ వేస్తుండాలి. ఇలా ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాముల భయం నుండి నివారణ పొందవచ్చు. 

మారేడు పూల హల్వా.. ఆయుర్వేద ఉపయోగాలు..

 నిహన్యాద్బిల్వజం పుష్పమతీ సారం తృషాం వమీం.. మారేడు చెట్టును శివుడిపై భక్తితో పెంచుకునే వారే ఎక్కువ.కానీ దాని పూలు, ఆకులు, కాయలు అన్నీ ఔషధ ప్రయోజనాలు కలిగించేవే.. 

మారేడు,మర్రి, రావి ఇవన్నీ వాతావరణం నుంచి ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకుని ఎక్కువ ఆక్సీజన్ ఇచ్చే చెట్లు. భోజన కుతూహలం గ్రంథంలో ఆహార యోగ్యమైన పువ్వుల గురించిన ప్రకరణం ప్రారంభిస్తూ మారేడు పూలను మొదటగా ప్రస్తావించారు. భక్తి ప్రాధాన్యత కాదు అది .. ఆరోగ్య ప్రాధాన్యత. మారేడు పూలు ( మారేడు - ఇండియన్ బేల్ ) విరేచనాలను తగ్గిస్తాయి. దప్పిక తీరుస్తాయి. వాంతుల్ని ఆపుతాయి అని భోజన కుతూహలం గ్రంథంలో తెలిపారు. 

మారేడు కాయ గుజ్జు అమీబియాసిస్ వ్యాధి నియంత్రణకు పని చేస్తుంది కానీ మారేడు పూలు అతిసార వ్యాధిని కూడా అరికట్టగలదని దీని తాత్పర్యం. బ్యాక్టీరియా కారణంగా పేగులలో వచ్చే వ్యాధులను అరికట్టడానికి మారేడు పువ్వులు ఉపయోగపడతాయి. మనం అప్పుడప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కు గురవుతుంటాము. బయట ఆహారం తినడం తప్పనిసరి అయిన వారు తరచూ మారేడు పూలు, కాయలు లేదా ఆకులు .. వీటిలో ఏది దొరికినా వాడుకుంటూ ఉండాలి. దీని వల్ల పొట్ట మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. 

ఇవి తాజాగానే ఉండాలని లేదు .. ఎండించి,దంచి , భద్రపరచుకొని రోజూ ఒక చెంచా పొడిని నీళ్లలో వేసి మరిగించి టీ లాగా తాగవచ్చు. మారేడును వాత వ్యాధులను తగ్గించే ఔషధమని చరకుడు ప్రముఖంగా పేర్కొన్నాడు. 

మారేడు వేరు దశ మూలాలలో ఒకటి. దశ మూలాలు వాత వ్యాధులను హరించేవిగా ప్రసిద్ధి. మారేడు పూలు చలవ నిస్తాయి. పైత్యాన్ని తగ్గిస్తాయి, అందువల్ల ఎసిడిటీ కారణంగా వచ్చే సమస్యలన్నిటిపైనా చక్కగా పని చేస్తాయి. మారేడు పూలను నెయ్యితో వేయించి , హల్వా తయారు చేసుకుని, ఫ్రిజ్ లో భద్ర పరచుకొని రోజూ ఒక చెంచా మోతాదులో తీసుకోవచ్చు. 

తీసుకున్న ఆహారం వంట బట్టక పోవడం,తినగానే విరేచనానికి వెళ్ళాల్సి రావడం , మల బద్ధకం, గ్యాసు, పేగు పూత, , కడుపులో నొప్పి, నీరసం , నిస్సత్తువ లాంటి లక్షణాలన్నీ ఇరిటబుల్ బెవెల్ సిండ్రోమ్ IBS అనే వ్యాధిని సూచిస్తాయి. దీని పైన మారేడు ఆకులు, పూలు, కాయ లోపలి గుజ్జు ఔషధంగా పని చేస్తాయి. ఇది చిట్కా వైద్యం కాదు. ఆయుర్వేదంలో బిల్వారిష్ట, బిల్వాది గుళిక లాంటి ఔషధాలు దీని పైన పని చేసేవి మార్కెట్ లో దొరుకుతున్నాయి. వైద్యుడి సలహా మేరకు వాడుకోవచ్చు. 

2, సెప్టెంబర్ 2026, బుధవారం

ఏ వ్యాధి కలవారు.. ఏ ఔషధాలు వాడవచ్చు.

 వాత వ్యాధులకు..

