సీతా ఫలం అనగానే తీయని మృదువైన గుజ్జు గుర్తుకు వస్తుంది. దీని లోపలి గుజ్జు కస్టర్డ్ లా మెత్తగా ఉంటుంది కాబట్టి దీనిని ఇంగ్లీష్ లో కస్టర్డ్ ఆపిల్ అని పిలుస్తారు.
భోజన కుతూహలం గ్రంథంలో సీతా ఫలం గుజ్జును తియ్యని, చలవ చేసేదిగా , పైత్య దోషాలను తగ్గించేదిగా పేర్కొన్నారు.
సీతా ఫలం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..
అన్నం సహించక, నోటికి రుచి తెలియని వారికి సీతా ఫలం రుచిని కలిగిస్తుంది. ఇది తినటం వలన ఎక్కువ కఫం పెరగదు.
మిగల ముగ్గిన సీతా ఫలం లో సహజ చక్కెరలతో పాటు పిండి పదార్థాలు , పీచు, విటమిన్ సి, బి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలున్నాయి. వీటి వల్ల శరీరానికి త్వరగా శక్తి అందుతుంది. పీచు జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది.
సీతా ఫలం పచ్చి కాయను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు.అతిసారం , నీళ్ల విరోచనం తగ్గటానికి దీనిని ఉపయోగిస్తారు.
కొన్ని ప్రాంతాలలో పచ్చి కాయను బాగా ఎండబెట్టి దానిని పొడిగా దంచుతారు. చర్మ సమస్యలకు ఈ పొడి మంచి మందుగా పనిచేస్తుంది.
సీతా ఫలం గింజలు నల్లగా మెరుస్తూ ఉంటాయి.అందుకే ఈ మొక్కకు " కృష్ణ బీజ" అనే పేరు కూడా వచ్చింది. ఇవి తినడానికి పనికి రావు. కానీ సంప్రదాయ వైద్యంలో ఈ గింజల పొడి ని చుండ్రు తగ్గించడానికి , పేలను తొలగించడానికి వాడతారు.
సీతా ఫలం వేడి శరీర తత్వం ఉన్న వారికి చలవనిస్తుంది. దీనికి పిత్త వికారాలు, దాహం, మంట వంటి వాటిని శాంతింప చేసే గుణం ఉంది.
సీతా ఫలాలు ఎక్కువగా తినటం మంచిది కాదు.ముఖ్యంగా మధుమేహం , స్థూల కాయం ఉన్న వారు వీటిని మితంగా తింటేనే మంచిది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి