Tuesday 1 January 2013

పసుపు తో ఆయుర్వేద ఉపయోగాలు./ USES OF TURMERIC POWDER ( PASUPU ) - AYURVEDAM

హిందూ సంస్కృతిలో పసుపుకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది.సౌభాగ్యానికి ,ఆరోగ్యానికి సంకేతాలు పసుపు కుంకుమలు.ఆడవారి ఐదోతనానికి , ముత్తైదువల మాంగళ్యానికి రక్ష పసుపు కుంకుమలు.

క్రిమిసంహారిణి గా , ఆరోగ్యప్రదాయిని గా కొన్ని వేల ఏళ్ళనుండీ పసుపు విరాజిల్లుతోంది.మతవిశ్వాసాలకు , శాస్త్రీయ పరిశోధనలు తోడవడంతో పసుపు అంతర్జాతీయ ఖ్యాత్రి గాంచింది.

పసుపు శాస్త్రీయనామం కుర్ కుమ లొంగ,ఇది జింజిబరేసి కుటుంబానికి చెందింది.అల్లం వలె ఇది భూమ్యాంతర కాండాలుగా పెరుగుతుంది.

పసుపుపై అంతర్జాతీయంగా కొన్ని వేల సంఖ్యలో పరిశోధన పత్రాలు వెలువడుతున్నాయి.వాపులు , క్యాన్సర్ , కీళ్ళవాతం వంటి వ్యాధులను అరికట్టడమే  కాకుండా , బ్యాక్టీరియా , వైరస్ లను అదుపు చేయడం లో , రోగ నిరోధక శక్తి పెంచడంలో విశేష ఖ్యాతి గడించింది.క్యానసర్ వ్యాధి నివారణలోనూ , మాలిగ్నెంట్ కణజాలాల పెరుగుదలను నిరోఢించడంలో ముఖ్య పాత్ర వహిస్తోంది. 

భారత దేశంలో సుమారు 5000 సంవత్సరాలకు పూర్వమే అయుర్వేద వైద్యంలో పసుపు విశిష్టతను గుర్తించారు.జీర్ణాశయ సమస్యలకు, గాయాలు,దెబ్బలు మానడానికి పసుపును విరివిగా వాడేవారు.ఎలుకల్లోని కొలెస్టరాల్ పరిమాణంపై ప్రభావం చూపుతుందని 40 సంవత్సరాల క్రితమే తెలుసుకున్నారు.1990 దశకంలో జరిగిన ప్రయోగాల్లో పసుపులోని కుర్కుమిన్ క్యాన్సర్ పై ప్రభావం చూపుతుందని తెలిసింది.

వాపులు ,దెబ్బలు, పాంక్రియాస్ కు వచ్చే క్యాన్సర్ ,అల్జిమీర్స్ వ్యాధి , చక్కెర వ్యాధి ,కొలైటిస్, గాస్ట్రైటిస్,జ్వరాలు, ఎలర్జీ , హృద్రోగాలు,వంటి అనేక వ్యాధుల నిర్మూలన , అదుపులో పసుపు తోడ్పడుతుందని ఇటీవలి పరిశోధనల్లో తెలిసింది.

పసుపులో ఉండే కుర్కుమిన్ అనేక వ్యాధులను నయం చేస్తుందని తెలిసింది.ఎలుకల్లో వచ్చే కీళ్ళ వాతం , కీళ్ళ క్షీణత, వాపులను , పసుపు వేర్ల నుండి సంగ్రహించిన పదార్థం అడ్డుకుంది.అల్జిమీర్స్ వ్యాధి కారకాలను బలహీన పరిచేలా కురుకుమిన్ పని చేసింది.కొలాన్ క్యాన్సర్ ను వేగిర పరిచే హార్మోనులను నియంత్రిస్తుంది కొలాన్ , రిక్టంలలో కలిగే పాలిప్స్ , సీజు , సంఖ్యలను , కుర్కుమిన్ మరియు , క్వర్సెటిన్ లను కలిపి వాడి తగ్గించగలిగారు.మైలాయిడ్ ల్యుకేమియా ఉన్నవారికి కుర్కుమిన్ పెద్ద మోతాదులో ఇవ్వగా క్యాన్సర్ కణాల విభజన్ ఆపడం , లెక చంపడం జరిగింది.కొలాన్ క్యాన్సర్ , బ్రెస్ట్ క్యాన్సర్ లపై కుర్కుమిన్ వ్యతిరేక ప్రభావం చూపింది. 