 1. మహా రాస్నాది కషాయం లేక గోక్షూరాది గుటికలు. 2. అర్కాది తైలం . 3. త్రిఫల కల్పం. 4. అశ్వగంధ ఘృతం ( తీపిలేకుండా )+ శిలాజిత్ వాడుకోవాలి.

గ్యాస్ మొదలగు ఉదర వ్యాధులకు..

1. త్రిఫలా కల్పం 2. హింగ్వాష్టకం 3 . ఆర్ద్రక ఖండం వాడుకోవాలి.

దగ్గు, ఆస్తమా మొదలగు కఫ రోగాలకు..

1. సీతో ఫలాది చూర్ణం 2. తులసి మాత్రలు.3.త్రిఫల రసాయనం ( తేనెతో రాత్రి ) . 4. తులసి టీ.  5. భృగు హరీతకి ( నిర్మలీ) వాడుకోవాలి.

తెల్ల లేక ఎర్ర బొల్లి మచ్చల కు..

1. ఖదీరాది కషాయం 2. సుగంధ పాల లేహ్యం. 3. స్వర్ణ తైలం( గోల్డ్ ఆయిల్). 4. శ్విత్ర అధర లేపనం. 5. త్రిఫల రసాయనం వాడుకోవాలి.

చర్మ వ్యాధులకు..

1. మంజిష్టాది కషాయం .2. సుగంధ పాల లేహ్యం.3. సింధూరాది తైలం. 4. త్రిఫల కల్పం.5. ఖాదీరాది కషాయం.6. కామధేను అర్కం వాడుకోవాలి.

చర్మం పై పైత్య దురదలు ,దద్దుర్లకు..

 1. ఆర్ద్రక ఖండం.2. త్రిఫల రసాయనం. 3. గోక్షూరాది అవలేహ్యం . 4. సింధూరాది తైలం వాడుకోవాలి. 

వెంట్రుకల సమస్యలకు..

1. త్రిఫల రసాయనం. 2. కేశామృతం 3. భృంగరాజ తైలం. 4. త్రిఫల కల్ప జలం. 5. కేశ వృధ్ధి లేపనం. 

కంటి సమస్యలకు..

1. పునర్నవాది కషాయం  2. త్రిఫల రసాయనం( ఆవు నెయ్యి, తేనెతో ) వాడుకోవాలి . 

చెవి సమస్యలకు..

1. త్రిఫల రసాయనం. 2. అపామార్గ తైలం. 3. అశ్వగంధ ఘృతం. 4. షడ్బిందు తైలం. 

ముక్కు సమస్యలు తగ్గడానికి ..

1. తులసి మాత్రలు. 2. షడ్బిందు తైలం లేక వేప నూనె. 3. త్రిఫల రసాయనం ( తేనె తో)  4. అమృత ధార వాడుకోవాలి . 

లివర్ సమస్యకు..

1. పునర్నవాది కషాయం. 2. ఆర్ద్రక ఖండము. 3. త్రిఫల రసాయనం వాడుకోవాలి . 

హృదయ సమస్యలకు..

1. త్రిఫల రసాయనం. 2. హింగ్వాష్టకం . 3. అర్జునాది వటి వాడుకోవాలి.

 మధు మేహ వ్యాధికి.. 

1. త్రిఫల కల్పం. 2. అశ్వగంధ ఘృతం ( తీపి లేకుండా) + శిలజిత్. 3. మధు సంహారిణి లేదా మధురిహా చూర్ణం వాడుకోవాలి. 

మూత్ర పిండాలలో రాళ్లకు..

1. గోక్షూరాది కషాయం. 2. త్రిఫల కల్పం.  3. భృగు హరితకి లేహ్యం. 

శీఘ్ర స్ఖలనము - నపుంసకత్వం..

1. ఖర్జూరాది చూర్ణం. 2.  శతావరీ పాకం. 3.  వాసరీ గుటికలు. 4. అశ్వగంధ+ శిలాజిత్. 5. త్రిఫల రసాయనం. 6. అశ్వగంధ తైలం. 

దంత సమస్యలకు..

1. కణాది చూర్ణం ( పండ్ల పొడి ) .2. త్రిఫల కల్ప జలం. 3. అశ్వగంధ ఘృతం వాడుకోవాలి.

గొంతు సమస్యలకు - థైరాయిడ్ కు.

1. త్రిఫల రసాయనం ( తేనెతో ) .2. తులసి మాత్రలు. 3. అమలకాది చూర్ణం ( గళ రోగ హర ) వాడుకోవాలి.

ఆకలి లేని పిల్లలకు,పెద్దలకు ..

