14, మార్చి 2026, శనివారం

ఫలాలలోకెల్లా ఉత్తమం ద్రాక్ష

 ఆయుర్వేదంలో ద్రాక్షను ఫలోత్తమం అని ప్రశంసించడం జరిగింది. ద్రాక్షలో అనేక పోషక విలువలు ఉండటమే దీనికి ముఖ్య కారణం. మన పురాతన గ్రంథాల్లో ద్రాక్షపళ్లను ద్రాక్ష మృద్విక, గోస్తని, మధురస అనే పేర్లతో పేర్కొన్నారు.

 ప్రస్తుతం మనకు ప్రధానంగా ఆకుపచ్చ ద్రాక్ష, నల్ల ద్రాక్ష, కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష లభిస్తున్నాయి. ఈ మూడింటికి గుణాలు దాదాపు ఒకేలా ఉన్న ,తీపి పులుపు నిష్పత్తులలో తేడాలు ఉన్నాయి. అందుకే వాటి గుణాల్లో కూడా స్వల్ప మార్పులు కనిపిస్తాయి. ఇక ద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ఫలితాలు ఏమిటంటే ..

ద్రాక్ష శరీరానికి చలవనిస్తాయి. దద్దుర్లు తగ్గించడంలో సహాయపడతాయి .అలసటతో కూడిన నొప్పులను, అరికాళ్ళు, అరిచేతులలో కలిగే మంటలను తగ్గిస్తాయి. మూత్ర విసర్జనకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ద్రాక్ష వల్ల తొలగిపోతాయి .

నల్ల ద్రాక్ష ,ఆకుపచ్చ ద్రాక్షల మధ్య గుణాలలో తేడా ఉండదు. అయితే ఔషధాలు తయారీలో నల్ల ద్రాక్షను ఎక్కువగా వాడుతారు. నల్ల ద్రాక్ష మగత, బద్ధకం, ఆవులింతలు, అలసటలను తగ్గిస్తుంది .

బాగా పండిన నల్ల ద్రాక్ష దప్పికను, అలసటను తగ్గించి శరీర వేడిని ఉపశమింప చేస్తుంది. శరీరానికి బలం, మృదుత్వాన్ని ఇస్తుంది. ఉబ్బసం, గ్యాస్, ఉబ్బరాలను తగ్గించడంలో కూడా దోహదం చేస్తుంది.

 పచ్చి ద్రాక్ష ఎక్కువ పుల్లగా ఉండి వగరు రుచిని కలిగిస్తుంది. అది శరీరాన్ని వేడెక్కించి, రక్తస్రావాన్ని పెంచే అవకాశం ఉంది. అందువల్ల బాగా పండిన ద్రాక్షనే తినాలని ఆయుర్వేద గ్రంథాలు సూచిస్తాయి..

ఎండు ద్రాక్ష మలబద్ధకాన్ని తగ్గించి ,విరేచనాన్ని సులభంగా జరిగేలా చేస్తుంది. జ్వరము, ఊపిరితిత్తుల సమస్యలు, వాంతులు, కీళ్ల నొప్పులు, లివర్ వ్యాధులు, అరికాళ్ళ మంటలు ,చర్మం ఎండిపోవడం, కండరాల బలహీనత వంటి సమస్యల నివారణకు ఈ ద్రాక్ష ఉపకరిస్తుంది.

 నెలసరి సమయంలో మహిళలు ద్రాక్ష తినటం అలవాటు చేసుకోవడం మంచిది. నోరు చేదుగా ఉండడం, అజీర్తి ఉన్నప్పుడు వాటిని తగ్గించడంలో ద్రాక్ష ఉపకరిస్తుంది. మేలు చేస్తుంది .

ద్రాక్ష ఉపిరితిత్తులకు రక్షణ నిస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. ద్రాక్ష రసం తాగటం వల్ల మద్యపానం చేయాలని కోరిక కూడా తగ్గుతుంది.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...