సకల శుభకరమైనది పసుపు.బిడ్డ పుట్టినది మొదలు , అనేక శుభకార్యాలలో పసుపు ప్రముఖ పాత్ర వహిస్తోంది.

1. పసుపుతో పురిటి స్నానం.

2.పసికందు ముసముసలాడుతుంటే మాడున పసుపు అద్దుతారు.

3.ఆడబిడ్డలకు ఒంటి నిండా పసుపు , సున్ని పిండిలతో నలుగు స్నానం.

4.ప్రతి హిందు స్త్రీ పూర్వకాలంలో ముఖానికి పసుపు రాసుకునేవారు .తరువాతె స్నానం.

5.కొత్త పెళ్ళికూతురు పాదాలకు పసుపు పారాణి , మంగళ స్నానంలో పసుపు.

6.పెళ్ళి పనులకు నాంది రోకలికి ,రోటికి పసుపు కొమ్ము కట్టడం.రోలులో పసుపు కొమ్ములను ముత్తైదువలు దంచడం.
7. పసుపులో తడిసిన మధుపర్కాలు వధూవరులు ధరిస్తారు.

8.మంగళసూత్రాలను ఎంతటి ధనవంతులైనా పసుపుతాడుతో ముడి వేస్తారు/

9.కొత్త బట్టలకు పసుపు పెడతారు.

10.కొత్త పుస్తకాలపై ఓం , శ్రీ అనే అక్షరాలు పసుపుతో రాస్తారు.

11.ఆడవారికి పెళ్ళైన తర్వాత పసుపుకుంకుమల కింద కొంత భూమి లేక డబ్బు ఇస్తారు దీనినే స్త్రీ ధనం అంటారు.

12. అపవిత్రమైన వస్తువులపై పసుపు నీరు చల్లి శుద్ధి చేస్తారు.

13.గడపలకు పసుపు పూసి రక్షణ కల్పించుకుంటారు.

14.పేరంటాలలో కాళ్ళకు పసుపు పూసుకుంటారు.

15.అన్ని రకాల శుభపత్రాలకు చివర పసుపు రాస్తారు.

16.ఏ పూజ చేసినా, శుభకార్యం జరిగినా ముందుగా వినాయకుడిని పసుపుతో తయారుచేసి పూజిస్తారు.

17. పూజలో హర్ద్రాక్షతలు వాడతారు.

18.కైలాసగిరి నోములో 5 కుంచాల పసుపు ,5 కుంచాల కుంకుమను అమ్మవారికి పూజ చేసి తర్వాత ముత్తైదువలకు పంచుతారు.

19.కుంకుమ నోములో ఊరిలోని వివాహితులందరికీ పసుపుకుంకుమలను పంచుతారు.

20. బాలింతలకు వేడిచేయడం కోసం కాళ్ళకు పసుపు రాసి, ఒళ్ళంత పసుపు , సున్ని పిండిలతో నలుగు పెడతారు.

21.అక్షయబొండాల నోములో ఐదుగురు ముత్తైదువలకు ఏడాదిపాటు ఐదేసి పసుపు ఉండలను బొట్టుపెట్టి ఇచ్చుకుంటారు.

22.పసుపు ఉపయోగించకుండా ఏదీ శుద్ధి అవదు.