1. ఆర్ద్రక ఖండము. 2. త్రిఫల రసాయనం. 3. హింగ్వాష్టకం వాడుకోవాలి.

అర్శమొలలకు ( పైల్స్ కు ) ..

1. సూరణ వటుకములు. 2. త్రిఫల కల్పం ( మజ్జిగతో ) . 3. హింగ్వాష్టకం వాడుకోవాలి.

అండ వృద్ధి,వృషణాల వాపు, హెర్నియా..

1. మహా రాస్నాది కషాయం. 2. అండ వృద్ధి మాత్రలు. 3. త్రిఫల కల్పం. 4. అర్కాది తైలం వాడుకోవాలి.

పిల్లలు,పెద్దల జ్ఞాపక శక్తి కి..

1. సారస్వత చూర్ణం. 2. భృంగరాజ తైలం. 3. ఆర్ద్రక ఖండము. 4. త్రిఫల రసాయనం వాడుకోవాలి.

మానసిక వికలాంగులకు..

1. అజామోదాది చూర్ణం. 2. సారస్వతి చూర్ణం . 3. భృంగ రాజ తైలం. 4. త్రిఫల రసాయనం వాడుకోవాలి.

స్త్రీల బట్టంటు వ్యాధులకు..

1. ఇంద్ర యవాది చూర్ణం. 2. శతావరీ పాకం. 3. కుమారీ రసాయనం. 4. గోక్షూరాది కషాయం . 5. త్రిఫల కల్ప జలం ( డూషింగ్) వాడుకోవాలి .

స్త్రీల అతి రుతు రక్త స్రావానికి..

1. శాతావరీ రసాయనం. 2. కుమారీ రసాయనం. 3. అశ్వగంధ ఘృతం. 4. గోక్షూరాది కషాయం వాడుకోవాలి.

స్త్రీ పురుషుల అధిక రక్తపోటుకు ( హై బీపీ కి )..

1. అమృతాది చూర్ణం. 2.  త్రిఫల కల్పం. 3. గోక్షూరాది కషాయం వాడుకోవాలి.

స్త్రీ పురుషుల అల్ప రక్త పోటుకు ( లో బీపీ కి )..

1. త్రిఫల రసాయనం . 2. సుగంధ లేహ్యం. 3.  శతావరీ పాకం . 4. అశ్వగంధ ఘృతం + శిలాజిత్ వాడుకోవాలి.

స్త్రీల గర్భాశయ సమస్యలకు..

1. కుమారీ రసాయనం. 2.  శతావరీ పాకం. 3.  త్రిఫల రసాయనం. 4. అశ్వగంధ ఘృతం + శిలాజిత్ వాడుకోవాలి.

అతి మూత్ర సమస్య కలవారికి..

1. త్రిఫల రసాయనం. 2. గోక్షూరాది కషాయం . 3. భృగు హరీతకి లేహ్యం వాడుకోవాలి.

సంతానం లేని స్త్రీలకు..

1. శతావరీ పాకం. 2. అశ్వగంధ ఘృతం. 3.  నాగ కేసర. 4. గోక్షుర వాడుకోవాలి.

ముఖ సౌందర్యానికి..

1. ముఖ కాంతి లేపనం ( ఫేస్ ప్యాక్ ). 2. సుగంధ లేహ్యం. 3. కుంకుమాది తైలం. 4.  త్రిఫల రసాయనం వాడుకోవాలి.

చర్మ సౌందర్యానికి..

1. శరీర దుర్గంధ హర చూర్ణం ( బాత్ పౌడర్ ) . 2. సుగంధ లేహ్యం. 3. త్రిఫల రసాయనం వాడుకోవాలి. 

పాదాల పగుళ్ళకు..

1. సుగంధ లేహ్యం. 2. మదనాది లేపనం. 3.  గోక్షూరాది కషాయం. 4.  త్రిఫల రసాయనం వాడుకోవాలి. 

అతి కొవ్వు ( ఒబెసిటీ ) హరించుటకు ..

1. త్రిఫలాది చూర్ణం . 2. త్రిఫలాద్య తైలం. 3. పునర్నవాది కషాయం .4. గోక్షూరాది కషాయం వాడుకోవాలి. 

ఏ సమస్యా లేని వారికి సమస్య రాకుండా..

1. త్రిఫల కల్పం. 2.  పునర్నవ కషాయం 3.  అశ్వగంధ వాడుకోవాలి. 

ఏ వ్యాధి కలవారైనా ఆహార వేదం లాంటి ఆయుర్వేద గ్రంథాలు చదివి ఆహార,విహార ,వ్యవహారాలు పాటించాలి.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...