ఆయుర్వేద ఉపయోగాలు - 

1. పిష్ట మేహం   - పసుపు, మాను పసుపు ( దారు హరిద్ర ) చూర్ణాల మిశ్రమాన్ని నీళ్ళలో కలిపి తీసుకోవాలి.

2.చర్మ వ్యాధులు ,గజ్జి,ఎక్జిమా తగ్గడానికి  - పసుపును శుద్ధి చేసిన గోమూత్రం తో కలిపి ఒక నెల పాటు తీసుకోవాలి.

3.రక్త హీనత - పసుపు, త్రిఫలా చూర్ణం,నెయ్యి,తేనె ల మిశ్రమాన్ని టీ స్పూన్ మోతాదులో ప్రతి రోజూ తీసుకోవాలి.

4.కామెర్లు  - పసుపును , స్వర్ణ గైరికాన్ని ( కావి రాయి ) మెత్తగా నూరి కలపాలి.ఈ మిశ్రమానికి ఉసిరి రసం చేర్చి నూరాలి.దీనిని అంజంగా కళ్ళకు పెట్టుకుంటే కామెర్లలో హితకరంగా ఉంటుంది.

5. కడుపు నొప్పి - పసుపు ( 5 భాగాలు ) ,వాము ( 5 భాగాలు )సైంధవ లవణం  ( 1 భాగం ) కలిపి , ఈ మిశ్రమాన్ని నెయ్యితో కలిపి వేడి చేసి తీసుకోవాలి.
6 . పొక్కులు , బొబ్బలు , విసర్పం తగ్గడానికి  - పసుపును , గుంటగలగర ( భృంగరాజ ) వేరును కలిపి నీరు చేర్చుతూ ముద్దగా నూరి బాహ్యంగా వాడాలి.
7. వాత రక్తం తగ్గడానికి - పసుపును ,తిప్ప తీగను కలిపిముద్దగా నూరి అరకప్పు కషాయాన్ని  తేనె చేర్చి తీసుకోవాలి.

8.మూత్రమార్గంలో ఇసుక వంటి రేణువులు వస్తున్నప్పుడు  - పసుపును కాంజికంతో ( బియ్యానికి నాలుగు రెట్లు నీళ్ళు కలిపి ఉడకబెట్టిన పదార్థం ) కలిపి తీసుకోవాలి.

9. గోరుచుట్టు తగ్గడానికి  - పచ్చి పసుపు స్వరసానికి కరక్కాయ పెచ్చులను  కలిపి ఇనుప రోలులో ముద్దగా దంచి గోరుచుట్టూ మీద లేపనంగా రాస్తే చీము పక్వమై పగిలి ఉపశమనం లభిస్తుంది.

10 . అర్శమొలలు తగ్గడానికి  - పసుపును జెముడు పాలతో కలిపి ముద్దగా నూరి బాహ్యంగా ప్రయోగించాలి.పసుపు,పిప్పళ్ళూ, గోపిత్తం ( ఆక్స్ బైల్ ) వీటిని కలిపి మెత్తగా నూరి బాహ్యంగా ప్రయోగించాలి.
11 . ఒళ్ళు నొప్పులు తగ్గడానికి - చెంచాడు పసుపును రెండు కప్పుల పాలకు చేర్చి మరిగించి ఉదయం ఒక కప్పు , రాత్రి ఒక కప్పు చొప్పున తీసుకోవాలి.

12 . మొటిమలు , బ్లాక్ హెడ్స్ తగ్గడానికి - చిటికెడు పసుపును ,కొత్తిమీర ఆకుల కషాయంతో కలిపి బాహ్యంగా ముఖ చర్మం మీద ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగించాలి.
13. కాలిన గాయాలు తగ్గడానికి - చెంచాడు పసుపును ,చెంచాడు కలబంద గుజ్జును కలిపి కాలిన గాయం మీద రాయాలి.

14.ముఖ వర్చస్సు పెరగడానికి - పసుపు , మీగడ , చందనం , చిరు శనగల పిండి ,వీటి మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగించాలి.
15. దీర్ఘ కాలపు వ్రణాలు తగ్గడానికి - పసుపుకు వేప నూనెను కలిపి వ్రణం తయారైన చోట బాహ్యంగా ప్రయోగించాలి.

16. రక్త మొలలు తగ్గడానికి - పసుపు , ఆవనూనె , ఉల్లి రసం మిశ్రమాన్ని మొలల మీద నేరుగా ప్రయోగించాలి.రక్త స్రావాన్ని ఆపడానికి 1-2 చెంచాల పసుపును రక్తస్రావం ఆగిపోయేవరకు తీసుకోవాలి.సాధారణంగా ఒక గంటలో రక్తస్రావం ఆగిపోతుంది.
17. గర్భధారణలో రక్తస్రావం కనిపిస్తుంటే  - మరిగే నీళ్ళకు 2 చెంచాలు పసుపును చేర్చి ప్రతి రోజూ , రక్తస్రావం ఆగిపోయేంతవరకు తీసుకోవాలి.

18. రక్త హీనత తగ్గడానికి - ప్రతి రోజూ చెంచాడు పసుపును , తేనెతో కలిపి తీసుకుంటే హీమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
పసుపు ,త్రిఫలా చూర్ణం ,నెయ్యి ,తేనె వీటి మిశ్రమాన్ని టీ స్పూన్ మోతాదుగా ప్రతిరోజూ తీసుకుంటే రక్తం పెరుగుతుంది.
24. దగ్గుతో కూడిన ఉబ్బసం తగ్గడానికి - పచ్చి పసుపు కొమ్మును 21 రోజుల పాటు ఉప్పు నీళ్ళలో ఊరేసి బాగా ఆరబెట్టి ,నిప్పుల మీద వేడి చేసి నోటిలో ఉంచుకొని రసం పీల్చాలి.

25 . కఫం వల్ల దప్పిక కలిగితే - పసుపు కషాయానికి తేనె , పంచదార కలుపుకొని తాగితే ' ఎడినాయిడ్స్ ' వంటి సమస్యల కారణంగా నోరెండి పోవటం ,దప్పికగా అనిపించటం వంటి సమస్యలు తగ్గుతాయి.

26 . మూత్రాధిక్యత , మూత్రం కలకబారటం సమస్యకు - పసుపు పొడిని ఉసిరిక స్వరసానికి కలిపి కొద్దిగా తేనె చేర్చి తీసుకోవాలి.
19. కళ్ళకలక తగ్గడానికి - స్వచ్చమైన పసుపు నీటిలో శుభ్రమైన నూలు గుడ్డను ముంచి కళ్ళను తుడుచుకోవాలి.

20. బోదకాలు తగ్గడానికి - పసుపుకు బెల్లం కలిపి ముద్దగా నూరాలి. 5 గ్రాముల మోతాదులో ,శుద్ధి చేసిన గోమూత్రంతో   తీసుకోవాలి.
21 . పొడి దగ్గు తగ్గడానికి  - పసుపును అడ్డసరం ( వాస ) ఆకుల స్వరసంతో కలిపి మెత్తగా నూరి మీగడతో కలిపి  1 టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి.

22 . ఉబ్బసం తగ్గడానికి - పసుపు మసిని ( క్లోజ్డ్ హీటింగ్ ) తేనెతో కలిపి తీసుకోవాలి.1 గ్రాము పసుపు మసి ని 1 స్పూన్ తేనెతో కలిపి తీసుకోవాలి.

23. పిల్లి కూతలతో కూడిన ఉబ్బసం, చాతీలో పట్టేయడం తగ్గడానికి - పసుపు , ఆకుపత్రి , ఆముదపు వేళ్ళు ,లక్క , మణీశిల ( రియల్ గార్ ) ,తాళకం ( ఆర్పిమెంట్ ) ,దేవదారు , జఠామాంసి వీటితో ధూమవర్తిని తయారు చేసుకొని పొగ పీల్చాలి,లేదా వీటి పొడిని హుక్కా మాదిరిగా పీల్చాలి.

24. దగ్గుతో కూడిన ఉబ్బసం తగ్గడానికి - పచ్చి పసుపు కొమ్మును 21 రోజుల పాటు ఉప్పు నీళ్ళలో ఊరేసి బాగా ఆరబెట్టి ,నిప్పుల మీద వేడి చేసి నోటిలో ఉంచుకొని రసం పీల్చాలి.ఉబ్బసంగా అనిపించినప్పుడు పసుపు కొమ్మును నిప్పుల మీద వేడి చెయ్యాలి.తరువాత నోటిలో ఉంచుకొని రసం పీల్చాలి.

25 . కఫం వల్ల దప్పిక కలిగితే - అర కప్పు  పసుపు కషాయానికి తేనె , పంచదార కలుపుకొని తాగితే ' ఎడినాయిడ్స్ ' వంటి సమస్యల కారణంగా నోరెండి పోవటం ,దప్పికగా అనిపించటం వంటి సమస్యలు తగ్గుతాయి.

26 . మూత్రాధిక్యత , మూత్రం కలకబారటం సమస్యకు - అర టీ స్పూన్ పసుపు  పొడిని  2 టీ స్పూన్ ల ఉసిరిక స్వరసానికి కలిపి కొద్దిగా తేనె చేర్చి తీసుకోవాలి.ఎక్కువ సార్లు మూత్రం రావడం, మూత్రంలో మడ్డి రావడం తగ్గుతాయి.

27 .చికెన్ పాక్స్ తగ్గడానికి - అర టీ స్పూన్ పసుపును గుప్పెడు చింతాకుతో కలిపి నూరాలి.చల్లటి నీళ్ళతో కలిపి తీసుకుంటే చికెన్ పాక్స్ లో ఉపశమనం కలుగుతుంది.
28.మొటిమలు తగ్గడానికి - జామ ఆకులు పసుపుతో కలిపి నూరి రాయాలి.

29.కఫం తగ్గడానికి - వేడి పాలలో కొద్దిగా పసుపును కలిపి తాగాలి.

30.జీర్ణశక్తి పెరగడానికి - పెరుగు లేదా తేనెలో పసుపు కలిపి తాగాలి.

31.రక్తం శుద్ధి కావడానికి - ఆహార పదార్థాలలో  పసుపును కొద్దిగా వాడాలి.

32.దగ్గు ,జలుబు తగ్గడానికి - మరుగుతున్న నీటిలో పసుపును కలిపి ఆవిరి పట్టాలి.

33.నొప్పులు , బెణుకులు తగ్గడానికి - పసుపు , ఉప్పు , సున్నం కలిపి రాయాలి.

34.డయాబెటిస్ తగ్గడానికి - ఉసిరి పొడిలో పసుపు కలిపి , నీటిలో కరిగించి తాగాలి.

35.తల తిరుగుడు తగ్గడానికి - పసుపు దుంప ముద్దగా దంచి తలపై రాసుకోవాలి.

36.ముక్కు దిబ్బడ ,జలుబు తగ్గడానికి - నిప్పులపై పసుపు వేసి ఆ పొగను పీల్చాలి.

37.పంటి నొప్పి , దుర్వాసన, అరుచి తగ్గడానికి - పసుపులో మెత్తటి ఉప్పు కలిపి పళ్లు తోముకోవాలి.

38.స్థూలకాయం తగ్గడానికి - పసుపును వాడితే కొవ్వు పెరగకుండా చేసి స్థూలకాయాన్ని అదుపు చేస్తుంది.

39.అల్జీమర్స్ / మతిమరుపు వ్యాధి తగ్గడానికి - పసుపులో ఉండే కుర్కుమిన్ అల్జీమర్స్ వ్యాధిలో వచ్చే గ్నాపక శక్తి తగ్గుదల, వాపులు , మానసిక నిస్త్రాణ తగ్గిస్తుంది.

40.గుండె సంబంధిత వ్యాధులు తగ్గడానికి - రక్తాన్ని శుభ్రపరుస్తుంది, ఎల్.డి.ఎల్ కొలెస్టరాల్ ని బయటకు పంపే కాలేయం పనితీరును మెరుగు పరుస్తుంది.

41.క్యాన్సర్ తగ్గడానికి - పసుపులోని యాంటి ఆక్సిడెంట్లు పిల్లల ఆరోగ్యం కాపాడి ల్యుకేమియా రాకుండా చేస్తుంది.క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది.

42.కేశ సంబంధ సమస్యలు తగ్గడానికి - పసుపు వాడితే చుండ్రు తగ్గుతుంది.కేశ సంబంధ వ్యాధులకు వాడే పదార్థాలలో పసుపును ఉపయోగిస్తారు.

43.చర్మ ఆరోగ్యానికి - చర్మం పై ఏర్పడే తట్టు , ఎక్జిమా వంటివి, చర్మం శరీరం నుండి వ్యర్థ పదార్థాలను బయటకు పంపే ప్రక్రియ , దీనిలో పసుపు సాయపడడం వల్ల కాలేయం మరింత సమర్థంగా పని చేస్తుంది.
44.జ్వరం తగ్గడానికి - పసుపును పాలలో లేదా తేనెలో కలిపి తీసుకోవాలి.దీనివల్ల దయేరియా , ఋతుసంబంధ సమస్యలు కూడా నయమవుతాయి.

45.ఆస్త్మా తగ్గడానికి - ఒక కప్పు పాలలో ఒక టీ స్పూన్ పంచదార కలిపి మరిగించి తాగాలి.

46.ఎనీమియా / రక్తహీనత తగ్గడానికి - ఒక స్పూన్ పసుపు జ్యూస్ ను తేనెలో కలిపి ప్రతి రోజూ తాగాలి.

47.కొలాన్ క్యాన్సర్ తగ్గడానికి - పసుపు , ఉల్లి కలిపి వాడినట్లయితే కొలాన్ క్యాన్సర్ తగ్గించవచ్చునని కొన్ని పరిశోధనల సారాంశం.

48.ప్రొస్టేట్ క్యాన్సర్ తగ్గించడానికి - క్యాలిఫ్లవర్ ,క్యాబేజి, బ్రొకోలి వంటి వాటితో పసుపు కలిపినప్పుడు ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా చెయ్యడమే కాకుండా ,అప్పటికే ఉన్న క్యాన్సర్ మరింతగా వ్యాప్తి చెందకుండా చేస్తుందని ఒక పరిశోధన సారాంశం.

49.ఆరోగ్యం , ఆనందం కలగడానికి - ఈ రెండింటిని కలిగించే పోషకాలు, విటమినులు దీనిలో ఉన్నాయి.

50.ఎమిలాయిడ్ ఫ్లేక్స్ తగ్గడానికి - మెదడులో తయారయ్యే ఈ నోడ్స్ ను పసుపు తగ్గిస్తుంది.

51.ఆయుర్వేద వైద్యంలో  - వేడి చేస్తుంది.పైల్స్ కు మంచి మందు.ల్యుకేరియాపై పని చేస్తుంది.కఫం తగ్గిస్తుంది.మంచి యాంటి ఆక్సిదెంట్ గా పని చేస్తుంది.

పసుపు ఎన్నో సూక్ష్మ క్రిములను సం హరిస్తుంది.శరీరంపై ఏర్పడే గాయాలకు , పుళ్ళకు పసుపు పూస్తే క్రిములు ఆశించవు.సెప్టిక్ అవదు,త్వరగా మానుతాయి.

1.ఇంటి గడపలకు పసుపు పూస్తే సూక్ష్మజీవులు , క్రిమి కీటకాలు  లోనికి ప్రవేశించవనే నమ్మకం .

2.పరిశుభ్రంగా ఉండని నీరు కూడా పసుపు కలిపితే తాగడానికి వీలవుతుంది.

3.పసుపు పూస్తే ,గజ్జి ,తామర వంటి వ్యాధులు తగ్గుతాయి.

4.తడిసున్నంతో పసుపు కలిపి పట్టు వేస్తే గోరుచుట్టు వ్యాధి తగ్గుతుంది.

5.పసుపు కలిపిన ఊరగాయలు ఎక్కువ కాలం నిలవ ఉంటాయి.

6.ఉప్పు , నూనె,పసుపు కలిపి రాస్తే కాలి ఒరుపులు,దురద తగ్గుతాయి.

7.పసుపు కొమ్ము అరగదీసి రాస్తే తామర తగ్గుతుంది.

సౌందర్య సాధనంగా పసుపు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

1.నారింజ తొక్కల పొడిలో పసుపు కలిపి రాసుకుంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది.

2.మంచి గంధం ,పసుపు సమపాళ్ళలో తీసుకుని తేనెతో కలిపి ఫేస్ ప్యాక్ గా వాడవచ్చు.

3.మీగడలో పసుపు కలిపి రాసుకుంటే ఫేస్ ప్యాక్ గా ఉపయోగపడుతుంది.

4.పసుపు అవాంచిత రోమాలను తగ్గిస్తుంది.

5. చర్మం పై యు వి కిరణాల ప్రభావం లేకుండా చేసి సహజ సిద్ధమైన పిగ్మెంట్స్ ను కాపాడుతుంది.

6. పెసర పిండిలో పసుపు కలిపి రాసుకుంటే ముఖం తేజోవంతంగా ఉంటుంది.

7.వెన్నలో పసుపు కలిపి రాసుకుంటే ముఖం , మృదువుగా, నున్నగా,అందంగా ఉంటుంది.

8.నిమ్మరసం లో పసుపు కలిపి రాస్తే చర్మం పై ఏర్పడిన అనేక రకాల మచ్చలు మాయమవుతాయి.
9.పాలల్లో కొద్దిగా  పసుపు కలిపి పేస్ట్ లా తయారు చెయ్యాలి.శరీరంపై పూసి కొద్దిసేపు ఆరనివ్వాలి.నెమ్మదిగా దానిని నీటితో తొలగించాలి.ఇలా వారానికి రెండు,మూడు సార్లు చేస్తే శరీరం , బంగారు కాంతులీనుతూ నిగనిగలాడుతూ ఉంటుంది.

10.పసుపు , మంచి గంధం , పాలు కలిపి పేస్ట్ లా చేసి శరీరానికి రాసుకోవాలి.దీనివల్ల చర్మం పరిశుభ్రపడుతుంది.స్వేద రంధ్రాలు తెరుచుకుంటాయి.చర్మంపై మచ్చలు పోవడానికి పెరుగు , క్యారెట్ కలిపి వాడాల్సి ఉంటుంది.

11.శరీరంలఒకి పసుపు బాగా గ్రహింపబడాలంటే - నల్ల మిరియాలలో ఉండే పెపరైన్ అనే పదార్థం శరీరం పసుపును గ్రహించడానికి ఎంతగానో తోడ్పడుతుంది.దీనివల్ల శరీరం పసుపును గ్రహించే శక్తి రెండు వేల రెట్లు పెరుగుతుందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి.నల్ల మిరియాల పొడి కలిపితే పసుపు ఆరోగ్య రీత్యా అద్భుతంగా పని చేస్తుంది.





No comments:

Post a Comment